మచ్చలు లేని అరటి పండు , మానవత్వం లేని శాస్త్రీయ ట్రెండ్ , హానికరమే !!!?

                            
                                                                                     

                                        క్రైస్తవుల  పవిత్ర గ్రందం అయిన బైబిల్ లో ఒక కధ ఉంది . సృష్టిలోని అది మానవులు అయిన ఆదాం , అవ్వలు దేవుని అజ్ఞ మేరకు "ఎదేన్స్" వనం లో స్వేచ్చ గా , దిగంబరంగా ఏ అరమరికలు లేకుండా సంచరిO చేవారు . వారు కోరిన పలములు , తియ్యనివి తింటూ ఆ వనం లో ఉండేవారు . అయితే వారిని ఎలా అయినా దేవుని శాపానికి గురి చేయించి , తన అధినంలో ఉంచుకోవాలని బావించిన సైతాన్ "సర్ప" రూపo లో వారి వద్దకు వచ్చి వారిని ప్రలోభపరచి , దేవుడు తినవద్దని సూచించిన "జ్ఞాన ఫలం" తినేలా చేస్తాడు . దానితో వారికి జ్ఞాన నేత్రం లు తెరచుకుని ,తాము దిగంబరంగా ఉన్న విషయాన్ని తెలుసుకుని , సిగ్గుపడి తమ శరీరాలను ఆకులుతో కప్పుకుంటారు . ఆ తర్వాత దేవుని శాపానికి గురి అయి అనేక కష్ట నష్టాలకు గురి అవుతారు . అది వేరే కధ.  

   అయితే ఇప్పుడు ఆ కద గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ  రోజు ఈనాడు పేపర్లో చూసిన ఒక విషయం ఆ కదను గుర్తుకు తెచ్చింది. బహూశా ఆదం అవ్వ లు దేవుని మాట వినకుండా జ్ఞాన పలం తిన్న నేరానికి , వారి వారసులైన నేటి మానవులు అ జ్ఞానపరంపర లో కలిగిన శాస్త్రీయ జ్ఞానం వలన పండ్లు ను మగ్గబెట్టుకుని తినే బదులు , రసాయనాలు కలుపుకుని , విష పండ్లను తయారు చేసుకుని తింటునారు అంటె అది దేవుని శాపమే కాబోలు . ఎందుకంటె ఇదంతా శాస్త్రీయ జ్ఞాన మహిమే కదా ! 

                                                                         


      ఒక్కప్పుడు మార్కెట్ కి వెలితే మచ్చలు ఉన్న అరటి పండ్లు కనిపించేవి . వాటిని చీటా పండ్లు అనే వారు  అంటె చిరుతపులి మీద మచ్చలు ఉన్నట్లు వాటికీ మచ్చలు ఉండెవి. అరటి కాయ పక్వానికి వచ్చింది అని చెప్పటానికి ఆ మచ్చలే నిదర్శనం. మచ్చ యొక్క విస్తీర్ణత ను బట్టి  బట్టి పండు పక్వత చెప్పవచ్చు. ఉదాహరణకు పై చిత్రం లోని మూడు అరటి పండ్లను చూస్తే అన్నింటికి కంటె క్రింది పండు  మీద మచ్చలు తొలిదశను .,మద్య పండు మద్యదశను , పై పండు మీది మచ్చలు పూర్తి పక్వడశను తెలుపుతున్నాయి. కాని ఈ   రోజున  మార్కెట్ లోకి వెలితే చీటా కాయలకు బదులు "చీటింగ్ కాయలు " దొరుకుతున్నాయి . అంటే కాయ పక్వానికి రాక ముందే గెలల మీదే రసయానాలు పోసి ఒక్క రోజులోనే పండు రంగు వచ్చేలా చేస్తున్నారు . అది చూడటానికి నీట్ గా, నిగ నిగలాడుతూ మచ్చ లేకుండా ఉంటే మురిసి పోయి తెచ్చుకుని , ఆరగించి ఆనారోగాల పాలు అవుతున్నారు సామాన్య జనం. దీనికి కారణం కాసుల కక్కుర్తి . అందుకు దోహదం చేస్తున్న శాస్త్రీయ జ్ఞానం 

                                                                           
                         

                                                    శాస్త్రీయ జ్ఞానం , శాస్త్రీయ జ్ఞానం అని విర్రవీగే వారికి ఇది ఒక సవాల్. ఎంతసేపు వెనుకటి తరం ఏర్పరచిన గోతులు చూసి గేలి చేస్తూ నడుస్తున్నారే కాని, వీరు చంకలు గుద్దుకునే  శాస్త్రీయ జ్ఞానం, ముందు ఎంత అగాధం సృష్టిస్తుందో తెలుసుకోలేక పోతున్నారు. నిజంగా ఈ  నాడు ఆదునిక మానవులం అని చెప్పుకుంటున్న మనం బ్రతికేది ఒక బ్రతుకేనా? స్వచ్చమైన గాలి లేదు  . స్వచ్చమైన నీరు దొరికే పరిస్తితి లేదు. పాలలో కల్తీ . పండ్లు చూస్తే విష పూరితం . పట్టు మని 40 యేండ్లు  రాక ముందే ఒంట్లో జవసత్వాలు క్రుంగి పోతాయి . ఏ పని చేయాలన్నా గోలీ వేసుకోవాలసిందే . తిండి తినాలంటే మాత్ర. కాపీ తాగాలంటే మాత్ర . స్వీత్ తినాలంటే మాత్ర . ఆఖరకు సంసారం చేయాలన్నా మాత్ర వేసుకోమ్దే కుదరని పరిస్తితి. స్పందించాల్సిన  హృదయాలు  స్తంభిస్తాను అంటుంటె , స్తంభిచాల్సిన అవయవాలు స్పందనలు లేక నీరు కారి పోతుంటాయి. మనది ఒక బ్రతుకేనా ? చేవ చచ్చి, జావ గారే మనది ఒక బ్రతుకేనా? దీని కోసమేనా మానవాభివ్రుద్ది పేరుతో  వనం లో నుండి నగరాల్లోకి ప్రస్తానం చేసింది? ఇదే నా ఆధునిక శాస్త్రీయ జీవన విదానం? . నా ద్రుష్టిలో శాస్త్రీయ జ్ఞానం అంటె ఆరోగ్యకరమైన, ఆనందకరమైన  జీవనం సాగించగల జ్ఞానం  , కోట్లాది సంపాదన ఉన్న కోరుకున్న దానిని పొందలేని వాడి జీవితం వెస్ట్ . మధుమేహం ఉన్న వాడికి ఇంట్లో మిటాయి భండారం ఉన్నా  లాభమేమిటి?సంపద అయినా అంతే .   

     శాస్త్రీయ జ్ఞానం కంటె ముందు మనిషికి మానవత్వం అబ్బాలి  . పది మందికి చెడు  చేసే విజ్ఞానం ని నియంత్రించి , మంచి కోసమే దానిని వినియోగించేలా చేసేదే మానవత్వం. దానిని మనిషిలో పెంపొందించాదానికి , స్వార్దం కోసం అడ్డ దారులు తొక్కకుండా చెయ్యడానికే పాప బీతి , దైవబీతి , లాంటివి  మనషుల మనసులలో నెలకొల్పడం జరిగింది . వాటి   కోసం మత వ్యవత్సలు పని చేస్తున్నాయి. ఉదాహరణకు  పాలలో కల్తీ కలిపే వారు, పండ్లను విషపూరితం చేసే వారు గొప్ప శాస్త్రీయ జ్ఞానం కలిగిన వారు కాదు. వారికున్న కొద్ది పాటి జ్ఞానమే సమాజానికి అంత హాని చేయిస్తుంటే , ఇంకా జ్ఞానం ఎక్కువైతే ? అందుకే మానవత్వ హీనమైన శాస్త్రీయ జ్ఞానం మహా పాపాలలో ఒకటి అన్నారు మహాత్మా గాందీ .  సైన్స్ కంటె ముందు మానవత్వాన్ని ప్రబోదించాలి. అందుకు నైతిక విద్యాబోదన అవసరమ్. పూర్వకాలం లో రాక్షసులు అందరూ సైంటిస్టులే . కాని మానవత్వం లేనందువలన వారు చేసే పనులు సమాజ వినాశనానికి దారి తీసి చివరకు వారిని సంహరించాల్సి వచ్చింది. 

            అందుకే మచ్చలు లేని అరటి పండు , మానవత్వం లేని సైన్స్ ట్రెండ్ ,మనిషికి ,సమాజానికి  హానికరమే   !

      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.