పెండ్లి పత్రాలు ఏమి ఖర్మ,ఏకంగా పెండ్లాన్నే మార్చేసాడట!

                                                                             


ప్రస్తుత సమాజంలో మనుషులు అడ మగ తేడా లేకుండా తమ పబ్బాలు గడుపుకోవడం కోసం ఎంతటి నీచమైన పనులకైనా ఒడిగట్టే స్తాయికి దిగజారారు . ప్రస్తుత తరం లో కొంత మంది అసలు వివాహం అన్నా వివాహా వ్యవస్తా అన్నా  బొత్తిగా గౌరవం లేకుండా పోయింది . పోనీ సాంప్రదాయాలు అంటే గౌరవం లేక పొతే  లేకపోవచ్చు కాక, కనీసం చట్ట భయమైనా ఉండాలి కదా , అది అస్సలు భయం లేదు మాకు అన్నట్లు ప్రవర్స్తిస్తున్నారు ,. విషయం ఏమిటంటే :
     గత సంవత్సరం ఆగస్టు 30 న ఖమ్మం జిల్లా వెంకటగిరికి చెందిన రజితతో మహేశ్ అనే సెల్ పోన్ షాప్ లో పని చేసే కుర్రాడితో పెండ్లి అయింది . వారి వైవాహిక జీవితం పలిo చడం తో రజిత గర్భవతి అయి , కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిందట . రజితతో  పెండ్లి కాక పూర్వం మహేశ్ గుంటూరులో  విజయ లక్ష్మి అనే ఒక అమ్మాయిని ప్రేమి oచాడట ! గత ఏడాది జులై నెలలో వారిద్దరి మద్య ఏదో గొడవలు రావడం , విజయ లక్ష్మి మహేశ్ మిద చీటింగ్ కేసు పెట్టడం కూడా జరిగిందట . మరి అ కేసు సంగతి ఏమైందో కాని , అ తర్వాత మహేశ్ ఖమ్మం  వచ్చి రజితను వివాహ్హ మాడినట్లు తెలుస్తుంది .
 విజయలక్ష్మి , మహేశ్ ల మద్య పాట సంబంధం నడుస్తున్నట్లు ఉంది, ఆమె కోరిక మేరకు , ఆమెను కూడా వివామాడడానికి నిర్ణయించు కున్నాడు మహేశ్ . రజిత పుట్టింటికి వెళ్ళిన సమయం చూసి , అబ్బాయి గారు పెండ్లి కొడుకు లాగా ముస్తాబు అయి , టింగు రంగా అంటూ , గుంటూరులో విజయలక్ష్మిని పెండ్లాడ బోతున్న సమయం లో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి విజయ లక్ష్మి మహేశ్ లను పోలిస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారట . ఇది నిన్న జరిగిన విషయం . మహేశ్ రెండవ వివాహం గురించి ఎవరో రజితకు ఉప్పందిo చబట్టి సకాలంలో స్పందించిన రజిత ఆమె తల్లి గుంటూర్ వెళ్లి అర్బన్ S.P గోపినాద్ గారికి మొరపెట్టుకుంటే , అయన ఆదేశాల మేరకు పోలీసులు మహేశ్ , విజయలక్ష్మి ని అరెస్ట్ చేయడం జరిగింది .
పోలిస్  దర్యాప్తులో రజిత కంటే ముందే విజయలక్ష్మిని వివాహమాడినట్లు , తప్పుడు తేదీలతోపత్రాలను సృష్టించి గుంటూరులో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసిందట . ఇదంతా విజయలక్ష్మికి మొదటి బార్య పదవి కట్ట బెట్టడం ద్వారా , లీగల్ గా ఆమె భార్య అని చట్టాన్ని నమ్మించడానికి చేసిన ప్రయత్నం కావచ్చు అని పోలిస్ లు అనుకుంటున్నారట ఈ  విషయంలో ఆడపిల్లలు అమాయకంగా అలోచించి మగవాడి కపట బుద్దికి బలి అయి పోతున్నారు . సాటి ఆడపిల్ల ఏమైతే నాకెందుకు ? మంఛి వాడో , చెడ్డవాడో ఎవడో ఒకడు మొగుడు అయితే చాలు , తనకు సమాజ o లో భద్రతా ఉంటుంది అని ఆడపిల్లలు , వారి తరపు వారు ఆలోచిస్తున్నoత  కాలం మహేశ్ లాంటి నిత్య పెండ్లి కొడుకుల ఆటలు సాగుతూనే ఉంటాయి .
  గుంటూరులో మోసం కేసును పెట్టిన విజయలక్ష్మి , అతని మిద సరి అయిన చర్యలు తీసుకోకుండా , ఆటను మరొక పెండ్లి చేసుకోవడానికి అవకాసం ఇవ్వడమే కాకుండా తిరిగి మరొక ఆడపిల్ల హక్కులకు భంగం కలిగేలా మహేశ్ కు సహకరించడంతో , ఆమె కూడా పోలిస్ కేసులో ఇరుకోక తప్పలేదు . ఒకరిని మోసం చేసిన వాడు మరొకరిని చేయకుండా ఉంటాడు అని గ్యారంటి ఏమిటి ? అందుకే తప్పు చేసిన వాడు క్షమార్హుడు అవ్వచ్చేమో కాని , నేరం చేసిన వాడు కాదు . అటువంటి నేరస్తుల మిద సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటే , మరొక ఆడపిల్ల బ్రతుకు నాశనం కాకుండా ఉంటుంది అనేది ప్రతి ఆడపిల్ల గ్రహించడం మంచిది . లేకుంటే స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడిని నిజం చేసిన వారవుతారు!.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన