బార్యని వేదిస్తున్నాడని కేసు పెడితే, కేసు పెట్టిన పోలిసులు ని వేదించాడట!

                                                             

అయన ఒక పోలిస్ కానిస్టేబుల్ . ఖమ్మం జిల్లా ,అశ్వాపురం  పోలిస్ స్టేషన్ లో ఉద్యోగం. మగాడు అంటే మగాడే ! అతనికి  పురుష ఆదిపత్య సమాజం ద్వారా సంప్రాప్తించిన అహంకారం ఉంది. దానికి తోడు ప్రజల మీద జులుం చేసే అదికారం ఉందనుకుంటున్న పోలిస్ ఉద్యోగమూ ఉంది. అందుకే ఒఆ అతనికి పెళ్లాం అంటే కొంత చిన్న చూపు ఉందేమో ఆమెను వేదించటం మొదలు పెట్టాడు . నేరస్తులును చూసినట్లే ఆమెను చూసి ఉంటాడు, అందుకే ఆమె ఆ వేదింపులు తాళలేక భర్త మీద కేసు పెట్టింది. "ఓఆ  సో స్, ఎంత దైర్యం ! అసలే పోలీసుని ,అందులో తాళి కట్టిన మొగుణ్ణి నామీదే కేసు పెడతావా అని కారాలు మిరియాలు నూరాడట. అయిన నేను పోలిసునే కదా నన్నెవరు అరెస్ట్ చేస్తారులే అనుకున్నట్లుంది పాపం.  కానీ ఖమ్మం జిల్లా S.P  గారు అయిన ఆవుల రంగనాద్ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరుంది. కాబట్టి క్రింది స్తాయి అధికారులు కూడా జాగర్తగనే ఉంటున్నారు. దానీ వలన సదరు పోలిస్ కానిస్టేబుల్ గారి మీద అశ్వాపురం సి. ఐ గారు కేసు నమోదు చేసారు.

   ఒక సారి కేసు నమోదు చేసి , కంప్లెంట్ లో ఉన్న విషయం నిజమేనని నిరూపించే ఆదారాలు దొరికితే నిందితున్ని అరెస్ట్ చెయ్యక తప్పదు. ఒక వేళ పోలిస్ వారి విచారణ లోప భూఇష్ట మైందని , తను నిర్దోషిని అని నిందితుడు బావిస్తే, దానికిఅతను  జిల్లా కోర్టు వారిని కానీ, హై కోర్టు ఒఆ వారిని కానీ అబ్యర్డించి , తనను అరెస్ట్ చెయ్యకుండా , "యాంటీసిపేటరీ బెయిల్ " తెచ్చుకుని , సంబందిత మేజిస్ట్రేట్ వద్ద జమానత్ లు సమర్పిస్తే సరి పోతుంది . ఇది సాదారణ పౌరుడు దగ్గర్నుంచి ప్రధాన మంత్రి వరకు వర్తించే నియమం . కానీ అలాంటి వెసులు బాటును వినియోగించుకోకుండా , నేనేరా పోలిస్ !పోలిస్! పోలిస్! అంటే చట్టం ఊరుకుంటుందా ? తన పని తానూ చేసుకు పోతుంది. అదే జరిగింది ఈ  కానిస్టేబుల్ గారి విషయంలో కూడా !

    సదరు కానిస్టేబుల్ ని వేదింపుల కేసు క్రింద అరెస్ట్ చేసి న్యాయాస్తానానికి తరలిస్తుంటే నానా హంగామా చేసాడట. ఏ సహచర పొలిసు ని లెక్క చెయ్య లేదట. మణుగూరు D .S .P . గారి ఎదుటే వీరంగం వేస్తే ఆయనకు చిరీతుకు వచ్చి , పదిమంది పోలిసుల ఎస్కార్ట్ తో , చేతులకు బేడీలు వేసి , ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ జీప్ లో న్యాయస్తానానికి తరలించారట! అక్కడ మేజిస్ట్రేట్ గారు అతనిని రిమాండ్ కు పంపారు. ఆ దెబ్బతో అతని లో ఉన్న పురుష అహంకారము,ఒఆ  పోలిస్ అన్న అహంకారం రెండూ ఆలోచనలో పడి ఉంటాయి. ఒక వేళ అప్పటికి జ్ఞానోదయం కాకపోతే అది అతని ఖర్మే కాదు, అతని కుటుంభం మొత్తానికి శాపం అనుకోవాల్సి వస్తుంది

     బార్యా భర్తల తగవులను రొటీన్ కేసులుగా బావించకుందా పోలిసులు కౌన్సిలింగ్ పద్దతి ద్వారా , సాద్యమైనంత వరకు సఖ్యత చేకూరేలా చెయ్యాలి. "గృహ హింస చట్టం" యొక్క మౌలిక ఉద్దేశ్యం కోడా అదే . ఒక వేళ కౌన్సెలింగ్ చేసినా , వినని పైన చెప్పిన కానిస్టేబుల్ తిరుమల రావు లంటి వారు ఉంటే అప్పుడు  ఒఆ వారికి చట్టం రుచి చూపవచ్చు . ఒక వ్యక్తీ యొక్క అజ్ఞానపు అహంకారం, కుటుంబానికి శాపంగా మారడం నిజంగా దురద్రుష్టకరం.కానిస్టేబుల్ తిరుమలరావు  కుటుంబం అటువంటి శాపానికి గురి కావద్దని మనస్పూర్తిగా కోరుకుందాం.--- Manavu

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన