కుర్రాళ్ళతో కడుపులు పండించుకోవటానికి , ఇండియాకి ఎగబడుతున్న అమెరికా అమ్మమ్మలు !!!

                                                                   
ముదురు ప్రేమికురాలు , లేత ప్రేమికుడు 
           

మన పల్లేటూళ్ళలో ఆవులు లేక బర్రెలు ఎదకు వచ్చినప్పుడు , రైతులు వాటిని తీసుకు పోయి గిత్తలతొ లేక దున్న లతో కలిపి తద్వారా కలిగే దూడలు వలన  పశు సంతతిని అభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది. దీని కోసం సదరు  గిత్త లేక దున్న కలిగి ఉన్న యజమానికి "కలయిక " కు ఇంత అని డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పశువుల ఆసుపత్రుల్లో పశువుల సెమెన్ బ్యాంక్ లు ఉన్నాయి కాబట్టి , కృత్రిమ గర్బాధారణ చేయిస్తున్నారు. దానికీ అఫిషియల్ గానో అనఫిషియల్ గానో అంతో ఇంతో ముట్టచెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన సైన్స్ పుణ్యమా అని ఇలాంటి కృత్రిమ గర్బోత్పత్తి ప్రక్రియలు మనుషులకు కూడా అందుబాటు లోకి వచ్చాయి . అలా అందించేవే "ఫెర్టీలిటీ సెంటర్ " లు. అయితే ఈ  విదానం లో డబ్బు బాగానే ఖర్చు అవుతుంది.డు

   అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంతాన సాఫల్య కేంద్రాలు ద్వారా పిల్లల్ని పొందాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుండడం వలన , అక్కడి స్త్రీలు కొందరు , ముఖ్యంగా  నడి వయసు వారు ఇండియాకి వచ్చి తక్కువ ఖర్చులో , సహజ పద్దతుల్లో సంతానం పొందుతున్నారు . దానికి వారు అవలంభించే పద్దతి  "ఫేస్ బుక్ లవ్". ఇటువంటి వారి వలన ఇప్పుడు ఇండియాకి "లవ్ టూరిజం " ఎక్కువైంది అంటా . ఇది ఎలా జరుగుతుందో ఉదాహరణ లతో సహా చెపుతాను. 

మెడికిల్ ఫీల్డ్ లో అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్న నడివయసు మహిళలు  తమకు పిల్లలు పుట్టించే సత్తా ఉన్న ఆరోగ్యవంతులు అయిన భారతీయ యువకులు కోసం ఫేస్ బుక్ లో వేట మొదలు పెడతారు . ఎవరైనా నిరుపేద యువకులు , కంటికి నదురుగా ఉన్నవారు కంటబడితే , వారితో  అచ్చిక బుచ్చిక లాడి వారిని లైన్ లోకి దించుతారు. గమ్మత్తు ఏమిటంటే ఇలాంటి కేసులలో స్త్రీలు 40 యేండ్లు పైబడిన వారు అయితే , యువకులు మాత్రం 20 నుండి 23 యేండ్లు లోపలి వారే ఉంటున్నారు . 

                                                                         

                   

                              అలా వారి మధ్య  గాఢానుబందం ఏర్పడాక ఒక ఫైన్ మార్నింగ్ ఆ అమెరికా అమ్మమ్మ విమానం ఎక్కి తన కుర్ర ప్రియుడి దగ్గరకు వస్తుంది. వారిద్దరూ వీర ప్రేమికులు మాదిరి పోజులు కొడుతూ తాము వివాహం చేసుకుని ఒకటి అవుతాం అంటే సాదారణంగా ఇండియా పేరెంట్స్ ఒప్పుకోరు కాబట్టి, వారిని అమెరికా అమ్మమ్మ తన డబ్బుతో నోరు మూయిస్తుంది. ఇటూ కుర్రాడికి తన ముదురు ప్రేమ తో పాటు కట్న కానుకలు బాగా ఇవ్వడం వలన , ఆమెను శాస్త్రోక్తంగా  పెండ్లి చేసుకుని  జాం , జాం అని హనీమూన్ వెలగపెడతారు. దానితో ఆమెకు కడుపు రావడం, పిల్ల నో, పిల్లాడినో కనడం జరిగి పోతాయి. ఆ తర్వాత ఆమె తన కూతురు లేక కుమారుడు తో అమెరికా వెళ్లి పోయి , ఇక్కడి కుర్ర మొగుడితో తనకున్న అనుబందాన్న్ని లీగల్ గానే తెంచేసుకుంటుంది . దీని వలన ఆమెకు అమెరికా లో సంతాన సాఫల్య కేంద్రాలు ద్వారా పొందే సంతానం కి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే చాలా తక్కువ ఖర్చు తోనే సంతానం పొందుతుంది కాబట్టి , ఈ  లవ్ టూరిజం వలన అటూ కురాడితో  హానిమూన్ , ఇటూ తక్కువ ఖర్చుకి పిల్లలు పొందుతున్నారు. 

  ఇక్కడ నాకున్న అనుమానం ఏమిటంటే ఐ ఫేస్ బుక్ లవ్  ప్రక్రియే అందరి విషయం లో కామన్ గా ఉంటుంది కాబట్టి దీని వెనుకాల ఒక పెద్ద మాఫియా ఏజెంట్లు  ముటాయే ఉన్నట్లు కనపడుతుంది. ఆ ఏజెంట్లే  ఇక్కడి కుర్రాళ్ళు వారి తల్లి తంద్రులతో ముందుగానే మాట్లాడుకుని, అమెరికా లోని అమ్మమ లకి క్లియర్ సిగ్నల్ ఇస్తే వారు ఇక్కడికి వచ్చి పై తతంగం నడుపుతున్నారు. కుర్ర్రాడితో పెండ్లి తాత్కాలికమే కాబట్టి కాసులకు ఆశపడిన కుర్ర్రాడి తల్లితండ్రుల పేదరిక దౌర్బాగ్యం ఈ  భూటకపు పెండ్లికి O.K  అనేలా చేస్తుంది. ఫేస్ బుక్ లవ్వు , గాడిద గుడ్డూ అని వారు చెప్పే కహానిలు  ఇవ్వన్నీ ప్రజల్ని, చట్టాల్ని ఏ మార్చే ప్రక్రియలె. వీరి మద్య పెండ్లిళ్ళు చేయడం ద్వారా పుట్ట బోయే పిల్లలను అమెరికా తీసుకు వెళ్ళడానికి చట్టపరంగా ఏ విదమైన అడ్డంకులు లేకుండా పోతున్నాయి. ఇటువంటి నీచపు కార్యక్రమాలకు "ప్రేమ అనంతమైనది" అని , దానికి వయసుతో పనిలేదని, ప్రేమికులకు ఎల్లలు లేవని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ , వారి పోటొలతో కూడిన ప్రేమ చరిత్రను ప్రచారం చేయడం ద్వారా , సదరు ఏజెంట్లు తమ "లవ్ టూరిజం " ని మూడు పువ్వులూ , ఆరుకాయలుగా వర్దిల్లిలేలా చేస్తున్నారు. కావాలంటే ఇలాంటి ఒక అమెరికా అమ్మమ్మ , ఇండియా కురాడి ప్రేమ కధను గురించి ఫేస్ బుక్ లో ఎలా వర్ణించారో ఈ లింక్ లో చూడండి 

    ఆమె పేరు ఎమిలి అంత. వయసు 41 సంవత్సరాలు. అమెరికాలో ని మోంతానా లో హెల్త్ కో ఆర్డినేటర్ గా పని చేస్తుంది. ఇండియాలోని హితేశ్ చావడా అనే గుజరాత్ కుర్రాడిని ఫేస్ బుక్ లో చూసి మనసు పారేసుకుంది అంట. వెంటనే కురాడితో లవ్ ఛటింగ్ మొదలు పెట్టి, కొన్నాళ్ళు గడిచే సరికి ఇక ఆగ లేక విమానం ఎక్కి వచ్చేసింది. విచిత్రం ఏమిటంటె వచ్చిన రీజే పెండ్లి చేసుకుంది. ఐ అమెరికా అమ్మామ్మ వయసు , ఆవిడ గారి ఇండియన్ అత్త అంటే హితేశ్ తల్లి  వయసు  ఇంచూ మించు ఒకే లాగుంది. కావాలంటే ఫోటోలో చూదండి. ప్రస్తుతం వారిద్దరూ హనీ మూన్ లో ఉన్నారు. వీరిద్దరి అమర ప్రేమ గురించి ఎంతో గొప్పగా ప్రచారం జరుగుతుంది. అయితే వీరి లవ్ విషయం లో నాకు అనుమానం కలగడానికి ప్రదాన కారణం సేమ్ ఇలాంటి లవ్ స్టొరీయే  హర్యానా కుర్రాడి  విషయం లో జరిగింది. దాని గురించి విపులంగా ఇదే బ్లాగులో   అమెరికా అమ్మమ్మను మనువాడిన 25 ఏండ్ల ఇండియా పేస్ బుక్ ప్రెండ్ !  టపా పెట్టాను . కావాలంటే చూడండి. ఈ రెండు ప్రేమ కధలలో ఉన్న సారుప్యత వలననే "ఫేస్ బుక్ లవ్ మ్యారేజి " లు మాటున అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీని వలన లక్షలు చేతులు మారుతున్నాయని అనుమానం కలుగుతుంది. 

                                                                             
హితేశ్ తల్లితో అమెరికా కోడలు 


                 కాబట్టి ఈవిషయమ్ లో భారత ప్రభుత్వం వారు ఒక దర్యాప్తు సంస్త ద్వారా విచారణ చేస్తే ఈ ముదురు- లేత ప్రేమ వ్యవహారాలలో ఉన్న సీక్రేట్స్ బట్ట బయలు కాగలవు. మితిమీరిన ఆదునిక మానవ స్వేచ్చకు తార్కాణం ఈ  అనైతిక సంతాన ప్రక్రియలు. దీనిని  ఎల్లలు లేని ప్రేమ అనే బదులు బరి తెగించిన ఆదునిక సంస్క్రుతి అనడం సబబు. పైన తెల్పిన జంతు సంతాన సాపల్య ప్రక్రియకి , దీనికి పెద్ద తేడా ఏముంది? భారతీయ చట్టాలులో ఉన్న లొసుగు లు ఆదారంగా నడుస్తున్న ఈ  భూటకపు  ప్రేమ పెండ్లిళ్ళను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక రకమైన సంతాన చౌర్యం . ఇందులో ఎక్కువ శాతం బాగస్వాములుగా ఉన్న యువకులు హిందువులే. అరోగ్యవంతులైన హిందూ యువకులు ద్వారా సంతానం పొంది , అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆ పిల్లల్ని  అన్యమతస్తులుగా పెంచితే , చివరకు వారినే  తిరిగి భారత దేశానికి "మత మార్పిడులు " చేయటం కోసం తన జన్మ దాత స్తలాలకు పంపితే.జరిగే అనర్దం ఎంత ఉంటుంది ? ఇప్పటికే హిందూ జనాభా రేటు తగ్గిపోతుందని ఆందోళనలు చేస్తున్న హిందూ సంస్తలు ఐ విషయం గురించి ఎందుకు సీరియస్ గా తీసుకోవటం లేదు. ? 
                                                                         
మరొక ముదురు ప్రేమ 
                                                                 

        విదేశియుల్ని వివాహమాడే విషయాలలో భారతీయ చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే భవిష్యత్ లో భారతీయ యువకులు  విదేశి వనితలకు   సంతానం సమకూర్చే " సెమెన్ బ్యాంక్ " లుగా తప్పా మరెందుకూ పనికి రాకుండా పోయే ప్రమాదముంది. డబ్బులకు విర్యదానం చేసే యువతలో  కలిగే అనైతిక ప్రవర్తన వలన సమాజం లో అనేక దుష్పరిణామాలు ఎర్పడతాయి. చివరకు విదేశి మహిళా టూరిస్ట్ లకూ లేక గే టురిస్టులకు పనికి వచ్చే  వారు మగ వ్యభిచారులుగా మారినా ఆశ్చర్య పోనవసరం లేదు. బవిష్యత్ లో అలా జరుగకుండా   దినిని నిరోదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Comments



  1. కడుపున పంటలు పండన
    ముడుపుల తోడను జిలేబి ముద్దుగ వచ్చెన్
    విడిచెను జూడన్ విటుడిని
    బుడిబుడి నడకల బుడతడు బుట్టన్ చట్టన్ :)

    ReplyDelete
    Replies
    1. నేను నాలుగు పేరాలలో చెప్పిన దాని సారాంశాన్ని కేవలం నాలుగు పంక్తులలో లోనే చక్కగా, చమత్కారంగా చెప్పారు! Superb !

      Delete
  2. chaalaa jaagrattagaa gamanimchi melkonakapote pramaadame

    ReplyDelete
    Replies
    1. అవును దుర్గేశ్వర గారు! కుటుంభ నియంత్రణ విషయం లోను మన నాయకుల ముందు చూపు లేని తీరు వలన జరిగిన నష్టం ఏమిటో అందరికి తెలిసిందే.చివరకు ఒక స్వామిజి ప్రతి హిందూ స్త్రీ నలుగురు పిల్లలని కనాలని చెప్పే పరిస్థితి హిందువులకి.చంద్ర బాబు లాంటి సెక్యులర్ నాయకుడు కూడా పరోక్షంగా హిందూ జనాభా పుట్టుక రేటు తగ్గిపోవడం మీద ఆందోళన వెలిబుచ్చాడు అంటే పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.అదే కుటుంబ నియంత్రణ పథకం ని అందరికి నిర్బంధంగా అమలు చేసి ఉంటే ఇలాంటి అభద్రతా బావ పరిస్థితి ఉండేది కాదు కదా.మరి ఇప్పుడు ఈ అమ్మమ్మ ల ఫేస్ బుక్ ప్రణయ వివాహాలు వలన భవిష్యత్జ లో జరిగే అనర్థాలు గమనించక పొతే ఖచ్చితంగా హిందూ జాతి మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన