Posts

Showing posts from November, 2014

అలాంటి ఖతర్నాక్ చట్టాలు భారత్ లో లేవని బాదపడుతుంది కాబోలు ఈ టెన్నిస్ స్టార్ !

Image
                                                                                ఆమె గారు ఒక గొప్ప క్రీడాకారిణి . ఆమె పుట్టింది భారత్ లో మెట్టింది పాకిస్తాన్లో. ఆమె గారిమీద, భారత జాతీయ జెండాను అవమానించిందన్న ఆరోపణలు ఉన్నా , భారత్ దేశం ఆమెను ఏమి అనలేదు. పై పెచ్చు ఆమెకు మన రాష్ట్రం "తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ " గా ప్రకటించి కోటి రూపాయలు నజరానా ప్రకటించింది . తెలంగాణా కోసం పోరాటం చేసిన "విమలక్క " లాంటి అక్కలు ను కాదని ఇలాంటి "క్రీడా చుక్క" లకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇచ్చినప్పుడు కూడా  బారత్ సంతసించిందే తప్పా వేరు మాట అనలేదు. అలాంటి ఆవిడ గారు ఐక్యరాజ్య సమితిలో ఏదో గౌరవం దక్కిందని చెప్పి , పుట్టింటి భారత్ గురించి అంత మాట అంటుందా? ఆమె ఏమి అందో చోడండి.                                                                           నిజంగా భారత్ లో మహిళా స్వేచ్క కు ఆటంకం కలిగించే చట్టాలు ఉన్నాయా? ఎన్నో చట్టాలు మహిళలకు అండగా ఉండి , కొన్ని సార్లు కుటుంబ  హక్కులను కాల రాస్తున్నా , ఆ చట్టాలను కొనసాగిస్తున్నామే తప్పా రద్దు చేయమని ఎవరూ కోరుకోవటం లేదు. సమాజంలో జరి

"రంజింప"చేయటానికి మగతనం చాలినా , పరిపూర్ణ నిత్యానందుడు కావాలంటే "మొగుడు తనం" కావాలి!

                                                                  మగతనం వేరు! మొగుడు తనం వేరు! ప్రతి మొగుడిలో మగతనం ఉంటుంది . కాని ప్రతి మగాడిలో మొగుడి తనం ఉంటుందన్న గ్యారంటి లేదు. మగాడు స్త్రీ కి తాత్కాలిక సుఖం మరియు తాత్కాలిక రక్షణ  మాత్రమే ఇవ్వగలడు  . కాని మొగుడు శాశ్వత సుఖం తో పాటు, శాశ్వత రక్షణ తన స్త్రీకి మాత్రమే కాక , మొత్తం కుటుంబానికి ఇవ్వగల దమ్మున్న వాడు . ఒకవిధంగా మగాడు ఆప్ట్రాల్ మాన్ అయితే మొగుడు "ప్యామిలీ మాన్". వందమంది స్త్రీలను రంజింపచేసే మగతనం కన్నా , కుటుంబ రక్షణకు ఉపయోగపడే మొగుడుతనమే అన్నింటికి అన్నా మిన్న. అందుకే హిందూ జీవన విదానంలో " గృహస్తునికి " అంత ప్రాదాన్యం ఇచ్చింది . మొగుడు కానిదే  మగాడు కి పరిపూర్ణత రాదు.    మొన్న వివాదా స్పద స్వామీ నిత్యానందులు వారిని డాక్టర్ లు " మగాడు " గా డిక్లేర్ చేసారట!అయితే ఎవరికీ లాభం ?రేప్ లు గట్రా జరిగితే నష్టాలు తప్పా , కేవల మగతనం తో సమాజానికి ఒరిగిందేమి లేదు.  ఆశ్రమ జీవన విదానం లో కావలసింది కేవల "మగతనం"కాదు.   సన్యాసి కావాలంటే ముందు సంసారి కావాలి . సంసార జీవితo లో పరిపూర్ణత పొంది

అత్తింటి ఆరళ్ళు పడలేక పుట్టింటికి చేరిన తమిళ నటి "కుష్బూ "

Image
                                                                        ఆమె గారు ఒక మహా నటి ! పెండ్లికి ముందు సెక్స్ తప్పుకాదన్న తెగువ ఆమె గారి సొంతం . అంతటి దీరవనిత నిన్ననే పార్టి మారింది. ఈ మద్య చాలా మంది   ప్రతిపక్ష పార్తీల్లో పనిచేయాలంటే తెగ ఇబ్బంది పడిపోతున్నారు . 5 ఏండ్లు ఏ పదవీ లేకపోతే ప్రజలకు సేవచేసే దేలా ? అని యమ మదనపడి పోయి , నిద్ర పట్టక , చక్కగా నిద్ర పోతున్న  తన అనుచర గణాన్ని, లేపి మరీ సమావేశాలు నిర్వహిస్తే , పాపం వారు ఏమి అంటారు!? తమ నాయకుడి అదికార కాంక్షకు జై అంటారు కదా! అదిగో అలా అనిపించుకుని "ప్రజల కోరిక మేరకు అధికార పక్షంలో చేరుతున్నానహో" అని డంకా బజాయించి మరీ అధికార పక్షంలో చేరి పోతున్నారు . మరి అటువంటి సమయంలో ఈ నటీమణి గారు కోరి కోరి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరడం వింతే మరి !   దానికి కారణం ఏమిటమ్మా , అని విలేకరులు అడిగిన ప్రశ్నకు " కాంగ్రెస్ నాకు సొంత ఇల్లు లాంటిది " అన్నదట ! వారెవ్వా క్యా బాత్ హై. ! అంటే , కాంగ్రెస్ సొంత ఇల్లయితే , ఇన్నాళ్ళు పని చేసిన D.M.K  అత్తారిల్లా? అత్తారింట్లో ఆరళ్ళు తట్టుకోలేకే ఈ నటీమణి పుట్టింటికి వచ్చిందా ? గతంలో స

ఇల్లాలు ఇంటికి రావటం లేదని ఇంటికే నిప్ప్పు పెట్టిన "వరద రాజులు"

                                                                                  సంసారం అన్నాకా కలతలు ఉంటాయి . అందులో బాగంగా అలకలూ ఉంటాయి . అలగడం ఆడవాళ్ళ జన్మ హక్కు లాంటిది . వారిని అనునయించి  అలకకు కారణం కనుగొని  కనుగొని వారి కోర్కెలు తీర్చిన వాడె భర్త! భర్త అంటె భరించువాడు అని అర్దం. శ్రీ కృష్ణుడు అంతటి వాడె సత్యబామ అలక తీర్చడం కోసం ఆమె ఎడమ కాలి  తో తన్నించుకోవలసి వచ్చింది . ఆప్ట్రాల్ మనమెంత?!              పెళ్ళాం అలిగి పోయి ఇంటికి రాలేదనే కోపంతో తనకూ కోపం వచ్చి అసలు ఉంటున్న ఇంటికే నిప్పు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ? ఇదిగో అచ్చం ఖమ్మం జిల్లా అశ్వారావు పేట   వరద రాజులు చేసిన పని లాగే ఉంటుంది . వెనుకటి కేవడో ఎలుక మిద కోపంతో గుడిసెకు నిప్పు పెట్టుకున్నాడట! అలా ఉంది ఇతని పరిస్తితి! వరద రాజులు భార్య ఇవాళ కాపోతే రేపు వస్తుంది . ఆమె వచ్చిందని కాలిపోయిన ఇల్లు  ప్రత్యక్ష మవుతుO డా? లేదు కదా? మొన్న ఒకాయన పెళ్ళాం విడాకులు ఇచ్చిందని  బంగారం లాంటి తన ఇద్దరు పిల్లల్ని చంపి తను రైలు క్రింద పది ఆత్మ హత్య చేసుకున్నాడు . పైగా ఆయనొక గురువు గారు . ప్రోపెసర్  అయితే నేమి తన లోని కోపాన్ని జయించ

ఒక్క రోజులో 6000 పైగా పేస్బుక్ క్లిక్ లు , 1600 పైగా బ్లాగ్ వీక్షకుల లుక్ లు సాదించిన "మనవు" బ్లాగ్ పోస్ట్ !

Image
                                                                              కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు! మనిషి కుక్కను కరిస్తే వార్త! అనేది పత్రికా ప్రపంచంలో తలలు పండిన వారి ఉవాచ ! నిజమే మరి! పనికొచ్చే వార్తలు , వాటి మీద విశ్లేషణల పేరుతో రోజూ ఏదో ఒకటి బ్లాగుల్లో ప్రచురిస్తున్నా వీక్షకులు మాత్రం కొంచం వెరైటి గా ఉన్న దానిని ఎక్కువుగా ఇష్టపడుతుంటారని నాకు బ్లాగర్ గా అనుభవమే . బ్లాగులు ఎంత వీక్షకాదరణ పొందినప్పటికి రొటీన్ మాటర్ ని పెద్దగా పట్టించుకోరు అనేది కూడా వాస్తవం!ఒక్కొక్క సారి మనం ఎంతో మంచి విషయం పది మందికి పనికొచ్చే దానిని ప్రచురిస్తున్నాం అని హుషార్ గా పోస్ట్ దానికి వచ్చే స్పందన చూసినప్పుడు బోల్డంత నీరసం వస్తుంది . ఎందుకంటే "రోటీన్ మాటర్ " అనే ద్రుష్టి తో అది పది మందిని ఆకర్షించ లేక పోవడమే . అలా అని ఆకర్షించే మాటర్ పేరుతో ఏది పడితే అది పోస్ట్ చెయ్యాల్సిన అవసరం చాలా మంది బ్లాగర్ లకు లేదు. బ్లాగ్ లను ఏ ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్నామో , దానికి కట్టుబడి ఉన్న దానినే కొంత ఆకర్షనీయంగా మార్చి , పోస్ట్ చేయగలిగితే చాలు అనుకుంటున్నాను. అన్నింటికి వేల వీక్షణాలు రావలసిన అవస

ఈ "దెయ్యం " డైరెక్టర్ కి దేవుళ్ళు గురించి ఏందుకు?

Image
                                                                అతనొక సినిమా డైరెక్టర్ .దెయ్యాల మీద , రౌడీలు మీద సినిమా లు తీసి బాగానే సంపాయించుకున్నట్లుంది .  దేవుడు అంటే బొత్తిగా నమ్మక్కం లేదని  చెపుతుంటాడు . సరే మంచిది. బారతావనిలోబోల్డంత  మంది నాస్తికులు ఉన్నారు , అందులో ఇతనూ ఒకడనుకుందాం . కాని దేవుళ్ళు అంటే నమ్మకం లేని వాడు నమ్మకం లేనట్లు ఉండాలి కాని దేవుళ్ళను నమ్మే భక్తులను ఉద్దేశించి పిచ్చి ప్రేలాపనలు చెయ్యడం , "సైతాన్ "  సలహాలు ఇవ్వడం ఎందుకంటా ?           బెజవాడలో చదువుకునే రోజుల్లో బాగా రౌడీ గాంగ్ లతో తిరిగాడంట! వారి చరిత్రలనే సినిమా కెక్కించి జనాల డబ్బు దండుకున్నాడు. అది అతని సినిమా హక్కుల్లో బాగం కాబట్టి O.K . కాని దేవుల్లందరిని సమానం గా పూజించే తెలంగాణా భక్తులను కించ పరచే మాటలు మాట్లాడతాడా? దేవుళ్ళ మద్య ప్రాంతీయ బేదాలు ఉండాలని చెపుతాడా? భక్తులకు సప్తగిరి అయినా యాదగిరి అయినా ఒకటే అయినప్పుడు , తెలంగాణా వారు యాదగిరికి , ఆంద్రా వారు సప్తగిరికి పరిమితమవ్వాలని బోడి సలహా ఇస్తాడా? అవునులే! దెయ్యాలు సినిమాలు తీసి తీసి ఈయన మైండ్ దొబ్బినట్లుంది . లేక పోతే ప్రచారం లేక

. మోరల్ వద్దు ! పోలిసింగ్ వద్దు ! "బృందావన్ లాడ్జి"లో సరసమే ముద్దు! అంటున్న పోలిస్ ద్వయం

Image
వారిద్దరూ పోలిస్ డిపార్ట్ మెంట్లో ఒకరు S.I , మరొకరు C.I  గా ఉద్యోగాలు వెలుగబెడుతున్నారు . అందులో ఒకరు స్త్రీ కాగా మరొకరు పురుషుడు . ఇద్దరికీ పెండ్లిళ్ళు అయ్యాయి . అందులో S.I  గారి భర్త  తన  బార్య మీద ఎంతో నమ్మకంతో  దూరంగా చెన్నై లో ఉద్యోగం చేసుకుంటూ  ఉంటె , అటు C.I  గారి భార్య మొగుడు మీద నమ్మక్కం తో ఇంట్లో నిబ్బరంగా  ఉంది ఉంటుంది . అలా వారు నమ్మకంగా ఉండటం ఈ  పోలిస్ ద్వయం కి నచ్చలేదనుకుంటా . వేంటనే వారి జీవిత బాగా స్వాముల నమ్మక్కానికి చెక్ పెట్టాలనుకుని ,హైదరాబాద్ లో ఆబిడ్స్ లోని బృందావన్ లాడ్జికి వెళ్లి సరసాలు మొదలు పెట్టారట. దీనిని చూసి సహించలేని "మోరల్ పోలిసులు " ఎవరో  సదరు S.I గారి భర్తకు ఉప్పు అందిస్తే , ఆదరా బాదరా హైదరాబాడ్ వచ్చిన భర్తకు, రెడ్ హ్యాండేద్ గా దొరికి పోయిందట అ పోలిస్ ఇల్లాలు . దీన్ని గమనించిన C.I  గారు పారిపోతుంటే , భర్త అరుపులకు అలెర్ట్ అయిన ఆటో డ్రైవర్ లు సదరు C.I  గారిని పట్టుకుని నలుగు పీకి పోలీసులకు అప్ప చెప్పారట! ఇప్పుడు అ పోలిస్ ద్వయ్యాన్ని D.I.G  ఆపీసుకు ఆటాచ్ చేసారట! ఖచ్చితంగా ఇది మోరల్ పోలిసింగ్ విజయమే! లేకుంటే S.I  గారి భర్తకు మెస్సేజ్ అలర్ట్