పెళ్ళాం మీద అలిగి వెళ్ళిపోయినా, గాడిదలకూ పోలిస్ సెర్చ్ డ్యూటి తప్పదా !?

                                                                   


వెనుకటికి ఒకాయన అపరాద పరిశోదన నవలలు చదివి , చదివి , తానూ ఒక డిటెక్టివ్ అయి బాగుండు అనుకున్నాడట . వెంటనే కొంత డబ్బు ఖర్చు చేసి "xxx డిటెక్టివ్ ఏజెన్సి" అనే దానిని అట్టహాసంగా ప్రారంభించాడట. మొదటి రోజు మొదటి బేరం ఏమి తగులుతుందా అని ఎదురు చూస్తున్న అ డిటెక్టివ్ గారి దాగ్గరకు  , పంచే పైకెగ దోపుకుని , ఆయాసంగా ఒగర్స్తూ ఉన్న వ్యక్తీ ఒకరు రావడం జరిగింది . వచ్చి రావడంతోనే "అయ్యా ఇక్కడ, కనపడకుండా పారిపోయిన వాళ్ళ , జాడ కనిపెడతరంటగా " అని అడిగే సరికి , మొదటి కేసు ఏదో మిస్సింగ్ పర్సన్ కేసు తగిలందుకుని "అవును" , అన్నాడట  ఔత్సాహిక డిటెక్టివ్ . దానికి ఆ ఆసామి "బ్బాబ్బాబు ! మీకు పుణ్యముంటుంది . వారం రోజుల నుంచి నా గాడిద కనపడటం లేదు . వెతికి పెడితే "చచ్చిమీ కడుపున పుడతా " అని అంటుoటే   తెల్ల ముఖం వేసాడట ఆ కొత్త డిటెక్టివ్ . మన రాష్ట్రం లో పోలిస్ వారు నిర్వహిస్తున్న కొన్ని డ్యూటి లు చూస్తుంటే ఈ కదే గుర్తుకు వస్తుంది . విషయం ఏమిటంటే ,

    సికింద్రాబాద్ జీడిమెట్ల పోలిస్ స్టేషన్ పరిది లోని జగద్గిరి గుట్ట మగ్దూం నగర్ ఏరియాలో ప్రైవేట్ ఎలేక్త్రిశియన్ గా పని చేస్తున్న శ్రీదర క్రాంతి కుమార్ ,అతని బార్య స్రవంతి తమ కుమార్తె తో కలిసి ఉంటున్నారు . ఈ 18  న బార్య భర్తలకు ఏదో గొడవ వచ్చి , ఆతను బార్య మిద అలిగి కుమార్తెను తీసుకుని ఎటో వెళ్ళిపోయాడట . సాదారణంగా ఎవరైనా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతే, సంబందితుల కోరిక మేరకు మిస్సింగ్ కేస్ గా డైరి నమోదు చేసి అన్ని పోలిస్ స్టేషన్ లకు సమాచార మిస్తారు . అదే కిడ్నాప్ కేస్ అయితే పోలిస్ ప్రత్యెక టీం లతో సెర్చ్ లు నిర్వహించి , నిందితులను అరెస్ట్ చేసి , కిడ్నాప్ కు గురయిన వారిని సంబందితులకు అప్ప చెపుతారు . ఇది పద్దతి .

   అయితే పై కేసులో విచిత్రంగా తన కూతురిని తీసుకువెళ్ళిన తండ్రి మిద జగద్గిరి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసారట . పిల్ల విషయంలో తల్లి తండ్రి మద్య గొడవ ఉంటె ఎవరి కస్టడిలో పిల్ల ఉండాలి అనేది కుటుంభ న్యాయస్తానాలు తెలుస్తాయి . అంతే కాని , నేచురల్  గార్డియన్ అయిన తండ్రి కూతురును , తల్లికి తెలియకుండా తీసుకువెళ్ళినంత మాత్రానా అది కిడ్నాప్ నేరం క్రిందకు ఎలా వస్తుందో , అసలు తండ్రి మిద FIR ఎలా నమోదు చేసారో అ పోలిసులకే తెలియాలి . ఈ  కేసు కోసం ఉన్న పనులు పక్కన పెట్టి , డోర్నకల్ , భద్రాచలం లో పోలిస్ బృందాలు వెతుకులాట మొదల పెట్టారట . అది తెలిసిన క్రాంతి కుమార్ తన కూతురుతో సహా పోయి జగద్గిరి పోలిస్ స్టేషన్లో లొంగి పోయాడట.  రేపు ఇదే కేసులో తండ్రిని కిడ్నాపర్ గా చూపిస్తూ కోర్టులో ప్రవేశ పెడతారేమో ! ఇది నేను పేపర్లో వచ్చిన వార్తా ఆదారంగా ప్రస్తావిస్తున్న అంశం . నాకు తెలిసి ఇలా కేసు పెట్టి ఉంటె మాత్రం అది ఇల్లీగల్ .

  సరే ఏది ఏమైనా మొగుడు పెళ్ళాల పనికి మాలిన పంచాయతి కోసం ఇంత శ్రద్ద చూపిన పోలీసులు జగద్గిరిలో ఉండగా , విజయవాడలో మాత్రం గాంగ్ రేప్  కు గురై , దారుణంగా మృగాల్ల చేతిలో హత్యకు గురి అయిన హిమబిందు అనే ఇల్లాలి కేసులో మాత్రం ఎ మాత్రం పట్టించుకోకుండా , పిర్యాదు చేసిన వారినే అవమానిoఛి  ఘోర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు విజయవాడ పటమట పోలీసులు . ఈ  రోజు విజయవాడలో విద్యార్ది సంగాలు పోలిసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, మ్రుగాల్లను ఉరి తియాలంటూ ఆందోళన చేస్తున్నారు . ఇదే విషయమై ఇంతకూ ముందు ఇదే బ్లాగులో పెట్టిన టపా కోసం క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడండి .

అవమానకర దర్యాప్తుతో ఇల్లాలి ని అనుమానించి, మాజీ న్యాయ మూర్త్రి చేతనే కంట తడి పెట్టించిన "పటమట పోలీసులు " http://ssmanavu.blogspot.in/2014/03/blog-post_18.html


   ఇలా ఒకే డిపార్ట్మెంట్ కు చెందిన ఆంద్ర ప్రదేశ్ పోలిస్ , ఒక చోట, పనికి మాలిన విషయాలకు అతి శ్రద్ద చూపి , కాలాన్ని,ప్రజల  డబ్బును దుర్వినియోగం చేస్తుంటే , ఇంకొక చోట అతి ప్రాదాన్యత ఉన్న కేసులను పట్టించుకోకుండా , ప్రజలలో ఒక అభద్రతా బావం కలిగేలా చేస్తున్నారు . దీనిని సరి చేయాల్సిన అవసరం ఉంది . పోలిస్ వ్యవస్తను తక్షణమే ప్రక్షాళన చేసి , ప్రజలకు జవాబుదారిగా ఉండేలా తీర్చి దిద్దవలసిన గురుతతర బాద్యత రానున్న కొత్త రాష్ట్ర ప్రబుత్వాల మిద ఉంది .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన