Posts

Showing posts with the label బానిస కొడుకులు

ఎంత తెలివి ఉన్నా,వీళ్లంతా డబ్బున్నవాడి బానిస కొడుకులంటా!

                                                                     ఈ రోజుల్లో  వ్యక్యులు ఎంత తెలివి గలవారైనా కావచ్చు.గొప్ప రాజ నీతిజ్ణులు కావచ్చు. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు చిటికెలో సమాదానం చెప్పే అద్బుతమైన మెదడు ఉంటే  ఉండ వచ్చు గాక.భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికిల్ ఏమి చెపుతుందో చెప్పటమే కాక, వాటిని ప్రస్తుత పరిస్తితుల కనుగుణంగా ఎలా సవరణలు చేస్తే మనకు ఉపయోగమో వివరించ గల ఘటనాఘట సమర్దులు అగుగాక! అయితే ఏం! ఇటువంటి వారు ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో నిలబడటానికి, ఇవేమి పనికి రావు.   60 యేండ్ల స్వాతంత్ర్యంలో  మన రాజకీయం ఎంతగా ఎదిగి పోయిందంటే "కోటిరూపాయలు కుమ్మరిస్తే కాని కార్పోరేటర్" కాలేనంతగా.అసలు మేదావులు,దేశబక్తులు అనేవారు ఎన్నికలు అంటే బయపడే అంతగా, ఈ రాజకీయ వ్యవస్తను తీసుకెళ్ళి పోయారు ఈ దనస్వాములు. కాబట్టి వీరికి ఇక భయం లేదు.ఈ దెశ రాజకీయాలలో దనవంతులుకి తప్ప గుణవంతులకు స్తానం లేదన్నది రూడి అయిపోయింది. కాబట్టి,వారెంత అవినీతికి పాల్పడ్డారని ఆరొపనలున్నా,"ఎంత అవినీతి పరులైతే అంత పాలనా దఖ్షులు" అనే సూత్రాని వంట బట్టించుకుని ,ఈ సో కాల్డ్ మేదావులు అంతా వారి చుట్టూ