లక్ష మంది విద్యార్దులు మరియు వారి తల్లి తండ్రులు Vs ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వము

                                                                
 
                                                              

   జులై రెండవ తారీకు దాక ఏ మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేది లేదన్న బారత సర్వోన్నత న్యాయస్తానం హఠాత్తుగా నిన్న "నీట్’ పై వెలువరించిన మద్యంతర ఉత్తర్వులతో, ఆంద్రప్రదేశ్ లోని లక్షమంది వైద్య విద్య ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రుల ను పెద్ద "నీట్" గండం నుంది బయట పడేసారు. లేకుంటే గత నాలుగు నెలలుగా ఏమి చదవాలో, ఏమి రాయాలో తెలియని ఆయోమయ పరిస్తితిలో విద్యార్థులు, వారు పడుతున్న టెన్షన్ చూసి, బాదతో తల్లడిల్లిన తల్లితండ్రులు మరియు మనసున్న లెక్చరర్లు అందరూ మరొక రెండు నెలలు టెన్షన్ కు గురి కావల్సి వచ్చేది. అసలు ఇలా జరగడానికి కారకులు ఎవరు?.

   వైద్య విద్యా విదానంలో జాతీయ స్తాయిలో ఒక సమగ్ర విదానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా బారత వైద్యమండలి, జాతీయ స్తాయిలో" నీట్" పరీక్షను తప్పని సరి చేస్తూ, ఈ సంవత్సరం నుండే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో,ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ విద్యార్దులకు గుండెల్లో రాయి పడింది. కారణం వారు "నీట్" కు సంబందించిన సిలబస్ చదవక పోవడమే. గత మూడేళ్లుగా ఈ విషయం గురించి చెపుతున్నా అన్ని విషయాలకు వలేనే ఇ విషయంలో కూడ మన సర్కార్,మొద్దు నిద్ర పోతూ విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యడంతో, సుమారు లక్షమంది విద్యార్థుల బవిష్యత్తు గందరగోళంలో పడినట్లయింది. దీని మీద మేదావులు విద్యావేతలు, తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చెయ్యడంతో ఒక్క సారిగా మొద్దు నిద్ర నుండి లేచి, స్వయంగా ముఖ్య మంత్రిగారే, ఈ సంవత్సరం వరకైనా "నీట్" నుండి మినాహింపు ఇవ్వాలని, బారత వైద్య మండలికి లేఖ రాస్తే అది సుప్రీంకోర్ట్ వారి నిర్ణయమని దానికి తాము చెయ్య గలిగింది ఏమి లేదని వారు చేతులెత్తే సరికి, ఒక్కసారిగా ప్రబుత్వం తెల్ల ముఖమేసింది. ఇటువంటి పరిస్తికి తామే కారణమని తప్పు తెలుసుకుని మినాహింపు కొరకు సుప్రీంకోటు వారిని ప్రాదేయపడగా వారు ముందు అటూ "నీట్" ఇటూ "ఎంసెట్" రెండు పరీక్షలు నిర్వహించమని, పలితాలు మాత్రం తాము చెప్పే దాక వెలువరించవద్దని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

   దీనితో అటు కొన్నాళ్ళు "నిట్" అని కొన్నాళ్ళు "ఎంసెట్" అని వస్తున్న పుకార్లను నమ్మి, నాలుగురోజులు దానికి నాలుగు రోజులు దీనికి తయారు అవుతూ విద్యార్థులు ఏది సరిగా చదవలేక పోయారు. ఇటూ నీట్ పరీక్ష కోసం ఎంట్రెన్స్ పీజ్  "వేయి" రూపాయలు వసూలు చేసిన ప్రబుత్వం మాత్రం సుమారు ఎనబై వేళ మంది విద్యార్థుల నుండి "ఎనిమిది కోట్ల" రూపాయలు వసూలు చేసింది. ఎర్రని ఎండల్లో జరిగిన నీట్ పరీక్ష అటు తల్లితండ్రులకు వ్యయ ప్రయాసలు మిగిలిస్తే, ఇటు విద్యార్థులకు అంతులేని టెన్షన్ మిగిలించింది. చివరకు అది రద్దు కావడంతో ఊపిరి పీల్చుకున్నా, గత ఐదునెలలుగా పడిన పిల్లల టెన్షన్ వారి ఆరోగ్యాల మీద ఎంతటి దుష్పరిణామాలు చూపాయో వారిని దగ్గరిగా పరిశిలించిన వారికి మాత్రమే తెలుస్తుంది.

   ఇలా పిల్లల జీవితాలతో ఆటలాడిన ఈ సర్కార్ నిర్లక్ష్య దోరణికి సుప్రీం కోర్టు వారు తగిన విదంగా గుణపాటం చెప్పేటట్లు తుది తీర్పు ఇస్తే బాగుంటుంది.భవిష్యత్తులో ఇటువంటి విదానాలు పునరావ్రుతం కాకుండా ఉంటాయి.             

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన