తాగిన మత్తులో తాళి కట్టిన ఇల్లాలిని చంపితే , ప్రభుత్వం పైన్ కట్టాల్సిందే నట !

                                                                         

ఇన్నాళ్ళు  "మద్యం" ఆదాయపు మత్తు తలకెక్కి , ప్రజల సంసార జీవన స్తితిగతులను పట్టించుకోని ఆంద్ర ప్రదేశ్ సర్కార్ కు రాష్ట్ర హై కోర్టు వారు చాచి లెంపకాయ ఒకటి కొట్టారు . మొన్న వారు ఇచ్చిన తీర్పు స్పూర్తి తో , తెలుగువారిలో ఏమన్నా తెలివి వచ్చి , ఇక నుంచి  రాష్ట్ర ప్రభుత్వ మద్యo  పాలసి వల్ల  బాదితులైన కుటుంబాలు కోర్టులను ఆశ్రయిస్తే , మద్యం అమ్మకాలు వలన రాష్ట్ర ప్రబుత్వానికి వచ్చె ఆదాయం కంటే , బాదితులకు చెల్లించే నష్ట పరిహారాల మొత్తమే ఎక్కువుంటుంది . "సాహెబ్ గారి సంపాదన బేగం గారి మందుల ఖర్చుకు చాలవు" అన్నట్లు తయారవుతుంది రాష్ట్ర ఖజానా పరిస్తితి. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రబుత్వాల పరమావధి కావాలి అనే విషయాన్ని రాష్ట్ర సర్కార్ కు గుర్తు చేస్తూ , హై కోర్టు వారు ఇచ్చిన ఈ  తీర్పు ఆహ్వానించ తగినది మరియు ఆలోచించ తగినది .

  వరంగల్ జిల్లా అర్పనపల్లికి చెందిన ఘనపురపు రవి , రాష్ట్ర ప్రభుత్వ "మద్యం పాలసి " కి మెచ్చి ,  మద్యం దుకా ణానికి డైలీ  రెగ్యులర్ కష్టమర్ అయ్యాడు . మద్యం అమ్మకాలు లో వృద్ది కోసం కష్ట పడి పనిచేసి ,  మద్యం అమ్మకాలు పెంచుతున్న ఎక్సైజ్ అధికారులకు బహుమతులు ప్రకటిస్తున్న , తెలుగునాడు సర్కార్ ను చూసి , ఆనందం తట్టుకోలేక పుల్ గా మందు కొట్టి మరి రోడ్డు మీద దొర్ల సాగాడట . పండుగల వేళ పన్నెండింటి దాక అయినా  సరే ,మద్యం దుకాణాలు  తెరిపిoఛి ఉంచి , ప్రజల కు ఆనందం సరపరా చేస్తున్న గవర్నమెంట్ ను చూసి , ఇక తట్టుకోలేక అసలు ఇంటికి రాకుండా , దుకాణం దగ్గరే మకాం పెట్టేసాడు అట .

    మందు కొడితే సర్కార్ కు లాభం కాబట్టి , సర్కార్ కి ముద్దు . కాని  సంసారం గడవడానికి పైసలు తెచ్చె మొగుడు , అలా ఇంట్లో పైసలన్ని కాజేసి , సర్కారి లైసెన్స్ దుకాణానికి ఇచ్సుస్తుంటే , ఏ  ఇల్లాలు మ్మాత్రం ఓర్పు వహిo చగలదు ? అటు ఒళ్ళు ,అందుకే  ఇటు ఇల్లు గుల్ల చేస్తున్న రవి ని నిలదీసింది  అతడి భార్య , అంతే ! కోపం తో బయటకు పోయి పుల్ గా మందు కొట్టి , ఇంటికి వచ్చి భార్య ను గొంతు నులిమి చంపాడట . ఆ  పై కిరోసిన్ పోసి ఆమెను దహనం చేసాడట . ఈ తతంగం అంతా బిక్కచచ్చి చూస్తున్న రవి  6 యేండ్ల కొడుకే  మహబూబాబాద్ ట్రయిల్ కోర్టులో సాక్ష్యం చెపితే , దాని ఆదారంగా అతనికి ట్రయిల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విదించింది . ఈ తీర్పు  అన్యాయమని , హై కోర్టులో అప్పీల్ చేసిన రవి వాదనను తిరస్కరిస్తూ హై  కోర్టువారు జస్టిస్ L .నరసిoహ్మారెడ్డి , జస్టిస్ M .S .K జైస్వాల్ గార్లతో కూడిన ధర్మాసనం క్రింది కోర్టు తిర్పునే ఖరారు చేస్తూ తీర్పును ఇచ్చారు . ఈ సందర్బంగా కోర్టు వారు రాష్ట్ర ప్రబుత్వ సర్కార్ యొక్క మద్యం విదానాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు .
   
    " ప్రభుత్వం అనుసరిస్తున్న అసాంఘిక మద్య విదానంతో ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి . ముక్యంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు మద్యం రక్కసి కోరలుకు బలి అవుతున్నాయి .కొర్తుల్లొ దాఖలైన క్రిమినల్   అప్పిళ్ళ కేసుల్లో ఎక్కువ శాతం మద్యంతో ముడి పది ఉన్న కేసులే . ఈ  కేసులో సైతం మద్యానికి బానిసైన భర్త భార్యను హత్య చేయడం వలన ఆమె పిల్లలు ఆదారం కోల్పోయారు . దీనిలో రాష్ట్ర  ప్రభుత్వబాద్యత కూడా ఉంది  కాబట్టి, చనిపోయిన  ఆమె పిల్లలు ఇద్దరికీ తలా 2 లక్షలు రూపాయల చొప్పున, రాష్ట్ర ప్రభుత్వం  , బ్యాంకులో పిక్సిడ్ డిపాజిట్ చేయాలి " అని హై కోర్టు తీర్పులో పేర్కొన్నారు .

   కాబట్టి ఇకనైనా , మద్యం బాదిత కుటుంబాలు , ఏదైనా జరుగ రానిది , మద్యం వలననే జరిగినప్పుడు, ప్రభుత్వాన్ని బాద్యులు గా చేస్తూ ,  కోర్టుల  తలుపు తడితే తప్ప కుండా వారికి నష్ట పరిహారం ఇప్పించడానికి పై తీర్పు ఉపయోగ పడుతుంది .కనీసం ఇలాగైనా ఎక్కువ కేసులు ప్రబుత్వాన్ని బాద్యులుగా చేస్తూ , దాఖలైతే , అప్పుడన్నా ప్రజల జీవన స్తితి గతులును పట్టించుకునే ఆలోచన చేస్తుందేమో .  నా దృష్టిలో బలహీన వర్గాలకు రాజ్యాదికారం ఇవ్వడమంటే , అ యా సామాజిక వర్గాలలో ఎవరో ఒకరిని "ముఖ్య మంత్రి " చేయడం కాదు , వారిలోని తాగుడు  అలవాటును ను మాన్పించ గలిగితే , రాజ్యాధికారం గురించి వారే పోటి పడగలరు . లేకుంటే సింహాసనం మిద ఎ సామాజిక వర్గపు వారిని కూర్చో పెట్టినా , బలహీన వర్గాలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు .
      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన