Posts

బుద్ధుడు చెప్పిన మోక్షం మానవునికి ఈ విధంగా కలుగనుందా!!??

Image
                                 49 రోజులు భోది వృక్షం క్రింద ధ్యానం చేసి గౌతమ బుద్ధులు వారు తెలిసికున్నదేమిటంటే మానవుడి దుఃఖానికి కోర్కెలు కారణం,అవి అనంతం కాబట్టి,వాటిని విడిచి పెట్టనిదే దుఃఖం నుండి మనిషి విముక్తుడు కాడు అని.సరే కోర్కెలను మన నుండి వెల్లగొట్టడం కష్టం కాబట్టి ఎలాగో కష్టపడి బౌద్ధ ధర్మాన్ని ఇండియా అంచుల వరకూ తరిమి బుద్ధుని పేరు మీద కార్యక్రమాలు జరుపుకునే అంత మేరకు కోర్కె ను నియంత్రించుకున్నాం.దేశం లో అక్కడక్కడ బుద్ధ మతం పేరుతో ఎదో చేయాలని ఆరాట పడుతున్న వారు,బుద్ధుని బోధనలు మీద మమకారం తో కాక,హిందూ ధర్మం మీద ప్రతికారంతో ఎగురుతుండడం వల్ల వారిలో కూడా కోర్కెలు ఏ మాత్రం తక్కువ కాలేదు. బుద్ధుని బోధన లో ఒకటైన బ్రహ్మచర్యం వల్ల మనిషి సంతతి తగ్గి చివరకు మానవ జాతికి భూమి నుండి మోక్షం లభిస్తుంది. ఈ రకమైన మోక్షాన్ని మనిషి సాధించటం కష్టం కాబట్టి ,మానవ ఆవిష్కృత సైన్స్ ఆ పని చేయటం మొదలు పెట్టినట్లుంది. ఆధునిక మానవుడు ఉపయోగిస్తున్న సాంకేతిక పనిముట్లు,కారకాలు వలన పర్యావరణం కలుషితమై దాని ఫలితంగా పురుషుల్లో సం...

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

Image
                                  రివర్స్..రివర్స్..రివర్స్.కాలం రివర్స్ అయింది.ఎండాకాలం లో వానలు పడుతున్నాయి.వానాకాలం లో ఎండలు కాస్తున్నాయి. రివర్స్ లో నీరు లేక రివర్స్ ని రివర్స్ చేసి నడిపించే రివర్స్ ఆలోచనలు మానవులకు వచ్చింది.అందుకే ఎత్తిపోతల పథకాలు ద్వారా నదుల్లో నీరు వెనుకకు నడుస్తున్నాయి.సహజ పద్దతిలో పంటలు పండించడం మానేసి ,రసాయనిక ఎరువులు వాడడం ద్వారా అటు భూమాత ఆరోగ్యం ఇటు మనుషుల ఆరోగ్యం పాడయి, చివరకు ప్రకృతి వ్యవసాయం వైపే సైన్స్ రివర్స్ అయింది.అటువంటి అనారోగ్య ఆహారం తినడం వలన ఏమో,మనుషుల ఆలోచనల్లోనూ రివర్స్ లక్షణాలు కనపడుతున్నాయి.పురుషులను స్త్రీలు.స్త్రీ లను పురుషులు పెండ్లాడి సంసారం చేసే సహజ పద్ధతికి కొంతమంది విముఖత చూపిస్తున్నారు.దాని బదులు రివర్స్ గేర్ లో స్త్రీలను స్త్రీలు,పురుషులు ను పురుషులు పెండ్లి చేసుకుంటున్నారు.పైగా వాటిని చట్టబద్ధం చేయమని పోరాడి కొన్ని దేశాలలో విజయం సాధించారు కూడా. భార్యలు లేకుండా పురుషులు.భర్తలు లేకుండా స్త్రీలు పిల్లల్ని పొందే సౌకర్యం రావడం తో డ్యూయల్ పేరెంట్...

దంపతులు ఇద్దరూ సమానులే అనేది గే ,లెస్బియన్ లకు వర్తిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి ఒక్కటి అనేదే హిందూ తాత్విక దృక్పదం!

Image
                                                                        భారత రాజ్యాంగం తన పౌరులకు సమానత్వం ని ప్రసాదించింది. దీనికి ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల కృతజ్ఞుడి గా ఉండాల్సిందే. ఎవరి దృష్టిలో ఎలా ఉన్ననా , రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమే. అందులో ఆడ, మగ ,థర్డ్ జెండర్ అనే లింగ వివక్షత అనేది చూపించటానికి విలు లేదు. అదిగో అదే కారణం చూపిస్తూ మొన్ననే సుప్రీం కోర్టు భారతీయ శిక్షా స్మృతి లోని  497 సెక్షన్ ,అడల్త్రి నేరానికి శిక్ష పొందే విషంలో స్త్రి పురుషుల పట్ల వివక్ష చూపించడమే కాక, భార్యను భర్త యొక్క ఆస్తిగా బావించే పాత తరం వారి బూజు పట్టిన బావ జాలానికి అడ్డం పట్టేల ఉందని ప్రకటిస్తూ , అసలు అ సెక్షనే నేటి తరానికి పనికి   రాదనీ 4:1 మెజార్టి తో అత్యున్నత న్యాయస్తానం కొట్టివేయడం జరిగినది. అయితే 497  సెక్షన్ లో నేరానికి బాద్యుడిగా పురుషుని మాత్రమె చేయడం వెనుక , అడల్త్రి న...

జంటగా నేరం చేసిన ఆడదాన్ని ఏమనలేక ,మగాడిని కూడా వదిలేయమన్న సుప్రీం కోర్టు అప్ ఇండియా !

Image
                                                                                          సెక్షన్ 497 కేసులో తప్పు లేక నేరం స్త్రి పురుషులు ఇరువురు చేసినప్పటికీ ,కేవలం పురుషుడికి మాత్రమె శిక్ష విదించే అవకాసం కల్పించడం ,స్త్రీని కనిసం  ప్రేరేపణ చేసిన వ్యక్తిగా నైన సహా నిందితురాలిగా చేర్చకుండా పూర్తిగా వదిలి వేయడం వెనుకాల "కేవలం స్త్రి పురుషుడి యొక్క స్వంత ఆస్తి కాబట్టి, అట్టి ఆస్తికి సంబందించిన హక్కుకు బంగం కలిగింది కాబట్టే ,ఇది కేవలం పురుషుల మద్య అనుభవ హక్కుల సమస్య గా బావించి వెనుకటి చట్ట నిర్మాతలు,పురుష ఆదిక్య బావజాల ప్రబావం తో  ఈ సెక్షన్ పెట్టారు " అని బావించటం పూర్తిగా తప్పు. అదే నిజమైతే తప్పు చేసిన మగవాడికి 5 యేండ్లు జైలు శిక్ష విడిస్తే ,అదే తప్పు చేసిన స్త్రీని ఇంకా కటినంగా శిక్షించమని చట్టం చేసి ఉండేవారు. దీనిలో స్త్రీల మిద కేసు పెట్టకపోవడానికి...

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

Image
                                                                                             తిరుమల తిరుపతి దేవస్థానం ! దేవ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి కోవెల . ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఆర్థికపరంగా వత్సరానికి అన్ని వనరుల నుంచి  వేయి కోట్ల పైన ఆదాయం పొందుతున్న దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు మీద అజమాయిషీ కోసం ప్రభుత్వం I.A.S  కేడర్ కలిగిన అధికారిని కమిషనర్ గా నియమిస్తే ,కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం గ్రూప్ ఆలయాల అజమాయిషీ కోసం ప్రత్యేకంగా  I.A.S  కేడర్ కలిగిన అధికారిని  "కార్య నిర్వాణాధికారిగా " నియమిస్తున్నారు అంటే ఆర్థిక పరంగా ఆ దేవాలయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవచ్చు. తిరుమల క్షేత్ర్రాలు నిర్వహణ కోసం ప్రత్యేక చట్టం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆక్ట్ లో అంతర్భాగంగా ఉంది. తిరుమల క...

గ్రంధాలు పట్టుకు తిరిగేవారు జ్ఞానులూ, ఆవు చుట్టూ తిరిగే వారు అజ్ఞానులా ?!!

Image
                                హిందూ జీవన విధానంలో భగవంతుని దర్శించి తద్వారా జీవన్ముక్తులు అయ్యే పద్ధతుల్లో ముక్యంగా 3 మార్గాలు ఉన్నాయి . (1). జ్ఞాన మార్గం (2) భక్తి మార్గం.3 కర్మమార్గం . సాంప్రదాయిక జ్ఞానమార్గంలో ఉన్నవారు ఎవరైనా ఒక గురువును ఆశ్రయించి , వేదోపనిషత్తుల ఇతర గ్రంధాలలోని   సారాంశం తెలుసుకోవడం ,ఆ గురువుగారు చెప్పిన విధానంలోనే భగవంతుణ్ణి దర్శించడం చేస్తుంటారు. వీరి దృష్టిలో దేవుడు వేరు . గురువు వేరు. దేవుడు గురించి తెలుసుకోవాలంటే గురుబోధలు ద్వారానే అది సాధ్యమవుతుoది తప్పా అన్యదా కాదు అనేది జ్ఞాన మార్గీయుల అభిప్రాయం లేక విశ్వాసం .                         ఇక భక్తి మార్గం లో భగవత్ దర్శనం చేసుకునే వారికి ఏ గ్రంధాలు లేక గురువులు తోనూ పని లేదు . వారికి అలౌకిక అనందం ఇచ్చేది ఏదైనా సరే దానిని భగవంతుణ్ణి గానే భావిస్తారు  . నిత్యం  తాము దేవుడు అని నమ్మడానికి వీరికి ఏ గ్రంద సారాంశం అక్కర...

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

Image
                                                                                                                                      భారత దేశం లో ఉన్న "కుల వ్యవస్థ " అనబడే విధానం ప్రపంచం లో ఏ దేశం లో లేకపోవచ్చు . మొదట్లో వృత్తుల ఆధారంగా నిర్ణయించబడిన కులాలు చివరకు రాను రాను జన్మతః నిర్ణయింపబడానికి కొంతమంది పండిత పుత్రులు కారణమయినప్పటికీ , అగ్రకులాలు ,నిమ్నకులాలు అని వర్గీకరించబడడానికి , పై కులాల  ఆధిపత్యం క్రింది కులాల వారి మీద  శతాబ్దాలుగా కొనసాగిస్తుండటానికి మాత్రం అన్ని కులాల వారి ప్రమేయం ఉంది. ప్రతి కులస్తుడు తనపై పెత్తనం చేయచూసే అగ్రకులస్తుడి అహకారం ని ప్రశ్నించే బదులు ,తనకంటే క్రింది కులం గా ఉన్నవారి మీదే తన ఆధిపత్య అహ...

క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!?

Image
                                                                                                                            అయన గారి పేరు కంచ ఐలయ్య . ఇది హిందూ జీవన విదానం పాటించే తెలుగు వారి పేరు.కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ లాగ  ఈ పేరు కి  తెలుగువారిలో ఒక ఇమేజ్ ఉంది. ఈయన గారు ఒక పుస్తకం రాసారు . దాని పేరు "నేనెట్ల హిందువు నైత"? . దానికి ఆయనకు జాతీయ స్తాయిలో పేరు వచ్చింది అంటే బహూశా హిందూ జీవన విదానం లో జీవిస్తూ , నేనెట్ల హిందువు నైత అని అనే వ్యక్తీ చెప్పినదేమిటొ చూద్దామనే కుతూహలంతో మేదావులు , సామాన్యులు అయన పుస్తకాన్ని చదవగా వచ్చిన పేరు అది. హిందూ అనేదే   లేకపోతే  "కంచ ఐలయ్య " గారికి అంత ఇమేజ్ ఉండెది కాదు. అంటే ఆయనకు పేరు రావడానికి  పరోక్ష...

వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!

Image
                                                                                                                                                                                                         నేను ఇదే బ్లాగులో కొన్ని టపాలలో ఒక విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. హిందూ అనేది ఒక మతం కాదని, అది ఒక జీవన విదానం అని , ఒక క్రమ పద్దతిలో , ప్రక్రుతి నిర్దేసించిన విదానం లో ఉంటుందని చెప్పడం జరిగింది. దానినే మన వాళ్ళు సింపుల్ గా "ఏ వయసులో ఆ ముచ్చట " అని చెప్పారు. దానిని మను...

దేవుడికి దగ్గరవుతారని చెప్పి,400 మంది శిష్యుల వ్రుషణాలను కోయించి వేసిన "వృషభ గురువు"!!!

Image
                       అతడొక గురువు. కాని అందరికి మల్లె అట్టాంటి ఇట్టాంటి మామూలు గురువు కాదు .ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ ల మంది అనుచరులు  ఉన్న "చార్మిషింగ్ గురు". అతడే "డేరా సచ్చా సౌదా "అనే మత సంస్త వ్యవస్తాపకుడు " గుర్మీత్ రాం రహీం సింగ్ ". ఇతడు  సిక్కు మతానికి వ్యతిరేకంగా అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ తో మూడు మతాలకు సంబందించిన  పేరుతో ఉద్బవించిన ఒక సంచలన గురువు . పాలోయ ర్స్ సంఖ్యను  ను  బట్టి , గురువుల గొప్ప తన్నాన్ని నిర్ణయించాల్సి ఉంటే మాత్రం ఇతడు గొప్ప గురువే .కాని గురు భోదలు అనుసారం "గురు " పరిక్ష జరిపితే మాత్రం ఇతడు ఒక తిక్కల గురువు లేదా మానసిక సమస్యతో బాదపడుతున్న గురువు అని అనక తప్పదు .దానికి కారణం 2000 వ సంవత్సరం లో  అతడు చేసిన  ఒక "మహా పాప కార్యం ". అదేమిటో చూదాం .                                                     ...

గణపతి పూజ నుండి ఘనపతి పూజ వరకు

Image
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్యా!           మా చిన్నతనంలో వినాయక చవితి వస్తుందంటే పిల్లల్లం మేము చాలా సంబరపడే వాళ్లం.నేను మా చెల్లెలు ఇద్దరంకలిసి పొద్దున్నే మా ఇంటి ఎదురుగా కొద్ది దూరంలో  ఉన్న ఎర్ర చెరువు కి వెళ్లి, అందులోనుంచి,చెరువు మట్టి ని తీసుకు వచ్చే వాళ్ల్లం. ఆ తర్వాత మా అమ్మ గారి సూచనలతో ఇద్దరం కలిసి గణపతి బొమ్మను తయారు చేసేవాళ్లం.అలాగే మా ఇంటి చుట్టు (మా ఇల్లు వూరికి దూరంగ మా చేలో ఉంది)ఉన్న రక రకాల పత్రి సేకరించే వాళ్లం.వాటిలో జిల్లేడు,దెవదారు,తంగేడు,సీతాపలం,వెలగ,రేగు,గన్నేరు ,ఉమ్మేత్త,మారేడు ,దానిమ్మ,మొదలైనవి ఉండేవి. ఆ తర్వాత మా అమ్మ గారు రక రకాల పిండి వంటలు ముక్యంగా వినాయకుడికి (మాకు కూడ)  ఇష్టమైన కుడుములు చేసి పూజకి అంతా సిద్దంచేసి ఉంచేవారు. మా నాన్న గారు పూజమంధిరంలో పటాలకు పూజ చేసి, మేము చేసిన గణపతిని ప్రతిష్తించి పూజ చేసేవారు.మేము పిల్లలం మా పుస్తకాల పైన  "శ్రీ " అని పసుపుతో రాసి పూజ దగ్గర పెట్టేవళ్లం. అలాగే మా నాన్న గారు మా వ్యాపార సంబందమైన పుస్తకాలను పెట్టె వారు. మా వ్యవసాయ పనిముట్లు అన్నిటి ప...

డేటింగ్ లు చేసి మొగుళ్ళని ఎంపిక చేసుకుందాం అనే ఇండియన్ గర్ల్స్ కి చీటింగ్ కేసులే గతి!!?

Image
                                                                                                                                               ఒక పక్క ఆడ పిల్లల్లు, అమాయకంగా ఇండియా లో ప్రాశ్చ్చాత్య సంస్క్రుతి వచ్చిందని భ్రమపడి, మగవాళ్ళను నమ్మి  భయటకు వెళ్ళి దారుణంగా భంగ పడుతున్నారు. ఆ క్రమంలో మానం సంగతి సరే సరి కాని ప్రాణాలు కూడ దక్కేట్లు లేవు. పోని వీరి డేటింగ్ కార్య కలపాలకి ప్రబుత్వాలని రక్షణ అడుగుదామా అంటే, డేటింగ్ ని చట్ట బద్దం చేయరాయే! ఇప్పటికే "ఎయిడ్స్"...

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

Image
                                                                      Courtesy :From  Bapu Cartoons  మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల  లక్షణాలు  క్రింది విదంగా ఉంటాయి . (1) శ్లో॥    కార్యేషు యోగీ, కరణేషు దక్షః          రూపేచ కృష్ణః క్షమయా తు రామః          భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం          షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త  లక్షణాలు ) కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.   కరణేషు దక్షః  కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.  రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి.  క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి...

తప్పుడు కేసులు పెట్టమని భార్యలకు సలహా ఇచ్చే వారిని , చెప్పు తీసుకు కొట్టిన సుప్రీం కోర్టు అప్ ఇండియా !!!.

Image
                                                                    పెద్దమనిషి అనేవాడు ఎవడైనా, ఆలు మగల మద్య సమస్యలు వస్తే వాటిని సరిచేసి ,బుద్దిగా కాపురం చేసుకోండి అని చెపుతాడు . భార్యల తప్పు ఉంటే మందలింపులతో ,భర్తల తప్పు ఉంటే,అతన్ని  చెప్పు తో కొట్టి అయినా సరే సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసేదే సాంప్రాదాయక "పెద్ద మనిషి తనం ". ఇటువంటి పెద్దమనిషి తనం మన పెద్దల్లో ఉండబట్టే మన కుటుంభ వ్యవస్థ ఇంతవరకూ అవిచ్చిన్నంగా కొనసాగుతూ వస్తుంది .ని   కాని ఎప్పుడైతే సాంప్రాదాయక పెద్ద మనిషి  స్తానే,స్త్రీ వాద   సంఘాలు,  గల్లి రాజకీయ నాయకులు ,లాయర్లు, పోలిసులు, కుటుంభ సమస్యల విషయంలో రంగ ప్రవేశం చేసారో,అప్పటి నుండి భారతీయ కుటుంభ వ్యవస్తకు బీటలు వారడం మొదలు అయిందని చెప్పవచ్చు. దానికి ఉతం ఇచ్చింది ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 498 A.  ఈ సెక్షన్ క్రింద దాఖలైన కేసుల్లో నూటికి 95% కేసులు తప...