డిల్లి "నిర్భయ "కేసుకు , ముంబాయి "నిర్భయ "కేసుకు గల తేడా ఏమిటో గ్రహించారా ?

                                                                   
                                                                           


                                      భారత దేశం లో యావత్ జాతి తలదించు కునేలా జరిగిన అమానవీయ సంఘటన "నిర్భయ" ఉదంతం . అబలను ఒక్క దానిని పరమ పాశవికంగా హింసించి, హింసించి మరి అత్యాచారం చేయడమే కాకుండా , అత్యంత కిరాతకంగా నడుస్తున్న బస్సులోనుంఛి ఆమెను ఆమె బాయి ప్రెండ్ ను క్రిందకు నెట్టివేశారు మ్రుగాళ్ళు కొందరు . ఆమె అత్యాచారం వలన అయిన గాయం కంటే , శరీరానికి అయిన గాయాలు ఎక్కువ అవటం వలన ఆమె మరణించింది . అలా మ్రుగాళ్ళు ఆమె మిద అత్యంత పాశవికంగా దాడి చేయటానికి ఆమెకు, వారికి మద్య పాత పగలు ఏమి లేవు . మరి ఎందుకలా చేసారు అంటే కేవలం అ సమయంలో లౌక్యం తెలియని అ అమ్మాయి వారిని పరుషమైన మాటల తో   రెచ్చగోట్టడం వలననే అని తెలుస్తుంది . అ విషయం గురించి కొంత మంది పెద్దవాళ్ళు వ్యాక్యానిస్తూ , అ విపత్కర సమయంలో కొంత బ్రతిమాలె విదానం  ప్రదర్శిస్తే , ఆ అమ్మాయికి అంత ముప్పు ఏర్పడి ఉండేది కాదు అని అంటే , దానిని అబ్యుదయ వాదులు ఖండించారు . కాని అదే తరహ అత్యాచారం ఆ తర్వాత ముంబాయి లేడీ  జర్నలిస్ట్ కేసులో ఎదురైతే , ఆ అమ్మాయి ఎంతో సంయమనం తో వ్యవహరించి , తనకు ఎక్కువ హాని జరుగకుండా చూసుకుని , ఆ తర్వాత ఆ మ్రుగాళ్ళను న్యాయస్తానాలుకు ఈడ్చి మరి ,వారికి ఉరి శిక్ష వేయించ గలిగిగింది . మరి ఇందులో ఎవరు చేసినది కరెక్టు ? ఎవరు నిజమైన "నిర్భయ".?

                2013 ఆగస్టులో ముంబాయిలో జరిగిన అత్యాచారం మిద నేను స్పందిస్తూ"నలుగురు ని రేప్ చేసారు ! పాపం పండి అయిదో రేప్ కి అరెస్ట్ అయ్యారు !"అనే ఒక టపాను పెట్టడం జరిగింది . అందులో
    
                     "వివిద సమయాల్లో నలుగురు అమ్మాయిల్ని రేప్ చేస్తే, ఒక్కరైన కేసు పెట్టలేదు సరి కదా , కనీసం వారి తాలుకు బందువులు ఆ మదాందుల్ని ఏమి అనకుండా నోరు మూసుకున్నారు అంటే ఖచ్చితంగా వారు సమస్యలకు బయపడే మనస్తత్వం కలవారైన అయి ఉండాలి ,లేకుంటే అటువంటి  నిర్జన ప్రాంతానికి వెళ్ళడం లో వారి తప్పు కూడ ఉండి ఉండాలి. అందుకే రేపిస్ట్ ల దుశ్చర్యలు  వెలుగులోకి రాలేదు. కానీ మొన్న పోటో జర్నలిస్ట్ దైర్యవంతురాలే కాక వివేక వంతురాలు అనిపిస్తుంది. నిర్భయ కేసులో మాదిరి కాకుండా అనువు కాని వేళ ఒదిగి ఉండి, తర్వాత కేసు పెట్టడం ద్వారా  ఆ పాపాత్ముల ఆగడాలకు అరికట్ట వేయించ గలుగుతుంది. ఈ  కేసులో ఇంకా కొన్ని నిజాలు వెలుగు లోకి రావాల్సిన అవసరం ఉందనిపిస్తుంది .

 రేప్ జరిగిన తర్వాత,నిందితులు సాక్ష్యాలు లేకుండా చేసి, ఆ తర్వాత బాదితులతో తాము బాదితుల సొమ్ములను ఏమి తీసుకోలేదు అని, చెక్ చేసుకోండని చెప్పి అమ్మాయి మొబైల్ అమ్మయికి ఇచ్చి, కొంత దూరం అంతా కలిసే నడచి ఆ తర్వాత  నిందితులు పారి పోయారట! అమ్మాయి కూడా హాస్పిటల్ లో జాయిన అయ్యాక తన తల్లిని బట్టలు అవి తీసుకుని హాస్పిటల్ కి రమ్మని చెప్పిందట!ఈ కేసులో దోషులకు త్వరగా శిక్షీమ్చాలని, తాను త్వరగా కోలుకుని తన ఉద్యోగానికి వెళ్ళాలని ఉన్నట్లు బాదితురాలు చెప్పింది .శబాష్! అదే దైర్యం ప్రతి బాదితురాలలో ఉండలి. రేప్ అనేది సమాజానికి మాత్రమే కాక జాతి అభిమానానికి వ్యతిరేకంగా జరిగే నేరం .ఇందులో బాదితులు తలవంచుకోవలసిన పని లేదు. ఒక ప్రాంతం లో రేప్ జరిగితే ఆ ప్రాంత రక్షణాదికారి నుంచి రాష్ట్రపతి వరకు సిగ్గుతో తల వంచుకోవాలే తప్పా, బాదితులు మాత్రమ్ కాదు.  మానసికంగా చెడిపోనంత వరకు శారీరక గాయాలు మనిషిని ఏమి చెయ్య లేవు. కానీ నిర్బయ కేసులలో మాదిరి ఒక్కో సారి మానబంగం ప్రాణ హాని కి దారి తీస్తుంది కాబట్టి,పైన చెప్పినట్లు స్తిలు వారి కుటుంబ సబ్యులు రక్షణ విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం  మంచిది. "  అని చెప్పడం జరిగింది . మరి నిన్న అదే కేసు తాలూకు జడ్జ్ మెంట్ ఇచ్చారు . అందులో  ప్రధాన ముద్దాయిలు ముగ్గురికి ముంబాయి సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విదించింది . బాదితురాలు కూడా మామూలుగా తన డ్యూటి తాను చేసుకుంటుంది  . మరి ఈ ఆమె వివేక వంతురాలు కాదా? చెప్పండి .

     జర్నలిస్ట్ కంటే ముందు అదే సంవత్సరం, దుండగులు మరో 4 గురిని రేప్ చేసినట్లు తెలుస్తుంది . కాని జర్నలిస్ట్ లాగా వారెవరూ  కేసు పెట్టె దైర్యం చేయలేక పోయారు . నిర్భయ చట్ట సవరణల ప్రకారం ఒకే వ్యక్తీ మొదటి సారి రేప్ కేసులో నేరం రుజువైతే యావజ్జీవ శిక్ష , రెండు కేసులలో రుజువైతే మరణ శిక్ష విదించే అవకాసం ఉంది . జర్నలిస్ట్ దైర్యం చూసి , అదే స్పూరితితో మరొక బాదితురాలు తనపై అంతకు ముందు జరిగిన అత్యాచారాన్ని బయట పెట్టి , రుజువు చేయడంతో 3 గురికి మరణ శిక్ష పడింది . ఈ  దెబ్బతో మ్రుగాల్లకు వెన్నెముకలో చలి పుట్టాల్సిందే . నిర్భయ లో రేప్ కు సంబందించి మరణ శిక్ష పడిన తోలి కేసు ఇదే .   నిర్భయ పని చేయడం ప్రారబిo చింది . బాదితురాలైన స్త్రీలు దైర్యoగా ముందుకు వస్తే , మ్రుగాల్లకు జీవిత కాలం ఊచలు లెక్క పెట్టిo చవచ్చు. మరి రెచ్చి పోయే వారికి యమ వాహనం గంటలు వినిపించవచ్చు . కాబట్టి ఖబడ్దార్ మ్రుగాళ్లారా !

   అయితే స్త్రీల రక్షణ విషయం లో అదునాతన స్త్రీ వాదం కంటే , సంప్రాదాయ స్త్రీ రక్షణ వాదమే   కరెక్టు అని నిర్భయ చట్టం రుజువు చేస్తుంది . అది ఎలాగో మరొక టపాలో చూదాం      ముంబాయి రేప్ కేసు గురించి ఇదివరలో పెట్టిన టపా కోసం క్రింది లింక్ మిద క్లిక్ చేయండి .

నలుగురు ని రేప్ చేసారు ! పాపం పండి అయిదో రేప్ కి అరెస్ట్ అయ్యారు ! http://ssmanavu.blogspot.in/2013/08/blog-post_26.html

                                         (5/4/2014 Post Republished)) 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన