ఇక నుంచి ఖమ్మం లో 10,000 విలువ చేసే వస్తువు విజయవాడలో 8,000 అట!

                                                           


జై తెలంగాణా అని పదేళ్ళు పోరాడినందుకు తెలంగాణా వారికి "హైదరాబాద్ సహిత" తెలంగాణా ప్రసాదించినందుకు మేడం సోనియాను వేనోళ్ళ కిర్తిస్తున్నారు తెలంగాణా రాజకీయ నాయకులు . కొందరైతే ఏకంగా ఆమెకు గుడులు కట్టి రోజువారి పూజలు చేయాలని కూడా పిక్స్ అయి పోయారు . కాని ఇన్నాళ్లు పోరాడినందుకు   పాడి ఆవు  తెలంగాణా కు దక్కినా , పాల రేట్లు మాత్రం సిమాంద్ర కు తగ్గిoచడo వలన దాని ప్రబావం తెలంగాణా మార్కెట్ ను నిర్వీర్యం చేయక మానదు అని పిస్తుంది . అది ఎలాగో చూదాం .

   ప్రజలు ఇంటి ఆవసరాలు కు వాడే వస్తువుల మిద సెంట్రల్ గవర్నమెంట్ టాక్స్ విదిస్తుంది . ఉదాహరణకి ఒక టెలివిజన్ ను మనం 10,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే , దానిలో సుమారు 1200 రూపాయల నుంచి 1400 రూపాయల దాక సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ కె పోతుంది . అలాగే ఇంకా చిన్నా చితక , అన్ని కలిపి సుమారు రెండు వేల దాక కేంద్ర ప్రబుత్వం వారికి కట్టాల్సి ఉంటుంది . ఇది డైరెక్టుగా వినియోగ దారుడు కట్టక పోయినా, పంపిణి దారులు వస్తువు రేటుల లోనే అది వసూలు చేస్తారు కాబట్టి అంతిమంగా వినియోగ దారులు మిద పడే బారమే అది . మరి అటువంటి T.V.  కి ఒక వేళ సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ లేకుండా పొతే , వినియోగ దారుడికి 8000 రూపాయలకే అమ్ముతారు కదా  . మీ ఊళ్ళో వక వస్తువు 10,000 రూపాయలకు అమ్ముతుంటే , అదే వస్తువు పక్క ఊరిలో 8,000 వేలకే అమ్ముతుంటే  మీరు ఎక్కడ కొంటారు ? ఖచ్చితంగా పక్క ఊరికే వెళ్లి కొంటారు కదా ! దానివలన మీ ఊరి షాపుల్లో వ్యాపారం చాప చుట్టుకు పోయినట్లే కదా ! అదే జరుగబోతుంది తెలంగాణా వస్తు మార్కెట్ కి !

   తెలంగాణాకి హైదరాబాద్ ఇచ్సెసినందుకు నష్ట పరిహారంగా సిమాంద్ర రాష్ట్రానికి ప్రత్యెక ప్రతిపత్తి హోదా 5 ఏండ్లు ఇస్తారట . దానితో అక్కడ కేంద్ర ప్రబుత్వం వారు అనేక టాక్స్ ల రాయితీ లు ఇవ్వ బోతున్నారు . దానికి ఆకర్షితులైన అనేకమంది  పారిశ్రామిక వేతలు అక్కడే తమ పరిశ్రమలు నెలకొల్పుతారు . అలాగే సెంట్రల్ ఏక్సిస్ సుంకం రాయితీలు ఉన్నందు వలన ప్రజలకు తక్కువ రిట్లలో వస్తువులు దొరుకుతాయి . దాని వలన సిమాంద్ర మార్కెట్ కళ కళ లాడుతుంది . ఉదాహరణకు విజయవాడ లాంటి ప్రాంతంలో చౌకగా వస్తువు దొరుకు తుంటే ఖమ్మo లో ఉండే వినియోగ దారులు అక్కడి వస్తువులు తెచ్చుకోవడానికి ఇష్ట పడతారు . ఒక వేళ ఏదైనా నిబందనలు పెట్టినా అవి అన్ని హుష్ కాకి. స్మగ్లింగ్ ఎక్కువైడే తప్పా , సిమాంద్ర సరుకు తెలంగాణాకి రాక తప్పదు. ఇది ఖమ్మం లాంటి దగ్గరి ఎరియాలకే కాదు తెలంగాణా లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది .

                    ఉదాహరణకు ప్రస్తుతం చిత్తూర్ లో తయారవుతున్న నల్ల బెల్లం తెలంగాణా లోని సారా బట్టిలకు సరపరా అవుతూ చిత్తూర్ బెల్లం  స్మగ్లర్లకు  విపరీత లాబాలు పంచుతుంది . తెలంగాణా లో అదికారు లుకు కూడా అంతో ఇంతో ముడుతుంది కాబట్టి , బెల్లం స్మగ్లింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది .దాని వలన తెలంగాణా లో ఏ "సంబురం " జరుపుకున్నా , దాని వలన లాభాలు సిమాంద్ర వారికి చెందు తాయి . రేపు ఇదే పరిస్తితి చాలా వస్తువులకు అమలు చేయబడుతుంది . దానితో  సదరు వస్తు అమ్మకాలు ద్వారా వచ్చె ఆదాయాన్ని తెలంగాణా రాష్ట్రం  కోల్పోక తప్పదు . ప్రస్తుతం హైద్రబాద్  లో వచ్చె అంత రెవెన్యూ బవిష్యత్ లో తగ్గే అవకాశాలు ఉన్నాయి .సిమాంద్ర ప్రజలు వలసలు తగ్గుతాయి కాబట్టి ఈ ప్రబావం తెలంగాణా రియల్ ఎస్టేట్ మిద కూడా పడే అవకాశ ముంది. వోట్ల రాజకీయాల మిద నడిచే   మన భారత దేశంలో ఒక సారి రాయతీలు ఇచ్చాక దానిని తొలగించాలంటే కష్టం  . కాబట్టి సిమాంద్ర ప్రత్యెక ప్రతి పత్తి మరి కొంత కాలం పోదిగిస్తారు . దానితో రానున్న 10 ఏండ్లలో సిమాంద్ర అభివృద్ధి చెందితే , తెలంగాణా వారు స్మగ్లింగ్ చేసుకోవడం తప్పా గత్యంతరం ఉండదు అనుకుంట !
                     అయితే సిమాoద్ర కు ప్రత్యెక పట్టి ఇవ్వడంలో అనేక అనుమానాలు ఉన్నాయి . దేశంలోని ఇతర ప్రాంతాల వారు దీనిని వ్యతిరేకించడం కంటే సిమాంద్ర కు ప్రత్యెక ప్రతి పత్తి హోదా పొందే అర్హత లేదంటున్నారు . అయినా తోటి తెలుగువారికి దక్కుతున్న సౌకర్యాలు వద్దనడం తెలంగాణా ప్రజలకు అభిలషినియం  కాదు . కాకపొతే దాని వలన తెలంగాణా ప్రాంతానికి జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పనిలో పనిగా తెలంగాణా రాష్ట్రానికి కూడా ప్రత్యెక ప్రతి పత్తి  ఇస్తే ఇక్కడి వారు కూడా నిజాయితిగా తమ రాష్ట్ర అభివృద్దిలో పాలు పంచుకుంటారు . లేకుంటే కరెంట్ కష్టాలు , స్మగ్లింగ్ నష్టాలు తప్పా తెలంగాణలో ఏమి ఉండదు .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన