తెలంగాణా రాజ్యానికి ఇదే సరి అయిన అధికారిక చిహ్నం !

                                                                       


నూతనంగా ఏర్పడే తెలుగువారి నూతన రాష్ట్రం "తెలంగాణా " కి అధికార చిహ్నం ఎలా ఉండాలి అనే దాని మిద తర్జన భర్జనలు జరగటం , రెండు వర్గాలకు చెందిన ప్రజలు తమ తమ జాతి  గోప్పదనాలను ప్రతిబింబించే చిహ్నాలు ను అధికారిక చిహ్నాలుగా ఉంచాలని కోరడంతో , చివరకు K.C.R గారు ఆ  రెండు వర్గాలు ప్రజలను సంతృప్తి పరచే ఉద్దేశ్యంతో కాకతీయుల తోరణం పెద్దగానూ , చార్మినార్  ను చిన్న గాను , వాటి పైన భారత అధికార చిహ్నం మూడు సింహాల సహిత అశోక చక్రo  తో పాటు త్రిబాష లలో తెలంగాణా పేరు ఉండేటట్లు అధికార చిహ్నానికి ఓ.కే. చెప్పినట్లు తెలుస్తుంది . ఒక లౌకిక రాజకీయ నాయకుడిగా K.C.R గారు చేసింది అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచే చర్యే అయినా , "సూర్యమండలం " గా పేరు గాంచిన కాకతీయ రాజ్య ప్రాంతం అయిన తెలంగాణా రాష్ట్రం కి సూర్యుని చిహ్నం అధికార చిహ్నం లో  లేక పోవడం ఖచ్చితంగా లోటే అని చెప్పవచ్చు .

   పూర్వపు  కాకతీయ రాజులు అందరూ సూర్యారాధకులే . అసలు కాకతీయ సామ్రాజ్యO ఆ సూర్య భగవానుడి వర ప్రసాదితం . అందుకే హనుమకొండ వేయి స్తంబాల గుడిలో విష్ణు రుద్రులతో పాటు సూర్య రాధాన చేసారు అ నాటి రాజులు . అ నాడె కాదు నేటి తెలంగాణా అభివృద్ధి చెందాలన్నా అ సూర్య శక్తి అవసరం ఎంతైనా ఉంది . సూర్య శక్తిని నమ్ముకున్న సౌరాష్టియులు (గుజరాత్ ), నేడు ఎంతో అభివృద్ధి చెందడమే కాక , అ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేసిన అభివృద్ధి పనులకు భారత ప్రజలు ముగ్దులై ఆయనకే దేశ రాజకీయ సారద్యం అప్పచెప్పారు అంటే అయన సాగించిన సూర్యారాదనే . మరి సౌరాష్ట్ర తో పాటు సూర్య మండల ప్రాంతంగా గుర్తింపు పొందిన తెలంగాణా కి అధికార చిహ్నం లో సూర్యుడు లేక పోవడం దురదృష్ట కరం . చార్ మినార్ చరిత్ర కేవలం నాలుగు వందల నాటిది . దానిని హైదరాబాద్ నగరానికి అధికారిక గుర్తింపుగా ఉంచినా అంతర్జాతీయ గుర్తింపు పొందుతూనే ఉంటుంది . కాబట్టి K.C.R  గారు మరొకసారి ఈ విషయంలో ఆలోచన చేసి సూర్యుని చిహ్నం అది కారిక చిహ్నం లో ఉండేలా చూడాలి

   ఇంతకూ ముందే కొంత మంది సూర్య సహిత కాకతీయ కళా తోరణం ని అధికారిక చిహ్నంగా ఉంచమని కోరడం జరిగింది .దాని తాలూకు చిత్రమే పైన ఉన్న చిత్రం . తెలంగాణా రాష్ట్ర ఉజ్జ్వల బవిష్యత్తు కు సూర్య దేవుని(సోలార్ ఎనర్జీ ) అనుగ్రహం తప్పని సరి .
     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన