విద్యార్దినులను రోల్ నంబర్ల వారీగా రేప్ చేయించిన మహిళా వార్డెన్ !!!

                                                                     
           


                            మనం చిన్నప్పుడు స్కూల్లో చదివిన పాఠాల్లో ఎల్లప్పుడూ గుర్తుకు వచ్చే పాఠం  "సింహం -కుందేలు " కధ .టూకీగా కదా సారాంశం ఏమిటంటె " ఒక అడవిలో సింహం ఒకటి ఉండెది. అది ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు విచక్షణా రహితంగా జంతువులను చంపి తింటుంటే , అడవిలోని జంతువులు అన్నీ సమావేశం అయి ఒక తీర్మానం చేసి , దానికి ఆ మృగ రాజును కూడా ఒప్పించాయి. సదరు తీర్మానం ప్రకారం రోజుకొక జంతువు ఆ సింహానికి ఆహారంగా వెళ్లి సింహం ఆకలి తీర్చాలి. దీనివలన విచ్చలవిడి జంతు వేట ఆగిపోతుంది. సింహానికి వేటాడే బాధా తప్పుతుంది. అలా ఒక రోజు ఒక చిన్న కుందేలు వంతు వస్తే అది తెలివిగా ఉపాయం ఒకటి ఆలోచించి సింహం వద్దకు కావాలనే లేటుగా వెళుతుంది . ఆకలి మీద కోపం తో ఉన్న సింహానికి , తన ఆలస్యానికి ఒక కట్టు కద చెపుతుంది. తను సింహం దగ్గరకు వస్తుంటే వేరొక సింహం అద్దగించిందని , దాని బారి నుంది తప్పించుకు రావడం వలన ఆలస్యం అయిందని చెప్పగా , ఆ సింహం ఎక్కడుందో చూపించమంటె , సరే అని చెప్పి ఆ తెలివి తక్కువ సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకు వెళ్లి , లోపల ఉంది చూడు అనడం, సింహం లోపలికి చూసి నీటిలో కనపడుతున్న తన ప్రతిబింబాన్నె మరొక సింహం గా బావించి , దానీ మీద యుద్దం కోసం బావిలోకి దూకి మరణించడం జరుగుతుంది. ఆ తర్వాత అడవిలో జంతువులు ఆన్ని కుందేలు ను కొనియాడతాయి.

      మన దేశం లో ఉన్న ఏ స్కూల్లొ అయినా ఈ  కదని ఇలాగే చెప్పి "ఉపాయం తో అపాయం " ఎలా తప్పించుకోవాలో పిల్లలకు నేర్పుతారు. కాని జార్కండ్ రాష్ట్రం లోని గొడ్డా జిల్లలోని ఒకానొక కస్తుర్భా గాంధీ ఆశ్రమ పాఠశాలలోని  మహిళా వార్డెన్ గా పని చేస్తున్న బిజిలి కుమారి అనే ఆమె మాత్రం తన హాస్టల్లో ఉంటున్న విద్యార్దినులకు కధను గుర్తుకు తెచ్చేలా ప్రాక్టికల్స్ చేయించింది. అదెలా అంటె 

     కధలో మృగ రాజు లాంటి మ్రుగాళ్ళ వద్దకు  తన హాస్టల్ విద్యార్దినులను రోల్ నంబర్ వారిగా రాత్రిళ్ళు పంపేది అట. ఆక్కడ ఆ అమాయకపు పిల్లలు మీద మ్రుగాళ్ళు లైంగిక దాడి చేసి తమ కామ వాంచను తీర్చుకునే వారట. ఆ పిల్లల ను వార్డెన్ తనే స్వయంగా తీసుకు వెళ్లి మ్రుగాళ్ళకు అప్పచెప్పేది అట. దానికి ప్రతిపలంగా ఆమే ఏమి పొందేదో ఆ భగవంతుడికే తెలియాలి. అలా రోల్ నంబర్ లు ప్రకారం అందరూ బలి పశువులు అవడం వలన విషయం బయటకు పోక్క లేదు. ఆ పిల్లలకు గర్భం రాకుండా పిల్స్ కూడా ఇస్తారట.అలా ఒక అమ్మాయికి గర్బం వస్తే ప్రస్తుతం వార్డెన్ గా పని చేస్తున్న కల్యాణి చతుర్వేది అనే అవిడ ఆ అమ్మాయికి పిల్స్ ఇచ్చిందట.  కాని ఆ అమ్మాయి కి పిల్స్ పని చేయక అరోగ్యం దెబ్బతినడం తో తల్లితండ్రులకు కబురు పంపారట. దానితో  తో బెంబేలెత్తిన ఆ పిల్ల తల్లి తండ్రులు హాస్పిటల్ కి ఆ అమ్మాయిని  అడిగే సరికి , వార్డెన్ బాగోతం బట్ట బయలు అయింది.  దాని తో ఆ తల్లి తండ్రులు పోలిస్ కేసు పెట్టడం తో , "రోల్ నంబర్ ల ప్రకారం రేప్" లు చేయించిన ఆ మహిళా వార్డెన్ చేసిన ఘనకార్యాలు మీద ఒక మహిళా పోలిస్ అధికారిని నియమించి విచారణ చేయిస్తున్నారట పోలిసులు. అయ్యా అదీ కద!  

    పై వాస్తవ సంఘటణ లో అత్యాచారం చేసింది పురుషులే అయినా , వారికి సంపూర్ణంగా సహకరించి , ఆడపిల్లలను రోల్ నంబర్ ప్రకారం వారి వద్దకు పంపింది ఒక స్త్రీ . వారీకి గర్బం వస్తే కాది చప్పుడు కాకుండా అబార్షన్ అయ్యేలా మాత్రలు సరపరా చేసింది మరొక స్త్రీ. "స్త్రీకి  స్త్రీయే శత్రువు "  చేసి చూపారు ఈ దుష్ట  మహిళా వార్డెన్ లు. ఇలాంటి వారు సమాజం లో ఉండబట్టె అమాయకపు ఆడపిల్లలు ఎంతో మంది మ్రుగాళ్ళ కామానికి బలి అవుతున్నారు. రేప్ చేసిన వారికి అంగ చేధనమ్ , వారికి సహకరించిన వారిక శిరచేధనమ్ చేస్తే తప్పా ఈ  ఘోర  కృత్యాలు కట్టడి కావు. అనుకుంటా . 



Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన