పవన్ కళ్యాణ్ గారు అన్నది, పక్కాగా నిజం అనిపిస్తుంది !!

                                                                 


                                                       
                                            పవన్ కళ్యాణ్ ! సిని హీరో ! జనసేన అధినేత! లక్షలాది అభిమానుల అరాద్యుడు కాబట్టి నేటి ప్రజాస్వామ్య వ్యవస్తకు పనికివచ్చేవాడె . కాకపోతే NTR లా దీటైన వాయిస్ లేకపోవడం తో పాటు , పదిమందిని చూసి సిగ్గుపడే మనస్తత్వం చిన్నప్పటనుండి కలిగిఉండడం చేతో , ఏమో కాని , మీడియా తో మాట్లాడేటప్పుడు సగం మాటలు మింగేస్తూ తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. మాటలు మింగినా , తన మనసులో ఉన్నది మాత్రం దైర్యంగా, మొహమాటం లేకుండా  చెప్పేస్తూ ఉంటాడు కాబట్టి  , అయన గారి ప్రెస్ మీట్ కు కూడా అంతో ఇంతో ప్రాదాన్యత ఇవ్వక తప్పదు. 

    మొన్న కాపు నాడు వారు నిర్వహించిన సభలో , టపాసులు లాంటి మాటలు తూటాలు పేల్చి , కుల ప్రజలను రెచ్చగొట్టగలిగే  ప్రసంగాలు చేయగలిగిన   కాపు సామాజిక నాయకులు  ఎవ్వరూ లేరు. కాని ఆశ్చర్య కరంగా ఒక్క సారిగా కాపులు అంతా రైల్ పట్టాల మీదకు వెళ్లి , అప్పుడె వస్తున్న "రత్నాచల్ ఎక్సప్రేస్ " ని ఆపుచేయడమే కాక సదరు రైలు మొత్తాన్ని తగుల పెట్టారు అంటె , అది మామూలు పని కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు "ఇటు వంటి విద్వంసకర మైన పనిని , ఎంతొ ప్రీ ప్లాన్డ్ గా ప్రొపెషనల్స్ మాత్రమె చేయగలరు " అని అన్నది. ఇది నిజం కావచ్చు. ఎందుకంటె 

      నిజంగా కాపు యువత లో రిజర్వేషన్ ల కోసం ప్రభుత్వం తో తాడో పేడో తేల్చుకోవాలన్న తత్వమే ఉంటె అది కేవలం "రత్నాచల్ దహనం " తో చల్లారదు. రావణ కాష్టం లా మండుతూనే ఉండెది. ఇంకా ఎన్నో ప్రాంతాలలో ఇలాంటివి జరుగుతునే ఉండెవి. కాని వారి ఉప్పెన ఆవేశం తాటాకు మంటలా చల్లారి పోయింది అంటే , అది కేవలం పోలిస్ వారు  తీసుకున్న చర్యల మూలంగానే అంటె నమ్మడం కష్టమే . ఊరు అంతా కాలిపోయాక పైరింజన్లు  వచ్చినట్లు , జరగాల్సిన నష్టం జగిపోయాక , తెల్లారి ఎప్పటికో కాని రాపిడ్ ఆక్షన్ పోర్స్  రాలేదు. కాబట్టి తమకు అప్ప చెప్పిన అసైన్మెంట్ పూర్తి చేసేసి విద్వంసకులు నింపాదిగా వెళ్ళిపోతే , బిత్తరపోయిన ప్రబుత్వ వర్గాలు  తేరుకోవడానికి  ఒక రోజు పట్టింది. అసలు రైళ్ళు తగలబెట్టడం వలన ఎవరికీ లాభం?  ఇలాంటి ఆకస్మిక ద్వంస రచన వలన రిజర్వేషన్ లూ సిద్దిస్తాయి అని రాజకీయ జ్ఞానం ఉన్న ఏ నాయకుడు అనుకోడు . పైపెచ్చు ఇలాంటి పనులు వలన సమాజం లో కాపుల పట్ల వ్యతిరేకత ప్రబలె అవకాశం ఉంది. కాబట్టి సాంప్రదాయ ప్రజాస్వామ్యా పద్దతిలో డిమాండ్ లు సాదించే వారెవ్వరూ ఇలాంటి వాటిని ప్రొస్తాహించరు . మరి ఎవరి ప్రోత్సాహం తో ఈ  దహనాలు జరిగాయి? 

     భారత దేశం లో ఈ  మద్య "అసహన వాదం " ఎక్కువైంది. అలాగే ఆంద్ర ప్రదేశ్ లో కూడా "అసహన వాదం "
ఉంది . కాకపోతే ఇండియాలో ఉన్నది సాంప్రదాయ విదానాలను వ్యతిరేకించే  అసహనం అయితే , ఆంద్ర ప్రదేశ్ లో ఉన్నది అధికారం కోసం అర్రులు చాచే అసహనం. రాజ్యాంగం లో , ఎన్నుకోబడిన ప్రభుత్వాల పదవీ కాలం 5 సంవత్సరాలు  కాక, 2 సంవత్సరాలు ఉంటె , పాపం "రత్నాచల్ ఎక్స్ప్రెస్ " కు మంటల్లో మాడి పోయే దురవస్ట  ఉండేది  కాదనుకుంటా . కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు నోటుకు కేసులో అధికార పక్షాన్ని ఇరికించినా , చివరకు ఇద్దరు ముక్యమంత్రులు కలిసిపోయి, కేసు అటక ఎక్కింది. పోన్బి ఎలాగో ఓపిక పడదాం అనుకునే వారికి , ఇంకా 3 యేండ్లు వేచి చూడాలి అంటే , అంత ఓపిక , సహనం ఉండెంత రాజకీయ పరిజ్ఞానం లేదాయే. మరి ఏమి చేయాలి. ? సింపుల్! సినిమాల్లో మాదిరి ఎవరో ఒకరిని ప్రేరేపించి విద్వంసాలు స్రుష్టించడమే. తద్వారా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని కులదొయడమె .  దానికి ఒక బలమైన వర్గం సపోర్ట్ అవసరం కాబట్టి , వారికి కాపు రిజర్వేషన్ అంశం మదిలో మెదిలి ఉంటుంది . అందుకే లక్షలాది ప్రజల సమీకరణ. కాపు ఉద్యమం మాటున రైలు, పోలిస్ వాహనాల దహనాలు జరిగి ఉండె అవకాశాలు ఎక్కువ. 
 

     అలాంటి అధికార అసహన వాదుల బ్యాక్ గ్రౌండ్ ను  దృష్టిలో పెట్టుకునే "పవన్ కల్యాణ్ " గారు పై విదంగా వ్యాక్యానించి ఉండవచ్చు. అంద్రా రాజకీయాలు , విద్వంసం జరిగిన తీరు గమనిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నది పక్కాగా నిజం అనిపిస్తుంది. ఒక వేల అదే నిజం అయితే అంద్రా లో రాబోయే 3 సంవస్తరాలలో ఇంకెన్ని విద్వంసాలు జరుగుతాయో! 

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన