స్త్రీ స్వేచ్చ

                                                    

ఆ!మిత్రులార,మళ్లి ఈ రొజు మిమ్మల్ని పలకరించె అవకాశం వచ్చినందుకు సంతోషంగ ఉంది.నిన్న కొన్ని విషయాలు చెప్పాను. ఈ రోజు చెప్పేది ఏమిటంటె నేను గత జన్మలొ మనువు గ "మనుస్మ్రుతి"రాసాను. ఈ మద్య ఒక చోట "మనుస్మ్రుతి" అనే పుస్తకం చూశాను.కాని అందులొ నేను రాసింది తక్కువగను,రాయంది ఎక్కువగను కనిపించింది.నేను చాలా ఆశ్చర్యపొయాను. ఇధేమిటి? ఇదంతా ఎవరు చొప్పించారు? అని ఆలోచిస్తూ వెళుతుంటె ఒక మైదానంలొ పెద్ద సభ జరుగుతుంది.ఆ సభలో ఎవరో నన్ను విమర్సిస్తూ ఉపన్యాసం చెపుతుంటె అక్కడికి వెళ్లి ఆశ్చర్యంగా వింటుండిపొయా.
                   ఆ ఉపన్యాస సారాంశం ఏమిటంటె నేను స్త్రీ వ్యతిరేకినంట! నా వల్లనే ఈ దేశంలొ స్త్రీలకు స్వేచ్చ లేకుండా పోయి, బానిసలుగ మిగిలిపొతె వీళ్లు స్త్రీ లను స్వేచ్చా వీదుల్లొ విహరింప చేసి వాళ్ల అభ్యుదయానికి పాటు పడుతున్నరంట!
         సరే నండి కాసేపు నేను రాయని "న స్త్రీ స్వాతంత్ర మర్హతి" నేనే రాసాను అనుకుంధాం. దాని ప్రకారం  స్త్రీని ఎక్కడ ఉంచాం.తండ్రి,భర్త, కొడుకు,ఎవరో ఒకరి సంరక్షణలొ కుటుంబంలొనె ఉంచాం. కాని ఈనాడు  స్వేచ్చ పేరుతొ చేస్తున్నది ఏమిటి? స్త్రీని బజారులొకి తీసుకువచ్చి బట్టలూడతీసి హొర్డింగుల మీద చూపిస్తూ, వ్యాపారాలు చేస్తున్న వీరా నన్ను విమర్సించేది?ఒకసారి ఆలొచించండి వీరికి  నన్ను విమర్సించే నైతిక అర్హత ఉందా? చెప్పండి.

            ఓ.కే.ఈ రోజు కి ఇది చాలు తర్వాత కలుద్దాం (సశేషం)

Comments

  1. మీరే మనువు అని ఎలా నమ్మాలి? నిజమైన మనుస్మృతి సెలవిస్తే అప్పుడు ఎవరైనా ఇటు చూస్తారు.

    ఇదొక్కటి చెప్పండి, మీ ప్రకారం, బ్రాహ్మణుడికి పుడితేనే బ్రాహ్మణుడట కదా!.

    ReplyDelete
  2. మనుస్మ్రుతి గురించి రాను రాను తెలియచెప్పుతాను.ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకు మాత్రమే బధులిస్తాను.మనుస్మ్రుతి కాలం నాటికి కుల వ్యవస్థ లేదు.అప్పటి సమాజం ప్రకారం

    జన్మనః జాయతె శూద్రః,
    సంస్కారత్ ద్విజ ఉచ్చయతే,
    వేదపతి బావేధ్ విప్రః,
    బ్రహ్మ జ్నానతి బ్రాహ్మణః

    అంటె ఒకరు జన్మం చేత శూద్రుడిగను,సంస్కారక్రియల చేత ద్విజుడిగను,వేదజ్నానం చేత విప్రుడిగను బ్రహ్మజ్నానం చేత,బ్రాహ్మణుడిగ గుర్తించబడ్దాదు.అంతే కాని కలెక్టర్ కొడుకు కలెక్టర్ కానట్టు,బ్రాహ్మణుడికొడుకు బ్రాహ్మణుడు కాదు.ఇక్కడ బ్రహ్మజ్నానం అంటె "ఏ ఒక్కటి తెలుసుకుంటె సర్వం తెలుసుకున్నట్టు అవుతుందో" అదే బ్రహ్మజ్నానం.దానిని తెలుసుకున్నవాడే నిజమైన బ్రాహ్మణుడు. కాబట్టి ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడు కావడానికి ప్రయత్నించాలి తప్ప పుట్టుక వలన బ్రాహ్మణుడు కాలేరు. మీరు విన్నది నేను చెప్పింది కాదు.అందుకే నా ఈ బాదంతా.

    ReplyDelete
  3. for details on this issue please see http://ssmasramam.blogspot.in/2012/08/who-is-prajapati-view-on-rig-veda-god.html

    ReplyDelete
  4. మరి ఇది చెప్పండి, ఆయన నోటి నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాలనుంచి శూద్రుడు జన్మించారా? ఇంకో అర్థం ఏదైనా ఉందా ?

    ప్రజాపతి బ్రహ్మజ్ఞాని అని వింటున్నాను. అయితే మీరు బ్రహ్మ జ్ఞాని లా పుట్టారా ? బుద్ధుడికీ, బ్రాహ్మణుడికీ తేడా ఉందా ?

    ReplyDelete
    Replies
    1. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మనుస్మ్రితి మొత్తం మనువు రాసింది కాదు.అది ప్రక్షిప్తం అయింది.అంటె మనువు తర్వాతి కాలంలొ దానిలొ కొంతమంది స్వంత ప్రయొజానాల కోసం వారి శ్లొకాలు జత చేసి గ్రందాన్ని అపవిత్రం చేసారు.అలా స్వంత పైత్యంవాళ్ల నుంచి చేర్చబదిందే మీరు చెప్పిన 4 వర్ణాల సిద్దాంతమ్.మనుస్మ్రితి ప్రక్షిప్తం అయిందనడానికి అందులోని కొన్ని శ్లొకాలు అంటె 33,35,36 చూడండి.౩౩ లొ మనువు నేనే స్రుష్టికర్త అని చెప్పినట్టు ఉంది. 35,36 వ శ్లోకాల్లొ మనువు ప్రజలను స్రుష్టించదానికి 10 మంది ప్రజాపతులని స్రుష్టించాడని అందులొ భ్రుగువు ప్రజాపతి ఒకరని,అలాగె ఈ ప్రజాపతులే 7 మనువులని ఇతర దేవతలను,మహరుశులను పుట్టించారని ఉంది.అంతె మనువు తానే స్రుష్టికర్త అని ౩౩వ శ్లొకంలొ చెప్పి,ఆ తర్వాతి అంటె 36 వ శ్లొకంలొ మనువు ని స్రుష్టించింది ప్రజాపతి అని చెప్పడం ఇది చాలదా మనుస్మ్రితి ప్రక్షిప్తం ఆయిందనడానికి.కాబట్ట్ మహా పండితుడైన మనువు రాసిన మనుస్మ్రితి కొంత మంది పండిత పుత్రుల స్వార్దం వలన అపవిత్రమైంది, వాళ్లే స్త్రీలకుఉ,శూద్రులకు వ్యతిరేకంగా శ్లొకాలు చొప్పించి మనుస్మ్రితి ని అపవిత్రం చెసారు. కాబట్టి వాటి గురించి చర్చ అనవసరం.అని నా అభిప్రాయం.
      .
      ఇకపోతె నేను పుట్టుకతొ శూద్రుడను.బ్రహ్మజ్నానం కోసం తపస్సు(విషయం మీద మనస్సు లగ్నం చేయడం)చేస్తున్నాను.అది పొందదమె నా జీవిత పరమార్థం. అలాగె బుద్దుడికి బ్రాహ్మనుడికి ఉన్న తేడా గురించి ప్రత్యకంగ చెపుతాను. ఒక .
      మాటలో చెప్పేది కాదు అది.
      ఇంతకి కాయ అనే నామంతొ వ్యవహరిస్తున్న మీరు మీ పూర్తి వివరాలు ఎక్కడో ఒకచోట ఇవ్వడం సత్సాంప్రాదాయం.

      Delete
  5. ప్రజాపతికి మనుషులందరి పైనా ఒక విధమైన బాధ్యత ఉంది. అందుకని, నా పేరు ఏదైనా, నేనెవరనైనా, నన్నొక బాటసారి గా తలచి నిజమైన మనువు వ్యవహరిస్తారు.

    12ఏళ్ళ ప్రాయంలోనే మీకు గత జన్మ స్మృతి ఎలా వచ్చింది ? మిమ్మల్ని మనువు అని ఎలా నమ్ముతారు జనం ?

    ReplyDelete
  6. నేను విన్నదాని ప్రకారం ప్రస్తుతం నడుస్తుంది వైవస్వత మన్వంతరం. రాబోయె మనువు పేరు సూర్య సావర్నిక మనువు.నేను ఈరోజు ఈనాడు బుక్ లొ ఒక వ్యాసం చదివాను. ఎవరి గురించి ఐన తెలుసుకొవలంటె గూగుల్ సెర్చ్ లొ అడిగితె అన్ని తెలుస్తాయట. కాబట్టి కాయ గారు మీరు గూగుల్ లొ సూర్య స్సావర్నిక మనువు
    గురించి వాకబు చెయ్యొచు గదా!ఒకరు నేను మనువుని అంటె తేలిగ్గా నమ్మెస్తారా!నేను ఎవర్ని విమర్సించడంలేదు కేవలం నా అభిప్రాయం చెప్పాను అంతే

    ReplyDelete
  7. నేను గత జన్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తాను. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. నేటి ప్రపంచాన్ని ఏకం చేసే ఒక శక్తి అవసరం చాలా ఉంది. వివిధ దేశాల్లో జరుగుతున్న నరమేధానికి ముగింపు దొరకాలి. భూమండలమంతా ఒక రాజ్యం కావాలి. అందుకని, నేను వెతుకుతున్న దారులకోసం, ఈ బ్లాగులో ప్రశ్నలు నన్ను నేను అడిగి తెలుసుకోవడానికే. మాటలు నేను ఎప్పుడూ నమ్మను. చేతలే కొద్ది అర్థాన్ని పరిచయం చేస్తాయి.

    ReplyDelete
    Replies
    1. మీరు బలే వారండి కాయ గారు,ప్రత్యెక రాష్ట్రాలు కావాలని ఆత్మార్పన చేసుకుంటున్న ఈ రోజుల్లో,ఉన్న మండలాల్నె,విడగొట్టలంట్టున్న ఈ రోజుల్లొ,భూమండలం అంతా ఏకం చేసేవారు రావడమా?వచ్చి నరమేదాలు ఆపడమా?హ..హ..హ..ఇంతకి పూర్వ జన్మ సిద్డాంతం నిజమేనంటారా?

      Delete
    2. నరమేధాలను ఆపే ప్రపంచ శక్తి కావాలన్న మీ కొరిక బహుదా శ్లాఘనీయం.మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.ఎందుకంటె ఒక వ్యక్తి కి ఒక ఆలొచన వచ్చిందంటె అదే సమయంలొ చాలామందికి ఆ అలొచన వుంటుంది.ఈ స్రుష్టిలో ఏది అప్పటి కప్పుడు జనియించదు. అన్ని ఒక పద్దతి ప్రకారమే జరుగుతాయి. అవన్ని ఒక దానికొకటి కార్యాకారణ సంబదం కల్గి ఉన్టాయి.మానవ చర్యలన్ని మానవ సంకల్పానుసారమే జరుగుతున్నపటికి అట్టి మానవ సంకల్పాలు భగవత్సంకల్పంలొ బాగంగానే జనియిస్తాయి.అందుచేత మీ కొరిక భగవత్సంకల్పం. కాబట్టి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.

      ఇక పోతె 12 ఏండ్లకే గత జన్మ స్మ్రుతులు ఎలా సాద్యం అని గదా మీ ప్రశ్న?.ఇక్కద మీరొక విషయం తెలుసుకోవాలి. మనువు లేక మనవు అంటే (మనః+ఉద్బవుడు) మనసు లోనుంచి జనియించినవాదు.నేను ద్విజుడ్ని.అంటె ఒక జన్మలోనే రెండవ జన్మం పొందిన వాడిని.నా జన్మ కారకుడి నామం వేరు.అలాగె ఆయన జన్మ కారకులు కూడ దైవం చేతనే నిర్నయించబడతారు. ఫ్రతి మన్వంతరములోను మనవు జననానికి కారకులైన వారి పేర్లు హిందూ పురాణ గ్రందాలలొ తెలుపబడ్డాయి.కాబట్టి వాటి గురించి యెవరైన తెలుసుకొవచ్చు. నమ్మకం అనేది వ్యక్తుల ఒక్క మనసుకి సంబందించిది.కాబట్టి దైవేచ్చలో అది బాగం.

      కర్మలను చేయుట యందే నాకు అదికారం. వాటి ఫలితంతొ నాకు నిమిత్తం లేదు. యెందుకంటె నేను "గీతా" బద్దుడను.

      Delete
  8. కాయగారు మీరు చెప్పింది నిజం. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరూ చెప్పలేరు. నాకొక వివరణ కావాలి.మీకు తెలిస్తే చెప్పగలరు."దేవగుహ్యం" అంటే ఏమిటి? "దేవగుహ్యం" అన్నా, "తిరుపతి" అన్నా ఒకటె అర్థమా? చెప్పగలరు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన