భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

                           

అప్పుడెప్పుడో రాజేంద్ర ప్రసాద్ , మాధవి  కలిసి నటించిన తెలుగు సినిమా ఒకటి చూసాను . అందులోని సారాంశం ఏమిటంటే పెండ్లి అయిన కొన్ని రోజులకే  భర్త చనిపోతే మాధవికి తన చిన్న తమ్ముడి వయసున్న మరిది రాజేంద్ర ప్రసాద్ ని ఇచ్చి కట్టబెడతారు పెద్దలు. అది వారి సాo ప్రదాయం అట . బహుశా ఈ సినిమా అటువంటి ఆచారం కలిగిన పరబాషా చిత్రం నుండి అనువదించ బడి ఉంటుంది . మన తెలుగు వారిలో అటువంటి దురాచారం లేదు కాబట్టి , అ సినిమా కొంత ఎబ్బెట్టుగానే అనిపించింది .
 అలాంటిదే ఇంకొక పరబాషా  సినిమా లో ఒక వదిన గారు తనకు సంసార సుఖం లేదని భర్తను నిరంతరం అవమాన పరచడమే కాకుండా అతని ముందే అతని తమ్మున్ని వాంచిస్తుంటే అది తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకుంటాడు . అది తెలియని తమ్ముడు విడవరాలైన తన వదిన గారి పట్ల ఎంతో పూజ్య బావంతో  ఆమె, ఆమె కూతురు ఆలనా పాలనా చూస్తుంటే , ఆ వగలాడి వదిన మాత్రం అతనికి వచ్చే సంబందాలు అన్ని చెడగోడుతూ ఉంటుంది . మరిదిని ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటుంది . చివరకు విషయం పసి గట్టిన మరిది ఆమెను మందలించి తన ప్రియురాలితో వివాహానికి సిద్ద పడటం . వదిన పగ తో అ ప్రియురాలిని చంపే క్రమంలో ఆమె హతమై పోవటం తో కద సుఖాంతం అవుతుoది. ఆ సినిమా చూసినప్పుడు అ వదిన లాంటి స్త్రీలు మన సమాజంలో ఉంటారా అనిపించింది . కాని ఈ రోజు పేపర్లో వార్తా ఒకటి అచ్చు పై సినిమా కద లాగానే ఉoడేసరికి కొంచం ఆశ్చర్య పోవాల్సి వచ్చిoది . సినిమా కద లో వదిన సేక్రేట్ గా మరిది ని కోరుకుంటే ఈ నిజ జీవిత కధలో వదిన గారు మరిదిని పబ్లిక్ గా కోరుకోవడమే కాకుండా ఆతను వేరే అమాయిని వివాహం చేసుకున్నందుకు, అతని మిద పోలిస్ కేసు కూడా పెట్టిందట .

  వివరాలు లోకి వెళితే ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కు చెందిన వ్యక్తితో సదరు పైన తెల్పిన అమ్మాయికి  వివ్వాహం అయి 10 ఏండ్లు అయిందట . అయితే ఆమె దురదృష్టం కొద్ది పెండ్లిన 4 యేండ్ల కె భర్త ప్రమాదం లో మరణించాడు . అపటికే వారికొక కుమారుడు ఉన్నాడు . ఆమె తిరిగి వివాహం చేసుకోలేదు . ఆమె కోక మరిది ఉన్నాడు . ఆతను ఈ మద్యనే వరంగల్ కి చెందిన అమాయిని పెండ్లి చేసుకున్నాడు . దానితో అగ్గి మిద గుగ్గిలం అయిన వదిన గారు, తన మరిది తనకే స్వంతం అని , అతను పెండ్లి చేసుకుంటాను అంటేనే తానూ ఆటను కలిసి 6 ఏండ్లుగా సహజీవనం చేస్తున్నామని, తీరా ఇప్పుడు తనని కాదని వేరే అమ్మాయిని పెండ్లి చేసుకోవడం మోసం క్రిందకు వస్తుందని అంటూ మరిది మిద కేసు పెడితే , మొదట పోలీసులు తెల్ల బోయినా , తర్వాత కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారట . అది సంగతి .
   మన సమాజంలో ఆరోగ్యకరమైన సంసార బoదాలు పటిష్టంగా ఉండాలి అంటే ఇటువంటి  అక్రమ సంబందాలను నిర్ద్వందంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .
         (Republished post.OPD:23/7/2014)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.