Posts

Showing posts from July, 2014

తెలంగాణా విద్యార్దుల పీజుల కోసం సిమాంద్రా మంత్రులు సుప్రీం కోర్టుకు వెళతాం అనడం దిక్కుమాలిన రాజకీయం కాదా !?

Image
                                                                             తెలంగాణ ప్రబుత్వం "ఫాస్ట్ " అనే పీజ్  రెయంబర్స్ మెంట్ పధకం తెలంగాణ విద్యార్దుల కొరకు ప్రవేశ పెట్టడానికి ఒక కమిటిని నియమిస్తూ నిన్న జీ.ఓ  ఒకటి జారీ చేసింది . దాని ప్రకారం ఇక నుంచి తెలంగాణా లోని విద్యార్దులు పిజ్ రియంబర్స్ మెంట్ పొందాలంటే సంబందిత విద్యార్ధి తల్లి తండ్రులు లేక తాత ముత్తాతలు 1/11/1956 కంటే ముందు తెలంగాణ నివాసులై ఉందాలి . ఈ పధకం ప్రవేశ పెట్టడానికి ముందే తాము దాని చట్టబద్దతను అన్ని కోణాల్లోంచి విశ్లేషించి , గతంలో ఉన్నత న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పులను పరిసీలించాకే తమ ప్రబుత్వానికి "స్తానికత " ను నిర్దారించే అధికారం ఉంది అని రూడి పరచుకున్నాకే 1956 ని స్తానికత నిర్దారణకు ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందని K .C. R  గారు గట్టిగా నొక్కి  చెప్పడమే కాక , సంబ0దిత తీర్పులను కూడా ఉటంకించడం జరిగింది .      అయితే సదరు జీ.వో  గురించి తెలంగాణా లోని రాజకీయ పార్తీల కంటే , సీమాంద్రా మంత్రులు అత్య్త్సాహం చూపుతూ , స్తానికత నిర్ణయించేది రాష్త్ర ప్రబుత్వాలు కాదని , అది కేంద్ర ప్రభుత్వ పరిది అని

.ఇలాంటి బార్యలు ఉండటం కన్నా , మలేషియా విమాన ప్రమాదంలో మరణించటం మిన్న !" అంటున్న ఈ ఆర్టికిల్ చదవండి.

                                                                                                                                           ఈ రోజు " పంజాబీ కేసరి "లో ప్రచురితమైన ఒక హింది ఆర్టికిల్ కొంత ఆసక్తి కరమైన విషయం గురించి ప్రస్తావించింది . అది మారుతున్న జీవన శైలి,ముక్యంగా మితిమీరిన  సెల్ పోన్ వాడకం ఏ విదంగా బార్యా భర్తల సంసార జీవితాలను ప్రభావితం చేస్తుందో తెలిపే అర్తికిల్.ఇలాంటి     మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన మహిళా పోలిస్ స్టేషన్ లకు వాసు వారిలో బార్యలె కాదు భర్తలు ఉంటున్నారట . వీరి సంఖ్య నెలకు ఒక్కొక మహిళా స్టేషన్ లో 20 నుండి 30 వరకు ఉంటుందట . మనోవైజ్ఞానికుల అంచనా ప్రకారం సదరు సేల్ పోన్ బార్యా బాదితుల  సంఖ్య బవిష్యత్లో రెట్టింపు   అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే భర్తలతో కలిసి సమస్య నివారణకు బార్యలు కౌన్సెలింగ్ తీసుకోవడానికి ముందుకు రావడానికి ఇష్ట పడటం లేదట . అందుకే బార్యలకు ఎలాగో నచ్చ చెప్పి వారిని ఆ అలవాటు నుంచి మాన్పించండి అని, తమ దగ్గరకు వచ్చె భర్తలకు మాత్రమె కౌన్సిలింగ్ ఇస్తున్నారట !. అయినా అసలు సమస్య ఏమిటొ చెప్పకుండా ఈ "సెల్ సొల్లు" ఏమ

మితిమీరిన "స్త్రీ స్వెచ్చ ",ఆ మహిళా ప్రొపెసర్ " గారిని తాగుడు మైకంలో నగ్నంగా రోడ్ల మిద పరుగులు తీయించిందట !

                                                                                                                                              పురుషులతో పాటు మందు కొట్టడం లో పోటిపడాలనుకునే "స్త్రీ వాదులకు " ఒక శుభ వార్త ! మొన్న బెంగ ళూర్ లో రాత్రి సమయంలో కొంత మంది మహిళలు బాగా మందు కొట్టారు అట . మందు కొట్టిన వారు లేడిస్ కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా వారిని ఇంటికి తీసుకు వెళ్ళాలి అని , వారిలో ప్రవేశించిన "మందు"కు తెలియదు పాపO . ఎందుకంటే అది మద్యం కాబట్టి . దానికి స్త్రిలైనా పురుషులైనా పక్ష పాతం ఏమిలేదు . అల్ అర్ ఈక్వల్ . అందుకే వారిని తిన్నగా ఇంటికి పోనివ్వకుండా రోదేక్కి గంతులేసేలా రేచ్చ గొట్టింది .ఇలా ఒక రోజు కాదు , చాలా సార్లు జరిగిందట . దానితో రోడున పోయే కార్లు , ఇతర వాహన దారులు తెగ ఇబ్బంది పడుతూ "మహిళలై ఉండి మీకిదేమి మాయ దారి రోగం అంటే , సివంగులై వారితో గొడవ పడే వారట . దానితో ఓపిక నశించిన కొందరు పోలీసులకు ఉప్పు అందించారు . దానితో మహిళా పోలీసులు మొన్న సదరు రెస్టారెంట్ ముందు బీట్ వేయగా అలవాటు పడిన అమ్మాయిలూ యదా ప్రకారం వచి పుల్ గా మందు కొట్టి

డాన్ బాస్కో !ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే ,ఇరగదీస్తాం చూస్కో !

Image
                                                                      ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఎర్రగడ్డ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అక్కడ ఉన్న "మెంటల్ హాస్పిటల్ " . ఆ హాస్పిటల్ లో చాలా మంది పిచ్చోళ్ళు ఉంటారు . అందులో పిల్లలకి పాఠాలు చెప్పడం చేత కాక , పిచ్చెత్తి పోయి హాస్పిటల్లో చేర్చబడిన వారు ఉన్నారో లేదో కాని , అదే  ఎర్రగడ్డలో ఉన్న "డాన్  బాస్కో" స్కూల్లో పని చేస్తున్న ఒక ఇంగ్లీష్ పంతులమ్మ మాత్రం ఆ  అర్హత  సాదించిందట . పైనున్న చిత్రం చూసే వారికి విషయం అర్ధం అయి ఉంటుంది .  ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీష్ మాత్రమె మాట్లాడాలి అనేది పిల్లలకు ఇంగ్లీష్ బాషను బోదిమ్చడం లో బాగం కావచ్చు. తెలుగు మాతృబాష గా ఉన్న విద్యార్దులు తెల్లారే పాటికి పర బాషలో పండితులు కావాలంటే వారేమి మహా కవి కాళీ దాసు లా  వర ప్రసాదితులు కారు . ఒక ప్రణాళిక బద్దంగా , ఎంతో ఓర్పుతో పిల్లలకు బాషను నేర్ప గల శిక్షణ పొందిన ఉపాద్యాయులు ఇందుకు అవసరమ్. ఇంగ్లీష్ ను కూడా మొదట తెలుగు బాష ద్వారానే నేర్పించడానికి ప్రయత్నించాలి . ఉదాహరణకు ఉల్లి పాయను ఇంగ్లండ్ లో ఉండే విద్యార్ది కి చూపించి "ఆనియన్ " అని చెపి

1956 తర్వాత తెలంగాణా లోకి వచ్చిన ఇల్లరికపు అల్లుళ్ళ సంతానం కి "పీజ్ రియంబర్స్ మెంట్ " ఇవ్వరా ?!

                                                                                                                                                                                        మాత్రు దేవో భవ !                                                              పితృ దేవో భవ !                                                               ఆచార్య దేవో భవ !   ఇది మనం ప్రత్యక్ష  దేవుళ్ళని దర్శించే సంప్రదాయం. ఎవరికైనా సరే అమ్మ వాస్తవం అయితే అయ్య నమ్మక్కం . కానీ మన తెలంగాణా అధికారులకు మాత్రం వాస్తవం కంటే నమ్మక్కం మీదే బోల్డంత నమ్మక్కం ఉన్నట్లుంది . అందుకే తెలంగాణా విద్యార్దులకు "పిజ్ రియంబర్స్మెంట్ " చెల్లించే విదానం గురించి సలహాలు ఇమ్మని ముక్యమంత్రి గారు కోరినప్పుడు కొందరు అధికారులు " 1956 కు ముందు ఉన్న తండ్రుల స్తానికతను  మాత్రమే  సంతానంకి  వర్తింపచేసి  పీజ్ రియంబర్స్ మెంట్  ఇవ్వాలని " వారు మాత్రమే తెలంగాణా బిడ్డలు అని నొక్కి చెప్పినట్లు తెలిసింది . సర్కార్ వారు కూడా  అదే సలహాను అనుసరించి జీ.ఓ లు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది సమంజసం అయిన నిర్ణయం అవుతుంద

ఈ సంవత్సరం మన రాష్ట్రం లో కరువు తాండవించడానికీ కారణం వారేనా !?

                                                                        మొన్న ఎవరో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మన రాష్త్రంలో కరవు అనేది లేదని ,ఈ  సంవత్సరం తిరిగి చంద్రబాబు గారు  పాలనా పగ్గాలు చెపట్టారు కాబట్టి తిరిగి కరువు దేవత మన రాష్ట్రం లోకి వచ్చిందని అనేసరికి నేను చాలా ఆశ్చర్య పోయాను. అయన గారి సిద్దాంతం ప్రకారం చంద్ర బాబు గారి పూర్వపు 9 ఏండ్ల పాలనలో తెలుగు రాష్ట్రంలో కరువు నెలకోందట . ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దేవుడి పాలన దివికి దిగి వచ్చిందా అన్నట్లు వేంటనే వర్షాలు పడి బీళ్ళు సస్యశ్యామలం అయ్యాయట! ఆ తర్వాత 10 ఏండ్లు ఏ నాడు "తెల్ల కాలం " ఏర్పడలేదట . తిరిగి ఈ  సంవత్సరమే వర్షాలు వెనుకాడాయి అట. దానికి సోల్ కారణం నవ్యాంద్ర ముఖ్యమంత్రి గారు అధిపతి కావడమేనట. ఇలా అయన చెపుతున్న రీజనింగ్ విన్న నాకు ఠక్కున ఒక డౌట్ వచ్చింది. పోనీ అయన చేప్పేదే నిజమయితే , చంద్రబాబుగారు నవ్యాంద్ర వరకే ముఖ్యమంత్రి కానీ , మొత్తం భారత దేశానికి కాదు కదా , మరి దేశం అంతా కరవు కాలమే కదా ? అంటే , చంద్ర బాబు గారీ లెగ్ సామాన్యమైనది కాదని, దానీ ప్రభావం యావత్ దేశం అ

బార్యలను చంపేవాళ్ళు మంత్రులు కానీ , భారతీయ సంస్క్రుతి గురించి వాపోయే వారు మంత్రులా ? అంటున్న మాజీ పాలకులు!

                                                                    ఆయనొక మాజీ మంత్రి ! ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా పదవి వెలగ బెట్టిన అయన గారికి స్త్రీల విషయంలో కూడా  ఎక్స్ట్రా ఎఫ్ఫిర్స్ అంటేనే మోజు ఎక్కువ . కట్టుకున్నోళ్లు ముచ్చటగా ముగ్గురైనా ఒంట్లో తీట తీరక బార్యా ఉండగానే పరాయి స్త్రీతో పబ్లిక్ గా సంబందం పెట్టుకుంటే , దానిని భరించలేని ఆ ఇల్లాలు సదరు మంత్రి గారి ప్రియురాలితో ట్విట్టర్ లో యుద్దం చేసి చివరకు ఆత్మహత్య (?) చేసుకుంది . ఈ  కేసులో మాజీ  మంత్రి గారికీ వ్యతిరేకంగా ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నా అప్పటి ప్రభుత్వం కానీ , స్త్రీల హక్కుల కోసం పోరాడే మహిళ సంగాలు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే విషయం మీద "మనవు" లో ప్రస్తావించడం జరిగింది . ఆసక్తి ఉన్నవారు క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడగలరు . http://ssmanavu.blogspot.in/2014/01/24.html    సదరు మంత్రి గారు తన బార్య ఆత్మ హత్య కేసులో ఆమె మరణం ని "సహజ మరణం " గ ద్రువీకరిస్తో సర్టిపికెట్ ఇవ్వమని కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి చేసారని , పోస్ట్ మారటం నిర్వహించిన డాక్టర్ గారు నిన్న చెప్పడం చూస్తుంటే , మాజీమంత్రి గా