శ్రీ శ్రీ గారు హేళన చేసినా, భారతీయ తాత్విక చింతన యే కరెక్ట్ అని తేల్చిన బౌతిక శాస్త్రజ్ణులు!

                                                       


ప్రముఖ విప్లవ కవి శ్రీ, శ్రీ గారు "మిద్యావాది"
అనే కవితలో
  మాయంటావా!
  అంతా  మిద్యంటావా
  నా ముద్దుల వేదాంతీ.
  మాయంటావు, లోకం
  మిద్యంటావూ!
 అని
భారతీయ అద్యాత్మిక వాదాన్ని అవహేళన చేస్తూ, బౌతిక ప్రపంచమే సత్యం అంటాడు. సరే ఆయన ఏమన్నా ఆయన శ్రమజీవుల కష్టాలు గురించి రాసాడు కాబట్టి, వారి అభ్యుదయానికి బౌతిక బావజాలం ఉపయోగపడవచ్చు. కానీ అంతిమ సత్యం ని ఎవరూ మార్చలేరు.

  బారత దేశం లోని అద్యాత్మిక వాదులు ఏనాడో చెప్పారు. ఈ కనిపించే ప్రపంచం అంతా  శూన్యం నుండి ఉద్బవించిందే అని. దానినే శంకరా చార్యులు మాయ అన్నాడు. అంతకు ముందు నాగార్జుణుడు

శూన్యత్వమే అసలైన నిర్వాణమనీ, అది కారణ రహితమైన అస్తిత్వమనీ, అందులో అన్ని పరిణామాలూ సమత్వం పొందుతాయనిచెప్పారు .  ఇదే అతని శూన్యవాద సారాంశం.
ఆచార్య శంకరుని మాయా వాదానికి నాగార్జునుని శూన్య వాదమే ప్రాతిపదిక అయ్యిందని పెద్దలు చెబుతారు.

  ఏది ఏమైనా దేనినైనా  మనిషి కంటే మనసు ముందు దర్శిస్తుంది. అయిన్ స్టీన్ కూడా ఏ నాడు ప్రయోగ శాలలో అడుగు పెట్టలేదని అంటారు. కానీ ఆయన ఆవిష్కరించిన  బౌతిక సత్యాలు ఆయన మనో శక్తి వలన సాక్షాత్కరింప చేసుకున్నవే. అందుకే ఆయన కూడా ఆద్యాత్మిక వాది అని చెప్పక తప్పదు. అలగే భారతీయ చింతన ఎన్నో ఏండ్లు పూర్వమే స్రుష్టికి మూలం శూన్యం అని చెప్పగలిగింది.

  నిన్న బౌతిక శాస్త్రంలో ఈ యేడాది నోబెల్ ప్రైజ్ కు గాను బౌతిక శాస్త్ర విబాగంలోప్రాన్సొయి ఎంగ్లర్ట్, పీటర్ హిగ్స్
  కు లభ్హించింది. వారిరువురూ విడి విడిగా చేసిన పరిశోదనల ద్వారా  ఈ స్రుష్టిలో పదార్దానికి
మూల కారణమైన  "దైవ కణం" లేక హిగ్స్ బాసన్ అనేది కంటికి కనిపించని "హిగ్స్ ఫీల్డ్" అనే అద్రుశ్య క్షేత్రం నుండు ఉద్బవిస్తుందని కనుగొన్నందుకు వారికీ నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం! చివరకు బౌతిక శాస్త్ర పరిశొదనలు సైతం "శూన్యం నుండే సమస్తం ఉద్బవం" అనే భారతీయ తత్వ వాదుల  చింతన సరి అయినదే అని రుజువు చేసినట్లైంది.

    మొత్తానికి కన్పించే దైవ కణాన్ని తప్పా, దానికి కారణమైన ఆ దైవ శక్తి ని కనుగొనడం బౌతిక ద్రుష్టి ద్వారా సాద్యపడదు అని తేల్చిన సైంటిస్టులకు అభినందనలు .ఇదే విషయం గురించి 14-03-2012   తేది నాడు నేను ఒక పొస్ట్ లో నాకున్న కొద్ది పాటి జ్ణానం తో  అభిప్రాయం చెప్పటం జరిగింది. కావాలంటే లింక్ మీద క్లిక్ చేసి  చూడండి

MY DOCTRINE IS ZERO.

http://ssmasramam.blogspot.in/2012/03/my-doctrine-is-zero.html

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన