దిక్కుమాలిన సమాజంలొ ఫుట్టడమే ఇళవరసన్, నాగరాజులు చేసిన తప్పా?

                                                                                   
                                                                                 
                                                                       
 అది ధ ర్మపురి. ధర్మం ఎన్నిపాదాల మీద నడుస్తుందో తెలియదు మరి!ఆ వూళ్లో యువతీ యువకులు ఇళవరసన్, దివ్య. ఇద్దరూ ప్రెమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. ఆ పెళ్లికి అమ్మాయి తల్లి తంద్రుల అనుమతి లేదు. ఇద్దరి కులాలు వేరు. అయినా పర్వాలెదు పెళ్లికి కుల మతాలు అడ్డు కాదు. ఎందుకంటే మన రాజ్యాంగం లోనే రాసుకున్నాం.అటు అమ్మాయి కులస్తులు పెద్దకులం కాబట్టి సహజంగానే పెళ్లిని వ్చ్యతిరేకించి ఉండవచ్చు.అబ్బాయి దళితుడు కాబట్టి ఎన్నో తరాల నుండి వస్తున్న సాంప్రదాయ వ్యతీరేకత అమ్మాయి తరపు వారు కలిగి ఉండడం సహజమే అయినప్పట్టికి మారుతున్న పరిస్తితులకు అనుగునంగా సమాజాన్ని మార్చదంలో విఫలమ కావడంలో అందరి పాత్ర ఉంది.

   ఒక అమ్మాయి అబాయి పెండ్లి చేసుకోవడానికి కుల మతాలు అనుమతి అవసరం లేకపోయినా ఇరువైపుల తల్లి తండ్రుల అనుమతి కాని వారు ఒప్పుకోని పక్షంలో కోర్టు అనుమతి కాని   అవసరం ఉందనేది నా ద్రుడ అభిప్రాయం ఇదే విషయం మీద ఇదివరలో ఒక టపా  ( http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html ) పెట్టడం కూడా జరిగింది. నా అభిప్రాయం తప్పు అని వాదించిన వారు ఉన్నారు. కాని ఈ ధర్మపురి ప్రేమ కేసు చూశాకా ఆటువంటి చట్ట సవరణే ఉంటే ఈ రోజు ఆ ప్రేమికుడు అయిన ఇళవరసన్ కాని, అమ్మాయి తండ్రి అయిన నాగరాజు కాని చనిపోయే వారు కారు .

     చట్టాలు చేసేసి నంత ఇఝీగా  కుల బావనను రూపుమాపాలనుకోవడం పిచ్చితనమే అవుతుంది.ఎంతవరకు అది అగ్రకులాల దాషిటకం అని కొందరు, లేదు నిమ్న కులాల వారి కుట్ర అని ఇంకొందరు వాదించుకోవడానికి, వారి వారి వర్గ ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు నటించడానికి పై కేసు ఉపయోగ పడిందే తప్పా అసలు సమస్యకు మూలం దానికి పరిష్కారం కోసం ఆలోచించింది ఏమైనా ఉందా?.

    ఈ కేసులో ప్రాణాలు అర్పించినది ఎవరు? అటు కులస్తులు కాని, ఇటు కులస్తులు కాని తమ ప్రాణాలను కులం కోసం అర్పించారా? లేదే! కేవలం తమ కులస్తుడు చనిపోయాడని ఎదుటివారి ఇండ్లను తగులబెట్టి తమ అక్కసును తీర్చుకున్నారు .అంతే.కాని ప్రేమించిన పడతిని వదులుకోలేక అటు ప్రేమికుడు మరణిస్తే, కన్న కూతురి బవిష్యతును తలచుకుని గుందే చెరువై తంద్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతే ఇలాంటి ప్రేమ వ్యవహరాల్లో అటు ప్రేమికులు, ఇటు తల్లి తంద్రులు మాత్రమే బాదితులు తప్పా వేరెవ్వరూ కాదు.

   అటువంతి తరునంలో ఇరుపార్టీలను విచారించి, అటు ప్రేమికులను ఇటు తల్లితండ్రులను కౌన్సెలింగ్ పద్దతి ద్వారా సమాధాన పరచి పెంద్లికి కులం మతం ప్రధానం కాదని, అలాగే ప్రేమికులు వ్యామొహంతో తీసుకున్న నిర్ణయం కాదని వారు అన్నీ ఆలోచించే వివాహ నిర్ణయానికి వచ్చారని తల్లితంద్రులకు నచ్చ చెప్పే బాద్యత సమాజానికి లేదా? అప్పటికి తల్లితంద్రులు తమ బిడ్డల నిర్ణయాన్ని వివేకం కలిగిన పెద్దలే ఆమోదించారని సంత్రుప్తి చెంది,వివాహానిక్ అంగికరించవచ్చు. ఒక వేళకుల మత వాసనతో  వారు అంగీకరించక పోయినా ఒక ఆర్డర్ ద్వారా ప్రంఇకుల వివాహానికి అనుమతి ఇవ్వవచ్చు. ఇలా చెయ్యడానికి చట్ట సవరణ ద్వారా ఫామిలీ కోర్టులకు అధికారం ఇరు పార్టిలకు తమ సమయలను తెలియ చెసుకునె హక్కూ కల్పిస్తే ఇటువంటి మరణ యాతనలు ఉండవు.

     కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయా పబ్బాలు గడుపుకునే వారికి, ఇతువంటి సంఘటనలు ఆదారం చేసుకుని కుల నాయకులుగా, వర్గ నాయకులుగా, పబ్లిసిటి అవుదామనుకునే వారు అటు ఇటూ ఉన్నంత కాలం ఎంత మంది ఇళవరసన్లు, నాగరాజులు ఆత్మ హత్యలు చేసుకుంటే వారికంత లాబం కాబట్టి ఇటువంతి చట్టసవరణలు కావాలని కోరుకోరు.  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన