'స్త్రీ స్వేచ్చ' తో మొదలై 41 నెలల కాలం లో 5 లక్షలు వీక్షణములు సాధించిన "మనవు " బ్లాగు !!

                                                                     

సెప్టెంబర్ 6, 2012 న  "మనవు " బ్లాగు ప్రారంభించబడినది . అంటే సరిగ్గా  41  నెలలు దాటింది . ఈ 41  నెలల కాలంలో సుమారు 900 పై ఛిలుకు టపాలు ప్రచురించడం జరిగింది.మొదటి టపా పేరు  'స్త్రీ స్వేచ్చ'.900 టపాలలో లలో  కొన్ని బంపర్ హిట్ ఐతే , కొన్ని ఫట్ అయినవి. విచిత్రం ఏమిటంటె నేను హిట్ అవుతాయి అనుకున్నవి వీక్షకుల ను ఆకట్టుకోకపోవటం  అలాగే వీటినేమి చదువుతారులే అనుకున్నవి, బాగా ఆదరణ పొందటం. ఎలాగైతేనేమి 41 నెలల కాలంలో  మనవు బ్లాగు 5 లక్షల వీక్షణములు సాదించడం ఘన కార్యం కాక పోయినా , సంతోషం కలిగించే విషయమే . ఈ చిరు  సంతోషం ని  మీతో పంచుకుందామనే ఈ ప్రత్యేక ప్రస్తావన .

  
మనవు వీక్షణముల చరిత్ర 

 "మనవు" ప్రారంభించిన  తేదీ :-        6-9-2012

1,00,000 వీక్షణములు పొందినది :-   9-9-2013 

2,00,000 వీక్షణములు పొందినది :-   18-2-2014 

4,00,000 వీక్షణములు పొందినది :-    9-8-2015  

            5,00,000 వీక్షణములు పొందినది :-   18-2-2016         

  మొదటి లక్ష వీక్షణము లు సాదించడానికి ఒక సంవత్సర కాలం పట్టినా , రెండవ లక్ష కు చేరువ కావడం  5 నెలల కాలం లో సాద్యమైంది  . . మద్యలో కొన్నాళ్ళు బ్లాగు లో టపాలు రాయడం కుదరనందున  18 నెలల కాలానికి గాను  మరో 2 లక్షలు వీక్షణములు  పొంది 4 లక్షలకు చేరడం జరిగింది. తిరిగి 6 నెలల కాలం లో లక్ష వీక్షణములు పొంది నిన్నటికి మొత్తం 5 లక్షల వీక్షనములు పొందింది "మనవు " బ్లాగు. అంటె ప్రస్తుత ఏవరేజ్ రన్నింగ్ రేట్ సంవత్సరానికి 2 లక్షలు అన్న మాట. నేను నా బ్లాగు పోస్టులు ప్రచురించడం ద్వారా తెలుసుకున్న సత్యం ఏమిటంటె , వీక్షకులను ఆకర్షించేది బ్లాగుకు ఉన్న పేరు  కాదని , బ్లాగులో ప్రచురించిన టపాలలో ఉన్న సరుకు మాత్రమే అనేది . అందుకే ఎంత గొప్ప బ్లాగు అయినా తరచుగా మన మనసులోని బావాన్ని  వీక్షకులు మెచ్చే  రీతిలో  రాస్తూ ఉంటె తప్పా , మనుగడ ఉండదు. బ్లాగు నిర్వహణ  అనేది ఒక యజ్ఞం . బ్లాగులను నిర్వహించే వారంతా ఆధునిక రుషులు అని నా అభిప్రాయం. ఎందుకు అనేది వేరే టపాలో వివరంగా చెపుతాను. ఈ రోజుకి విక్షణముల చరిత్ర ని తెలుపుతూ అందుకు తోడ్పడిన వారందరికి ధన్యవాదాలు తెలపడానికే పరిమితం. 

                        నా బ్లాగు అభివృద్దికి తోడ్పడుతున్న వీక్షకులకు, మిత్రులకు ,శ్రేయోభిలాషులకు ,  విమర్శకులకు , అగ్రిగ్రేటర్ లు యావన్మందికి పేరు పేరు నా దన్యవాదములు తెల్పుకుంటున్నాను. 

                                                                                                         ఇట్లు 
                                                                                            మద్దిగుంట నరసింహా రావు. 
                                                                                            " మనవు" బ్లాగ్  అడ్మిన్   

       .    

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన