Posts

Showing posts with the label భారత దేశం రెండవ రాజదాని

పొంచుకుని ఉన్న పెనుముప్పు ను ఎదుర్కోవడానికి హైదరాబద్ ని రెండవ రాజదానిగా చెయ్యడం తక్షణ కర్త్యవ్యం.

                                                                         మన రాష్ట్రం లో జరుగుతున్న "తెలంగాణా" "సమైక్య ఆంద్రా" ఉద్యమాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంటే దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ వారు ఎదో ఓక నిర్ణయం తీసుకుని ప్రజల మద్య వైషమ్యాలు లేకుండా చూడాల్సింది పోయి, అదిగో తేలుస్తాం, ఇదిగో తేలుస్తాం అని "నాన్నా పులి వచ్చే" కదలో మాదిరి వ్యవహరిస్తుంది.   అసలే మన పొరుగున ఉన్న "డ్రాగన్" చైనా వారు ఒక పకడ్బంది వ్యూహంతో మన చుట్టూ ఉన్న పొరుగు దేశాలతో మైత్రి పెంచుకుని,మిలట్రీ పరంగా బలోపేతం అవుతుంది. ఉత్తరాన అరుణాచల్ ప్రాంతంలో, ఇతర సరిహద్దు ప్రాంతాలలో అనేక మార్లు చొర బాట్లుకు తెగబడడమే కాక, అదేమిటని ప్రశ్నిస్తే అంతా ఉత్తిదే అన్నట్లు నాటకా లాడుతుంది. మన దేశం నైసర్గికంగా మూడు వైపులా హిందూ మహా సముద్రం ఉండటంతో,తన మిలట్రీ వ్యూహంతో ఆ మూడు వైపులా కూడా చైనా "ముత్యాల సరం" పేరుతో ఇండియాని చక్ర బందం లో బంధించింది అని చెప్ప వచ్చు. దీని కోసమే మన పొరుగు దేశాలకు తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకునే కార్యక్రంఅం చేపట్టింది. ఇప్పుడు భారత దేశం డ్రాగన