ఆ అరవై ఐదు మంది కించ పరచింది" మోడిగారినా "? లేక బారత సార్వ బౌమత్వానా ?

                                                                               



  'పోగాలం దాపురిమ్చినపుడు  ముందు వెనుకలు కానక చరింతురు ', అని పెద్దల ఉవాచ . అ అరవై మంది పెద్దలు మామూలు వారు కారు . చట్టాలు చేసే సభలో సబ్యులు. నూట ఇరవైకోట్ల భారత ప్రజల ఆకాంక్షలను గౌరవించా ల్సిన గురుతరమైన బాద్యత గలిగిన వారు. అవసరమైతే రాజ్యాంగానికి సవరణలు చేయగలిగిన మేదో సంపత్తి గలిగిన వారు. తమకు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా మెజార్టీ ప్రజల ఆకాంక్షలను మన్నిస్తూ, మెలిగే గౌరవ లౌకిక ప్రజాస్వామ్య వాదులు వారు. మరి అంత గొప్ప వారు కేవలం ఒక వ్యక్తీ మిద ద్వేషంతో  భారత సార్వబౌమత్వాన్ని కిoచ పరచే పనిని ఎలా చెయ్య గలిగారు?

  గుజరాత్ రాష్ట్ర ముక్యమంత్రి మోడీ గారి వీసాను అమెరికా వారు నిరాకరించారట !. అది రెండు రకాలు గా అవమానమ్. ఒక వేళ మోదిగారిని హిందూ మత ప్రతినిదిగా చూస్తె  హిందువు లందరికి అవమానమ్. లేదూ గుజరాత్ ముక్య మంత్రిగా చూస్తె, గుజరాత్ ప్రజలకు తద్వారా భారత ప్రజలందరికీ అవమానమ్. ఒక వేల గోద్రా అల్లర్ల్ర కేసులో అయన గారి పాత్ర ఉంటే అది నిర్నయించాల్సినది  బారతీయ న్యాయ స్తానాలు తప్పా , అమెరికా వీసాలు కావు. మోడీ గారు తప్పు చేసారని  ఎ న్యాయ స్తానం నిర్దారిమ్చలేదు . కాని అమెరికా మాత్రం విసా నిరాకరించి ప్రపంచ దృష్టిలో మోదిగారిని రాక్షసుడిని చేసింది . దీనికి అమెరికా ఉత్పత్తులను నిరాకరించడం ద్వారా తమ నిరసనను తెలియ చేయాల్సిన భారతీయ జనతా పార్టి , అది చెయ్యకుండా తగుదునమ్మా అంటూ  విసా పైరవీలు చేస్తూ  అమెరికాలో ట్రావెలర్ ఏజెంట్ లాగా పైరవీలు చేస్తుంది .

  రెండో ప్రక్క, ఒక ముస్లిం నాయకుడి చొరవతో 65 మంది m.p. లు అమెరికా అద్యక్షుడికి ఒక లెఖ రాసారట. దానిలోని సారాంశం ఏమిటంటే   "మోడి పాలనా వ్యవస్ధలోని అనేకమంది సీనియర్ అధికారులతో సహా అనేకమంది నేరస్ధులకు వ్యతిరేకంగా కేసులు కోర్టులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ పరిస్ధితిలో నిషేధాన్ని ఎత్తివేస్తే 2002 నాటి భయానక హత్యాకాండలో మోడి ''పాత్రను నిరాకరించినట్లే అవుతుం. అది మోడీ  యొక్క మానవ హక్కుల ఉల్లంఘనలను న్యాయబద్ధం చేస్తుంది. అమెరికా-ఇండియా సంబంధాల స్వభావాన్ని కూడా తీవ్రంగా మార్చివేస్తుంది. సార్వత్రిక విలువలయిన మానవహక్కులు, న్యాయంల కంటే అమెరికాకు తన ఆర్ధిక ప్రయోజనాలే మిన్న అన్న సందేశం ఇచ్చినట్లవుతుంది.",

అది ఎలా ఉందని పిస్తుందంటే,  " మోడీ" అనబడే దేశానికి ,"" 65mps"" అనబడే దేశానికి, బద్ద వైరం ఉoది .  మోడీ దేశం  వారు, 65mps దేశం వారి మిద అకారణంగా దండెత్తి అక్కడి ప్రజలను చంపితే, 65mps దేశం వారు అంతర్జాతీయ న్యాయస్తానంలో  మోడీ దేశం మిద కేసు పెడితే , అ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి,  అంతర్జాతి కి అన్న అయిన అమెరికా, మోడీ దేశఅద్యక్షుడికి  విసా ఇచ్చి ఆహ్వానిస్తే దాని ప్రబావం సదరు కేసు మిద పడుద్ది కాబట్టి, అలా ఇవ్వరాదు,ఇస్తే అది అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకం అన్నట్లు  ఉంది . ఈ దేశం లోని  కొంత మంది మైనార్టీ మతస్తులు ఈ దేశ సార్వ బౌమత్వాన్ని గుర్తించడానికి ఇష్ట పడటం లేదని ఈ  లెఖలొని  సారాంశం రుజువు చెస్తుమ్ది. దిని మిద తక్షణం స్పందించాల్సిన అవసరం  బారతప్రబుత్వానికి ఉంది .  ఒక దేశ  పౌరుడు తన సహా పౌరుడికి విసా ఇవ్వవద్దని  ఒక . విదేశీ అధ్యక్షుడిని కోరే హక్కు ఉందా? అలా ఉంటే ఈ దేశంలో తనకు నచ్చనివి జరుగుతున్నాయి కాబట్టి  ఈ దేశానికి చేస్తున్న  ఆర్దిక సహాయం ఆపమని  ఈ  దేశo లోని  పౌరులు  విదేశం  లోని తమ మాట వినే మత పెద్దల ద్వారా  రికమెండ్ చేయిస్తూ డైరెక్ట్గా లెఖలు రాస్తే ఏమిటి పరిస్తితి. ఇది మన దేశ అంతర్గత విషయాలలో జ్యోక్యం చేసుకోమని అభ్యర్దిమ్చినట్లు కాదా ? అలోచిం చండి  మేదావులారా?    

                పొరుగు దేశం లో తల దాచుకున్న తన మత శత్రువు ని చంపడానికి,  కనీసం అ దేసానికి సమాచారం ఇవ్వకుండా , అ దేశ అనుమతి లేకుండ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంగిస్తూ , అర్దరాత్రి అ దేశం లోకి ప్రవేసించి తన శత్రువును చంపి వెళితే కిక్కురుమనని  సో కాల్డ్ మత  వాదులు,  మోడీ గారికి విసా ఇవ్వ వద్దని అ వర్గ శత్రువునే కాళ్ళ మిద పది ప్రాదేయ పడుతున్నారట! సిగ్గు! సిగ్గు! బారతీయ జనతా పార్టి వారు కూడా ఏజెంట్ పైరవీలు ఆపి ఇంటికి వచ్చి ఏమి చేస్తే  'పెద్దన్న' దిగి వస్తాడో ఆలోచిస్తే మంచిది . అమెరికా ఇచ్చె వీసాను బట్టి ఇక్కడ ఎవరూ ఒట్లేయ్యడం లేదని పార్టీలు గ్రహిస్తే అంతే చాలు. ముందు తేల్చాల్సింది mp ల  లెఖ  బారత దేశ సార్వబౌమత్వానికి బంగకరమా ?కాదా? అనెది. 



  



.     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన