Posts

Showing posts from September, 2013

"పశువుల గడ్డి మేసినందుకు పదిహేడేల్లకి శిక్ష విదించారట!

                                                                    ఈ దేశం లో కేవలం ఒక్క న్యాయస్తానాలు మాత్రమే అవినీతి గడ్డి తీంటున్న పెద్దలను నిష్కర్షగా జైల్ లోకి పంపి, ఈ దేశం కోసం తపించే వారిని అప్పుడప్పుడు ఆనందపరుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. 'ఈ దేశం ని ఎవరూ బాగు చెయ్యలేరు, అవినీతి అనేది సర్వసాదార్ణం విషయం' అని మన దేశం లో పామరులు నుంచి మేదావులు  దాకా  ఒక ద్రుడ నిర్ణయానికి వచ్చే శారు.  దీని వలన అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులలో కానీ, అధికారులలో కాని చట్టం అంటే ఏ మాత్రం భయం లేకుండా పోయింది. అవినితి పరులకు జనం నీరాజానాలు పట్టి ఎన్నికలలో గెలిపిస్తుంటే తాము చేసే పనికి ప్రజామోదం ఉంది అని అవినీతి పరులు బుకాయిస్తూ, అధికార దర్పం వెలగపెడుతుంటే చట్టం అంటే గౌరవం ఉన్నవారు, మనది ఖచ్చితంగా ఒక పద్దతి గల ప్రజాస్వామ్య దేశం అని బావిస్తున్న వారు విస్తుపొతున్నారు.కొంత మంది  ప్రజలు అవినీతి పరులను ఆరాదించడం చూసి,ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రద్దుచేసి,  కొంతకాలం నియంత్రుత్వ పాలన వస్తే బాగుండు అని కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకు అదికమవుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి వారే ఎన్నికలలో వోటింగ

రాహుల్ గాందీ గారు ఒక చెంప పగలగొడితే, కిరణ్ కుమార్ గారు రెండో చెంప పగల గొట్టారు!.

                                                                        నిన్న కేంద్ర సర్కార్ వారికి రెండు చెంప దెబ్బలు తగిలినట్లైంది! అయితే ఈ చెంప దెబ్బలు కొట్టిన వారు ప్రతిపక్ష పార్టీలో, సుప్రీం కోర్టు వారో కాదు. సాక్షాత్తు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉపాద్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ బావి ప్రదాని అభ్యర్దీ శ్రీ రాహుల్ గాందీ గారు కాగా, రెండవ వారు తమ పార్టీ ఏలుబడిలో ఉన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక విదంగా చెప్పాలంటే రాహుల్ గాంది గారి స్టెట్మెంట్ పరిశిలిస్తే కేంద్ర ప్రభుత్వం నైతిక బాద్యత వహించి స్వచ్చందంగా రాజీనామ చేయతగిన తప్పిదం చేసినట్లే లెఖ్ఖ.   ఈ  దేశ సర్వోన్నత న్యాయస్తానం, నేర గాళ్లు చట్టనిర్మాతలుగా ఉండే దౌర్బాగ్య పరిస్తితి నుండి జాతిని రక్షించడానికి  చారితాత్మక తీర్పులను వెలువరించింది.  అందులో ఒకటి ఏ ప్రజా ప్రతినిది  అయినా సరే కోర్టుల చేత నేరస్తుడిగా నిర్దారించబడిన మరుక్షణం నుండే పదవీచ్యుతులవడమే కాక బవిష్యతులో ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కూడా అనర్హులు.  . అలగే క్రిమినల్ కేసుల వలన పోలిస్ కష్టడీ కానీ, జుడిషియల్ రిమాండ్ లో కానీ ఉంటే అట్టి వారు ఎన్

మితిమీరిన ప్రేమ అందుడినే కాదు హంతకుడిని కూడా చేస్తుంది!

                                                                          ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమించిన వారికోసం వారు ఏమైనా చేస్తారు. ఇంట్లో వారికి రూపాయి ఖర్చుచెయ్యడం ఇష్టపడనివారు సైతం ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతైనా దారపోస్తారు.కారణం వారిలో ఉన్నది స్వార్దం తో కూడిన ప్రేమ మాత్రమే. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. అలాంటి ప్రేమ తల్లినీ,చెల్లీనీ ,భార్యనీ ఒకేలా ప్రేమించేలా చేస్తుంది. కానీ మోహంతో కూడిన ప్రేమలో త్యాగం అనేది ఉండదు. తాను ఇష్టపడిన అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తారు. వారి కోసం అప్పు చేసైనా వారు కోరింది ఇస్తారు. కానీ అదే ప్రేమను ఎదుటి వారు తిరస్కరిస్తే అస్సలు ఓర్చుకోరు. అవసరమైతే తనకు దక్కనిది ఎవరికి దక్క కూడదనే ఉద్దేశ్యంతో  తాము ప్రాణాధికంగా ప్రేమించిన వరినే మట్టుబెడతారు. ఈ విషయం లో రక్తసంబందాలు కూడ అడ్డురావని తమిలనాడు  జరిగిన ఈసంఘటణ రుజువు చేస్తుంది.   అతని పేరు తమిల్ సెల్వన్.ఉండేది కడలూర్ జిల్లాలోని పంచకుప్పం లో. అతనికి మహాలక్ష్మి అనే మేనకొడలు ఉంది. అతను తన  ఇరవైరెండవ యేట నుంచి అంటే అంటే మహాలక్ష్మి యుక్త వయస్కురాలు అయినప్పటి దగ్గరనుంచి ఆమె అంటే ఇష్టం పెంచుకున్నాడ

ఆ దేశం లో అయితే ఉరేస్తారట! ఈ దేశంలో అయితే ఉరేగిస్తారట!

         నిన్న ఫేస్ బూక్ లో ఒక పోస్ట్ చూసాను. చైనాకి మనకి అవినీతి విషయంలో ఎంత అభిప్రాయబేదం ఉందో అర్దమవుతుంది.మనo వ్యక్తి ద్రుక్పదమే తప్పా ,సామాజిక ద్రుక్పదం అంతగా లేనివారం.మనవారు   అభిమాన నటుడి సినిమా పైరసీ చేస్తే, అంకమ శివాలెత్తి పోతారు, అదే ప్రజల సొమ్ము దోచినోడి గురించి ఒక్క మాటా మాట్లాడలేరు.   చైనా లో అవినితికి పాల్పడితే ఉరిశిక్ష విదిస్తారట. అంటే అది మనకు "నిర్భయ" కేసు ఎలాగో వారికి అవినీతి కేసు అలాగ అన్న మాట.మరి వారికి మనకి సామాజిక ద్రుక్పదంలో అంత తేడా ఎలా వచ్చింది? మనం దోపిడిని అంతలా ఎలా సహిస్తున్నాం? పైపెచ్చు అలా దోచిన వారినే మన హీరోలు అంటున్నాం. వారినే పూజిస్తున్నాం. వారికోసం ప్రాణలు సైతం అర్పించడానికి వెనుకాడని అమరవీరులు మన సమాజంలో ఉన్నారు అంటే చైనా వారికి మనకి  తేడా ఎక్కడ వచ్చిందో అర్దం కావటం లేదు. ఈ మద్య ఒక మిత్రుడు నాకొక కద లాంటిది చెప్పా డు. అందులో వాస్తవం ఉంది అన్నాడు. మరి ఉందో లేదో మీరే చెప్పండి.   చెంగీజ్ ఖాన్ తన దండ యాత్రల సమయంలో ఒక టెక్నిక్ పాటించేవాడు అంట. అతను ఎప్పుడూ తన అనుచరులను ,తను జయించిన రాజ్యాలలో రాజులుగా నియమించలేదట! ఏ రాజ్యాన్ని తను హస్తగతం

గోవిందా..గోవిందా! యాబై వేల కోట్లు ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందా!

                                                                     మన సర్కార్లు ఎంతో ప్రతిష్టాత్మకం అని  చేసే కొన్ని కొన్ని పనులు చూస్తుంటే, అవి చిత్తశుద్దితో చేసేవా లేక అస్మదీయులకు లబ్ది చేకూర్చాలని ఎవరో ఇచ్చిన సలహాలను ముందు వెనుక ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలా అని అనిపిస్తుంది. అలాంటిదే నిన్న సుప్రీం కోర్టు వారు చెల్లదని కొట్టివేసిన ఆధార్ కార్డులను తప్పనిసరిచేసే ప్రక్రియ.   గ్యాస్, విద్యుత్, తాగునీటి కనెక్షన్ లకే కాక, ఇక బవిష్యత్ లో ఏ ప్రభుత్వ సేవలను పొందాలన్నా "అధార్ కార్డు" అనేది కంపల్సరీ అని కేంద్ర ప్రభుత్వం వారు  ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాలను నానా హైరాన పెట్టారు.  గాస్ సబ్సీడి పొందాలంటే ఆదార్ కార్డు ఆదారంతో తెరచిన బాంక్ ఖాతా వివరాలు అందచేయాలని, పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రం లోని అయిదు జిల్లాలను ఎంపిక చేసామని, కాబట్టి ఆ యా జిల్లాల ప్రజలు మే లోపు ఆధార్ వివరాలు వివరాలు అటు బాంక్ లో నమోదు చేసుకుని ,అట్టి ఖాతా వివరాలను గాస్ డీలర్ కి  ఇవ్వాలని లేదంటే 'సబ్సిడి కట్' అంటె ఆధార్ అందని ప్రజలు, ఇంకా అధార్ అప్లై చేయని ప్రజలు ఆందోళన చేసారు. రాష్ట్ర ప్రభుత్వ కో

డిగ్గీరాజా గారి ద్రుష్టిలో ముఖ్యమంత్రి గారు మూర్కుడట!?

                                                                       అవును మరి!తర తరాలకు సరిపడా సంపాయించుకునే  బంగారం లాంటి అవకాశం వస్తే,దానిని కాదని ప్రజలు, సెంటిమెంట్ అంటూ పట్టుకు వెలాడడం మూర్ఖత్వం కాదు మరి?అదే అవకాశం డిగ్గీ గారికి వస్తేనా, నా సామి రంగా, హైద్రాబాద్ వాళ్ళని హడలెత్తించి ఫాయిదా పోందేవారే!మరి ఆ తెలివి తేటలు మన కిరణ్ గారికి లేవాయే! అంత తెలివి గలిగిన వాడు కాబట్టే  మద్య ప్రదేశ్ లో కాంగ్రెస్ సమావేశం లో పాల్గొనకుండా డిగ్గి రాజా ముఖం మీదే తలుపులు మూ శారు అక్కడి కార్య కర్తలు . ఇంతకి మన ముఖ్యమంత్రి గారి మీద డిగ్గీ రాజా అని పిలువబడే దిగ్విజయ్ సింగ్ గారికి ఎందుకంత దుగ్ద!?   మొన్న సీమాంద్రా మంత్రుల సతీమణులు రాష్ట్రపతి గారిని ఇతర డిల్లీ పెద్దలను కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ణప్తి చేసారు. అందులో భాగంగానే డిగ్గీ రాజా గారిని కలిస్తే ఆయనకు చిర్రెతుకొచ్చిందట. ఒక సారి విభజన కు ఓ.కె అన్నాకా మాటి మాటికి ఈ రాయాబారాలేంటి అని అసహనం ప్రదర్శించారట." అయినా మిమ్మల్ని కాదు మీ ముఖ్యమంత్రిని అనాలి, ఎంత మూర్కుడు కాకపోతే కావాల్సిన దానిని అడగకుండా, అయిపోయిన రాష్ట్ర విభజన ఆ

హాంపట్..ఆమెను చంపి,అతడిని 13 వ అంతస్తు నుండి తోసేసి చంపిన ఆ భూతం ఏవరో తెలుసా!?

                                                               దెయ్యం! భూతం! కాష్మోరా!మోహినీ! పిశాచీ! కొరివి దెయ్యం! ఇవ్వన్నీ మనిషిని ఆవహించి వారిని ఉన్మాదులను చేసే మానసిక రోగాల పేర్లు. కానీ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ఉన్మాదానికి గురైన వారికి ఎటువంటి విద్యా అర్హత లేని మంత్రగాళ్ళు, భూత వైద్యులు, పకీర్లు ఈ ఉన్మాదాన్ని వదిలిస్తున్నారు. దెయ్యం పట్టి చనిపోయిన వారు ఉన్నట్లు ఉదంతాలు లేవు అనుకుంటా!కానీ కాష్మోరా ను మించిన భయంకర బూతం ఇప్పుడు యువతను ఆవహించి వారి ప్రాణాలను వారే తీసుకునేటట్లు చేస్తుంది. ఈ భూతం పుట్టేది ఎందులో తెలుసా? నవ నాగరిక జీవన విదానం లో!ఈ భూతం ఎవరిని ఆవహిస్తుందో తెలుసా? చదుకోని వారి జోలికి అసలు పోలెదు. చదువుకున్న వారి లోనే తిష్ట వేసి వారు చచ్చే వరకు వేదిస్తుంది. వీరికి భూతం పట్టిందని వీరికి తెలియదు, వీరీ చుట్టూ ఉండే నవ నాగరీకులకు తెలియదు. తీరా వారు చని పోయాక మాత్రం" పిచ్చోళ్ళు! ఇంత చిన్న విషయానికే చని పోతారా!" అని ఒక నిట్టూర్పు విడుస్తారు. మరి ఇప్పట్టికైనా ఆ భూతం ఏదో గ్రహించారా? దాని పేరే "స్ట్రెస్". మానసిక ఒత్తిడి.నేడు పదహారేళ్ల  పాటు చదువుకుని ,

రామ! రామ! ఈ దేశం లో భార్యలను మార్చుకునే " పార్టీలు" తగలడ్డాయ్యా!?

                                                                  వినటానికే సిగ్గు చేటైన విషయం! ఇది అన్య సమాజం ల లోని వారికి అంగీకారం అవ్తుందేమో కాని, భారతీయ సమాజం లో మాత్రం నిస్సందేహంగా అసహ్యపడవలసిన విషయం. అందుకే ఆ "భారతీయ వనిత" ఎదురు తిరిగింది. తిరగడమే కాదు, తన భర్త మీద ఆయనకు వత్తాసు పలికిన నౌకా దళ అధికారుల ని సుప్రీం కోర్టు వరకు ఈడ్చింది. శబాష్, మాతా! శబాష్!  ఆమె గారు కొచ్చిన్ లోని సదరన్ నావల్ కమాండ్ కి చెందిన ఒక అధికారి బార్య. మన సైన్యం లోని త్రివిద దళాలలో నౌకా దళం ఒకటి. బ్రిటిష్ వారు అయితే మన దేశాన్ని విడిచి వెళ్ళారు వారి తాలుకు అలవాట్లు, అభిరుచులు మాత్రం మన వారికే ఇచ్చేసి వెళ్ళినట్లుంది. కాబట్టి విదేశి సంస్క్రుతి అయిన "భార్యల మార్పిడి పార్టీలు" నౌకాదళ అధికారుల పార్టీలో సాదార్ణం అనుకుంటా. అధికారులు చేసుకునే విందు పార్టిల్లో పాల్గొన దలచిన  వారు, తమ తమ భార్యలతో ఆ పర్టిలకు వెళ్ళాలి.  అక్కడ మందు పుచ్చుకున్నాక "ప్లేటొ" చెప్పిన భార్యల కమ్మ్యూనిజం అవతరిస్తుంది. ఒకరి భార్యని మరొకరి భార్యతో మార్పిడి చేసుకుని ఆ రాత్రి ఎన్జాయ్ చేస్తారట. "పండగ నాడు క

ఓరీ దేవుడో ! ఈ అమెరికా వాళ్ళు నన్ను మిస్సమ్మని చేసారు ... రో...

                                                                      పై పోటో లోని అమ్మాయి పేరు నీనా  దావులూరి . మొన్న అమెరికాలో జరిగిన అందాల పోటిలో "మిస్ అమెరికా " గా ఎన్నికై న  N.R.I . ఈమె మిస్ అమెరికాగా ఎన్నిక కావడానికి కారణం ఆమె బౌతిక సౌందర్యం కాదట . ఆమె గారిలోని మానసిక సౌందర్య మేనట ! తను  బౌతిక సౌందర్యం కన్నా ,   మానసిక సౌందర్యానికే ప్రాదాన్యత ఇస్తానని , ఒక ప్రశ్నకు బదులుగా ఆమె ఇచ్చిన సమాదానానికి  జడ్జ్ ల మైండ్ బ్లాంక్ అయి ఆమెకు కిరీట దారణ చేసారట !  (అంతేనా , మైండ్ బ్లాంక్ అయి వేరెవరికో ఇవ్వాల్సినది ఈమెకు ఇచ్చారా }. సరే ఏదైతేనేం , కనిపించే బౌతిక సౌందర్యంని కాదని కనిపించని మానసిక సౌందర్యానికే "మిస్ అమెరికా " పట్టం కట్టారట అమెరికన్లు .   మరి రేపట్నుంచి అడ్వర్టైజ్ మెంట్ల కోసం ఈ  "మిస్ అమెరికా " గారు కనిపించే బౌతిక సౌందర్యం ని ప్రదర్శిస్తారా లేక కనిపించని మానసిక సౌందర్యాన్ని ప్రదర్శిస్తారా ? అసలు ఈ "  మిస్"  ల పోటిల ఉద్దేస్యం పక్కా వ్యాపారం . ఇండియా లాంటి అతి పెద్ద మార్కెట్ లో విదేశి  కంపెనీలు  తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి  ప్రచార సాదాన

తెలుగు నేల ముక్కలైందని వాళ్ళు ఏడుస్తుంటే "తెలుగు తేజం " అని మొదలెడితే మండదా మరి ?!

                                                                                  మన రాజకీయ నాయకులలో "జయ ప్రకాష్  నారాయణ్ ' గారు గొప్ప మేదావి అనడంలో ఎవరికీ అబ్యంతరం ఉండదు . ఏ విషయం లోనైనా ఒక సమగ్రమైన అవగాహన కలిగి ఉండటమే కాక ఏ సమస్య కైనా తగిన పరిష్కారం చెప్పగలిగిన దిట్ట అయన గారు !కాని ఆయనలో ఉన్న మైనస్ పాయింట్ ఏమిటంటె  ప్రజల మనోబావనలు ఎరిగి మసలక పోవడం . ఒక చిన్న ఉదాహరణ చెపుతాను.    ఒక ఊరిలో ఒక డాక్టర్ ఉన్నాడు  ఏ  రోగానైనా అతి త్వరగా తగ్గించగల సమర్దుడు . ఊరీ  జనానికి ఒక రోగం తగిలింది . దానికి డాక్టర్ గారు ఇంజెక్షన్ లే సరైన వైద్య విదానం అంటే "అమ్మో సూది అంటే భయం మాకొద్దు ' అన్నారు జనం . కానీ సూది మందు తీసుకోవాల్సిందే అన్న డాక్టర్ ని ప్రజలు దూరం పెట్టారు . కానీ  డాక్టర్ మాత్రం సూది మందు తీసుకొండి  అని ప్రజలను కోరుతూనే ఉన్నాడు తప్పాఅదే మందును పిల్స్ రూపం లో ఇచ్చి వారి రోగాన్ని నయం చేయవచ్చు అని ఆలోచించ లేక పోతున్నాడు  .  ఆ  విదంగా ప్రజలకు డాక్టర్ ఆలోచన పనికి రానిది అయిపోయింది . డాక్టర్ కి ప్రజలు మాట వినని మూర్కులయ్యారు . పై ఉదాహరణలో డాక్టర్ జె.పి గారైతే, సమస్య ఉన్న

మంత్రి గారి కారుకు, చంద్రబాబు గారి బస్సుకు బాణామతి చేసిందెవరు?

                                                             ఈ మద్య వారం రోజుల వ్యవదిలోనే మన రాష్ట్రంలో ముఖ్యులైనటువంటి వారి వాహానాలు ప్రయాణిస్తూండగానే హట్టాతుగా మంటలంటుకుని తగల బడ్డాయి. వాటికి కారణం "షార్ట్ సర్క్యూట్" గా పేర్కొన్నారు పోలిసులు. అది బౌతికంగా కనిపించే కారణమైనప్పట్టికి, కేవలం రెండు మూడు రోజుల వ్యవదిలోనే ఇలా వరుసగా ఎందుకు ఈ "షార్ట్ సర్క్యూట్" లు జరిగాయి అనేది వింత అయిన విషయం.   మొదట చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్న "ఆత్మ గౌరవ యాత్ర", బస్సులోనుంచి పొగలు వస్తే, దానిని సకాలంలో గమనించటం వలన ఆయన క్షేమంగా బయట పడ్డారు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎకడో కారు ఒకటి రోడ్డు మీదే తగలబడి పోయింది. మొన్న ఉద్యానవన శాఖ మంత్రి శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి గారి కారు కూడ భువన గిరి దగ్గర పూర్తీగా కాలి పోయింది.అది కూడా సకాలంలో గమనించబట్టి మంత్రి గారు క్షేమంగా ఉన్నారు. ఆ తర్వాత హైద్రాబాద్లో కూడ ఇలాగే ఒక కారు తగలబడి పోయింది. వీటన్నింటికి ఒకటే బౌతిక కారణం "షార్ట్  సర్క్యూట్".  నేను కొన్నేళ్ళుగా కొన్ని సంఘటణలను ఆసక్తిగ గమనిస్తూ ఉన్నాను. ఒక రోజు

పదమూడేళ్ళ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసిన 76,65, యేండ్ల వ్రుద్ద మ్రుగాళ్ళున్న సమాజంలో "నిర్భయ" సరిపోతుందా?

                                                         ఆడదైతే చాలు! దానికి వయసుతో పనిలేదు. మనసుతో పనిలేదు.ఒంటరిగా ఉన్నా, అనాధగా మిగిలినా పాశవికంగా అనుభవించి తీరాల్శిందే. అలా చేస్తేనే వారి ద్రుష్టిలో  మగాడు కింద లెఖ్ఖ.పదేళ్ళ వాడి దగ్గర్ణుంచి, ఎనబై యేండ్ల వాడి వరకు ఇదే మృగాల్ల అభిప్రాయం.   కరీంనగర్ జిల్లా , కోహెడ మండలం, శ్రీ రాముల పల్లిలో మానసిక వికలాంగురాలైన, పదమూడేళ్ళ బాలిక పై, అదే గ్రామానికి చెందిన సి.రాం రెడ్డి(76),జి. రాజయ్య(65), అనే వ్రుద్ద మ్రుగాళ్ళు అత్యాచారం చేసారట!. ఒకరు ఒక రోజు, మరొకరు మరొక రోజు అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. వీరు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి, ఒకరి తర్వాత ఒకరు పాడు చేసినట్లు ఆ అమ్మాయి తల్లి, ఇచ్చిన పోలిస్ రీపోర్టు ప్రకారం తెలుస్తుంది. అసలు ఇలాంటి  ముసలి మ్రుగాళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే  నాకు చిన్నపుడు చదువుకున్న  కధ ఒకటి  గుర్తుకు వస్తుంది.    ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది వయస్సు మీద పడి ముసలది అవటం చేత దానికి వెటాడే శక్తి సన్నగిల్లింది. అందుకని అది ఒక ఉపాయం ఆలోచించి, ఒక బంగారు కంకణాన్ని చేతికి ధరించి, దారీలో పడుకుని ఉండేది. ఆ దారిన పోయే బాటసారులను

వృత్తి ధర్మం కంటే "కుల బావన , ప్రాంతీయ బావన " లే ప్రదాన మయినవని ఋజువు చే సే వాడే ఆంద్ర ప్రదేశ్ పోలిస్ !పోలిస్ !పోలిస్!

                                                         మొన్న సమైక్యాంద్రాప్రదేశ్ కోసం, సీమాంద్రా ఉద్యోగులు హైద్రాబాద్ లో  జరిపిన ’సేవ్ అంద్రప్రదేశ్" సభ,సమైక్య రాగం వినిపించడానికే కాక,  పోలిస్ వారి చట్ట ఉల్లంఘనలకు కూడా  సాక్షిగా మిగిలిందని చెప్పవచ్చు.   ఆంద్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారాం, ఉద్యోగుల సభకు ఉద్యోగేతరులు ఎవరూ రారాదు.  గాయకులు అయిన గజల్ శ్రినివాస్ గారిని, హై కోర్టు వారి ఉత్తర్వులానుసారం, క్రిందిస్తాయి పోలిస్ అధికారులు సభలోకి అనుమతించక పోతే సాక్షాతు ఒక ఐ.జి. స్తాయి పోలిస్ అధికారి పబ్లిక్ గా, స్వయంగ తాను వెంట పెట్టుకుని సభా వేదిక వద్దకు తీసుకు వెళ్ళారు. దీనికి ప్రధాన కారణం, తెలంగాణా వారు ఆరోపిస్తున్నట్లు సదరు అధికారి గారికి సీమాంద్రా మీదో , సమైక్యతాంద్రా మీదో ఉన్న అభిమానం కాకపోవచ్చు. ఆ అధికారి గారిది, గజల్ శ్రినివాస్ గారిది ఒకే సామాజిక వర్గం కానీ, తత్ సంబంద మైన వర్గం కావడమే  ముఖ్య కారణం అనిపిస్తుంది. కానీ ఆంద్రా తెలంగాణా  గొడవల వల్ల అసలు కారణాలు మరుగునపడి, ప్రాంతీయ విద్వేషాల వెల్లువలో ప్రాంతీయ తత్వమే ప్రధాన కారణంగ కన పడుతుంది.  ఇంకొక సంఘటణ అదే సభలో, శ

ఆ విఘ్నేశ్వరుడి క్రుపా కటాక్ష వీక్షణములతో, బ్లాగ్ వీక్షకుల,మిత్రుల అభిమానంతో1,00,000 (లక్ష) వీక్షణములకు చేరువైన "మనవు" బ్లాగు!

                                                           బ్లాగు  మిత్రులకు, వీక్షకులకు, విమర్శకులకు, వినాయక చవితి శుభాకాంక్షలు. "మనవు" బ్లాగు గత ఏడాది సెప్టెంబర్ ఆరున ప్రారంభమై, అందరి అదారాభిమానాలతో మొదటి సంవత్సరం పూర్తీ చేసుకున్నది. ఇప్పటికి ఈ బ్లాగులో 364 పోస్టులు ప్రచురింపబడి లక్ష వీక్షణములు పొందింది. పోస్టులు రాయడం ని నేను గొప్పగా  ఫీల్ కానప్పటికి, లక్ష వీక్షణములతో మీరందరూ చూపించిన ఆదరాభిమానములకు కొంచం నా చాతీ వెడల్పు అయిందని చెప్పడానికి సంకోచించను .   కుటుంబ సబ్యులు ఎల్లరూ, సంతోషంతో చేసుకునే పండుగ వినాయక చవితి. అట్టి వినాయక ప్రతిమని, మన చేతులతో స్వయంగా తయారు చేసి, మనమే స్వయంగా సేకరించిన పత్రితో కొలిస్తే, ఆ మహదానందమే వేరు. కానీ కార్పోరేట్ కల్చర్ లో పెరిగే మన పిల్లలకు ఆ అద్రుష్టం లేదు. మేము చిన్నప్పుడు చవితిని ఎంత ఆనందం కూడిన భక్తి పరవశ్యాలతో చేసే వారమో! ఆ రోజులు రాక పోవచ్చు! కానీ ఆ మదురానుబూతులు ఇప్పటికీ మా మనస్సుల్లో ఉండి ఆనందాన్ని పంచుతూనే ఉన్నాయి. ఆ జ్ణాపకాలతో కూడిన పోస్టు ని పోయిన సంవత్సరం ఈ బ్లాగులో పెట్టాను. కావాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి చూడగలరు. http:

"గొర్రె కొవ్విన కొద్దీ కసాయివాడికి లాభమే",అన్నట్లు ...........

                                                                   తెలంగాణా రాజకీయ నాయకులు ఊహిస్తున్నట్లు తెలంగాణా వారి మీద ప్రేమతోనో, కె.సి.ఆర్. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడనో ,"తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు" ప్రకటణ చేసి ఉండరు కేంద్రం వారు. ఒక వేళా కేవలం రాజకీయ లబ్ది కోసమే అయితే, తెలంగాణా లో అధికార పార్టీకి తెలంగాణ ఇచ్చినా సరే  పదిసీట్ల కంటే ఎక్కువ లోకసభ సీట్లు వచ్చే అవకాశం లేదు.మరి అటువంటి పదిసీట్ల కోసం పాతిక సీట్లు గ్యారంటీగా పోగొట్టుకునే సాహాసం చేస్తారా? ఒకవేళ జగన్ పార్టిని కలుపుకుందామనుకున్నా, లోపాయాకారీ ఒప్పందాలతో మద్దతు పొందుతామనుకున్నా,సీమాంద్రా ప్రజలు అంత అమాయకులా! తమ మనోభావాలను తీవ్రంగా గాయపరచిన కాంగ్రెస్ వారికి మద్దతు ఇస్తామంటె ఒప్పుకుంటారా? ఇంపాజిబుల్. మరి ఇంత ఆగమేఘాల మీద రాష్త్రాన్ని ఆగం ఆగం చెయ్యడానికి అసలు కారణం ఏమిటి?   నేను ఇదివరకటి పోస్టుల్లోచెప్పిన విదంగా , హైద్రాబాద్ ని U.T   చేస్తే తప్పా తమకు, తమ ఆస్తులకు రక్షణ ఉండదన్న, మెజార్టీ హైద్రాబాదీయుల ఆకాంక్ష మేరకే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటణ జరిగింది అనుకోవాల్సి వస్తుంది. అందుకే సీమాంద్రలో అంతమ

తాము పని చేసే ఇల్లు ఇలాగే ఉండాలి,అని కోరే హక్కు సేవకులకు ఉంటుందా?

                                                                                                                               ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల కుటుంభాలు కలిసి ఉంటున్నాయి. ఆ ఇంట్లో పని చెయ్యడానికి సేవకులు అంటే పనిమనుషులు ఉన్నారు. ఆ ఇంట్లో అన్నదమ్ములకు ఏవో మనస్పర్దలు ఏర్పడి తమ్ముడు విడిపోద్దాం అంటుంటే, అన్న కలిసి ఉందాం అంటున్నాడు. తమ్ముడుకి సప్పోర్ట్ గా కోంతమంది సేవకులు ఇంటిని విభజించాల్సిందే అని గొడవ చేస్తుంటే, అన్న వైపు సేవకులు లేదు, లేదూ ఇంటిని ఉమ్మడిగా ఉంచాల్సిందే అని గొడవ చెయ్యటం మొదలు పెట్టారు. చివరకు అది ఎంత కాడికి వెళ్లిందంటె,అసలు ఓనర్లు తగ్గి ఉంటున్నా, కొసరు సేవకులు రోడ్లెక్కి కొట్లాడు కుంటున్నారు.  ఇంటిని విడదీయాల, వద్దా అనేది ఓనర్లైన అన్నదమ్ముల  ఇష్టం . సేవకులకు ఉండే హక్కు ,తమకు నచ్చిన ఇంట్లో పని చెయ్యడమే కాని, తమ సౌలబ్యం కోసం ఆ అన్నదమ్ములు తాము చెప్పిన విదంగానే ఇంటిని ఉంచాలి అనే హక్కు ఎక్కడిది? ఒక వేళ ఇంటిని విభజించిన తర్వాత , తమకు నచ్చిన ఇంట్లో పని చేసే హక్కు సేవకులకు ఉంటుంది. కానీ ఓనర్ల గొడవలో తాము తల దూర్చి, ఇంటి పరువును రచ్చకీడ్చడం ఎంతవరకు సమంజసం? ఎవర

సుప్రీం కోర్టు వారు రివ్యూకి అనుమతించటం,"మనవు " బ్లాగు పోస్టుకి ఒక గొప్ప పాజిటివ్ కామెంట్ లాంటిది !

                                                                    నేను జులై పదమూడవ తారీకున ఈ  బ్లాగులో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సారాంశం ఏమిటంటే అంతకుముందు  సుప్రీం కోర్టు వారు ఇచ్చిన రెండు తీర్పులలో ఒక తీర్పు సహేతుకమని,రెండవది సహేతుకం కాజాలదని ,పైపెవ్చ్చు రాజకీయ నాయకులు,అధికార్లు  అట్టి తీర్పును అడ్వాంటేజ్ గా తీసుకుని దుర్వినియోగం పరచే అవకాశం  ఉందని , కాబట్టి అట్టి తీర్పు మిద రివ్యూ కోరవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది . అట్టి పోస్టుకు మిత్రులు , సీనియర్ న్యాయవాది గారైన   G నరేందర్ గారు సమర్దించడమైనది. ఈ   రోజు అదే కేసులకు సంబందించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు వేసిన రివ్యూ పెటిషన్లు ను పరిశిలించిన అనంతరం సుప్రీం కోర్టువారు, తీర్పు సహేతుకం  అన్నదానిని డిస్మిస్ చేస్తూ, సహేతుకం కాజాలదు అని అభిప్రాయపడిన దానిని విచారణకు స్వీకరించింది . ఇది మా బ్లాగు పోస్టుకు ఒక ప్రశంశ పూర్వకమైన కామెంట్ గా బావిస్తున్నాను . ఆ పోస్టు గురించి పూర్తీ వివరములకు క్రింది లింక్ ని క్లిక్ చెయ్యగలరు సుప్రీంకోర్టు తీర్పుతో అవినీతి పరులైన అధికారులకు కాసుల పంటేనా!? http://ssmanavu.blogspot.in/2013/07/blog-p

అమాయకుడి పెళ్ళాం అందగత్తె అయితే ప్రతి అడ్డమైనోడి చూపూ దానిమీదే!

                                                                      "పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన, భూమీశుల పాలుచేరు భువిలో సుమతీ" అని చిన్నప్పుడు బడిలో పాఠాలు చదువుకున్నాం. అలాగే అమాయకుడికి ఒక అందమైన పెళ్ళాం ఉంటే వాడి కాపురం లో నిప్పులు ఎలా పోద్డామా అని చూసే అడ్డమైన వాళ్ళు మన సమాజం లో తక్కువేమి కాదు. ఇది కేవలం వ్యక్తులకే కాదు ప్రాంతాలకు, నగరాలకు  వర్తిస్తుందని మన హైద్రాబాద్ నగరం పరిస్తితి చూస్తే అర్దమవుతుంది.    నిన్న జాతీయ చానళ్ళలో ప్రసారం అయిన కదనాలు చూస్తుంటే కేంద్రం వారికి హైద్రాబాద్ నగరాన్ని తమ పాలన లోకి తెచ్చుకోవాలని ఎంత తహ తహ గా ఉందో అర్దమవుతుంది. అందుకు చిరంజీవి గారి లాంటి నపుంసక రాజకీయ  నాయకుల వత్తాసు వారికి ఉంది. సీమాంద్రా సెట్టిలర్స్ కి  తెలంగాణా వారి పాలనలో రక్షణ ఉండదనే  విషయాన్ని పదే పదే ప్రచారాం చేస్తున్న సీమాంద్రా నాయకులు, అవును అదే నిజం అనేలా ప్రవర్తిస్తున్న తెలంగానా నాయకులు చివరకు వీరు చేసేదేమిటంటే  తెలుగువారి తెలంగాణా నగరాన్ని కేంద్రం వారి చేతికి అప్పచెప్పడం. "మేము చేత కాని సన్నాసులం, మేము నగర వాసులకు రక్షణ ఇవ్వలేము, మీరైతే యమ పోటుగాళ్ళు!