బ్రహ్మం గారి కాలజ్ఞాన వాక్యాలను నిజం అని నిరూపించిన "పనామా పేపర్స్ లీక్ ".



                             ఇండియా  నోస్టర్ డామస్ గా పేరు గాంచిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారు చెప్పిన కాలజ్ఞాన వాక్యాలు నిజం అయ్యాయి అని తెలుగు ప్రజలు చాలా మంది నమ్ముతున్నారు. అయన గారు చెప్పిన కాలజ్ఞానం ని బ్రహ్మం గారి మఠం వారి తోపాటు కొంత మంది రచయితలూ గ్రందాల రూపం లో అచ్చు వేయించి ప్రజలకు అందించారు. బ్రహ్మంగారు చెప్పినవాటిలో కొన్నింటిని పరిసిలిస్తే మనకూ చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ  నాటి కాలం లో కనపడుతున్న ఎన్నో వస్తువులు బ్రహ్మం గారి కాలం నాటికి ఉనికిలో లేకపోనప్పటికి వాటి గురించి అయన గారు తన కళ్ళకు కనిపించిన విదంగా చెప్పడం , అచ్చం అవి అలాగే ఈ  నాడు జరుగుతుండడం  అద్బుతం అని చెప్పవచ్చు. ఉదాహరణకు "రెక్కల కోడి వచ్చును , దాని రెక్క విసురుకు లక్ష మంది చచ్చును " అన్న కాల జ్ఞాన వ్యాక్యం అచ్చుగుద్దినట్లు ఈ  నాటి బాంబర్ విమానాల పోలికకు సరిపోతుంది. యుద్దాల నెపం తో బాంబర్ విమానాల రెక్కల నుండి కురిసే బాంబుల దాడికి వేలాది మంది ప్రజలు చనిపోవడం విన్నాము,కన్నాము .

                                                           


   అలాగే నిన్న ప్రపంచ దేశాలను ప్రకంపనాలకు గురిచేసిన International Consortium of Investigative Journalists (ICIJ)    వారి రహస్య పత్రాల వెల్లడి గా చెప్పబడుతున్న  "పనామా పేపర్స్ లీక్ " ద్వారా ప్రపంచ ప్రజలకు దిమ్మ తిరిగే నిజాలు బహిర్గతం అయ్యాయి. ఇన్నాళ్ళు ప్రజల చేత  ఆదర్సవంతులుగా  కీర్తించబడిన 12 దేశాల అద్యక్షులు , మాజీ అద్యక్షులు , ఒక్క సారిగా "దోపిడి దొంగలుగా " వారి  నగ్న స్వరూపం ని పనామా పేపర్స్ ఆవిష్కరింప చేసాయి. వీరితో పాటు ప్రపం చ వ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు , వ్యాపారవేత్తలు , సినిమా స్టార్లు , మాఫియా డాన్ లు ఉన్నారట. వీరంతా తమ తమ దేశాల్లో ప్రబుత్వాలకు టాక్స్ లు ఎగవేయడం కోసం కానీ, లేక అక్రమార్జనను  గుట్టు చప్పుడు కాకుండ వెరే చోట్ల దాచుకోవడం కోసం  కాని , నల్ల దనం ని విదేశాలకు తరలించి అక్కడి కంపెనీలలో పెట్టుబడులు పెట్టి తమ పాపాన్ని అభివృద్ధి చేసుకుంటున్నరట. వెరే వారి విషయం కాసేపు అటుంచితే  దేశాది నేతలకు సైతం ఈ అక్రమ దోపిడి -దాపిడి లో బాగస్వామ్యం ఉండటం ప్రజాస్వామ్య దేశాల ప్రజలను నివ్వెర పరుస్తుంది. మరి దీనికి , బ్రహ్మం గారి కాల జ్ఞానం కి ఏమిటి సంబందం అంటున్నారా ? అదే చెప్పబోతున్నాను. 

 బ్రహ్మం గారు తన కాలజ్ఞానం లో "చోరులు పాలకుల రూపం లో ఉంటారు " అని స్పష్టంగా చెప్పారు. అంటే దొంగలు పాలకులుగా రాజ్యపాలన చేస్తూ ప్రజలను దోపిడి చేస్తూ , బందిపోటుల్లాగ తమ సంపదలను రహస్య ప్రాంతాలలో ఉంచుకుంతారు అని అర్దం. కరెక్టుగా అలాగే జరిగింది కదా . 12 మంది దేశాద్యక్షులు అందులోనూ రష్యా లాంటి దేశాల అద్యక్షులకే ప్రత్యక్షంగా ఇందులో బాగం ఉందంటె ఎంత సిగ్గు చేటు. చైనా లో అవినీతి సంపాదనకు శిక్ష ఏమిటో తెలుసా? ఉరిశిక్ష ! మరి సాక్షాత్తు ఆ దేశ  పొలిట్ బూరో సబ్యుడి కుమార్తె  అక్రమార్జనకు పాల్పడింది అంటె సామాన్య  జనాలకు కమూనిస్ట్ చైనా నాయకులు ఇచ్చే నైతిక సందేశం ఏమిటి? ఒక రకంగా ప్రపంచ దేశాలు లోని ప్రజలు  " మానసిక రోగుల "చేతికి పాలనా పగ్గాలు అప్ప చెప్పి , వారే తమ నాయకులు అని కీర్తిస్తున్నారు. అవసరాలకు మించి సంపాదించడానికి ఆబగా ప్రజల సొమ్ము దోచుకోవడం, దాచుకోవడం  అనేది తప్పకుండా ఒక మానసిక రోగమే. దొంగలను కింగ్ లు చేసే దౌర్బాగ్యం ఒక్క ప్రజా స్వామ్య వ్యవస్థ లో తప్పా మరెక్కడా సాద్యం కాదు అనుకుంటా . అసలు ప్రజలను పాలించడానికి కావల్సింది "ప్రజా నాయకులా ? లేక ప్రజా సేవకులా? . ప్రజా నాయకులు , ప్రజాసేవకులు మద్య ఉన్న తేడా ఏమిటొ తెలుసుకోవాలంటే ఇంతకు ముందు ఇదే బ్లాగులో నేను రాసిన టపా చదివితే తెలుస్తుంది. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన