రావణుడు చేత చెరచబడిన "రంభ "ల సంతానమా ఈ రచయితలంతా!!!?

                                                                         


                              చరిత్ర లేక ఏదైనా ఒక ఇతిహాసం మీద పరిశోదన చేసేవారికి నిక్ష్పాక్షిక ద్రుష్టి ఉండాలి. అలాంటి దృష్టితో పరిశొదనలు చేసి తమ అభిప్రాయాలను వెలిబుచ్చితే , వారు చెప్పే మాటకు కొంత విలువ వుంటుంది. అంతే కాని పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్న వారికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లు, మనసులో ఒక బావం ముద్ర వేసుకుని , అదే బావం తో చరిత్రలను లేక ఇతి హాసాలను పరిసీలిస్తే , వారి మనసుల్లో పాతుకుపోయిన బావాలే అందులో కనపడతాయి తప్పా, వేరు రకంగా కనపడడానికి అవకాశమే లేదు. ఎవరికీ ఇష్టం వచ్చిన రీతిలో వారు రామాయణ , మహాభారతాలను విశ్లేషించే  స్వేచ్చా  స్వాతంత్ర్యాలు , ఈ దేశ రాజ్యాంగం తన పౌరులకి ఇచ్చింది కాబట్టి, ఎవరి రంగు కళ్ళ జోళ్ళు వారు పెట్టుకుని , వారికి కనిపించే విదంగా వారు విశ్లేషిస్తున్నారు . మరి నేను కూడా నా జోడు దరించి రామాయాణాన్ని పరిశీలిస్తే  ఈ   క్రింది విదంగా అనిపించింది.

                                 రామాయణం అనేది భారతదేశం లో మెజార్టీ  ప్రజలు యొక్క ఆరాదనీయ గ్రందం. దానిని రచించించినది వాల్మీకి అనే మహర్షి గా మారిన   ఒక బోయ వాడు.ఈ   దేశం లో దళితులూ రాసేదంతా దళిత సాహిత్యమే  అని అనుకున్నట్లు   అయితే రామాయణం కూడా  మొట్టమొదటి దళిత సాహిత్యమే అవుతుంది.అప్కోర్స్ అప్పటికి దళిత అనే పదం లేదనుకోండి. కొంత మంది పరిశొదకులు ప్రకారం ,విష్ణువు , ఇంద్రుడు అనే వారు ఆర్య రాజులు అంట. అయితే అర్యులును గుర్తించాలంటే బండ గుర్తు ఏమిటంటె , వారిలో ఎక్కడా నలుపు అనేది ఉండదు అంట . మరి ఈ రూల్  అప్ప్లై చేసినప్పుడు ఇంద్రుడు ఆర్యుడు అవుతాడు కాని, నల్లగా ఉన్న విష్ణువు కాని అయన అవతారాలు కాని ఆర్యులు ఎలా అవుతారు? 

                  రామాయణo  లో    హీరో రాముడు నల్లని వాడు. కాబట్టి దళిత రూల్ ప్రకారం రాముడు ఆర్యుడు కాడు అని డంకా బ జాయించి చెప్పవచ్చు. రామాయణ కాలం నాటికే రాజవంశ ముఖ్యులలో  నల్లటి వారు , ఎర్రటి వారు అన్నదమ్ములుగా ఉన్నారు అంటె , అప్పటికే ఆర్యులు , అనార్యులు కలిసిపోయిన మిశ్రమ సమాజం ఏర్పడి ఉండాలి లేదా ఆర్యులు అనార్యులు అనే విభజన సిద్ధాంతమే తప్పుడుది అయి ఉండాలి . అటువంటప్పుడు రామాయణ కాలం నాటికే సమాజం లో ఉనికిలో లేని  ఆర్య, అనార్య బేదాలు వారికి ఆపాదించి ,వక్రద్రుష్టితొ విశ్లేషణలు చేయడం సరి కాదు. నా ఉద్దేశ్యం ప్రకారం రామాయణ మహా కావ్యం యొక్క ఉద్దేశ్యం మానవ ధర్మాలను, అందులో బాగంగా రాజ ధర్మాలను గురించి చెప్పడమే కాని, అప్పటి రాజుల మద్య వైషమ్యాలు , యుద్దాలు గురించి చెప్పడం కాదు. 

                                 రామాయణo  అంటె రాముడు నడిచిన దారి అని అర్దమ్. ప్రతి మనిషి కి రాముడు నడచిన విదానం యొక్క ఆవశ్యకత ,విశిష్టతను  తెలియచేయడమే  రచయిత అయిన వాల్మికి మహర్షి ఉద్దేశ్యం అయి ఉండాలి . రాముడు పుట్టుక మొదలు ప్రాణ త్యాగం వరకు ఒక పద్దతి ప్రకారం జరిగింది. ఇందులో పితృ దర్మం , పుత్ర దర్మం, బ్రాత్రు దర్మం ,పతి ధర్మం, సతి దర్మం, రాజధర్మం , సేవక ధర్మం, ఇలా చాలా ధర్మాలు గురించి చాలా చక్కగా  వివరించిన గ్రంధం రామాయణం .  అధికారాలకంటె  రాజులకు ధర్మరక్షణె ముక్యమని ప్రబోదించిన మహా కావ్యమ్. రాముడు తన తల్లితండ్రులకు "మనువు " (వైవాహిక ) పద్దతిలో జన్మించిన వాడు కాబట్టి , అవతార పురుషుడు అయినా  "మనుజుడై " మానవ ధర్మాన్ని పాటించాడు . తండ్రి మాట కోసం కానలకేగి అష్ట కష్టాలు పడ్డాడు . సతి పతులు అంటే  వేరు  వేరు  శరీరాలతో ఉండె ఏక మనస్కులు అని , ఒకరికి ఒకరు సుఖ దుఃఖాలలో తోడు నీడగా ఉండటమే నిజమైన దాంపత్యం అని నిరుపించటానికే అవతార మూర్తులైన ఆ దంపతులు అరణ్యవాసం చేసారు. సతి పతుల మద్య అన్ని బందాలు కంటె ప్రేమ బందమే గొప్పదని రుజువు చేసారు. ప్రజా వాక్కు కు వెరచి  సీతమ్మను అడవులకు పంపినా నిత్యం ఆమె విరహః వేదనలో బాదపడ్డాడే  కాని , మరొక స్త్రీని కన్నెత్తి చూడలేదు శ్రీ రాముడు.  ఈ విదంగా రామాయణం మొత్తం పరిసీలిస్తే "ఏక దంపతి వివాహ o " విశి ష్టతను  తెలియచేయడమే  వాల్మీకి ఉద్దేశ్యo  అనిపిస్తుంది.  
          
                 ఇకపోతే ఇందులో విలన్ కారెక్టర్ చూదాం .. విలన్ రావణాసురుడు . అతడి పుట్టుకే సరి అయిన పుట్టుక కాదు. అతని తల్లి కైకసి కేవలం సంతాన కాంక్షతో , ఒక బ్రాహ్మణుడిని చేరి , అతని వలన దశ కంటుడికి జన్మనిస్తుంది . అంటే రావణుడిది  "మనువేతర జన్మ" . కాబట్టి అతడు మనుజుడు కాడు. రాక్షస స్త్రియో , క్షత్రియ స్త్రియో , తల్లి కేకసి ఎవరైనా, తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ కూడా , రావణుడు పుట్టిన విదానం కాని, పుట్టిన ఘడియలు కాని కరెక్టు కానందున , జన్మతః బ్రాహ్మణుడైనా , రాక్షస గుణాలను పుణికి పుచ్చుకుని రాక్షసుడైనాడు. రాముడు నడిచింది ఒక పద్దతి ప్రకారం ఉంది కాబట్టి , తన హీరో పేరు మీద అది కావ్యానికి :రామాయణమ్ " అని పేరు పెట్టాడు వాల్మీకి . కొందరు అంటున్నట్లు  రావణుడే  ఇందులో హీరో అయితే  ఈ  కావ్యానికి  రామాయణం  పేరు బదులు "రంకాయణమ్ " అని పేరు పెట్టాల్సి వచ్చేది. 

                             నిజమే మరి! రావణుడు పుట్టుక మొదలు చచ్చిందాక అయన నడిచిన దారే అది. అతడు వెళ్లే దారిలో అతను చేసిన ఘనకార్యాలు ఏమిటి ?  కనపడిన  అందమైన స్త్రీల నల్లా చెరచడమే అతడి పని. మగాళ్ళను చంపడం, అడాళ్ళను చెర్చడం ఇదే అతడికి తెలిసిన ధర్మమ్. అందులో ఆ  జాతి , ఈ  జాతి అని ఏమి లేదు, కంటికి నచ్చినది ఎవరైనా సరే చెరబట్టి నాశనమ్ చేయాల్సిందే. అందులో దేవ జాతికి చెందిన రంభ కూడా ఉందట. ఇలా దేవ, దానవ, ముని, మానవ స్త్రీలు చెరచబడుతుంటె , ఆ రాక్షసుడు  నడచిన దారి అంతా హాహాకారాలతో అల్లాడుతుంటే  , వాడిని చంపటానికి అవతారపురుషుడు  రావడం  అవసరం కాదా? దానికి ఆర్య , అనార్య గొడవలుకి సంబందం ఎమిటి?   అటువంటి శాడిస్ట్ , రేపిస్ట్ ను పట్టుకుని అయన మా మూలపురుషుడు, మా జాతి రత్నం, అని చెప్పుకోవడానికి  కొంచం అయినా బిడియ పడాల్సిన పనిలేదా? పంచభూతాలను కంట్రోల్ చేయగలిగిన విజ్ఞాన వేత్త  అయినా  సరే పంచేద్రియాలను కంట్రోల్ చేసుకోలేక పోతే , చరిత్ర హీనుడు అవుతాడు అని రావణ చరిత్ర  ద్వారా చాటి చెప్పిన ఇతిహాసమే రామాయణం. రామాయణ కర్త ఉద్దేశ్యం గ్రహించకుండా, అందులో పరమ కర్కోటక , రేపిస్ట్ ను పట్టుకుని "అయన మా తాత. , మేమంతా అయన వారసులం" అని చంకలు గుద్దుకునే రచయితలను చూసి ఏమనాలో అర్దం కావటం లేదు. బహూశా రావణుడు చేత చెరచబడిన రంభల తాలూకు వారసులు కాబోలు ఆయన్ని హీరోగా చేసి రచనలు చేస్తున్న వారంతా! తాత ఎంత దుర్మార్గుడైనా , తమలో ఉన్నది  కూడా అయన DNA కాబట్టి , ఆ అభిమానం ఒలక బోస్తున్నట్లుంది. పాపం! రావణుడు  రంభలనే కాదు, చివరకు అయన వారసుల మెదళ్ళ ను  కూడా చెఱచి  వేసాడు. 


    ఏది ఏమైనా రావణాసురిడి గురించి ఎంత పాజిటివ్ గా చెపితే అంతగా లాభపడేది శ్రీ లంక టూరిజం డిపార్త్మెంట్. ఈ  మద్య వారు  రావణాసురుడి  ఆనవాళ్ళు గురించి తెగ ప్రచారం చేస్తూ , అదిగో గద, ఇదిగో కాలిజాడ అని టూరిస్ట్ లను తెగ ఆకర్షిస్తూ  తమ ఆదాయం పెంచుకుంటున్నారు అట. మన దేశం లోని రావణ భక్తులు అంతా వారిని సంప్రదిస్తే , వారి టూరిజం శాఖలో మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వవచ్చు. అలా తమ తాత  ఘన త ను కీర్తిస్తూ హ్యాపీగా లంకలో గడిపేస్తే పోలా !ఇక్కడ ఉండి హిందువుల మనో బావాలు  గాయపరచే రచనలు చేసే కంటె అది బెటర్ కదా!

                                             (16/10/2015 Post Republished). 
       
   

Comments

  1. "చరిత్ర లేక ఏదైనా ఒక ఇతిహాసం మీద పరిశోదన చేసేవారికి నిక్ష్పాక్షిక ద్రుష్టి ఉండాలి"
    అద్భుతమైన మాట చెప్పారు. ఇవ్వాళ చరిత్ర వ్రాసేవారికి, చరిత్ర మీద పరిశోధన చేస్తున్నామని అనుకునేవారికి కాని సామాన్యంగా ఉండేది చైనా దృష్టి అదే ఎర్ర దృష్టి లేదంటే వామపక్ష దృష్టి. అలాంటివాళ్ళు నిస్పక్షపాతంగా ఉండటం అనే విషయం అసాధ్యం.

    ReplyDelete
    Replies
    1. నిజం చెప్పారు.మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  2. వామపక్షం అనేది కూడా ఒక మతమే. వారిదృష్టిలో వామపక్షేతరులంతా తప్పుడుదారిలో పోతూ మానవజన్మలను వ్యర్థం చేసుకుంటూన్నవాళ్ళేను. తప్పుడు మతాల్లో ఉన్నందుకు అవశ్యం దండనీయులని ప్రతిమతం వారూ‌ ఎలా భావిస్తారో అలాగే వామపక్షమతస్థులూ తమదే సత్యదృష్టీ సమ్యక్‌దృష్టీ అని ఇతరులది అసత్యబుధ్ధీ అపసవ్యబుధ్ధీ అనీ‌ భావిస్తారు. అలా వాదిస్తారు. వింత ఏమీ లేదు.

    ReplyDelete
    Replies
    1. పేపర్ లో మొన్నీ మధ్య ఒక వార్త చూసాను.సి.పి.ఎం పార్టీ అగ్రనేత ఒకరు, తాము నాస్తికులు ఆయినప్పటికి తమ పార్టీలో అత్యధికులు ఆస్తికులు అయినందు వలన వారి మనోభావాలు గ్రహించి అందుకు అనుగుణంగా మెలిగి ఉంటె ,తమ పార్టీ ప్రజలకు దూరం అయ్యేది కాదని వాపోయారు.దీనినే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు.గమ్మతు ఏమిటంటే సీపీఎం నాయకుడు ఈ మాట అన్న కొద్ది రోజులకే సిపిఐ అగ్రనేత తిరుమల వెళ్లి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చారు.ఇన్నాళ్లు గ్రామాల్లో వామపక్ష భావజాలం అంతో ఇంతో మనుగడలో ఉందంటే అందుకు వెనుకటి నిజాముల నియంతృత్వ ప్ఒకదలకు పాత తరం నాయకులు చేసిన కృషి ఒక కారణం కాగా ,ఆధికారం కోసం అన్న కాంగ్రెస్ లో ఉంటె.జనం మీద పట్టు కోసం తమ్ముడు కమ్యూనిస్టు పార్టీలో ఉండడమే మేలు అని భావించే కొన్ని సామజిక వర్గాల వారి ఆలోచన వలననే తప్ప వారి నాస్తిక భావజాలానికి ప్రజలు ఆకర్షితులు అయినందు వలన మాత్రం కాదు.

      Delete
  3. https://twitter.com/Swamy39/status/801612421873840128

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన