పొంచుకుని ఉన్న పెనుముప్పు ను ఎదుర్కోవడానికి హైదరాబద్ ని రెండవ రాజదానిగా చెయ్యడం తక్షణ కర్త్యవ్యం.



                                                                     

   మన రాష్ట్రం లో జరుగుతున్న "తెలంగాణా" "సమైక్య ఆంద్రా" ఉద్యమాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంటే దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ వారు ఎదో ఓక నిర్ణయం తీసుకుని ప్రజల మద్య వైషమ్యాలు లేకుండా చూడాల్సింది పోయి, అదిగో తేలుస్తాం, ఇదిగో తేలుస్తాం అని "నాన్నా పులి వచ్చే" కదలో మాదిరి వ్యవహరిస్తుంది.

  అసలే మన పొరుగున ఉన్న "డ్రాగన్" చైనా వారు ఒక పకడ్బంది వ్యూహంతో మన చుట్టూ ఉన్న పొరుగు దేశాలతో మైత్రి పెంచుకుని,మిలట్రీ పరంగా బలోపేతం అవుతుంది. ఉత్తరాన అరుణాచల్ ప్రాంతంలో, ఇతర సరిహద్దు ప్రాంతాలలో అనేక మార్లు చొర బాట్లుకు తెగబడడమే కాక, అదేమిటని ప్రశ్నిస్తే అంతా ఉత్తిదే అన్నట్లు నాటకా లాడుతుంది. మన దేశం నైసర్గికంగా మూడు వైపులా హిందూ మహా సముద్రం ఉండటంతో,తన మిలట్రీ వ్యూహంతో ఆ మూడు వైపులా కూడా చైనా "ముత్యాల సరం" పేరుతో ఇండియాని చక్ర బందం లో బంధించింది అని చెప్ప వచ్చు. దీని కోసమే మన పొరుగు దేశాలకు తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకునే కార్యక్రంఅం చేపట్టింది. ఇప్పుడు భారత దేశం డ్రాగన్ భందమ్ లో ఉందంటే అతిశయోక్తి కాదు.

    మరి ఇటువంటి విపత్కర పరిస్తితిలో మన దేశం తీసుకుంటున్న చర్యలు కేవలం శాంతి మంత్రాలు వల్లించే చర్చలకు తప్పా ఇతరత్రా ప్రయోజనం శూన్యం అంటున్నారు. చైనా ఒక కన్నింగ్ రాజకీయాలు నడిపే దేశం. ఒక వైపు పంచశీల సూత్రాలు వల్లెవేస్తూనే రెండవైపు దురాక్రమణ చేసిన చరిత్ర దానికి ఉంది. అది చెప్పే మాటలు ఎట్టి పరిస్తితిలోను నమ్మటానికి వీలు లేదు. ఒక అంచనా ప్రకారం2023   నాటికి ప్రపంచంలో ఇండియా, చైనాలే అగ్రరాజ్యాలుగా అవతరిస్తాయట!. కాబట్టి బవిష్యత్తు వ్యూహాల పట్ల  ఎంతో ముందు చూపున్న చైనా తన బవిష్యత్ పోటీదారైన భారత దేశాన్ని ఎదుర్కోవడాన్కి ఇప్పటినుండే చర్యలు మొదలు పెట్టి ఉండాలి. అందులో బాగంగానే "ముత్యాల సరం" భందన ప్రయోగం కావచ్చు.

  మరి ఇటువంటి వాటిని మన వారు పసికట్టి తీసుకుంటున్న నిర్ణయాలూ ఎమో కాని, మొదలు దేశం లో ప్రజలలో వైష్యామాలు కలిగించే ప్రాంతీయ దోరణులను రూపు మాపాలి. పొరుగున  ఉన్న చిన్న దేసాలతో కూడ మిత్రత్వ సంబందాలు ఎక్కువ చెయాలి.భారత రాజ్యాంగ నిర్మాత డక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ సూచించినట్లుగా, రక్షణ పరంగా  బౌగోలికంకంగా అంత సురక్షిత ప్రాంతం కాని డిల్లీతో ప్రధాన రాజధానిగా ఉన్నపట్టికి, హైదరాబాద్ ని రెండవ రాజ ధానిగా ప్రకటించి, అభిరుద్ది చెయ్యలి. దీన్ వలన అటు తెలంగాణా సమస్య, ఇటు దక్షిణ భారతీయులకు, ఉత్తర భారతీయులకు అంతర్గతంగ ఉన్న అసమాన బావాలు కూడ పోగొట్టే అవకాశముంది. అంతే కాక చుట్టూ విస్తరిస్తున్న డ్రాగన్ భందాన్ని ఎదుర్కోవడానికి కూడ అవకాశం ఉంటుంది.కాబట్టి ఇన్ని ఉపయోగాలున్న భారత రెండవ రాజధాని ఏర్పాటు తక్షణ కర్తవ్యం గా భావించి ఆ దిశగా చర్యలు చేపడితే మంచిది.          

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన