అటు చైనా కి గాని ,ఇటు పాకిస్తాన్ కి గాని మన దేశం దేని తో సమానమో తెలుసా ?


                                                                     
     

గడ్డి పోచతో ! ఎందుకంటే వారి ద్రుష్టిలో మనది  ఆఫ్ట్రాల్ అసమర్దుల కంట్రీ అని బావం కాబోలు. మన  పొరుగు దేశాలలో ఒకటైన చైనా మన కంటే జనాబా పరంగా యే కాక ఇతరత్రా కూడా  ముందున్న దేశం కావచ్చు . కాని అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంగించి అప్పుడప్పుడు భారత  భూబాగంలోకి చొరబడటం ,అదేమిటని అడిగితే ఆ.... అదంతా ,అలవాటులో పొరపాటు అంటూ వెనక్కి పోవటం లాంటి తమాషాలు చేస్తుంది . ఇంకొక  పొరుగు దేశం పాకిస్తాన్ ,ఒక బుడత దేశం . భారతీయులు అందరూ గట్టిగా ఖాండ్రించి ఉమ్మితే ,  ఉమ్ముకే కొట్టుకు పోయే దేశం . అయినా సరే దానికి మన దేశం అన్నా , మన సైన్యం అన్నా లెక్క లేదు . కార్గిల్ యుద్దం జ్ఞాపకాలు మరవక ముందే మొన్న ఐదుగురు భారతీయ జవాన్లు మీద కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు . అలా కాల్పులు జరిపింది పాకిస్తాన్ ఆర్మీ వారేనని మన సైన్యం రిపోర్ట్ ఇచ్చింది కూడా .

  కానీ ఆశ్చర్యంగా ఘనత వహించిన మన రక్షణ మంత్రి గారు అలా కాల్పులు జరిపింది , పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఉగ్రవాదులు అని ప్రకటించి , పాకిస్తాన్ వారికి డిఫెన్స్  "లా" పాఇంట్ అందించారు . అదేమని ప్రతిపక్షం ఉబయ సభలలో నిగ్గదీసే సరికి , తనకు అందిన సమాచారం మేరకు చెప్పానని , మళ్లీ  రిపోర్ట్ తెప్పించుకుని అసలు విషయం చెపుతానని సెలవిచ్చారు అమాత్యవార్యులు . ఇలాంటి వారి చేతిలో భారత దేశ రక్షణ ఉండటం నిజంగా మన దౌర్బాగ్యం .

  నిజంగా ఒకవేళా ,పాకిస్తాన్ సైనికుల దుస్తులలో ఉగ్రవాదులు ఉంటే దానికి బాద్యత ఎవరిదీ ? ఈ రోజు వారి దుష్క్రుత్యాలు ఉగ్రవాదుల చర్య గా బావిస్తే , నిజంగా అది మన దేశానికి పెద్ద ప్రమాదం అని చెప్పాలి . సైన్యంలోనే ఉగ్రవాదులు చొరబడితే కనిపెట్టలేనీ పాకిస్తాన్ ని నమ్మి మన సరిహద్దు గస్తీ దళాలు ఎలా నిబ్బరంగా ఉండగలవు . ఎదురుగా పాకిస్తాన్ సైన్యం దుస్తుల్లో ఉన్నది ఉగ్రవాదులు కాదని ఎలా నమ్మాలి . ఆ అనుమానంతో భారత సైనికులు ,వరస పెట్టి పాకిస్తాన్ సైనికులను కాల్చేస్తే ,పాకిస్తాన్ ఊరుకుంటుందా ? అసలు మొన్న మనకి జరిగినట్లు వారికి జరిగితే యెంత యాగీ చేసే వారూ . కాబట్టి మన రక్షణ మంత్రి  మన కు డిపెన్స్  చేయాలి కాని ,పాకిస్తాన్కి కాదు అనేది ఆయనకు తెలియక పోవడం మన దౌర్బాగ్యం .

   ఇప్పుడే  తెలిసిన సమాచారం ప్రకారం మన మంత్రి గారు కొత్త స్టేట్మెంట్ ఇచ్చారట . బారత జవానుల మీద కాల్పులుకి తెగబడింది , పాకిస్తాన్ సైన్యం లోని స్పెషల్ ట్రూప్ వారట ! చూసారా , ఇలాంటి విషయాలలోనే బాధ్యతా రహితంగా ,చట్ట సభలలో  పొరుగు దేశానికి అనుకూలంగా ఉండే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చే వారు రక్షణ శాఖ  మంత్రులుగా ఉండదగిన వారా ? ఆలోచించండి .

 ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏంటోలా మాట్లాడే సదరు ఆంటోనీ గారే ఈ రాష్ట్ర  విబజన ప్రక్రియ కమిటికి అద్యక్షుడు . అలాగే కాంగ్రెస్ మానిఫెస్టో  అమలు కమిటికి కూడా  అద్యక్షుడు అంటా!పూర్తీ సమాచారం తెలియకుండా , కనీసం ఏ విషయంలో ఎలా మాట్లాడాలో తెలియని ఐ మహానుబావుణ్ణి  సున్నిత సమస్య అయిన రాష్ట్ర విభజన కమిటీకి అద్యక్షుడిగా రావడం, తెలుగు ప్రజలు ఆలోచించ దగ్గ విషయమే మరి

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన