తెలంగాణా లో R.I లను గిర్దావర్ లుగా మార్చినోళ్లు , S.I లను రజాకార్ లుగా మారుస్తారేమో !!?

                                                               
భవిష్యత్ లో తెలంగాణా రెవిన్యూ జాబ్స్ నోటిఫికేషన్ పాకిస్తాన్ లో మాదిరి ఇలాగే ఉండబోతుందా ? 


                                     ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయేటప్పుడు తెలంగాణా అభివృద్ధి గురించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి .ఆ అనుమానాలను పటాపంచలు చేయడంలో సపలమయ్యారు తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ కలువకుంట్ల చంద్ర శేఖర రావు గారు.అయితే కొన్ని తెరచాటు వర్గాలు ఆయన్ని ఎలా అయిన అప్రతిష్టల పాలు చేయాలని చూస్తున్నట్లు ఉన్నాయి. అందులో భాగంగా తమ ఇష్టాలను ప్రజల మీద రుద్దుతూ ఇదంతా ముఖ్యమంత్రి గారి ఇష్ట ప్రకారమే జరుగుతున్న దని.ప్రజల్ని నమ్మిస్తూ వారిని నోరెత్త కుండా చేస్తున్నారు.అందులో భాగమే ఇటీవలి రెవిన్యూ అధికారుల హోదా పేర్లు మార్పు విషయం.

     జాగీర్దారీ భూస్వామ్య నిరంకుశత్వంలో శతాబ్దాలుగా పీడనకు గురి అయిన తెలంగాణా ప్రజలు, భారత దేశానికీ స్వాతంత్య్రం సిద్దించాక కూడా తమకు స్వాతంత్య్రం దొరకక మరొక స్థానిక స్వాతంత్ర్య పోరాటం చేయాల్సి వచ్చింది . ఆ పోరాటాన్ని అణచివేయడానికి ఆ నాటి నిజాం ప్రభుత్వం "రజాకార్ " అనే జిహాదీ గ్రూపులను తయారు చేసి  ప్రజలను ఊచకోత కోయించింది . ఆ అరాచక పాలనను అంతం చేయడానికి చివరకు భారత ప్రభుత్వం మిలటరీ ఆపరేషన్ కు ఆదేశించడం తో నిజాం లొంగిపోయి తెలంగాణను కూడా స్వతంత్ర భారతం లో భాగం చేయటం జరిగింది. ఈ  సంఘటనలు కళ్లారా కాంచిన వృద్దులు కొంతమంది ఈ  నాటికి   తెలంగాణలో సజీవ సాక్ష్యాలుగా మిగిలి ఉన్నారు.

   తెలంగాణలో ప్రజలను అణచివేసి భూస్వాముల అడుగులకు మడుగులొత్తేలా చేయడం లో సఫలీకృతమైన వ్యవస్థలు గ్రామంలోని పటేల్ మరియు పట్వారి వ్యవస్థ. పటేల్ గ్రామ పోలీసుగా వ్యవహరిస్తే , పట్వారి గ్రామ కరణంగా రెవిన్యూ పనులు చక్కపెట్టేవాడు. తెలంగాణలో ఈ నాటికి రెవిన్యూ రికార్డులు ఆంధ్రాలో మాదిరి సక్రమంగా లేకపోవటానికి  కారణం నాటి పట్వారీల రెవిన్యూ రికార్డుల రాతల మెళుకువలను ఆ తర్వాత వచ్చిన రెవిన్యూ అధికారులు కొనసాగిస్తూ ఉండడమే.రైతు రికార్డు ప్రకారం ఒక సర్వే నంబర్ లో ఉంటె , వాస్తవంగా మరొక సర్వ్ నంబర్ భూమిని సాగు చేస్తూ ఉండడం ,  భూమి  వాస్తవ అధీనం లో ఒకరు ఉంటె , మరొకరి పేరు ఎక్కించడం , ఆ పేరు ఎక్కిన వారు  వారి పేరు మీద బ్యాంకు లో లోన్ లు తీసుకోవడం లాంటి జిమ్మిక్కులు,  తెలంగాణా రెవెన్యూ రికార్డుల్ల చరిత్రలో కో కొల్లలు. దీనంతటికి మూల కారణం N.T.R గారి ప్రభుత్వం ఒక్క కలం పోటుతో పట్వారి వ్యవస్థను రద్దు చేయగలిగింది కానీ ,  రాష్ట్రం లోని భూములను రి సర్వే చేయించి, రికార్డులను రీ సర్వే  వివరాలతో వెరిపై చేయించి , సరి చేయించి  ఆంధ్ర ప్రాంతం లో మాదిరి ఒక క్రమ పద్దతిలో ఉంచడంలో మాత్రం విఫలమయింది . అందుకే ఆ తర్వాతి రెవెన్యూ ఆపీసర్లు సహితం పట్వారీల రికార్డులు ను పాలో అవటం తో పాటు వారి అలవాట్లను కూడా అనుసరించడం తో  తెలంగాణా ప్రజలు మనస్సులోనుంచి పట్వారి లు పూర్తిగా తొలగి పోలేదు సరి కదా " పట్వారీ వ్యవస్థే  నయం " అనే భావనకు కూడా వచ్చ్హారు .  


             మొన్నటికి మొన్న తెలంగాణా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్ర శేఖర్ రావు గారు తెలంగాణా రెవిన్యూ రికార్డులను ఒక క్రమపద్ధతిలో ఏర్పాటు చేయాలనే తలంపుతో ఎవరూ చేయని విదంగా ఉదార హృదయంతో 5 ఎకరాలు లోపు రైతులకు జూన్ 2 2014 వరకు రైతులు మద్య జరిగిన భూ కొనుగోళ్లు పత్రాలు అన్నింటిని  ప్రీ రిజిస్ట్రేషన్ ద్వారా క్రమబద్దీకరించి రైతులకు డిజిటల్ పట్టాదార్ పాస్ బుక్ జారీ చేయించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ , పట్వారి భావజాల వారసులైన గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు అందుకు యదా శక్తి తమ మోకాలడ్డుతున్నారు. G.O ప్రకారం ఉచిత రిజిస్ట్రేషన్ అనేది పరాయి వాళ్ళ నుండి కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది తప్పా , కుటుంబ సభ్యుల మధ్య జరిగిన లావాదేవీలకు వర్తించదని సగం అప్లికేషన్ లు తిరస్కరించారు. అలాగే షెడ్యూల్డ్ ఏరియాలో 1970 తర్వాత జరిగిన  లావాదేవీలకు వర్తించదని మరో 40% అప్లికేషన్లు తిరస్కరించారు . ఇక మిగిలిన 5 నుండి 10% అప్లికేషన్ లు పరిష్కరించినా దాని వలన తెలంగాణా రెవెన్యూ రికార్డులు ఒక క్రమపద్ధతిలో ఏర్పడటం కలగానే మిగిలిపోనున్నది. ఇలా అస్త్యవస్థ రెవెన్యూయె రికార్డులు ఉన్నంతకాలమే  కదా  రెవెన్యూ అధికారులకు కాసుల పంట పండేది. 

    ఇక ప్రస్తుతానికి వస్తే ముఖ్యమంత్రి గారి సంచలనాత్మక నిర్ణయం వలన పరిపాలన వికేంద్రిరికరణ లో భాగంగా 10 జిల్లాల తెలంగాణా 31 జిల్లాల తెలంగాణగా రూపుదిదుకుంది. అందుకు ప్రజలు ఏంతొ  సంతోషిస్తున్నారు . కానీ ఒక విషయం లో మాత్రం తెలంగాణా ప్రజలకు బాధగా ఉంది. నిజాముల కాలం నాటి రెవెన్యూ అధికార వ్యవస్థల పే ర్లను తిరిగి ప్రవేశ పెట్టడం తిరిగి అలనాటి పీడనా తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేయడమే అవుతుంది తప్పా దాని వలన ప్రజలకు ఒరిగేదేమి లేదు.మండలాలను తెహసిలుగా, ఎమ్మార్వో ని తెహసిల్దారుగా, డిప్యూటీ ఎమ్మార్వో ని నాయిబ్ తెహసిల్దారుగా, R.I ని గిర్దావర్ గా, రెవెన్యూ అసిస్టంట్ ను నాయిబ్ గిర్దావర్ గా వ్యవహరించాలని కోరుతూ ఉత్తర్వులు ఇస్తున్నారంట . ఇలా తెలంగాణా ప్రాంత గత పీడనా తాలుకు పేర్లను తిరిగి అధికారులకు పెట్టదం లో ఉన్న మతలబ్ ఏమిటి ? తెలంగానా రెవెన్యూ మంత్రి గారు నిజాం గారి సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఆయనగారికి ఇష్టం అని చెప్పి వాటిని  తెలంగాణా ప్రజల మీద రుద్దుతున్నారా?  లేక వెనుకటి నిజాం కాలం నాటి పట్వారీ వ్యవస్తనే అమలులొకి తెనున్నారా? దీని మీద రెవెన్యూ డిపార్త్మెంట్ వారు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 

                                    ఇలా రెవెన్యూ అధికారులు పేర్లు మార్చి తమ ఉనికిని  చాటుకోవాలని తహ తహ లాడె తెరచాటు వర్గాలు, ఈ రోజు  R.I లను గిర్దావర్ లుగా మార్చినోళ్లు  , రేపు S.I లను రజాకార్ లుగా మారుస్తారేమో    అని అనుమానంగా ఉంది .   కాబట్టి తెలంగాణా రెవెన్యూ అధికారుల హోదా ల పేర్లు మార్చడం వలన ప్రజలకు ఏ విధంగా లాభమో రెవిన్యూ వర్గాలు చెప్పాలి . తెలంగాణా ముఖ్యమంత్రి గారు ఈ  విషయం లో   పునరాలోచన చేసి, తెలంగాణా ప్రజలుకు  గత కాలపు చేదు అనుభవాలను గుర్తు చేసే అధికార హోదాల పేర్లు కాక , అలవాటుపడిన   అమలులో ఉన్న పేర్లనే కొనసాగించాలని కోరడమైనది.   

Comments

  1. Narasimha Rao gaaru, Must watch


    Shri Sushil Pandit on "Truth About Kashmir : Story of Kashmir and Kashmiri Hindus

    https://www.youtube.com/watch?v=FhiXbwPKN9Y

    ReplyDelete
    Replies
    1. మీరిచ్చిన వీడియో లింక్ వలన కాశ్మీర్ లోని హిందువుల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. దన్యవాదాలు శ్రీ రామ్ గారు.

      Delete
    2. Tamilnadu Hindu Temple Loot

      https://storify.com/ranganaathan/tamilnadu-hindu-temple-loot

      Properties transferred to individuals identified – 8540 acres, Recovered by the Department – not even 10% #ReclaimTemples

      https://twitter.com/ranganaathan/status/789109137372164096
      https://twitter.com/hashtag/ReclaimTemples?src=hash

      Must watch

      Freeing Hindu Temples from Government Control

      https://www.youtube.com/watch?v=BA_VQdUMdeY

      Delete
    3. Anuraag Saxena: Returning stolen art to India (6 min)

      https://www.youtube.com/watch?v=uq6b07Ln0Pc

      Delete
    4. Dancing Shiva - Trailer

      https://www.youtube.com/watch?v=qeeSdYbPLkY

      Absconded AP Businessman Has Links With Idol Smuggler Subhash Kapoor | Sun News

      https://www.youtube.com/watch?v=-fBTKKXGGFo


      http://www.thehindu.com/news/cities/chennai/idol-smuggling-gang-busted/article8675788.ece

      Return Of Stolen Art May Thaw India-US Relations

      https://www.youtube.com/watch?v=B87lSsbH9iM

      Kapoor Loot - Part1

      https://www.youtube.com/watch?v=soh2_sKKhHQ

      The illegal trade of art and artefacts is estimated to be worth about Rs 40,000 crore a year, and India is a rich source of such items.

      The inside story of how idols are stolen from Indian temples and why custodians have failed to safeguard the gods

      http://www.theweek.in/theweek/cover/illegal-trade-of-art-and-artefacts.html
      -------
      Reporter exposes auction house antics

      Five years of investigation by Watson resulted in the TV program and a just-published book, Sotheby's, Inside Story.


      http://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=4888

      Delete
    5. Please read review comments

      Sotheby's: The Inside Story Hardcover – January 20, 1998
      by Peter Watson (Author)

      https://www.amazon.com/Sothebys-Inside-Story-Peter-Watson/dp/0679414037

      Delete
    6. Petitioning Honorable Prime Minister of India Shri Narendra Modi ji and 1 other
      Allow freedom for temples by enacting a system of representative council constituted with religiously relevant people with scholastic abilities to oversee, advise & decide. Stop intervention of secular governments & political nominees in religious affairs

      https://www.change.org/p/honorable-prime-minister-of-india-kindly-enact-a-law-for-hindu-temples-freedom

      Delete
    7. అర్చకులను ఆదుకోరూ!

      రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి పైసా కూడా బడ్జెట్‌ లేని శాఖ ఏదైనా ఉందంటే అది దేవాదాయ శాఖే. సర్కారు దన్ను లేకపోగా, ఆలయాలే ఖజానాకు కప్పం కడుతుంటాయి. ప్రతి గుడీ తనకు వచ్చే ఆదాయంలో 12 శాతం కంట్రిబ్యూషన్‌ (ఇందులో 5 శాతం దాకా ఈవో వేతనమే), 5 శాతం కామన్‌గుడ్‌ ఫండ్‌, 3 శాతం అర్చక వెల్‌ఫేర్‌ ఫండ్‌ కింద చెల్లించాలి. చివరికి గుడి ఆదాయ వ్యయాల లెక్కలు చూసేందుకు కూడా సర్కారుకు 1.5 శాతం ఆడిట్‌ ఫీజు చెల్లించాలి. అంటే గుడి ఆదాయంలో దాదాపు 22 శాతం దాకా సర్కారుకు కప్పం కిందే వెళుతుంది. మిగతా దాంట్లో 30 శాతానికి మించి జీతాలు తీసుకోగూడదు. (మిగతా 50 శాతం ఆలయ అభివృద్ధికి అంటారు. కానీ ఇందులో పెద్ద మొత్తం అనవసరమైన పనులు, తప్పుడు లెక్కలు, అవినీతి కింద పోతుంది)


      ఒక గుడికి భక్తులు రావాలన్నా, రాబడి రావాలన్నా అర్చకుడిదే ప్రధాన పాత్ర. కానీ 20 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న అర్చకుడికి వేతనం 5-15 వేల మధ్య ఉంటుంది. రోజంతా గుడిలోనే గడుస్తుంది కనక బయట పనులకో, పౌరోహిత్యానికో వెళ్లి సంపాదించుకునే అవకాశం లేదు. అంటే చాలీచాలని జీతం డబ్బులతోనే బతుకూ, భవిష్యత్తు కూడా గడవాలి. కానీ అదే గుళ్లో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేసే వ్యక్తి దాదాపు 45 వేలు జీతం తీసుకుంటాడు. ఆలయం సొమ్మును (కంట్రిబ్యూషన్‌ కింద) ఖజానాకు జమచేసి, అక్కణ్నుంచి, ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా వేతనం పొందుతారు. అర్చకులు, ఇతర సిబ్బందేమో గుడి రాబడి సరిపోక, నెలకు సక్రమంగా జీతం అందక అవస్థలు పడుతుంటారు. భక్తుల తాకిడి ఉండే రాజధాని శివారులోని కీసరలోనే అర్చకులకు సక్రమంగా వేతనాలు అందడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆలయంలో కరెంటు ఫిట్టర్‌గా చేరిన వారు కూడా ‘రకరకాల మార్గాలో’్ల ప్రమోషన్లు పొంది ఈవోలు, ఏసీలు, డీసీలు అవుతారు. వారికి జీతం కన్నా గీతం ఎక్కువన్నది బహిరంగ రహస్యం. కానీ ఒక అర్చకుడు, పది పన్నెండేళ్లు స్మార్త విద్య అభ్యసించి చేరితే మళ్లీ రిటైరయ్యేది అర్చకుడిగానే! ఆలయం అర్చకుడి వల్ల నడుస్తుందా? ఈవో వల్లా? భక్తులు అర్చకుడి మంచితనం, పూజా విధానం, అలంకరణ నచ్చి గుడికి వస్తారా? ఈవో చేసే ఆలయ పరిపాలన చూశా? అసలు ఎందరు ఈవోలు ఆలయాలకు సరైన సమయాలకు వస్తున్నారు? అర్చకుడు వైదిక విభాగానికి చెందిన వాడు. ఈవో పరిపాలనా విభాగానికి చెందిన వాడు. కానీ పూజల గురించి ఏమాత్రం తెలియని ఈవో అర్చకుడికి బాస్‌! దేవుడినే నమ్మని, దైవభక్తి లేని, కొండొకచో ఇతర మతాలకు చెందిన వారూ అధికారుల పేరుతో ఆలయాల్లో ప్రవేశిస్తున్నారు. బయట పైసాకు కొరగాని వారు, స్థానిక రౌడీలు, రాజకీయ నాయకులుగా అవతారమెత్తి దర్పం ప్రదర్శించడానికి, ధర్మకర్తలుగా అవతారమెత్తుతున్నారు. అధికారపార్టీ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వీరందరికీ తాము పెత్తనం చేయడానికి దొరికే అర్భకుడు అర్చకుడు!

      గత కొన్ని దశాబ్దాలుగా దేవాదాయ శాఖ అవినీతిమయమైపోయింది. హెడ్డాఫీసు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అదొక అవినీతి కూపం. ఇన్ని వందల మంది అధికారులు ఉండీ రాజులు, భూస్వాములు, భక్తులు ఇచ్చిన వేల కోట్ల రూపాయల విలువైన మాన్యాలను కాపాడలేకపోతున్నారు. కనీసం వాటి నుంచి తగినంత ఆదాయాన్ని కూడా రప్పించలేకపోతున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకునే దేవాదాయ శాఖ అధికారుల ఇన్నేళ్ల పనితీరుకు ఇదొక్క నిదర్శనం చాలు

      http://www.andhrajyothy.com/Artical?SID=145409

      Delete
    8. Freeing temples from state control by Dr.Subramanian Swamy

      The Srirangam Ranganathar Temple paid the government a (yearly) fee of Rs. 18.56 crore (2010-11) for ‘administering the temple’; for employees rendering religious services, like reciting Vedas, Pasurams during the deity procession, no salary is paid’. There are 36 priests in Srirangam who perform the daily poojas — they are not paid a monthly fixed salary. They are entitled to offerings made by devotees and a share in the sale of archana tickets. Yet the temple pays a monthly salary ranging from Rs.8,000 to Rs.20,000 for the temple’s government-appointed employees, like watchman, car drivers etc. who perform no religious duties.

      The situation is “significantly” better at the famous Nelliappar Temple in Tirunelveli. In this temple, priests performing daily pujas are paid monthly salaries, but ranging from Rs. 55-Rs. 72 (and this is during 2010-11). But did some politician not say you can have a hearty meal for Rs. 5 per day? But it is just Rs.1.65 per day, going by the standards of the ‘secular’ government.

      Many large temples maintain a fleet of luxury vehicles, typically the ‘fully loaded Toyota Innova’, for the use of VIPs! And for the use of assorted Joint and Additional Commissioners and, of course, the Commissioner himself. It is very difficult to understand the religious purpose such extravagance serves or even a ‘secular’ purpose! The HR & CE takes away annually around Rs.89 crore from the temples as administrative fee. The expenditure of the department including salaries is only Rs.49 crore. Why does the government overcharge the temples– literally scourging the deities – for a sub standard service?

      Temple antiquity: The third ‘contribution’ of the government is the mindless destruction of priceless architectural heritage of our temples.

      There are several instances of sand blasting of temple walls resulting in loss of historical inscriptions; wholesale demolition of temple structures and their replacement by concrete monstrosities; in a temple in Nasiyanur near Salem, an entire temple mandapam disappeared, leaving behind a deep hole in the ground, literally.

      http://www.thehindu.com/opinion/lead/freeing-temples-from-state-control/article5594132.ece

      Delete
    9. శ్రీ రామ్ గారు,
      హిందూ దేవాలయాల విముక్తి కొరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ చర్చలు,కోర్టుల్లో కేసులు.ప్రభుత్వాలకు విజ్ఞప్తులు లాంటి సమాచారంతో కూడిన లింక్ లు ఇస్తూ చాలా విలువైన సమాచారం అందిస్తున్నారు
      అందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.అయితే మీరు ఇస్తున్న లింక్ లు దేవాలయం విముక్తి కి సంబందించినవి కాబట్టి దానికి సంబంధించిన పోస్ట్ క్రింద వాటిని పబ్లిష్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యం తో "మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ?? "అనే ఈ టపా క్రింద మీ కామెంట్లు ఉంచడం జరిగింది.గమనించగలరు.అలాగే దేవాలయాల విముక్తికి సంబందించిన సమాచారం ని ఈ టపా క్రిందనే పబ్లిష్ చేయగలరని మనవి.

      Delete
  2. ప్రభుత్వోద్యోగాల డెజిగ్నేషన్లు (ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్‌మెన్‌ట్, పోలీస్ డిపార్ట్‌మెన్‌ట్) మార్చకుండా ఉంటే మంచిది. మీరు చెప్పిన కారణాలతో బాటు మరొక కారణం - అవి చాలామటుకు దేశమంతా అర్ధమయ్యే పేర్లు (బైదివే, "నాయబ్" అంటే డెప్యూటీనా?). వాటిని మారిస్తే మార్చిన రాష్ట్రంలో మాత్రమే అర్ధమవుతాయి. ఉదాహరణకి, చాలా ఏళ్ళ క్రితం మా అబ్బాయికి వేరే రాష్ట్రంలో మంచి యూనివర్సిటీలో సీటు వచ్చింది. వాళ్ళేదో సర్టిఫికేట్ తహసిల్దార్ దగ్గర నుంచి తీసుకు రావాలని అడ్మిషన్ లెటర్లో వ్రాసారు. అప్పటికే ఏపీలో మహానుభావుడు NTR మండల వ్యవస్ధ ప్రవేశపెట్టి MROలు అన్నాడు. సరే ఆ MRO సర్టిఫికేటే తీసుకువెళ్ళాం జాయిన్ అవడానికి. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఈ MRO ఎవరు, మేం అడిగింది తహసిల్దార్ సర్టిఫికేట్, ఇది మాకు సమ్మతం కాదు అని అభ్యంతర పెట్టారు. అంత దూరం వెళ్ళి ఇబ్బంది పడాల్సి వచ్చింది.
    ఏదో సినిమా లాగా వెరయిటీగా ఉండాలని, డిఫరెంట్ గా ఉండాలని, లేదా తన ముద్ర నిలిచిపోవాలని, లేదా రాజకీయ కారణాల వలనా, యూనిఫాంగా వాడుకలో ఉన్న పేర్లు మార్చెయ్యడం సమంజసం కాదు.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పినది అక్షరాల నిజం. రెవెన్యూ అద్సికారుల హొదాల పెర్లు మార్పువలన సామాన్య జనానికి ఒనగూడెదేమి లేదు. దన్యవాదాలు విన్నకోట గారు.

      Delete
  3. నేనెప్పుడో చెప్పాను,ఆంధ్రావోళ్ళు ముందుకు పరిగెడితే తెలంగాణ్పెళ్ళు ఎనక్కి పరిగెడతారని:-)
    కేసీయార్ బలే సర్దా అయినవోడు - సూస్తా వూరుకుంటే పాతరాతియుగాన్ని కూడా చూడొచ్చు:-)

    ReplyDelete
    Replies
    1. చరిత్ర పునరావ్రుతమవుతుంది అనే సిద్దాంతమే నిజమయితే, ముందుకు వెళుతున్నాం అని బావించె ప్రతి ఒక్కరి గమ్యం తమ వెనుకాలే ఉంటుందన్నది సత్యమే కదా!?

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన