"మరాటా సింహం" శివుని సన్నిదికి వెళ్లారు.


                                                             

ఏ స్తానిక  ప్రజా సమూహమైనా ఒక ప్రత్యేక  గుర్తింపు పోందాలన్న  కోరికకలిగి వుంటుంది. మన దేశంలో కులవ్యవస్త బలీయమైనా,ఎక్కడా ఒకే కులసమూహాం గా  జీవించలేదు.భాషా సమూహాంగా జీవిస్తున్నాం.అదే ఉద్దేశ్యంతో మన సర్కార్ వారు బాషా ప్రయుక్త రాష్ట్రాలు గా దేశాన్ని పాలనా మండళ్లుగా విబజించింది. వాటిలో మరాటిలు నివసించే "మహారాష్ట్ర"ఒకటి.

"బోంబాయి" మహారాష్ట్ర రాజధాని అయినప్పటికి,అది అనేక రాష్ట్రాల ప్రజల్ని ఆకర్షించడం వల్ల,ఇతర రాష్ట్రాల నుండి వలసలదికమై చివరకు స్తానిక ప్రజల  జీవన అవకాశాలకు గండి కొట్టడం వల్ల వారి నిరసన"మరాటా ఆత్మాభిమానం" రూపంలో వెల్లువెత్తింది.ఆ వెల్లువ కు రూపమే"బాల్ దాకరే"
 మొదట్లో  "మరాటా ఆత్మాభిమానం" పేరుతో ప్రజలను ఏకం చేసిన ఆయన తర్వాత "హిందూ జాతీయవాదం " వైపు తన పోరాటాన్ని మలిపారు. కారణం బహుశా ఇతర మతాలకు చెందిన "బొంబాయి డాన్"లను సమర్థవంతంగా ఎడుర్కోవడానికి కాబోలు.ఏదైతేనేం బొంబాయి లో మరాటాలను ఒక తాటి మీదకు తేవడమే కాక నగరం పేరునే"ముంబాయి" గా మార్చివేశారు.

కొన్ని సార్లు మెతిమీరిన జాత్యాభిమానం ఇతరులను ఇబ్బంది పెట్టినా,అసలు అభిమానమే లేకుంటె జాతే అంతరించిపోయే ప్రమాద ముంది.ఈ విషయం తెలిసిన "దాకరే" ఇండియాకు దయా గుణం కలిగిన నియంత కావాలి అంటాడు.ఆయన హిట్లర్ అభిమాని కూడా.అయితే హిట్లర్ లొని నిర్దయ వల్ల అతని చర్యలు అతనిని రాక్షసుడి గా ముద్ర పడేలా చేసాయని ఆయన ఆభిప్రాయం కావచ్చు.

నాయకులలొ చాలా మంది సినితారలను,క్రికెట్ వీరులను విమర్శించడానికి వెనుకంజ వేస్తుంటారు.కారణం వారి వెనకున్న ఆభిమానులు కావచ్చు. కాని మరాటా సింహానికి ఆ బెదురు లేదు. తన ముక్కు సూటి విదానాలతొ ఎంతోమందిని తనమాటవినేలా చేసారు.

ఎ వ్యక్తి అయినా, చివరకు బగవదవతారమైనా ఏదో ఒక నాడు వెళ్లి పోక తప్పదు. ఎంత కాలంబ్రతికారన్నది కాదు,ప్రజలకు ఏమి చేసి పోయారు అన్నదే ముఖ్యం.ఆయన లేనిలోటు మరాటిలకు,హీందూజాతీయవాదం కు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ..          

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.