"అనుమానం " అనే పెను బూతాన్ని అంతం చేయక పొతే , అది కుటుంబాలని ఎలా అంతం చేస్తుందో చూడండి !

                                                       


                                    ఎయిడ్స్ , కాన్సర్ , బి.పి. , షుగర్ , ఇత్యాది వాటిని వ్యాదులుగా గుర్తించిన ప్రభుత్వాలు , వాటి నివారణ కోసం హాస్పిటల్స్ ని నెలకొల్పి ప్రజల్ని వాటి బారి నుండి కాపాడ డానికి బారి ఖర్చును చేస్తుంది . చాలా సంతోషం . కాని విటికంటే  భయంకరమైన వ్యాది ఒకటి మన సమాజంలో కుటుంబాలు కుటుంబాలనే అంతం చేస్తుంటే , దాని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవటం మాట అటుంచి  అసలు దానిని "వ్యాది " గానే గుర్తించక పోవడం చాలా దురదృష్ట కరం . ఆ వ్యాది పేరే "అనుమానం ".

                 పైన చెప్పిన వ్యాదులలో ఎయిడ్స్ తప్పా మిగతావి వ్యక్తులకి మాత్రమె ప్రమాద కరమైనవి . ఎయిడ్స్ వలన కుటుంబం కి ప్రమాదం ఉన్నప్పటికీ , అది శాంతి బద్రతల సమస్యలు సృష్టించదు . కాని అనుమానం వ్యాది అలా కాదు . అది వ్యక్తులని నేరస్తులుగా మార్చి చివరకు కుటుంబాలనే సమూలంగా నాశనం చేస్తుంది . దానికి ఉదాహరణే  పైన చూపిన రెండు కేసులు . ఈ  రోజు దిన పత్రికలో ప్రచురితమైన ఆ  రెండు కేసులలోని విషయాలు క్లుప్తంగా ఇవి :

  తూర్పు గోదావరి జిల్లా , గోకవరం మండలం లోని గుమ్మళ్ళ దొడ్డి గ్రామం లో నివసించే శ్రీను, సుబ్బ  లక్ష్మి లు 8 ఏండ్ల క్రితం ప్రేమించి  చేసుకున్నారు . వారి ప్రేమకు గుర్తుగా 6 ఏండ్ల పాప  కూడా ఉంది . కాని కొన్నాళ నుంచి శ్రీనుకు  బార్య  మిద అనుమానం కలిగి చివరకు అది పెను  భూతంగా మారేసరికి వారి మద్య     మనస్పర్ధలు  ఏర్పడి సుబ్బ  లక్ష్మి పాపను    తీసుకుని పుట్టింటికి వెళ్ళింది . అయినా  సరే  అనుమాన భూతం ఆవహించిన శ్రీను ఆమెను కదతెర్చడానికి   నిర్ణయించుకుని  , కూరాగాయలు కొనుగోలు చేసి వస్తున్న సమయం లో ఆమె పై యాసిడ్ దాడి చేసి మరి చంపాడు . దానితో   స్తానికులు అతనిని స్తంబానికి కట్టి , మెత్తగా తన్ని పోలీసులకు అప్ప చెపితే , ప్రస్తుతం జైలులో ఉన్నాడతను . వారి 6  ఏండ్ల పాప తల్లి తండ్రులు కు దూరమయింది .

  ఇక   రెండవ  కేసు అయితే మరి దారుణం . ఒంగోలు లో నివసిస్తున్న వెంకటేశ్వరులు అనే ఆతను , బార్య మిద అనుమానంతో తన ఇద్దరి  కొడుకులను నీళ్ళ ద్రమ్ముల్లొ ముంచి ఘోరంగా హత్య చేసాడు . బార్యకు నూడిల్స్ లో విషం కలిపి ఇ స్తే , ఆమె మగతలోకి వెళ్లి పోగా ఆమె చనిపోయిన్దనుకుని , తానూ కూడా లారి క్రింద పడి ఆత్మ హత్య చేసుకో పోయాడు . కాని చివరకు గాయాల పాలై ఒంగోలు ఆస్పత్రి లో చేరాడు . అ విదంగా కొడుకులిద్దరూ ని కోల్పోయి బార్యా బర్తలు బ్రతికినా , భర్త జైలు పాలవక తప్పదు .

    పై ఉదంతాలు లో భర్తలు  నేరస్తులు మారడానికి కారణం ఎవరు ? అనుమానం అనే జబ్బు మాత్రమె  . సాదారణ హంతకులును  , అనుమానం తో అమానుషాలు చేసే వారిని  ఒకే గాటన కట్టి , నేర విచారణ చేస్తే   దాని కంటే అవగాహనా రాహిత్యం  మరొకటి ఉండదు . అనుమాన పిడితులను తోలి దశలోనే పసి గట్టి , వెంటనే సరి అయిన  ఫ్యామిలి కౌన్సలింగ్ తో పాటు మెడికల్  ట్రీట్ మెంట్ ఇస్తే , ఎన్నో కుటుంబాలను ఆ  పెను భూతం నుండి కాపాడే వీలు ఉంటుంది . దీనికి కావలసింది ముందు అనుమానం అనే దానిని ఒక వ్యాది గా ప్రబుత్వాలు గుర్తించి , వాటి నివారణ కోసం ఆసుపత్రులలో ప్రత్యెక విభాగాలు ఏర్పాటు చేయాలి . అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో నడచే ప్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లను వాటితో సమన్వయ  పరచి , బాదితులకు సరి అయిన సమయం లో తగిన చికిత్స అందేలా చేస్తే ,అనేక  కుటుంబాలను రక్షించే వీలు  ఉంటుంది అని నా అభిప్రాయం .
                                          (Republished Post. OPD:22/6/2014)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన