Posts

Showing posts with the label మడుపల్లి మర్డర్ కేసు

ఒకరికి ఇల్లాలిగా ఉంటూనే, మరో ఇద్దరికీ ప్రియురాలిగా మారినందుకు "ఆమె" కు ఆ గతి పట్టిందా !?

Image
                                                                                                                                                                                 "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని మనువు ఇటువంటి స్త్రీ, పురుషులను చూసి అని ఉంటాడు . స్త్రీ పురుషుల మద్య విచ్చలవిడి వివాహేతర సంబందాలు కుటుంబ వ్యవస్తను ఎలా బ్రష్టు పట్టిస్తున్నాయో ఈ  ఉదంతం తెలియ చేస్తుంది . పెండ్లి అయి , మొగుడు ఉండి ,ఇద్దరు బిడ్డలు తల్లి అయిన వ్యక్తిని ఒక అవివాహితుడు దైర్యంగా తనతో వేరు కాపురం పెట్టమని ఒత్తిడి చేయటమే కాక , అలా చేయనందుకు ఏకంగా హత్యే చేసాడంటే , ఈ సమాజం ఎటువంటి హిన పరిస్తితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు . దినంతటికి కారణం "లేచి పోయే రాజేశ్వరీ "లను ప్రొత్సాహిస్తున్న దిక్కుమాలిన స్త్రీ  వాదాలు కాక  మరింకేమిటి ?     ఖమ్మం జిల్లా, మధిర మండలం లోని మడుపల్లికి చెందిన శివారెడ్డి, దంపతులకు ఇద్దరు పిల్లలు. శివా రెడ్డి గారు వీర శివారెడ్డి లాంటి వారు కాదనుకుంటా, వాళ్ళావిడ  గారు మరో రాజశెఖర రెడ్డితో వివాహేతర సంబందం ఏర్పరచుకుంది. అయితే తప్పు అన్నాక ఒకరితో చేసినా పది మంది