పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

                                                           


కన్న తల్లి తండ్రులు ఎవరైనా తమ పిల్లలను తామే చంపుకుంటారా  ? సృష్టిలో ఏవో కొన్ని జీవులు తప్పా , అన్ని జీవులు తమ సంతానాన్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాయి . ఇదేదో ఆదర్శం కోసం చేసే పని కాదు. సృష్టి ధర్మమే అది . మరి మనుషులై ఉండి తమ కన్న కూతురినే చున్ని ఉరి పెట్టి చంపారు అంటే , వారు ఖచ్చితంగా ఆమె తల్లి తండ్రులు కాక పోయి అయినా ఉండాలి లేదా ఉన్మాదులు అయినా అయి ఉండాలి . లోకమంతా వారిని ఆమె తల్లి తండ్రులు అంటున్నారు కాబట్టి మనమూ అనుకుందాం . మరి వారికి ఉన్మాదం ఏదో అవహించబడి బడి ఉండాలి . ఏమిటది ?. విషయం లోకి వెళితే :

                        పచ్చల దీప్తి గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన, హరి బాబు సామ్రాజ్యం ల పెద్ద  కుమార్తె దీప్తి . ఆమె హైదరాబాద్లో HCL టేక్నాలిజీస్ లో టెక్నికల్ ఇంజనీర్  గా జాబ్  చేస్తుంది . ఆమె కు వివాహం కాలేదు . ఆమెకు ఒక చెల్లెలు ఉంది . హరిబాబు ఒక చిన్న రైతు . వారిది చాలీ చాలని సంపాదన . దానితోనే పెద్ద కుమార్తెను చదివించి ఉద్యోగాస్తురాలిని చేసాడు . ఆమె వివాహం తమ కులంలోనే చేయాలి అనుకున్నాడు . వారి సామాజిక వర్గంలో ప్రస్తుతం అమ్మాయిలకు బోల్డంత డిమాండ్ ఉంది . కారణం వారి లో అమ్మాయిలూ బూతద్దం పెట్టి వెతికినా కనపడటం లేదట . మరి అలాంటి సామాజిక వర్గంలో చదువు ఉండి , ఉద్యోగం చేసే దీప్తి లాంటి అమ్మాయిని  కన్యాశుల్కం ఇచ్చి అయినా చేసుకోవడానికి పెద్ద పెద్ద కుటుంబాలు వారు రెడీగా ఉంటారు .

     మరి అటువంటి పరిస్తితుల్లో దీప్తి తన స్నేహితుడిని , వేరే సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ ను ప్రేమించింది . గత 3 సంవత్సరం లనుండి వారు ప్రేమిమ్చుకున్తున్నారట . దీనికి హరి బాబు దంపతులు ఒప్పుకోలేదు . కిరణ్ కుమార్ మాటల్లో చెప్పాలంటే దీప్తి వీకెండ్ సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడల్లా , ఆమెను అరగంటకు ఒక సారి తల్లి తండ్రులు కొట్టే వారట . చివరకు దీప్తి, వారు చెప్పిన మాట వింటాను అంటే శాంతించారట . ఈ  లోపు కిరణ్ ఉద్యోగం చూసుకోవడానికి అమెరికా వెళ్ళాడట. ఇక్కడ దిప్తికి తల్లి తండ్రులు ఒక సంబంధం ఖాయం చేసారట . దానితో దీప్తి అమెరికాలో ఉన్న కిరణ్ కి సమాచారం ఇస్తే 3 రోజుల క్రితం అతడు హైదరాబాద్ వచ్చి, దీప్తి ని హైదరాబాద్ రప్పించి అక్కడ ప్రేమికులకు పెండ్లిళ్ళు చేయించే ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారట . అ తర్వాత దీప్తి తల్లి తండ్రులకు విషయం చెపితే , కూతురు చేసిన నమ్మక ద్రోహానికి నిర్ఘాంత పోయిన తల్లి తండ్రులు , కోపంతో , ఆవేశంలో తాము తల్లి తండ్రులు అన్న విషయమే మరచి పోయి , అంతే  నమ్మకంగా నవ దంపతులకు గుళ్ళో మళ్ళి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకు వచ్చి , అల్లుడిని లాడ్జిలో ఉంచి , కూతురిని ఇంటికి తీసుకు వచ్చిన 20 నిమిషాల్లోనే ఉరి పెట్టి చంపారట . అది దారుణం .

          ఈ  కేసులో సామాజిక కారణాలు కంటే ఆర్దిక కారణాలే  ఎక్కువ ప్రభావితం చేసి ఉంటాయి . హరి బాబు కి ఇద్దరు కూతుళ్ళు . వ్యవసాయం మిద వచ్చేది అంతంత మాత్రం . పెద్ద కూతురి సంపాదన తన కుటుంబానికి ఉపయోగ పడుతుందని ఆశించి ఉంటాడు . దీప్తి మామ గారి మాటల ప్రకారం దీప్తి ,కిరణ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం , తన సంపాదనలో కొంత భాగం తన తల్లితండ్రులకు ఇవ్వాలని కండిషన్ అట . కాని అ బిడ్డకు తన తల్లి తండ్రుల పట్ల ఉన్న మమకారం తో కూడిన బాద్యతను ఆ  పిచ్చి తల్లి తండ్రులకు చెప్పింది ఎవరు? ఒక వేళా దీప్తి చెప్పినా హరి బాబు నమ్ముతాడా ? ఒక్క సారి వివాహం అయ్యాక ఆడదాని బ్రతుకు మొగుడు చెప్పు చేతల్లోనే అన్ని నమ్మిన అ తండ్రికి కాదు , అలా జరుగదు అని గ్యారంటి ఇచ్చె వారెవ్వరూ? అలా లేదు కాబట్టే , హరి బాబు దంపతులలో ఆర్దిక  అభద్రతా బావం చోటు చేసుకుంది . కుమార్తె చెప్పకుండా పెండ్లి చేసుకోవడంతో అ అభద్రతా బావం వారిలోభయం గా మారి చివరకు రాక్షస రూపం ధరించింది . అందుకే ఆమెను అంత  కర్కశంగా పొట్టన పెట్టుకున్నారు .

  నేను ఇంతకు ముందు "తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన"   అనే టపా పెట్టడం జరిగింది . అందులో స్పష్టంగా వివాహాలకు తల్లి తండ్రుల అనుమతి గాని , పామిలి కోర్టుల అనుమతి గాని తప్పని సరి చేస్తూ , చట్ట సవరణలు చేయాలి అన్నాను. నిజంగా అలాంటి చట్టమే ఉంటె పాపం ,దీప్తి ఈ  విదంగా కన్నవారి చేతిలో చని పోయి ఉండేది కాదు . అనుభవం, విజ్ఞత ఉన్న న్యాయ మూర్తులకు తన అభిప్రాయాన్ని తెలిపి ,తల్లి తండ్రులకు తన సంపాదనలో కొంత, చట్ట బద్దమైన రీతిలో వారికి చెందేలా చెయ్యడం వలన వారిలో ఉన్న అభద్రత బావాన్ని రూపుమాపి , తనకు నచ్చిన వారిని వివాహం చేసుకుని ఉండేది . అటు దీప్తి తల్లి తండ్రులకు సరి అయిన కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిలో ఉన్న ఇతర బావాలను కొంత వరకు సముదాయించే విలు కలిగేది . కాని ఇవేవి జరుగ టానికి అవకాసం లేదు అంటే మన ప్రభుత్వాలలో అటువంటి చట్టం ఉండాలన్నా ఆలోచన రాకపొవడమే కారణం .
     
           కిరణ్ స్నేహితులు చెపుతున్న దాని ప్రకారం దీప్తి తల్లి తండ్రులు మొదట్లో వ్యతిరేకించినా , చివరకు కాంప్రమైజ్ అవ్వడానికి సిద్దమయ్యారు అట . కాని హరిబాబు  తరపు వారెవరో చెప్పిన చెప్పుడు మాటలు వలననే వారు అలాంటి పని చేస్సారట . నిజమే కావచ్చు . దీప్తి సామాజిక వర్గంలో అమ్మాయిలకి కొరత కాబట్టి , ఎవరైనా దీప్తి పెండ్లిని భగ్నం చేసి లబ్ది పొందాలనుకోవచ్చు . కాబట్టి హరిబాబు దంపతులలో  విష బీజాలు నాటి , వారిలో మరింత అభద్రతా బావం పెంచి ఉండవచ్చు . ఏది ఏమైనా చివరకు నష్ట పోయింది ఎవరు ? కిరణ్ కు కొంత కాలం బాద ఉండవచ్చు . కాని అతని కి  మరో బార్య దొరుకుతుంది . ఆ  తర్వాత మామూలే . హరి బాబు దంపతులకు మరో పెద్ద కూతురు దొరుకుతుందా?తన కన్నవారి పట్ల అంత బాద్యత ఉన్న అ అమ్మాయిని చేజేతులారా చంపుకోవడం హరిబాబు దంపతుల మూర్కాతి మూర్కం . తనలోని అభిప్రాయాన్ని  సమాజానికి తెలిపి ,తల్లి తండ్రులని ఒప్పించి గౌరవంగా వివాహం చేసుకునే  అవకాశం  లేకుండా చేసిన ఈ  సమాజమే దీప్తిని హత్య చేసింది .
         
                   కులాలు ఆదారంగా ఎన్నికలలో సీట్లు కట్టబెడుతున్న సమాజంలో , తల్లి తండ్రులని "కుల పిచ్చోళ్ళు" కులరక్కసులు " అని ఈసడించు కున్నంత మాత్రానా సమస్యలు పరిష్కారం అవుతాయా ?వారి మిద కవితలు రాస్తే , రాసిన వారిలోని కసి తీరుద్దేమో కాని , సామాన్యుడు లో ఉన్న బావం లో ఎలాంటి  మార్పు రాదు . వారికి ఏంతొ  కౌన్సెలింగ్ అవసరం. అప్త్రాల్ 50 యేండ్ల నుండి ఉన్న బావాజాలాన్ని, పెయిల్ అయిందని తెలిసి కూడా మార్చుకోవదానికే ఇష్టపడని మేధావులు ఉన్న సమాజంలో , వేల ఏండ్లుగా నరనరానా  జిర్నిం చుకు పోయిన దానిని , సామాన్య హరి బాబు దంపతులు ఎలా తొలగిoచుకోగలుగు తారు ? సమస్యపరిష్కారానికి  సామ , బెద , దాన , దండోపాయాలు అవసరం . దానిని చేయగలిగింది చట్టపరమైన విదానాలు మాత్రమె . అటువంటి చట్టం మన సమాజం ఇవ్వలేదు . అందుకే దీప్తి హంతకులు ఆమె తల్లి తండ్రులు కాదు. కాదు. కాదు. ఎందుకంటే తల్లితండ్రులు అనేవాళ్ళు కన్నవారిని  ఎన్నటికి హత్య చేయలేరు కాబట్టి . అమ్మా దీప్తి! నీలో ఉన్నకుటుంబ సంక్షేమ తపనను తెలిపే అవకాశం  ఇవ్వలేని ఈ  సమాజంలో సబ్యులు అయినందుకు సిగ్గుపద్తూ , నీ  ఆత్మకు శాంతి చేకూరాలని అ భగవంతుని ప్రార్దిస్తున్నాను .

         
     తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన అనే టపా కోసం లింక్ ని క్లిక్ చెయ్యండి . http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html

                                   (25/3/2014 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.