Posts

Showing posts from April, 2017

కారు నడుపుతూ "పేస్ బుక్ " గురించి ఆలోచించినందుకు "పేస్ "అంతా పచ్చడి అయిoదట !

Image
                                                                                                                              "పిచ్చి ,పిచ్చి, పిచ్చి రక రకాల పిచ్చి ! ఏ పిచ్చి లేదనుకుంటే అది అసలైన పిచ్చి !" . ఇది ఏ సినిమాలో పాటో గుర్తు లేదు కాని , పాడింది మాత్రం భానుమతి గారు అని మాత్రం గుర్తు!. ఇది అసలు సిసలైన జీవన సత్యమ్. ఒకరి కి ఉన్న పిచ్చి గురించి మరొకరికి సదభిప్రాయం ఉండదు కాని , ప్రతి వారిలోనూ ఏదో రకం పిచ్చి ఉండే ఉంటుంది . ఇందులో సదరు పిచ్చి వలన వ్యక్తికీ గాని , కుటుంబానికి గాని , సమాజానికి కాని లాభం ఉంటె అది ఒక గొప్ప ప్రవర్తన గా గుర్తించబడుతుంది . లేకుంటే అది పిచ్చిగానే మిగిలి పోతుంది . ఉదాహరణకు డబ్బు సంపాదన పిచ్చి వలన లాభం ఉంటుంది కాబట్టి , అవినీతితో డబ్బు సంపాదించినా అది గ్రేటే .  సమాజానికి మేలు చేసే రచనలు , కవితలు రాసే వారు ఎంత గొప్పగా ఆలోచనలు కలిగి ఉన్నా , వారి రచనలుకు పైసా ఆదాయం రానప్పుడు వారివి పిచ్చి రాతలే అవుతాయి . సో ఇందులో ఆర్దిక ఉపయోగిత వాదం ఇమిడి ఉంది .                                            సరే  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే , ఈ  మద్య సం

కొడుకు వయసు ఉన్న కుర్రాడితో 'లవ్ గేమ్ " ఆడినందుకు 'కుక్క చావు ' చచ్చిన పేస్ బుక్ ప్రేమికురాలు ! .

Image
                                                                                                         వెర్రీ వేయి విదాలు అంటారు . అందులో ప్రేమ వెర్రి ఒకటి . ఉచ్చ నీచాలు , వావి వరుసలు, వయసు తారతమ్యాలు ఇత్యాది వి అన్ని మరచి పోయి , మోస పూరిత విదానాలతో ఒక కుర్రాన్ని రెండు న్నర్ర సంవత్సరాల పాటు ప్రేమ పేరుతొ వెరెత్తిoచిన ముగ్గురు పిల్లల్లున్న తల్లి  చివరకు అ కుర్రాడి చేతిలోనే దారుణంగా హత్య చేయబడింది . వివరాలు లోకి వెళితే ,                        చిన్న వాళ్ళు , పెద్ద వాళ్ళు  అనే బేద బావం లేకుండా , అందరి మనో వికారాలను సంతృప్తి పరస్తుంది , సామాజిక సైట్ "పేస్ బుక్" . అందులో ఎవరైనా సరే తమ గురించి అబ్బద్దపు సమాచారంతో ఖాతా ఓపెన్ చేసి , తమ మనసులో ఉన్న వికారాలు అన్ని ప్రదర్సించ వచ్చు. అది నిజమే అని నమ్మి కొంత మంది బకరాలు అయి చివరకు బలి పశువులు అయిన ఉదంతాలు ఎన్నో !. అదిగో అలాoటి ప్రేమ వికారం పుష్కలంగా ఉన్న స్త్రీయే జబల్ పూర్ కి చెందిన 45 సంవత్సరాల జ్యోతి కరోనా . ఆమె కు 21 సంవత్సరాల వయసు గల కూతురుతో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు . భర్త ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో క్లర్క్ గా పని చ

సహచరుల అంగాలు అమ్ముకుని బ్రతికే రాక్షసులకు , శాంతి వచనాలు రుచిస్తాయా గురూజీ !!?

Image
                                                                                                   ఈ  మద్య మన హైదరాబాద్ నుంచి కొంత మంది ముస్లిం యువకులు , అంతర్జాతియ ఉగ్రవాద  సంస్త అయిన ISIS పట్ల ఆకర్షితులై అందులో చేరి తమ మతాభిమానం చాటుకోవడానికి ఏగేసుకు పోతున్నారట. అటువంటి వారికి ఒక శుభ వార్త! ప్రస్తుతం ISIS ఉగ్రసంస్త నిదుల లేమితో కష్టాల్లో ఉందట! పాపం అందుకనే  తమ సహచరులు ఎవరైనా పోరాటం లో గాయపడితే , వారు బ్రతికి ఉండగానే వారి శరీర అంగాలు తొలగించి వాటిని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుని తద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారట. కాబట్టి ఎవరైనా ఒత్సాహికులు బ్రతికి ఉండగానే తమ అంగాలను కోయించుకోవాలని ఉబలాటపడుతుంటే నిరబ్యంతరంగా ఆ సంస్తలో జాయిన్ కావచ్చు!.    పూర్వకాలం లో రాక్ష జాతి ఒకటి ఉండెది అని మన పురాణాలు చెపుతుంటే , అవి పుక్కిటి పురాణాలు అని ఎద్దేవా చేసే వారు ఉన్నారు. అటువంటి వారికి ఆ రాక్షస జాతి వారసులు " మేమున్నాం ,ఇది నిజం" అని తమ చేష్టల ద్వారా రుజువు చేస్తున్న ISIS సంస్త సబ్యులను చూసి తెల్లముఖాలు వేయాల్సిందే! యుద్దాలలో పట్టుబడిన స్త్రీలను  సెక్స్

కొడుకింట్లో ముందు గది,కూతురింట్లో వంట గది!

Image
 ఈ మద్య తల్లి తండ్రుల ద్రుక్పదంలో మగపిల్లల విషయంలో కొంత మార్పు వస్తున్నట్టుంది.ఇదివరలో ఆడ పిల్ల "అక్కడి పిల్ల" అనే భావంతో ఉండేవారు. ఆడపిల్లని పెద్ద చదువులు చదివిస్తే,అంతకంటే ఎక్కువ చదివిన వరుణ్ణి తేవాలంటే, కట్నాలు ఎక్కవ ఇవ్వడమే కాక దొరకడం కూడ కష్టమయి పోతుందనే బావంతో, మగపిల్లల్ని చదివించినంతగా ఆడ పిల్లల్ని చదివించేవారు కాదు. మగపిల్లాడు అంటే తమను ముసలితనంలో ఆదుకోవల్సిన వాడు అనే బావంతో కూడ మగపిల్లలకే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చే వారు.  కాని రోజులు మారాయి. ఆడపిల్లల్ని ఇచ్చే దగ్గర తమ పిల్లకు సాద్యమయినంత వరకు అత్త పోరు, ఆడబిడ్డల పోరు లేని కుటుంబమయితే బాగుండు అని ఆలోచిస్తున్నారు.ఉమ్మడి కుటుంబాలు అనేవి తగ్గిపోయాయి. మగపిల్లలు ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలలో ఉండాల్సిరావడం,నేటి యువత ఎక్కువ స్వేచ్చ దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో, పెళ్లయిన వెంటనే వేరు కాపురాలు పెట్టేస్తున్నారు.దీనికోసం కుటుంబాలలోని,చిన్న చిన్న తగాదాలను బూతద్దాలలో చూపిస్తూ,మొగుళ్లని వేరు కాపురం కోసం వత్తిడి చెయ్యడం పరిపాటి అయిపోయింది.   అలా వేరు కాపురాల వల్ల కొంచం ఆదపిల్లల్కి స్వేచ్చ లబించడం వల్ల తమ పుట్టింటి వారితో ఎక్కువ కాంట

"పెట్టు -పట్టు -కొట్టు " అనే ఫేస్ బుక్ వ్యాపారం లో లక్షలు సంపాదించిన వరంగల్ మాయలేడి !!?

Image
                                                                                                                 మోసాలు చేసి పెండ్లిళ్ళు చేసుకోవడం కొంతమంది మగవాళ్ళ పేటెంట్ రైట్ ఏమీ కాదు. అవకాశం చిక్కితే అతివలు అంతకంటె ఘనులే అని నిరూపించే ఎన్నో ఉదంతాలు ప్రస్తుత సమాజం లో కంటున్నాం . వింటున్నాం. అలాంటి మాయలేడి కోవలోకే వస్తుంది వరంగల్ కి చెందిన ఈ మాయలేడి కేసు. కాకపోతే ఇలాంటి మాయలాడి వలలో పడే మగవాళ్ళు ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తి విచారణ చేయకుండా ఎలా  ఆమె ఉచ్చులో చిక్కుకున్నారో అర్దం కావటం లేదు. వివరాలులోకి వెలితే ,    వరంగల్ కి చెందిన ఆమె బ్రతకడానికి ఏ వ్యాపారం అయితే బెస్ట్ అని ఆలోచించగా , ఆలోచించగా ఆమెకొక బ్రహ్మాండ మైన ఆలోచన వచ్చిందంట. ఇంతవరకు ఆడపిల్లలను పెండ్లిళ్ళ పేరుతో మోసం చేస్తూ  సమాజం లో దర్జాగా బ్రతుకుతున్న కొంత మంది నిత్యపెండ్లి కొడుకులు ఆమెకు స్పూర్తిగా నిలిచారు. మోసపు పెండ్లిళ్ళు చేసుకోవడం లో మగాళ్ళు పేటెంట్ రైట్ కలిగిఉండం ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. అన్ని రంగాల్లో పురుషులతో పాటు స్త్రీలు సమానమే అని రుజువు చేసుకుంటున్న  ఆధునిక సమాజం  లో "మోసపు  పెండ్లిళ్ళు&qu

తాకట్టు పెట్టిన "తాడు" ను విడిపించి కాపురం కాపాడమంటే, బావను చంపి అక్క "తాడు"నే తెంచిన తమ్ముడు!

Image
                                                                        ఆడపిల్లలకు పెళ్లి కాక ముందు పుట్టింటి రక్షణ, పెండ్లి అయ్యాక మెట్టినింటి రక్షణ ఉండాలనృది సాంప్రదాయ బావన. కాకపోతే ప్రస్తుత పరిస్తితులు ప్రకారం పుట్టింటి వారి రక్షణ స్త్రీలకు, ఎల్ల కాలం ఉండాల్సిందే  అనిపిస్తుంది. అయితే బార్యా భర్తల సంబందాలు సున్నితమైనవి కాబట్టి వారి మద్య ఏర్పడిన సమస్యలు పరిష్కరించే వారు కొంచం సహనవంతులై, ఇరువురికి తగిన విదంగా కౌన్సిలింగ్ చేస్తూ, వారి వారి తప్పులు తెలుసుకోవటమే కాక, సర్దుకు పోయే తత్వంలో కాపురం సరిదిద్దుకునేలా చేయ గలగాలి. దీనికి ఎంతో అనుభవమున్న పెద్ద మనుషులు కావాలి.అంతే కానీ తమ తోడపుట్టిన వారిని కట్టుకున్నోడు ఏదో రాచి రంపాన పెడుతున్నాడని , అంతులేని ఆవేశం లో "నేను లేస్తే మనిషినే కాను " అని ప్రవర్తించే దోరణిలో పుట్టింటి వారు ప్రవర్తిస్తే , మొన్న పండితా పురంలో బావను చంపిన బావమరిది కేసులో లాగే అవుతుంది.     ఖమ్మం జిల్లా లో కామే పల్లి మండలంలో ,పందితాపురానికి  చెందిన అంబడిపూడి వెంకటేశ్వర్లు (43), ఉమ బార్యాభర్తలు. ఇద్దరూ మంచిగానే కాపురం చేసుకుంటున్నారు అట. అయితే ఉమకు ఏడాది క్రి

కాపురాలు చేసే వారికి" తాళి "బరువు ! కంపెనీలు నడిపే వారికి "బట్టలు" బరువు !!

Image
                                      కాదేది అనర్హం పబ్లిసిటి స్టంట్ కు !  కాపురం చేసుకుంటున్న  ఆలి ,ఆ ఆలి కున్న తాళి ఇవన్ని రాజకీయ పార్తీల  పబ్లిసిటి కోసం ఉపయోగపడుతుంటె , ఆఫీసులలో  పని చేసే స్తీలు , బట్టలు లేని వారి నగ్నత్వం  కంపెనీల పబ్లిసిటికి ఉపయోగ పడుతున్నాయి . ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటె  పార్టీలు, కంపెనీల ప్రచారం కోసం వెలగబెడుతున్న సదరు పబ్లిసిటి స్టంట్ లు "సోషల్ ఎక్స్పెరిమెంట్ " పేరుతో జరుగుతున్నవే . ఇందులో ప్రదానంగా పోకస్ కాబడుతుంది స్త్రీలే . బంగం కలుగుతుంది వారి ఆత్మాభిమానానికే . ఈ బుర్ర తక్కువ ప్రదర్శనలలో  పురుషులు ఉన్నట్లు అనిపించినా , చివరకు పోకస్ అయ్యేది  "తాళి లేని ఆలి , బట్టలు లేని  ఉద్యోగిని " మాత్రమే        . వీటి గురించి మరి కొంచం వివరంగా చెపితే కాని విషయం అర్దం కాదు.                                                                                                                             పై చిత్రంలో ఉన్న పేపర్ సారాంశం చుస్తే మీకు విషయం అర్దమై పోయి ఉంటుంది . వివాహం అయిన స్త్రీలు తాళి దరించడమన్నది పూర్తిగా హిందూ మత  పరమైన విషయం . దీని

కట్టుకున్నోడిని వదిలేసి వస్తే , ప్రేమ వివాహం చేసుకుంటాను అంటున్న "వీర ప్రేమికుడు"

Image
                                                                                                                    ప్రేమించి పెండ్లి చేసుకోవడం మన సమాజంలో కొత్తా కాదు , తప్పు అంతకంటే కాదు . కాని పెండ్లి కాని వారిని మాత్రమె పరస్పర అంగీకారంతో ప్రేమించనూ వచ్చు , పెండ్లాడనూ వచ్చు . మరి ఒక వివాహితురాలిని పైగా ఒకప్పటి తన సహద్యాయినిని, ఇంకా  ప్రేమిస్తున్నాను అని వెంటబడడమే కాక , చివరకు మీ ఆయన్ని వదిలేసి వస్తే , మరో పెండ్లి చేసుకుని ప్రేమ రుచి చూపిస్తాను అంటే ఆ  ప్రేమికుడి ప్రవర్తన క్షమార్హం అవుతుందా ? ఖచ్చితంగా కాదు . అందుకే కటకటాల వెనక్కి వెళ్ళే పరిస్తితి అతనికి కలిగింది . వివరాలు లోకి వెళితే ,                  అతని పేరు కలన్శికో అట . ఇదేదో రష్యన్ పెరులాగుంది అంటే అతడి కుటుంబం సామ్యవాద బావజాల ఆకర్షితమై ఉండాలి . సరే ! మన కలన్శికో గారిలో ఒక తీవ్ర వాదం ఉంది .కాకపొతే  అది నక్సలిజం లాంటిది కాదు , లవిజం కు సంబందించింది .  అతను తను ఇంజనీరింగ్ కాలేజిలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్ట్రాడట . కాకపొతే అది వన్ సైడ్  లవ్ కాబట్టి అ అమ్మాయి మాత్రం ఇంజనీరింగ్ పూర్తీ అయ్యాక , తన

తప్పుడు సమాచారం తో పెండ్లి చేసుకున్నందుకు ,తల్లి తో కొరివి పెట్టించుకున్న కొడుకు !!?

Image
                                                                                                వివాహం చేసుకునే ముందు వదువు గురించి వరుడు , వరుడు గురించి వధువు అన్ని రకాలుగా విచారణ చేసుకుని , తమకు అనుకూలమైన సంబంధం అని బావించాకే వివాహానికి O.K. అంటారు. వివాహ పూర్వ విచారణలో వదూవరుల కుటుంబ నేపథ్యం, ఆర్దికపరిస్తితితో తో పాటు వారి విద్యార్హతలు కూడా పరిశీలనలోకి తీసుకుంటారు. ముక్యంగా ప్రొపెషనల్ కోర్స్ లు చదివిన వారు తమకు తమకు ఫలాని  ప్రొపెషనల్ కోర్స్ లు చదివిన అమ్మాయి లేక అబ్బాయి కావాలని మ్యారేజ్ బ్రోకర్లకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి వారికి సంబంధాలు కుదిర్చేటప్పుడు మధ్యవర్తులు  తగిన ఎంక్వయిరీ లు చేసి వదువు లేక వరుడి విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు నిర్దారించుకున్నాకే , అట్టి సంబంధాన్ని తమ పార్టీలకు రిఫర్ చేయాలి. ఇట్టి కేసులలో అవసరమైతే విద్యార్హతలు కు సంబందించిన సర్టిఫికెట్ లు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అలా పరిశీలన చేయనందువలన  ఒక వ్యక్తి పెండ్లి అయిన 2 నెలలకే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే  ,అతనికి  కొరివి పెట్టె మగదిక్కు లేక చివరకు కన్న తల్లే కొరివి పెట్ట

సాక్షాత్తు లక్ష్మీ నరసింహా స్వామీ సన్నిధి లోనే అక్రమాలకు పాల్పడిన ఎండోమెంట్ అధికారులు !!!

Image
                                                                                        హిందూ మతాధికారులు లేక పీఠాధిపతుల పాలనలో హిందూ దేవాలయ నిర్వహణ,అవినీతి మయంగా లోపభూయిష్టంగా ఉందనే వంకతో , జస్టిస్ చల్లా కొండయ్య గారి కమిషన్ సెలవిచ్చింది అని చెప్పి , 1987 లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టానికి సవరణలు చేసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా సెక్యులర్ అధికారుల చేతిలో దేవాలయ నిర్వహణ బాధ్యతలు పెట్టింది అప్పటి N.T.R గారి ప్రభుత్వం . చివరకు సెక్యులర్ అధికారుల పరిపాలన ఎలా ఉందని రుజువు అయిందంటే, "గొర్రెలను తినువాడు గోవింద కొడతాడు , బర్రెలను తినువాడు వస్తాడయ్యా " అన్న బ్రహ్మం గారి మాటను నిజం చేసినట్లు అయింది. సాక్షాతూ N.T.R గారి పాలనలోనే దేవాలయాలు లోని సెక్యులర్ ఆదికారులు తమ స్వార్థం కోసం  ఎంతకు తెగించారో , నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో ఈ  రోజు  ఈ  నాడు దినపత్రికలో వచ్చిన ఈ  క్రింది ఐటెం ఉదాహరణ.                                                                                                                                                                        

నిజమైన ఇండియన్ ముస్లిం లు ఇలా ఉంటారు ! అలా అనరు!

Image
    విబిన్న మతాలూ , సంస్కృతులు కు ఆలవాలమైన భారత దేశం లో ప్రజల మద్య శాంతి సామరస్యాలు తో కూడిన జీవన విదానం నిరంతరం కొనసాగాలంటే కేవలం ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటున్నామ్ అని పైకి చెప్పుకుంటూ , లోపల మాత్రం  మా దేవుడే గొప్ప అని గప్పాలు చెప్పుకుంటే కుదరదు. కనీసం సంవత్సరం కి ఒక సారైనా తమ తోటి సోదరుల ప్రార్ధనా మందిరాలకు వెళ్లి అక్కడా వారి విదానం లో ప్రార్దన చేసి , వివిధ మతాల ప్రజల చేత వివిధ పేర్లతో పిలువబడుతున్నా, భగవంతుడు ఒకడే అని ప్రాక్టికల్ గా  చాటి చెప్పాలి. ఇటువంటి విదానం హిందువులకు తెలిసినంతగా ప్రపంచం లో మరెవ్వరికి తెలియదు అనుకుంటా.                                                                                                 నాకు తెలిసి చాలా మంది హిందువులు ఇండియన్ ముస్లింల  ప్రార్ధనా మందిరాలు అయిన దర్గహ్ లకు వెళ్లి అచ్చం ముస్లిం లు ప్రార్దించే విదానం లోనే ప్రార్దించడమే కాక  తమకు కలిగే సంతానానికి ముస్లిం ల పేర్లే పెట్టిన వారు ఉన్నారు. అలాగే చర్చ్ లకు వెళ్ళె హిందువులూ ఉన్నారు. పల్లేటూళ్లల్లో ఉండే ముస్లిం స్త్రీ పురుషులు స్తానికంగా ఉండె దేవాలయాలకు వెళతారు . అలాగే మ

"అమ్మా బాబుల "అరేంజ్డ్ మారేజ్ " కాదన్నందుకు ," మై చాయిస్ " అని ప్రియుడితో లేచి పోయినందుకు , నా బ్రతుకు జైలు పాలే "అంటున్న "లేడి బంది పోటు " !!!

Image
                                                                        సందీప్ కౌర్  పై పొటో లో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు సందీప్ కౌర్ . వయస్సు 24 సంవత్సరాలు . మనిషి మంచిదేనట . గుణమే, ఆధునికత సావాసం చేసి చెడి పోయింది . నర్స్ గా తర్ఫీదు పొందిన  ఈ అమ్మాయి సాంప్రాదాయ కుటుంభం నకు  చెందినది . తల్లితండ్రులు ఒక మంచి సంబందం చూసి పెండ్లి చేసుకోమ్మా  అని అంటే , " ఠాట్  ! మీరు తెచ్చిన సంబందం చేసుకోవడానికి నేనేమైనా సాంప్రదాయక ఆడపిల్లనా , ఆధునికత తెలిసిన "మై చాయిస్ " పిల్లను అని తను ప్రేమించిన వాడితో ఒక ఫైన్ నైట్ ప్లైట్ ఎక్కి అమెరికాలో ని కాలిపోర్నియాకు జంప్ అయింది . ఆమె కోసం కొన్నాళ్ళు ఏడ్చి ,ఏడ్చి ఇక ఏడ్చే ఓపిక లేక మిన్నకుండి పోయారు ఆమె తల్లి తండ్రులు .               ఇక కాలిపోర్నియా వెళ్ళిన కౌర్ ప్రేమికులు , అక్కడ అక్కడ తిరిగి చేతిలో ఉన్నది కాస్త ఖర్చు చేసుకున్నారు . ఇక అమ్మాయి దగ్గర ఏమి లేకపోయే సరికి , ప్రియుడికి ఆమె మీద మొహం మొత్తినట్ట్లుంది , ముఖం చాటేశాడు . ఇక, వారిని ఆశ్రయించి , విరిని ఆశ్రయించి  కౌర్ సకల వ్యసనాలకు బానిస అయిందట . చేతిలో చిల్లిగవ్వ లేక పోయే సరికి ,

ముగ్గురు విద్యార్దులను "ముగ్గు "లోకి దింపి 30 యేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న 'ముదనష్టపు పంతులమ్మ '

Image
                                                                                                                                           అడ దానికి అయినా , మగాడి కైనా స్వీయ నియంత్రణలు లేకపొతే , ఎంత నీచమైన పనికి అయినా పాల్పడతారని  అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ఉతా లో జరిగిన సంఘటణ తెలియ చేస్తుంది. అమెరికా రాష్ట్రాల  రాజ్యాంగాలు అన్ని రంగాల్లో స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఇచ్చాయి కాబట్టి , నేరాల విశయం లో కూడా సమ న్యాయం పాటించి పురుషులతో పాటు స్త్రీలను కటినంగా శిక్షించడానికి వెనుకాడడం లేదని , ఒక లేడి టిచర్ కేసులో విదించిన శిక్ష తెలియ చేస్తుంది. మన దేశం లో అయితే మైనర్ బాలికను పాడు చేసిన మృగాళ్ళకు 7 నుంచి పది ఏండ్లు జైలు శిక్షలు విదించే అవకాశముంది. కాని అదే మైనర్ బాలుడిని ప్రలోబపరచి వాడితో గడిపే స్త్రీకి మాత్రం ఏ శిక్షా ఉండదు. పైపెచ్చు నాకు తెలిసీ తమిళనాడులో ఒక పదిహేనేళ్ళ విద్యార్దిని , ఆ పిల్లాడు చదివే స్కూల్లోని పంతుల్లమ్మ ప్రేమ పాటలు నేర్పి లేవదీసుకు వెళ్లి పెండ్లి చేసుకుంటే "ప్రేమకు వయసు తో పనేముంది ? అది వారిష్టం అని ఆవిడ వెనుకాల ఉన్న ఆస్తికి ఆశపడి , 30 యేండ్ల టిచర్

4 లక్షలు తీసుకుని దూలపల్లి కుర్రాడి "పొడుగు దూల " తీర్చిన గ్లోబల్ డాక్టర్లు !!!

Image
                                                                                                                                 అ అబ్బాయి పేరు నిఖిల్ రెడ్డి. వయస్సు 22 యేండ్లు. చదివింది B.tech .  ఉండేది  హైదరాబాద్ లోని పేట్ బషీర్ బాద్ పోలిస్ స్టేషన్ పరిదిలో గల దూలపల్లి  .ఈ  దూలపల్లి  అబ్బాయి కి  ఒక చిన్న దూల ఉంది అట. అదేమిటంటే తను ఇంకొంచం ఎత్తు కావాలని. ప్రస్తుతం అతని ఎత్తు 5. 7 అట. ఒక రకంగా అది మగాళ్ళకు ఏవరేజ్ ఎత్తు. మరి పొట్టిగా కాని , మరీ పొడుగుగా కాని అనిపించనంత సాదారణ ఎత్తు. అయినా సరే కుర్రాడికి తన ఎత్తు పట్ల సంతృప్తి కలుగలేదు అంటె దానికి వేరే కారణం ఏదైనా ఉందేమో! చదివిన  ఇంజనీరింగ్ కోర్స్ కూడా అతనికి మానసిక పరిపక్వతను ఇవ్వలేదనుకుంటా , మానసిక ఎదుగుదల లేక శారీరక ఎదుగుదల గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాడు. అతనికి ఒక స్నేహితుడు ఎవరో హైదరాబాద్ లోని గ్లోబల్ హస్పిటల్ లో ఆపరేషన్ ద్వారా మనుషుల ఎత్తు పెంచుతారని తెలిసి , గ్లోబల్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడి డాక్టర్ లను సంప్రదిస్తే వారు 4 లక్షలు ఇస్తే పని అయిపోతుంది అన్నారు అట.   సాదారణంగా కొన్ని  ఏక్సిడెంట్ కేస్  లలో కాళ్ళు

డిల్లి "నిర్భయ "కేసుకు , ముంబాయి "నిర్భయ "కేసుకు గల తేడా ఏమిటో గ్రహించారా ?

Image
                                                                                                                                                                                      భారత దేశం లో యావత్ జాతి తలదించు కునేలా జరిగిన అమానవీయ సంఘటన "నిర్భయ" ఉదంతం . అబలను ఒక్క దానిని పరమ పాశవికంగా హింసించి, హింసించి మరి అత్యాచారం చేయడమే కాకుండా , అత్యంత కిరాతకంగా నడుస్తున్న బస్సులోనుంఛి ఆమెను ఆమె బాయి ప్రెండ్ ను క్రిందకు నెట్టివేశారు మ్రుగాళ్ళు కొందరు . ఆమె అత్యాచారం వలన అయిన గాయం కంటే , శరీరానికి అయిన గాయాలు ఎక్కువ అవటం వలన ఆమె మరణించింది . అలా మ్రుగాళ్ళు ఆమె మిద అత్యంత పాశవికంగా దాడి చేయటానికి ఆమెకు, వారికి మద్య పాత పగలు ఏమి లేవు . మరి ఎందుకలా చేసారు అంటే కేవలం అ సమయంలో లౌక్యం తెలియని అ అమ్మాయి వారిని పరుషమైన మాటల తో   రెచ్చగోట్టడం వలననే అని తెలుస్తుంది . అ విషయం గురించి కొంత మంది పెద్దవాళ్ళు వ్యాక్యానిస్తూ , అ విపత్కర సమయంలో కొంత బ్రతిమాలె విదానం  ప్రదర్శిస్తే , ఆ అమ్మాయికి అంత ముప్పు ఏర్పడి ఉండేది కాదు అని అంటే , దానిని అబ్యుదయ వాదులు ఖండించారు . కాని అదే తరహ అత్యాచారం ఆ

ఆలుమగలు అంటే తనువుల పరంగా కాదు , మనసుల పరంగా అని చాటి చెపుతున్న సీతారామ కళ్యాణం !!!

Image
                                                                      .                                                  భారత దేశంలో కుటుంబ వ్యవస్థ ఉన్నంత వరకు , ఆలు మగల మద్య అన్యోన్యత ఉన్నంత వరకు సీతా రాముల ఆదర్శ దాంపత్యం గురించి జనులు చెప్పుకుంటూనే ఉంటు0టారు . హైందవ సంప్రాదాయంలో ఆలుమగలు ను విడి విడి గా చూడటం జరుగదు . హిందువులు జరిపే, గృహలలో పూజలు  మొదలుకుని , దేవాలయాలలో మరియు  ఇతర సామూహిక పూజల  వరకు తప్పకుండా దంపతులు పాల్గోనవలసిందే . ఒక వేళా  తన జీవిత బాగస్వామి రాలేని లేక లేని పరిస్తితులలో కూడా వారు ఉన్నట్లుగానే బావించి పూజలు జరపుతారు . అంతే  కాని వివాహం కాని వారికి క్రతువులు జరిపించే అధికారమే లేదు . ఇదే విషయం మనకు రామాయణం లో "స్వర్ణ సీత" ఉదంతంలో తెలుస్తుంది .                                    రాములవారు ప్రజల మాటకు విలువిచ్చి , కట్టుకున్న ఇల్లాలిని అడవిలో వదలి రమ్మని తమ్ముడిని ఆజ్ఞాపిస్తాడు . ఆ రోజు నుంచి ఇక్కడ రాజ ప్రాసాదంలో రాములువారు , అక్కడ అడవిలో సితమ్మ వారికి నిరంతరం ఒకరి మిద ఒకరికి ద్యాస . తమ జీవిత బాగస్వాములనే తలచుకుంటూ మానవులుగా తమ విద్యుక్త ధర్మాన్ని న

బరి తెగించిన బాయ్ ప్రెండ్ సంస్కృతికి బలి అయిపోయిన "బాలికా వధు " ప్రత్యుషా బెనర్జీ !!

Image
                                                                                   బారత టెలివిజన్ సీరియల్ చరిత్రలో రామాయణ , మహా భారత సీరియల్స్ తర్వాత అంత జనాదరణ పొందిన సీరియల్ బాలికా వధు . దానినే తెలుగులో "చిన్నారి పెండ్లి కూతురు " గా అనువదించి  ప్రసారం చేసారు. హిందీ లో ఆ సిరియల్ ఎంత జానాదరణ పొందిందో , తెలుగులోను అంతే ప్రేక్షకాదరణ పొందింది. ఆ సీరియల్ లో  చిన్నారి పెండ్లి కూతురు  టైటిల్ రోల్ ను పోషించిన  ప్రత్యూష బెనర్జీని తెలుగు ప్రేక్షకులు తమ స్వంత ఇంటి ఆడపడచులాగా బావించి ఆమెకు అభిమానులుగా మారారు. దీనికి ప్రధాన కారణం రాజస్తానీ సంప్రాదాయ దుస్తులలో ఆమె చూపిన హావ బావ విన్యాసం తో కూడిన నటనా కౌశల్యం . తెలుగు సీరియల్స్ ని సైతం కాదని , తెలుగు మహిళా మణులు ఈ  సీరియల్ కు బ్రహ్మ రధం పట్టారు అంటె కేవలం అందులో చూపించిన  సాంప్రాదాయ గ్రామీణ  కుటుంబ నేపద్యం పట్ల ఆసక్తి అని చెప్పవచ్చు.     సీరియల్స్ నటించడం వేరు. బయట నిజ జీవితం లో జీవించడం వేరు. సినిమాలలో రాముడు లాంటి ఆదర్శ మూర్తి పాత్ర దరించిన నటుడు అమ్మాయిల కు మత్తు మందు ఇచ్చి బ్లూ ఫిలిం లు తీసిన కేసులో పట్టుబడి , పోలిసుల చేతిలో ఒళ

"న అజ్ఞాని స్వాతంత్ర్య మర్హతి " అని చాటుతున్న నల్లగొండ అరుణ మరణ ఉదంతం. !

Image
                                                                        ఈ రోజు  రాష్ట్రంలో ఇద్దరు ఆడపిల్లలు ప్రేమ ఉన్మాదానికి బలి అయి పోయిన రోజు. ఒకరు  పిఠాపురంనకు చెందిన రేవతీ కాగా , మరొకరు నల్గొండ జిల్లా కు చెందిన అరుణ అనే ఇంజనీరింగ్ విద్యార్దిని . ఇరువురూ తమ ఉన్మాద ప్రియులు కిరోసిన్ పోసి నిప్పు అంటించిన తర్వాత ఎగిసిన ప్రేమ జ్వాలలకు తాళలేక మరణించిన వారే. ఇరువురూ హాస్పిటల్లో చేర్చినాకనాలుగైదు రోజులు నరక యాతన అనుభవించి చనిపోయిన వారే. పాపం ఆ ఆడపిల్లల మరణ యాతన చూస్తున్న వారికి ఎవరికైనా హ్రుదయం ద్రవించక మానదు. నల్గొండ అరుణ తండ్రి తన కూతురుని చంపిన వాడిని ఉరి తీసి చంపాలని చెపుతూ రోదిస్తున్న తీరు మనసున్న ఎవరినైనా కదలించి వేస్తుంది.                నల్ల గొండ అరుణ కేసులో  ఆమె ప్రియుడు సైదులును నేరం జరిగిన 24 గంటలలో నే పోలిసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిస్తే కోర్టు అతన్ని రిమాండ్ కి పంపింది. ఒక వేళ పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపితే , ఆరునెలలోపే విచారణ పూర్తీ చేసి అతనికి గరిష్టంగా శిక్ష విదించవచ్చు.  రోజు నల్ల గొండలో రాజకీయ పార్టిలు, మహిళా సంఘాలు, విద్యార్ది సంఘాలు

65 యేండ్ల 'హసన్ సరూర్ ', మతాచారం కోసమే 14 ఏండ్ల అమ్మాయి తో సెక్స్ కోసం తహ తహ లాడాడా?!!!

Image
                                                                                                 హసన్ సరూర్ !  లండన్ లో నివసిస్తున్న ఇండియన్ సంతతికి చెందిన వారు. గార్డియన్ పత్రిక లో వ్యాసాలూ రాసే ప్రముఖ ప్రొఫెషనల్ జర్నలిస్ట్. ఆయనకి స్వంత పత్రిక , టెలివిజన్ నెట్వర్క్ ఉన్నాయని అంటున్నారు . అయన గారికి 65 యేండ్లు మీద పడ్డాయి. నడవడానికి కూడా కొంచం ఇబ్బంది పడుతున్నట్లు ఉంది . అయితేనేం 14 ఏండ్ల కన్నె పిల్ల తో సరసాలకోసం ఒక గంట ప్రయాణం చేసి, అన్ని ముగిసాక తిరుగు ప్రయాణం లో డేప్ట్ పోర్ట్ రైల్వే స్టేషన్ లో పోలిసుల చేత అరెస్ట్ కాబడి రిమాండ్ కి తరలించబడ్డారు.  ఇంతకీ విషయం ఏమిటంటె                         లండన్ లోని UNKNOWN  T V  వారు తమ స్తింగ్ ఆపరేషన్ లో బాగంగా హసన్ గారి మీద నిఘా పెట్టారు అట. గార్డియన్ లాంటి ప్రెశ్త్జియస్ పత్రికకు కాలమిస్ట్ గా ఉన్న 65 యేండ్ల హసన్ గారికి , కన్నెపిల్లతో రొమాన్స్ చేయాలని బుద్ది  పుట్టిందట. అందుకు అయన ఎలాగో తంటాలు పడి ఒక 14 యేండ్ల యంగ్ ఏజ్ అమ్మాయిని ఎంగేజ్ చేసుకున్నారు అట. మరి ఆ అమ్మాయి ఉండెదేమో డేప్ట్ పోర్డ్ అనే ప్రాంతం. నడవడానికి కూడా ఇబ్బంది పడె హసన్ గారు ఉం