1956 తర్వాత తెలంగాణా లోకి వచ్చిన ఇల్లరికపు అల్లుళ్ళ సంతానం కి "పీజ్ రియంబర్స్ మెంట్ " ఇవ్వరా ?!

                                                    
                                                                       

                                                           మాత్రు దేవో భవ !
                                                             పితృ దేవో భవ !
                                                              ఆచార్య దేవో భవ !

  ఇది మనం ప్రత్యక్ష  దేవుళ్ళని దర్శించే సంప్రదాయం. ఎవరికైనా సరే అమ్మ వాస్తవం అయితే అయ్య నమ్మక్కం . కానీ మన తెలంగాణా అధికారులకు మాత్రం వాస్తవం కంటే నమ్మక్కం మీదే బోల్డంత నమ్మక్కం ఉన్నట్లుంది . అందుకే తెలంగాణా విద్యార్దులకు "పిజ్ రియంబర్స్మెంట్ " చెల్లించే విదానం గురించి సలహాలు ఇమ్మని ముక్యమంత్రి గారు కోరినప్పుడు కొందరు అధికారులు " 1956 కు ముందు ఉన్న తండ్రుల స్తానికతను  మాత్రమే  సంతానంకి  వర్తింపచేసి  పీజ్ రియంబర్స్ మెంట్  ఇవ్వాలని " వారు మాత్రమే తెలంగాణా బిడ్డలు అని నొక్కి చెప్పినట్లు తెలిసింది . సర్కార్ వారు కూడా  అదే సలహాను అనుసరించి జీ.ఓ లు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది సమంజసం అయిన నిర్ణయం అవుతుందా అని నా  అనుమానం. ఎందుకో చూద్దాం .

    మన సమాజం లలో పురుషులు అత్తారింటికి ఇల్లరికాలు వెళ్ళడం సాంప్రాదయమే . ఒక వేళ ఇల్లరికం గా కాక పోయినా అత్తవారింటి తరపు వారు కొంచం కలిగిన వారైతే , వారి అండన బ్రతుకుదాం అనే ఉద్దేశ్యం తో అయినా చాలా మంది తమ స్వస్తలాలు వదలి అత్తవారింటికి లేక వారు ఉంటున్న ప్రాంతం లోకి వెళ్ళడం ఆనవాయితీగా జరుగుతున్నదే . అలాగే 1956 తర్వాత ఎవరైనా తెలంగానేతర పురుషుడు తెలంగాణా అమ్మాయిని పెండ్లి చేసుకుని అక్కడికే వెళ్లి స్తిరపడి పోయి , పిల్లల్ని కని పెంచి పోషిస్తూ అక్కడె  చదివిస్తుంటె , ఇప్పుడు రాబోయే జీ. ఓ  వలన , ఆ పిల్లలకు రెయంబర్స్ మెంట్ వస్తుందా  అంటే ఖచితంగా రాదనే చెప్పాలి . ఎందుకంటె వారి తండ్రి వాళ్ళ అమ్మని 1956 తర్వాత చేసుకుని తెలంగాణా వచి స్తిర పడ్డాడు కాబట్టి . పోరాటాలు చేసే టప్పుడు . రాణి రుద్రమలు . చాకలి ఐలవ్వ వీర గాధలు పాడి మురిసి పోయిన మనం,  పిల్లల జన్మ కారకురాలైన తల్లి తండ్రులలో కేవలం తండ్రి  ప్రాంతాన్ని ,వారసత్వాన్నే పరిగణన లోకి తీసుకోవడం నిజంగా అమ్మను అవమానించడమే.

   కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో కూలంకష పరిశిలన చేసి, తెలంగాణా బిడ్డల పీజ్ రెయంబర్స్ మెంట్ విషయంలో ఏది చేసినా తల్లి తoడ్రులకు సమాన హోదా , గౌరవం ఇవ్వవలసినదిగా కోరడమైనది. జన్మ భూమి ని "తెలంగాణా తల్లి " గా కొలిచే మనకు బిడ్డల జన్మకు తండ్రిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం పాడి కాదు అని నా అభిప్రాయం.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన