"మనవు " చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమని తేల్చిన, "నిర్భయ " కేసు దోషి ఇంటర్వూ !!!

                                                                   



            నిర్భయ ఉదంతం తర్వాత మన దేశం లోస్త్రీల మీద జరిగిన కొన్ని అత్యాచార సహిత హత్యలు గురించి తెలుసుకున్నాక ,ఇదే బ్లాగులో ఒక ఆర్టికిల్ ను ప్రచురించడం జరిగింది. దానిని ఒరిజినల్ రూపంలో  చదివితేనే ఆ నాడు నేను చెప్పింది ఎంత వాస్తవిక దృష్టితో కూడుకున్నదొ అర్దమవుతుంది . ఆ ఆర్టికిల్ పేరు   

నిర్బయ చట్టం కూడా " స్త్రీల చావుకు" కారణాల్లో ఒకటి అవుతుందా!?

నేను పై ఆర్టికిల్ లో   "నిర్బయ చట్టం వలన సమాజం లోని మ్రుగాల్ళలో బయం ఏర్పడి స్త్రీల మీద అత్యాచారాలు తగ్గుతాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ  చట్టం  రావడానికి కారణమైన డిల్లీలోనే 2012 లో 700 పైగా రేప్ కేసులు నమోదైతే, చట్టం వచ్చిన తర్వాత పది నెల్లల్లొనే 1200 పైగా కేసులు నమోదయ్యాయి అట! మరి చట్ట ప్రబావం మ్రుగాళల్లో బయం కలిగించి అత్యాచారాలను అరికట్టేలా చేస్తుంది అనేది అనుమానంగానే ఉంది. అత్యాచారాలను అరికట్టక పోగా , నేరం జరిగాక కఠిన  చట్టం గుర్తుకు వచ్చి, బాదితురాలు నోరువిప్పితే తాము  తప్పించుకునే అవకాశాలు అవకాశాలు తక్కువ అని బావించి ఆమెను కడ తేర్చడానికే మొగ్గు చూపుతున్నారు అనిపిస్తుంది. ఇదివరలో అయితే ఏదో ఒక కారణం తో బెయిల్ తీసుకుని , ఆ పై కొన్నేండ్లు కేసు నడిచాక అప్పటికి ఆవేశాలు చల్ల బడతాయి కాబట్టి టెక్నికల్ గానో, లేక తక్కువ శిక్ష తోనో మ్రుగాడు బయట పడే అవకాశం ఉంది. కానీ నిర్బయ చట్టం వచ్చిన తర్వాత , ఒక్కసారి రిమాండ్ అయితే విచారణ సహా అంతా పూర్తీ చేసే నేరస్తుడుగా ప్రకటించి జైలులోనే ఉండి శిక్షా కాలం పూర్తయ్యాకే బయటకు రావడం జరుగుతుంది.   ఒక వేళా  ఎవరైనా  నిందితులకు సహాయం చెయ్యాలనుకున్న ప్రస్తుత పరిస్తితుల్లో సాద్యం కాని విషయం. అదే బాదితురాలు ని హత్య చేస్తే , ఆ హత్యకు సంబందించిన దర్యాప్తు జరగడానికి కొన్ని నెలలు కాలం పడుతుంది. ఈ  లోపు మ్రుగాళ్ళు తమకు ఉన్న అర్ద , రాజకీయబలాలతో దర్యాప్తు  అధికారులను ప్రబావపరచడానికి అవకాశం ఉంటుంది. అదే బాదితురాలు బ్రతికి ఉంటే ఈ  అవకాశాలు  ఏవి మ్రుగాడికి ఉండవు. ఆ ఉద్దేశ్యం తోనే బాదిత స్త్రీలను హత్య చేస్తున్నారు అనిపిస్తుంది. ఒక వేళ ఇదే నిజమయితే , ఏ స్త్రీల రక్షణకు ఒక పటిష్టమైన చట్టం చేసారో అదే స్త్రీలకు బూమి మీద నూకలు లేకుండా చేస్తుంది అనేది తలచుకోవడనికి కూడా  బయం కలిగిస్తుంది. ఏది ఏమైనా , స్త్రీలకు రక్షణ ఇచ్చేది స్వీయ జాగర్తలు. నేను ఇంతకు ముందు టపాలలో చెప్పినట్లు ఒంటినిండా బంగారం ఉన్న వారు ఏ జాగర్తలు తీసుకుంటారో ప్రతి స్త్రీ కూడా బంగారం ఉన్నా లేకపోయినా అవే జాగర్తలు తీసుకోవాలి.ముఖ్యంగా జన సంచారం లేని ప్రాంతాలకు , మదుగు ఉన్న పొదలు  , చెట్లు ఉన్న ప్రాంతాలలోకి ఒంటరిగా వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు "  అని స్పష్టంగా చెప్పాను . 

అదే విదంగా అత్యాచార సమయంలో స్త్రీలు ఎలా ప్రవర్తిస్తే ప్రాణాలతో బయట పడి ఆనక మ్రుగాళ్ళ ను ఎలా వేటాడవచ్చొ డిల్లి "నిర్భయ "కేసుకు , ముంబాయి "నిర్భయ "కేసుకు గల తేడా ఏమిటో గ్రహించారా ?"  అనే టపాలో చెప్పడం జరిగింది . అందులొ నేను "భారత దేశం లో యావత్ జాతి తలదించు కునేలా జరిగిన అమానవీయ సంఘటన "నిర్భయ" ఉదంతం . అబలను ఒక్క దానిని పరమ పాశవికంగా హింసించి, హింసించి మరి అత్యాచారం చేయడమే కాకుండా , అత్యంత కిరాతకంగా నడుస్తున్న బస్సులోనుంఛి ఆమెను ఆమె బాయి ప్రెండ్ ను క్రిందకు నెట్టివేశారు మ్రుగాళ్ళు కొందరు . ఆమె అత్యాచారం వలన అయిన గాయం కంటే , శరీరానికి అయిన గాయాలు ఎక్కువ అవటం వలన ఆమె మరణించింది . అలా మ్రుగాళ్ళు ఆమె మిద అత్యంత పాశవికంగా దాడి చేయటానికి ఆమెకు, వారికి మద్య పాత పగలు ఏమి లేవు . మరి ఎందుకలా చేసారు అంటే కేవలం అ సమయంలో లౌక్యం తెలియని అ అమ్మాయి వారిని పరుషమైన మాటల తో   రెచ్చగోట్టడం వలననే అని తెలుస్తుంది . అ విషయం గురించి కొంత మంది పెద్దవాళ్ళు వ్యాక్యానిస్తూ , అ విపత్కర సమయంలో కొంత బ్రతిమాలె విదానం  ప్రదర్శిస్తే , ఆ అమ్మాయికి అంత ముప్పు ఏర్పడి ఉండేది కాదు అని అంటే , దానిని అబ్యుదయ వాదులు ఖండించారు . కాని అదే తరహ అత్యాచారం ఆ తర్వాత ముంబాయి లేడీ  జర్నలిస్ట్ కేసులో ఎదురైతే , ఆ అమ్మాయి ఎంతో సంయమనం తో వ్యవహరించి , తనకు ఎక్కువ హాని జరుగకుండా చూసుకుని , ఆ తర్వాత ఆ మ్రుగాళ్ళను న్యాయస్తానాలుకు ఈడ్చి మరి ,వారికి ఉరి శిక్ష వేయించ గలిగిగింది . మరి ఇందులో ఎవరు చేసినది కరెక్టు ? ఎవరు నిజమైన "నిర్భయ".?" 

పై రెండు టపాలలో నేను వ్యక్త పరచిన నా అభిప్రాయాలు నూటికి నూరు పాళ్ళు నిజమని, నిర్భయ కేసులో నేరస్తుడైన ముకేశ్ సింగ్ అనే మ్రుగాడు BBC కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు తేట తెల్లం చేస్తున్నాయి . అతని ఇంటార్వ్యు గురించి "ఈనాడు" పత్రికలో వచ్చింది . అది పై  చిత్రంలో చూడవచ్చు . అందులో నిర్భయ కేసులోని నేరస్తుడి మనోబావాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది . అది ఈ దేశం లోని మృగాల్ల మనస్తత్వానికి ప్రతీక గా మనం అర్ధం చేసుకోవాలి .ఉరి శిక్ష వేసినా ఆ వెదవలో బుద్ది రాలేదు సరి కదా ,తన నీచ ప్రవర్తన అధికం కావటానికి  బాదితురాలి ప్రవర్తనే కారణం అని ,చీకటి పడినాక బాయ్ ప్రెండ్ లతో తిరిగే అమ్మాయిలూ తమను అకర్షిస్తారని ,అమ్మాయిల్లో మంచి అమ్మాయిలూ కూడా ఉంటారని , వారి పద్దతులు వేరుగా ఉంటాయని చెప్పాడు . మరి ఉరిశిక్ష కూడా వాడిలో మార్పు తేవటం లేదు కాబట్టి ,అటువంటి వాడి గురించి ఆలోచించటం వేస్ట్ .వాడికి ఉరే సరి అయిన శిక్ష .
 
      అయితే వాడు చెప్పిన ఒక ఇంపార్తేంట్ విషయం ఉంది . నిర్భయ చట్ట పద్దతుల బయం వలన ,తన లాంటి మ్రుగాళ్ళు అత్యాచారం చేసిన తర్వాత బాదితురాలిని బ్రతక నివ్వారని ,దాని వలన ప్రతి రేప్ కేస్ మర్డర్ కేస్ కి దారి తీస్తుందనే అర్ధం లో చెప్పాడు .ఇదె అందోళన కలిగించే విషయం . మన ఆడపిల్లల రక్షణ కోసం మనం చేసుకున్న చట్టాలే వారి హత్యలకు పురికొల్పేలా చేయడం ఎంతవరకు సమంజసం ?  కాబట్టి ఇప్పటికైనా ,ప్రభుత్వం చట్ట నిర్మాణంలో వీరావేశం  కంటే వాస్తవిక పరిస్తితులుకి ప్రాదాన్యత ఇచ్చి ,నిర్భయ బెయిల్  ప్రోసిడింగ్స్ ను కూడా "మర్డర్ కేసు " లో ఎలాంటి ప్రోసిడింగ్స్ ఉన్నాయో అలాంటివే ఉంచితే సరిపోతుంది . కాని శిక్షలు విషయంలో నో కాంప్రమైజ్!.ఒక్క సారి కేసు పెడితే శిక్ష గ్యారంటీ అనేలా ప్రాసికూషన్ ఉండాలి . ఇలాంటి విదానం వలన కనీసం మ్రుగాళ్ళు అత్యచారానికే పరిమిత మవుతారు .వారిలో కాలం తెచ్చే మార్పును కూడా సమాజం గమనిస్తుంది . చెడు మనిషిలో మార్పు తేవాలంటే ,కాలము +శిక్ష ఉపకరిస్తాయి తప్పా కేవలం ఆదరా బాదరా వేసే కటిన శిక్షలు మృగాలలో మార్పు తేలేవని పై ఇంటర్వ్యు విషయాలు తెలియ చేస్తున్నాయి .

       అలాగే    ప్రజలు కూడా ఆచరణలో,  ఆదర్శాల  కంటే వాస్తవికతకే ప్రాదాన్యత ఇచ్చి తదనుగుణంగా నడచుకుంటే మెరుగైన పలితాలు సాదించవచ్చని నా దృడ విశ్వాసం .లేకుంటె ఎవరేమనుకున్నా నా ఇష్టం నాది ,మేము "నిర్భయ "లం అని ఆడపిల్లలు అనుకుంటే ,మమ్మల్ని ఉరి తీసినా సరే ,రెచ్చగొట్టె ఆడపిల్లని మేము వదిలి పెట్టం ,మేము "నిర్లజ్జలం " అని మ్రుగాల్ళు అనుకుంటున్నారు . కాబట్టి స్త్రీ రక్షణ విషయం లో ,వాస్తవ ద్రుక్పదమా , వీరావేశమా  ? ఏది కరెక్టో నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమయింది .
                                             (3/3/2015 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన