సీక్రెట్ పెండ్లాం కోసం కట్టుకున్న భార్యనే రంపం తో 4, 5 ముక్కలు చేసిన గుల్బుద్దిన్ !!

                                                                          


                            మానవ సంబందాలు ఎంత దారుణంగా తయారు అయ్యాయో తెలిపే ఉదహరణ ఉదంతం  ఇది.  తనను పెండ్లి చేసుకుని , 18 యేండ్లు కాపురం చేసి , తన బిడ్డకు తల్లి అవటమే కాక ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న తన భార్యకు ఆ భర్త ఇచ్చిన ప్రతిపలం ఏమిటో తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది . ప్రపం చం లో మనిషి అనే వాడు చేయని పని చేసాడు ఆ నీచుడు. భార్యను గొంతునులిమి చంపి , రంపం తో 5 ముక్కలుగా కోసి గొనె సంచిలో వేసి ఎవరూ చూడని ప్రాంతం లో పడవేసాడు. మరి ఇదంతా ఎందుకు చేసాడయ్యా అంటె మరొక ఆడదాని కోసం. స్త్రీకి స్త్రీయే శత్రువు అని నిరూపించే కేసులలో ఈ  కేసు కూడా  ఒకటి. వివరాలు లోకి వెలితే :

    గుల్బుద్దిన్ అనే వ్యక్తీ తన భార్య పుల్లు బేగం తోను, 16 యేండ్ల కుమార్తె తోను దక్షిణ డిల్లిలోని ఆయ నగర్ లో ఉంటున్నాడు . గుల్బుద్దిన్ వ్రుత్తి  వంట చేయడం. అతనికి 40 యేండ్లు కాగా భార్యకు 36 యేండ్లు . గుల్బుద్దిన్ కు తన భార్య మీద మొహం మొత్తిందో ఏమో ,భార్యకు తెలియకుండా అస్సాం లో మరొక ఆవిడను సిక్రెట్ గా పెండ్లి చేసుకుని ఎంజాయి చేయడం మొదలు పెట్టాడు. "16 ఏండ్ల కూతురు ఉన్న ఓల్డ్ లేడి తో అక్కదేమి సుఖ పడతావు, అక్కడ ఉన్నదంతా అమ్ముకుని అస్సాం వస్తే ఇక్కడ ప్రణయ గీతాలు పాడుకుంటూ ఎంజాయి చేయొచ్చు " అని ఆ సీక్రెట్ పెండ్లాం చెప్పినట్లు ఉంది , భార్యను విడాకులు ఇచ్చి వేయమని వత్తిడి చేయటం మొదలు పెట్టాడు అంట. అంతే కాదు చంపుతాను అని మాటి మాటికి బెదిరిస్తూ ఉండండం తో , ఆమె తనకు ప్రాణ హాని ఉందని ఇరుగుపొరుగు తో చెప్పడం కూడా జరిగింది అంట. 

    గుల్బుద్దిన్ డిల్లీలోని తన ఇంటిని అమ్మ చూపటం తో భార్యా బిడ్డ ఎదురు తిరిగారు. దానితో ఎలాగైనా సరే తన భార్యను చంపాలి అని నిర్ణయానికి వచ్చినట్లు ఉంది , పోయిన  గురువారం  తన కుమార్తె నిద్ర పోయాక , భార్యతో గొడవ పెట్టుకుని ఆమెను గొంతు నులిమి చంపాడు . ఆ తర్వాత ఒక రంపం తో ఆమె శవాన్ని 5 ముక్కలు చేసి , ఒక గోనె సంచిలో కుక్కి , జన సంచారం లేని ప్రాంతానికి తీసుకువెళ్ళి పడ వేసి , మల్లీ ఏమి తెలియని వాడిలా వచ్చి పడుకున్నాడు. తెలారిన తర్వాత కూతురు "అమ్మ ఏది నాన్నా " అని అడిగితె తనకు తెలియదు అన్నాడు. కూతురి ని తన సెల్ స్విచ్ అప్ చేసుకో అని చెప్పడం తో ఆమెకు అనుమానం వచ్చి , తనకు తెలిసిన ఆమె ద్వారా , తండ్రికి తెలియకుండా ఫుల్లు బేగమ్ కనపడటం లేదని "మిస్సింగ్ కేస్ " రిజిస్టర్ చేయించడం తో పోలిసులు రంగం లోకి దిగారు. 

   పోలిస్ విచారణ లో మొదట తన కేమి తేలియదు అని  బుకాయించినా, వారి విచారణ పద్ధతులకు తట్టుకోలేక చేసిన దారుణమైన వేదవ పని చేప్పేశాడు గుల్ బుద్దిన్ . తన సీక్రెట్ పెండ్లాంతొ అస్సాం లో సుఖపడాలనే ఉద్దేస్యం తో దిల్లీలోని ఇల్లు బేరానికి పెడితే , భార్యా అడ్డగించడం వలన ఆమెను చంపి ముక్కలు చేసాను అని చెపుతున్న గుల్బుద్దిన్ ను చూసి పోలిసులు నివ్వెరపోయారు అంట. ఆ తర్వాత శవం ముక్కలు పంచనామా, గుల్బుద్దిన్ రిమాండ్ ఇవ్వన్నీ  మాములే. అన్యాయం అయింది ఫుల్లు బేగమ్, మరియు తల్లిని కోల్పోయిన  కూతురు.  అక్కడ అస్సాం లో ఉన్న సీక్రెట్ పెండ్లానికి గుల్బుద్దిన్ పోతే మరో సీక్రెట్ మొగుడు దొరుకుతాడు. పెండ్లాన్ని చంపిన గుల్బుద్దిన్ కు ఉరిశిక్ష ఖాయం కావచ్చు. ఒక ఆడదాని అక్రమ పొందు కోసం ఇంత దారుణానికి తెగబడ్డ గుయ్ల్బుద్దిన్ కుటుంబం చివరకు అనాద అయింది. అదీ  కధ . 

  ఈ కద వలన తెలిసేది ఏమిటంటే "అక్రమ సంబందం కోసం అస్సాం వెళ్ళే కంటే ,  సక్రమం గా ఉన్న చోటే సంసారం చేసుకుంటే  మేలు" అని.  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అమ్మ తనాన్ని అవమాన పరచిన ఇద్దరు "అప్రాచ్యపు " తండ్రుల ముద్దుల కొడుకు ను చూసి మురిసిపొతున్న "గే ప్రపంచం" !