అంతర్వేది లక్ష్మీ నరసింహా స్వామి కి , అన్యమత " క్రీస్తు "కి ఏమిటి సంబందం ?

                                                                 


అమెరికా అద్యక్షుడు ఒబామా గారు ,మొన్న భారత పర్యటన సందర్భంలో, ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ గా ఉండి ఇక్కడ  మత స్వేచ్చ చక్కగా ఉన్నంత కాలం, భారత పురోభివ్రుద్దికి డోకా లేదు అని సెలవిచ్చారు .దాని గురించి ఇండియాలో మెజార్తీ మతస్తులు అయిన హిందువులు పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకంటే హిందూ జీవన విదానంలోనే సెక్యులరిజమ్ కొన్ని వేల యేండ్లుగా పాతుకు పోయి ఉంది . కుక్క ,పంది లో సైతం దేవున్ని దర్శించే హిందువులు, అన్య మతస్తుల దేవుళ్ళలో దర్సిస్తున్నాం అంటే అభ్యంతరం చెపుతారా?కాక పొతే ఈ గడ్డ  మీద పుట్టిన వారిని హిందువులు దేవుళ్ళను చెస్తే ,పరాయి గడ్డ మీద  పుట్టిన వారిని అన్య మతస్తులు దేవుళ్ళుగా కొలుస్తున్నారు . అంతే తేడా!

    అయితే ఒబామా గారి మత స్వెచ్చ గురించి చెప్పిన దానిని, వేరొక రకంగా అర్ధం చేసుకున్నట్లు ఉంది ఆంద్ర ప్రదేశ్ లోని  అంతర్వేది కి సంబందించిన రెవెన్యూ మరియు ఎండొమెంట్ డిపార్త్మెంట్ లోని కొంత మంది కిరస్తానీ  అధికారులు . ఒబామా మత స్వేచ్చా గురించి నొక్కి వక్కాణించేట్టప్పుడు, మన ప్రదాని కౌంటర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ,తమకు కావలసినంత  మత స్వెచ్చ ఉందని ,తాము హిందూ మత సంస్థల్లో పని చేస్తున్నా ,తమ ప్రభువు గురించి బోల్డంత ప్రచారం చేసి ,దేవాలయానికి వచ్చే హిందూ భక్తులను తమ మతం లోకి ఆకర్షించ వచ్చు, అని వారికి యమ ఆనందం వేసి ఉంటుంది . అందుకే వారు హిందూ దేవుడు అయిన శ్రీ లక్ష్మి నరసింహా స్వామిని, అయన భక్తుల మనో బావాలను తీవ్రంగా గాయపరచే పనికి పూనుకున్నారు .

మొన్న జనవరి 29 న అంతర్వేది లో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహా స్వామీ కళ్యాణోత్సవానికి అక్కడి ఎండొమెంట్ మరియు రెవెన్యూ అధికారులు జారీ చేసిన మీడియా  పాస్ లలో, ముందు వైపు అస్పష్టంగా శ్రీ లక్ష్మీ నరసింహా
స్వామీ వారి పోటో ముద్రిస్తే ,వెనుక వైపున చేతులు బార్లా చాపిన అన్య మత ప్రభువును చాలా స్పష్టంగా ముద్రించారు  .దిన్ని  చూసి హిందువుల మనసులు ఎంతో  గాయపడి ,అధికారులను సంజాయషి అడిగితే "నేను ముందు చూసి సంతకం పెట్టాను తప్పా ,వెనుక చూడలేదు "అన్నారట. అదీ మన అధికారుల నిర్వాకం .ఇటువంటి వారి  కా  హిందూ మత  కార్య కలాపాలు అప్పచెప్పేది ?

 " వినాశ కాలే విపరీత బుద్ది" అనేది పెద్దల మాట. పోక దల కాలం వచ్చినప్పుడు ఇలాంటి పిదప బుద్దులే పుడుతుంటాయి . ఇన్నాళ్ళు కుహనా సెక్యులర్ విదానాలతో  లాండ్ మతాలను నీరుగారుస్తూ ,అన్య మతాలను   ప్రోత్సాహించే మీ ప్రభువులు అధికారం లో ఉన్నారు కాబట్టి ,చాప క్రింద నీరులా హిందూ సంస్తలను నాశనం చేసే విదంగా ప్రవర్స్తిస్తూ వచ్చారు .కాని ఈ నాడు నిజమైన సెక్యులర్ విదానం అమలులోకి వచ్చిందనే దైర్యం వచ్చింది కాబట్టి ,ప్రజలు, మీడియా అన్య మతస్తుల ఆగడాలను బయట  పెట్ట గలుగుతున్నారు . ఇతర మత ప్రార్ధనా స్తలంలో తమ మత ప్రచారం  చేసే వారిని ఉరి తీసే చట్టాలు వస్తే తప్పా వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడదు . ఈ విషయం లో హిందువులు  ఉపేక్ష వహిస్తే  మన భూమీ లోనే మనం పరాయి వారుగా బ్రతకాల్సిన రోజు ఎంతో దూరం లో లేదు . కాబట్టి తస్మాత్ జాగర్త!

  అంతర్వేది దేవస్తానం లో అన్య మతస్తులు హిందువుల మనో బావాలను  ఏ విదంగా గాయపరచారో ఈ క్రింది విడియోలో చూడండి .వీడియో క్లియర్ గా కనపడని వారు క్రింది లింక్ ను చూడగలరు

                                           
                                                                       
                                                                   
                                         లింక్ :           https://youtu.be/69Hy9mjzTkA                                                            
                                      (Republished Post. OPD :2/2/2015). 

Comments

  1. కం. నరసింహుని జోలికి పో
    సురలసురులు జంకువారు క్షుద్రులు ధర్మే
    తరులెట్లు పోవ నేర్తురు
    సరిసరి వారెల్ల రింక చచ్చిన వారే!

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పినది నూటికి నూరు పాళ్ళు నిజం శ్యామలరావు గారు.కాకపొతే నరసింహ స్వామీ లేటు మాష్టర్! చిన్నవాడైన ప్రహ్లాదుని కాపాడానికే అంత లెట్ గా వచ్చినవాడు అన్యమతస్తుల జోలికి అంత తొందరగా వస్తాడా?ఈ లోపు భారతాన్ని యేసు మాయం చేయొచ్చు అనుకుంటున్నట్లు ఉంది.కాని అయన ఎంటర్ అయితే కరుణామయ సినిమా కి ఇక ముగింపు పలకాలసిందే అని తెలుసుకోలేని మూర్కులు వారు.

      Delete
  2. Narasimha Rao Garu,

    What happened to Lord Narasimha Temples?

    It is known that the Grand plan of Telangana strong CM is under scrutiny (Today and Yesterday Andhra Jyoti News Paper) and it is said that the Temple designed by a Film people neglecting all Agama Sastra Rules? Then how can we expect from AP CM whom is in pressure?

    ReplyDelete
  3. వెంకట్రామ్ గారు నేను ఆ న్యూస్ ఐటెం చదవలేదు.చదివాక నా అభిప్రాయం పోస్టు రూపంలోనో పెడతాను.మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన