సంక్రాంతి పండుగ ఎప్పుడు చెయ్యాలో "పండితులకు" తెలియదు! కోడి పందాలు ఎలా ఆపాలో పోలీసులకు తెలియదు!

                                                     

ఉన్న ఊరే ! ఉదకమండలం అయిన వేళ !
                                                                                                                       బోగి మంటలు
మా గుడిలో గోదాదేవి కల్యాణం


రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు , అరిసెలు వండుకోవడాలు , ఇవ్వన్ని సాంప్రాదాయక  సంక్రాంతి పండుగలో కనిపించే అంశాలు . తెలుగు గ్రామాలలో ఎ పండుగ గొప్పగా జరుపుకోలేక పోయినా  సంక్రాంతి పండుగ మాత్రం తమకు కలిగినంతలో ఘనంగానే జరుపుకుంటారు ప్రజలు. కారణం అప్పటికే రైతులకు పంటల తాలూకు పలాలు చేతికొచ్చి ప్రతి ఇంట్లో దన దాన్యాలు ఉండడమే . అంతే  కాకుండా చలికాలం చివరి నెల కావడం వలన వాతా వరణం కూడా మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తూ పండుగ మూడు రోజులు ఆనందంగా గడచి పోయేలా చెస్తుoది .

    నిజంగా సంక్రాంతి శోభ చూడాలంటే పల్లెలకు వెళ్ళాల్సిందే . పొద్దునే పట్టిన పొగమంచు అందాలు పల్లెలను ఉదక మండలాలుగా మారుస్తాయి . బోగి నాడు వేసుకునే "బోగి మంటలు" , దాని చుట్టూ చేరి కుటుంబ సబ్యులు అంతా వెచ్చని చలి కాగుతుoటె, ఆహా ! ఆ  ఆనుబూతే  వేరు . అ తర్వాత ఆడపిల్లలు ఇండ్ల ముందు వేసే సంక్రాంతి ముగ్గులు, అందులో పెట్టె గొబ్బెమ్మలు, పూలు ఇవ్వన్ని ఇంటికి సంక్రాంతి లక్ష్మిని ని ఆహ్వానించి , ప్రతి  ఇల్లు  బోగ బాగ్యాలతొ తుల తూగేలా ఆశీర్వాదం పొందుతుంది .అలాగే సంక్రాంతి పండుగ స్పెషల్ వంటకం అయిన "అరిసెలు" చేయని ఇల్లు తెలుగు నాట ఉండదు . జంక్  పుడ్ కు అలవాటు పడిన తెలుగు వారిని సైతం ఈ అరిసెలు సాంప్రదాయక స్వీట్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసుకునేలా చెస్తాయి. ఇండ్లకు కొత్త అల్లుళ్ళు రావడం , ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా ఉండడం ఈ పండగ ప్రత్యెకతలు. మరి అలాంటి సాంప్రదాయక  పండుగను ఎలా మార్చారో చూస్తుంటే బాద కలుగక మానదు.

   అసలు ఈ సంవత్సరం పండుగ 14 వ తారికున జరపాలో , 15 వ తారికున జరపాలో తెలియని అయోమయ పరిస్తితి ప్రజలకు కలిగిందంటే దానికి కారణం తెలుగు పండితులు మద్య ఉన్న ఇగో . మేము చెప్పేది కరెక్టు అంటే , మేము చెప్పేది కరెక్టు అని వాదులదుకుo టూ , చివరకు పంచాంగ పండితులు అంటే పామరులు కూడా ఎవగించుకునే  దుస్తితికి దిగ జారారు .ఒక  పండగ విషయంలోనే ఏకాభిప్రాయానికి రానీ  వారు ప్రజలకు ఏమి మార్గదర్సనమ్ చేస్తారు ?సామాన్య  ప్రజలకు కావలసింది మీ పాండిత్యం కాదు , మీ మద్య సమన్వయం  అని చెప్పే జ్ఞానులు తెలుగు దేశంలో లేకపోవడం నిజంగా విచారించ దగిన విషయం . చివరకు ఎండోమెంట్ అద్వర్యంలో నడచే దేవాలయ అస్తాన పండితుల మద్య కూడా పండగ తేది విషయంలో బెదాభి ప్రాయలు ఉండి  భక్తులను కన్ప్యూజ్ చేస్తున్నారంటే "పండితులు రాసిన పంచాంగాలు కల్లలై పోవును " అని శ్రీ వీర  బ్రహ్మెంద్రులు స్వామీ వారు చెప్పిన కాల్ జ్ఞానం నిజమయిందా అని పిస్తుంది .

     ఇక పొతే ప్రజలు కొంతమంది ఈ పండుగను జూదాలా పండుగ గ మార్చి వేసారు . వీరికి సంక్రాంతి అంటే ఇంట్లో బోగ బాగ్యాలు కలగాలని కోరుకోవడం కాదు , ఇంట్లో సొమ్మును కోడి పందాలకు తగలేసి ఇంటిల్లి పాదిని ఏడిపించడం . ఒక్క కోన సీమ జిల్లాలోనే  వందల కోట్ల రూపాయల కోడి పందాలు జరుగుతున్నాయి అంటే ఎంత వ్యసనంగా ఈ  పందాలు మారాయో అర్ధమవుతుంది . మరి దినిని అరి కట్టడానికి పొలిసు వారు ఏమి చెయ్యలేరా అంటే , M.L.A లు వచ్చి కోడి పందాలకు  రిబ్బన్ లు కట్ చేస్తుంటే వారికి కోడి పందాలు ఎలా ఆపాలో తెలియటం లేదు . అది నేటి పల్లెల దుస్తితి. మొన్నటి పండుగ పందాలు సందర్బంగా దొంగ నోట్ల చలామణి విపరీతంగా జరిగిందని మీడియా కోడై కూసింది . అయిన  నివారణ చర్యలు నిల్ . దాని గురించి మరింత సమాచారం కొరకు ఈ  క్రింది విడియో లను చూడండి .




                      


          పండగ గురించి పండితుల వాదాలు ఈ  క్రింది విడియోలో చూడండి .
                        
                  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన