Posts

Showing posts from July, 2015

20 రోజుల నగర కాలుష్యాన్ని పట్టించుకోని నాస్తికులుకు , 12 రోజుల నదీ కాలుష్యం గురించి అడిగే నైతిక అర్హత ఉందా?

Image
                                                                                                                                                   గోదావరి నదీ పుష్కరాలు. 12 యేండ్ల కొకమారు వచ్చే పవిత్ర స్నానాల పండుగ. ప్రజలు తమ తమ పితృ దేవత ల సంస్మర్ణార్దం పిండాలు , తర్పణాలు నదిలో విడచి వారి పట్ల తమ కున్న భక్తీ పూర్వత గాడా భిమానం తెలియ చేసుకునే తరుణం.అలాగే నదీమ మ తల్లికి పూజలు చేసి తమ ను చల్లగా చూడాలని తమకు తోచిన రీతిలో కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం.  మరి తమ తోటి ప్రజలు ఎంతో పవిత్రంగా బావించే కార్యక్రమాలను తమకు ఇష్టం ఉన్నా లేక పోయినా మౌనం పాటించడం ఇంగిత జ్ఞానం ఉన్న నాస్తికుల పని. కాని తగుదునమ్మా అని , ఆస్తికుల మనోబావాలు  గాయపడేటట్లు ఫేస్ బుక్ లో , ఇతర మీడియా మాధ్యమాల్లో వ్హ్యాక్యలు చేయడం , పోస్టులు పెట్టడం, చర్చలు నిర్వహింఛి కీచకానందం పొందడం ఎంతవరకు సబబు? వీరు చేసే వ్యాఖ్యలు హిందువుల మనసులను గాయపరచ వచ్చు  కాని , తమ సాంప్రదాయ నదీమ  తల్లి పూజలు విషయం లో కాని , పితృదేవత పూజాకార్యక్రమ నిర్వహణ లో వారి అకుటింత దీక్షను ఏ మాత్రం చెక్కు చెదరనీయవు. దీనికి రుజువు ఈ 12 రోజులలో కోట్లాది మంది ప

రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది చావుకు ముఖ్యమంత్రి గారు కారణమైతే , ఖమ్మం వెటర్నరి డాక్టర్ గారి పుష్కర చావుకు కారణమెవరు?

Image
                                                                                                                                                 కొన్ని  ప్రమాద సంఘటణలకు  తక్షణ కారణం ,మూల కారణం అనేవి రెండు ఉంటాయి. మనం సాదారణంగా తక్షణ కారణాలు మీదే స్పందించి  దానికి అనుగుణంగా అందుకు బాద్యులు అయిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతుంటాం. ఒక్కొక్క సారి తక్షణ కారణం కంటె ఆ కారణానికి కారణమైన మూల కారణం ఏమిటొ కనుకున్ని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది . అయితే ఇటువంటి  కారణం కనుకోవటానికి సమగ్ర విచారణ జరపాల్సి ఉంటుంది. ఈ  రెండే కారణాలు కాక అసలు కారణం మరొకటి ఉంటుంది అని నా లాంటి నమ్మకస్తులు అనుకుంటూ ఉంటారు. అదే "విది ". విది కి వ్యతిరేకంగా ఏమి జరగదు అని , ఏది జరిగినా అంత "విది లిఖితం " అని అనుకునే వారు చాందస వాదులు లాగా కనిపించినప్పటికి , మన దేశం లో చాలా మంది ఆ నమ్మకం తోనే మనసును సంతృప్తి పరచుకోవడం వలన , దుర్ఘటనల తాలూకు మనో గాయాలు కు అది ఒక మంచి మందులా పనిచేసి , త్వరగా కోలుకోగలుగుతున్నారు.           ఉదాహరణకు , మొన్న రాజమండ్రిలో పుష్కరాల తోలి రోజునే, విపరీతమైన

మాతృ భూమి హిందూ జీవన విదాన సాంప్రదాయాన్ని పాటించిన "జగన్ " గారికి శుభాభి నందనలు!!

Image
                                                                                                   ప్రతి దేశానికి " law of the land " ఉన్నట్లే "Religious of the Land " కూడా  ఉండాలి . ఒక దేశంలో పుట్టి , కొనసాగే ఏ సాంప్రదాయమైన ఆ దేశ వారసత్వ సంపదే . దురాచారాలు, దుష్ట సాంప్రదాయాలు ఎక్కువ కాలం ప్రజల్లో మనలేవు కాబట్టి అవి పుబలో పుట్టి మఖలో మాడిపోయెవి. వాటి గురించి చెప్పుకోవలసిన అవసరం లేదు . కాని ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ , వారి అభ్యున్నతి కోసం ఉద్భవించిన ఏ ఆచారమైనా , మత విదానంగా రూపుదిద్దుకుంటుంది. దానినే దేశం లోని మెజార్తీ ప్రజలు ఆచరిస్తూ ఉన్నట్లైతే అది తప్పకుండా "Religious of the Land " అవుతుంది. దీనికి భారత దేశం కూడా మినహాయింపు ఏమి కాదు.          మనదేశం  లోని ప్రజల యొక్క దురదృష్టమో , అదృష్టమో విదేశి శక్తుల దండయాత్రలకు గురి అయి , అనేక సంవత్సారాలు వారి పాలనలో ఉండాల్సిన దుస్తితి ఏర్పడింది.విదేశి మత శక్తులు వారి సామ్రాజ్య వ్యాప్తి కోసం  ఈ దేశం లోని  ప్రజలను బలవంతంగా వారి మతాలలోకి మార్చి, వారినే తమ మాత్రు మతస్తుల మీదకు ఉసికొల్పి , వారి మద్య చిచ్చు పె

ఆడపిల్లల పేర్లకి అక్షరాలు కలిపితే అత్యాచారాలు అగుతా యంటున్న "వండర్ర్ ర్ ర్ ర్ బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ శ్రీ " . !!!

Image
                                                                                                                                  పైన పొటోలో ఉన్న ఆయన పేరు ఏదైనా సరే గాని, దానికి ముందు ఒక బ్రహ్మశ్రీ ఉంది. అది బహూశా బిరుదో లేక డిగ్రీ యో తెలియదు. అయన గారు సంఖ్యా జ్యోతిష్య శాస్త్రం లో పండితులు కాబోలు  T .V. లలో  ఆ శాస్త్రం గురించి ఒక స్పెషల్ షో నిర్వహిస్తూ ఉంటారు. నేను సాదారణంగా ఈ అప్రాయోజిత కార్యక్రమాలు చూడను. కాని  ఈ  రోజు T.V. చానల్స్ మారుస్తుండగా , అనుకోకుండా ఈయన గారు చెప్పే మాటలు కొంత ఆసక్తి కలిగించబట్టి, ఒక 5 నిమిషాలు ఈయన గారి ప్రోగ్రాం ని చూసాను. అయన చెప్పే దానిని వింటుంటె నాకు బోల్డంత ఆశ్చర్యం వేసింది. దేశం లో ఆడపిల్లలు మీద అత్యాచారాల రేటు పెరిగిపోయిందని అందోళన చెందే వారికి , వాటి నివారణకు ఈయన గారు చేపుతున్నపరిహారం వింటే "ఇంత సింపుల్ గా అత్యాచారాలను అరికట్ట వచ్చా " అని తెగ సంబ్రమశ్చ్ర్యాలకు గురి కాక తప్పదు. ఇంతకీ అయన, అత్యాచారాల నివారణకు  చెప్పిన తరుణోపాయం ఏమిటంటె     సదరు బ్రహ్మశ్రీ   గారు ఒక పరిశోదన చేసారట. ఆ పరిశోదన ఎవరి మీద అంటె , ఈ  మద్య అత్యాచారాలకు గురి అ

"పరాధికారం పైన వేసుకున్న వాడు గాడిదవలె దుర్మరణం పాలవుతాడు " అన్న కద,రాజమండ్రి విషాదాంతం కి సరిపోతుందా?

Image
                                                                                                                                 ఈ  రోజు మహా ప్రశస్తమైన రోజు. ప్రతి 144 సంవత్సరాలకు ఒక సారి వచ్చే గోదావరి మహా పుష్కారాలు ఆరంభమైన రోజు. ఈ సందర్భంగా  తోటి హిందూ సోదరులందరికి గోదావరి పుష్కర శుభాభినందనలు .     ఈ రోజు దురదృష్ట వశాత్తు , ప్రభుత్వ ముందు చూపు లేమి వలన రాజమండ్రి లో కడపటి వార్తలు అందేసరికి 27 మంది పుష్కర భక్తులు , తొక్కిడిలో ఊపిరాడక మరణించడం గోదావరి పుష్కర చరిత్రలోనే చీకటి రోజు.తమ పితృదేవతల సంస్మరణర్దమ్ జరిపే  మతాచార సేవా కార్యక్రమం లో నిమగ్నమై తమ అసువులు బాసిన ఆ పరమ భక్త్క్తులకు బగవంతుడు ఆత్మ శాంతి చేకూర్చాలని ప్రార్దిస్తున్నాను.        పరవస్తు చిన్నయ సూరి గారు చెప్పిన పంచ తంత్రం కధలలో "పరాధికారం పైన వేసుకున్న వాడు గాడిదవలె దుర్మరణం పాలవుతాడు " అన్న కద,ఆ కధ ఏమిటంటె "  అనగనగా ఒక ఊరిలొ ఓ చాకలి ఉండెవాడు . అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలిమేటలను మోసేదీ. కుక్క చాకలి ఇం టికి కాపల కాసి అతనెక్కడికి వెళ్తే అక్కడకెళ్ళి తోడుండేది. ఒక రోజు రాత్రి

మనో వికారాలను చట్టబద్దం చేసుకుంటూ పోతే , సేమ్ సెక్సూ తప్పు కాదు , ఏనిమల్ సెక్స్ ఏవగింపూ కాదు !!?

Image
                                                                                                     మొన్న ఒక బ్లాగర్ మిత్రుడు రాసిన ఒక ఆర్టికిల్ చదివాను. అందులో అయన గారు స్వలింగ సంపర్కాలు అసహజమైనవి కాదని, సహజ వాంచలు అని, వాటిని అర్దం చేసుకోలేని చాందసులే వాటిని వ్యతిరేకిస్తారని, అర్దం చేసుకున్న మోడరన్ వాదులు ఉన్న దేశాలు వాటిని స్వలింగ సంపర్కాలు ను చట్టబద్దం చేసే క్రమంలో , స్వలింగ సంపర్కుల మద్య వివాహాలు చట్టబద్దం చేసాయని , ఇంకా కొన్ని దేశాలు ఆ విషయం లో చట్టం చేయడానికి ఉవ్విలూరుతున్నాయని ప్రస్తావించారు. మన దేశం లో స్వలింగ సంపర్కంను  నీచమైన నేరంగా పరిగణిస్తూ ఉండడం వలన , దానికి యావజ్జీవ లేక 10 ఏండ్లు  గరిష్ట శిక్ష విదించే అవకాశం ఉండడం వలన , స్వలింగ సంపర్కులు , తమ లింగ బాధలను ఎవరికీ చెప్పుకోలేక పోతున్నారని , అదే చట్టబద్దం చేసినట్లయితే , తమ మనో వికారాలను బాహాటంగా ప్రదర్సించే అవకాసం --  పెండ్లిళ్ళు , శొభ్హనాలు , పార్తీల రూపంలో --   ఉందేది కదా అని తెగ బాద పడిపోతూ రాసారు .    ఇక్కడ ఒక ముక్యమైన విషయం ఏమిటంటె అసలు మనువు లేదా వివాహం యొక్క పరమోద్దేస్యం ఏమిటి ? కేవలం సెక్స్ కోసమే వివాహం అన

వారిది"కులబద్దం",వీరిది"రాజ్యాంగబద్దం".

Image
                                                                                                                                                      ఈమద్య ఎక్కడచూసినా ప్రజలు కులాలవారీగా, సంఘాలు పెట్టుకుని, అటు పార్టిలను,ఇటు  ప్రభుత్వాలను  ప్రబావితం చేస్తున్నారు. స్వాతంత్ర్యం  వచ్చాక,చాలకాలం వరకు, అన్ని పార్టిలలోని వారు, ఎంతోకొంత కుల,మత రహిత సమాజాన్ని‘ఏర్పాటుచెద్దామని,కలలుకని,ఆ దిశగా క్రుషిచేసారు. కాని అనాదిగా వెనుకబాటుకు గురైన  వర్గాల వారిని  సామాజికంగా,ఆర్థికంగా, ఎదిగిన వర్గాలతో సమానం చేయుటకు, వెనుకబడిన, షెడ్యూల్డు కులాలు, మరియు తెగలుగా విభజించి,వారికి కొన్ని రిజర్వేషన్లను ఇవ్వటం ప్రబుత్వాలకు అనివార్యమయింది. దానికోసం  ప్రాచీనా కాలం నుండి వస్తున్న కుల వ్యవస్తేనే ప్రామాణికంగా చేసుకుని  వారిని తరగతులుగా వర్గీకరించి, సీరీయల్  నెంబర్లు సైతం ఇచ్చి, రెజర్వేషన్లు, కల్పించారు. అంతవరకు ఓ.కే    తమ రీజర్వేషన్ హక్కులు రాజ్యాంగ బద్దం కాబట్టి, వాటిని పొందడానికి సంబందిత వర్గాల ప్రజలు "కుల సంఘాలు" పేరుతో ఐక్యమయి  తమ హక్కులను పరిరక్షించుకునే హక్కు వారికుంది. కాని విచిత్రంగా రాజ్యాంగ

నాడు హిందూ పాలకులను తెల్లవాడు విడదీసినట్లే , నేడు తెలుగు పాలకులను "వాళ్ల మతస్తులు విడదీస్తున్నారా ?!!!

Image
                                                                                                                   ఓటుకు నోటు కేసు పుణ్యమాని ఆంద్రా , తెలంగాణా పాలకుల  మద్య విబేదాలు మరొక సారి రాజుకుని , ఇరువైపులా మీసాలు మెలేసుకుని , తొడలు చరచుకునే దాకా వెలుతున్నాయి. ఇరువైపులా మెజార్టి ప్రజలు  అంతో ఇంతో జ్ఞాన వంతులు కాబట్టి , ఇదంతా రాజకీయ డ్రామాలో బాగమేలే అనుకుని మెదలకుండా జరిగే దానిని చూస్తున్నారు. లేకుంటే రాజకీయ నాయకులు కి శివాలెత్తినట్లు , మెజార్టి సామాన్య ప్రజలకు శివాలెత్తితే , ఈ  పాటికి పర్యవసానం వేరుగా ఉండెది.  నాకు తెలిసినంత వరకు K.C.R గారు కల్లా కపటం లేని ముక్కు సూటి మనిషి. తన మనసులో ఉండెది వెళ్ళగ్రక్కుతాడు. అయన వాడె బాష  కొంత మందికి బాద కలిగించినా, అయన నైజం తెలిసిన వారు అయన  వలన హాని  జరుగుతుందని అనుకోరు. అయన ఆలోచనలు తెలంగాణా ప్రాంత స్వార్దం గురించి ఉన్నప్పటికి , కోర్టుల ఆదేశానుసారం తన  పాలన ఉండాలనే అయన కోరుకుంటాడు కాబట్టి, ప్రజాస్వామ్య వాదులు అయన పాలన గురించి అంతగా బయపడవలసిన పని లేదు. ఈ  విషయం హైదరాబాద్ లోను, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆంద్రా సెటిలర్స్ మేదావులకు తెలుసు కాబట్ట