ఎంత తెలివి ఉన్నా,వీళ్లంతా డబ్బున్నవాడి బానిస కొడుకులంటా!


                                                                    

ఈ రోజుల్లో  వ్యక్యులు ఎంత తెలివి గలవారైనా కావచ్చు.గొప్ప రాజ నీతిజ్ణులు కావచ్చు. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు చిటికెలో సమాదానం చెప్పే అద్బుతమైన మెదడు ఉంటే  ఉండ వచ్చు గాక.భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికిల్ ఏమి చెపుతుందో చెప్పటమే కాక, వాటిని ప్రస్తుత పరిస్తితుల కనుగుణంగా ఎలా సవరణలు చేస్తే మనకు ఉపయోగమో వివరించ గల ఘటనాఘట సమర్దులు అగుగాక! అయితే ఏం! ఇటువంటి వారు ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో నిలబడటానికి, ఇవేమి పనికి రావు.

  60 యేండ్ల స్వాతంత్ర్యంలో  మన రాజకీయం ఎంతగా ఎదిగి పోయిందంటే "కోటిరూపాయలు కుమ్మరిస్తే కాని కార్పోరేటర్" కాలేనంతగా.అసలు మేదావులు,దేశబక్తులు అనేవారు ఎన్నికలు అంటే బయపడే అంతగా, ఈ రాజకీయ వ్యవస్తను తీసుకెళ్ళి పోయారు ఈ దనస్వాములు. కాబట్టి వీరికి ఇక భయం లేదు.ఈ దెశ రాజకీయాలలో దనవంతులుకి తప్ప గుణవంతులకు స్తానం లేదన్నది రూడి అయిపోయింది. కాబట్టి,వారెంత అవినీతికి పాల్పడ్డారని ఆరొపనలున్నా,"ఎంత అవినీతి పరులైతే అంత పాలనా దఖ్షులు" అనే సూత్రాని వంట బట్టించుకుని ,ఈ సో కాల్డ్ మేదావులు అంతా వారి చుట్టూ చేరి, భజన చేస్తుంటే మీ కేమనిపిస్తుంది చెప్పండి?.నా కైతే చిన్నఫ్ఫుడు చదువుకున్న వేమన పద్యం లోని చివరి వాక్యాలు గుర్తుకు వస్తున్నాయి.ఈ  పద్యం చూడండి. 
                    “కులము గలుగు వాడు గోత్రంబు గలవాఁడు
                     విద్య చేత విర్ర వీగువాఁడు
                     పసిడి గలుగు వాని బానిస కొడుకులు
                      విశ్వరాభిరామ వినుర వేమ“
                  
 
          కాబట్టి సో కాల్డ్ బానిస కొడుకుల వ్యవహారం చూస్తుంటే ఈ దేశాన్ని దేవుడు తప్ప ఈ రాజకీయ నాయకులు బాగుచేస్తారని మీ కేమైన ఆశ ఉందేమో కాని మాకైతే ఇసుమంత కూడ లేదు గాక లేదు.

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.