గణపతి పూజ నుండి ఘనపతి పూజ వరకు

ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్యా!      
    మా చిన్నతనంలో వినాయక చవితి వస్తుందంటే పిల్లల్లం మేము చాలా సంబరపడే వాళ్లం.నేను మా చెల్లెలు ఇద్దరంకలిసి పొద్దున్నే మా ఇంటి ఎదురుగా కొద్ది దూరంలో  ఉన్న ఎర్ర చెరువు కి వెళ్లి, అందులోనుంచి,చెరువు మట్టి ని తీసుకు వచ్చే వాళ్ల్లం. ఆ తర్వాత మా అమ్మ గారి సూచనలతో ఇద్దరం కలిసి గణపతి బొమ్మను తయారు చేసేవాళ్లం.అలాగే మా ఇంటి చుట్టు (మా ఇల్లు వూరికి దూరంగ మా చేలో ఉంది)ఉన్న రక రకాల పత్రి సేకరించే వాళ్లం.వాటిలో జిల్లేడు,దెవదారు,తంగేడు,సీతాపలం,వెలగ,రేగు,గన్నేరు ,ఉమ్మేత్త,మారేడు ,దానిమ్మ,మొదలైనవి ఉండేవి. ఆ తర్వాత మా అమ్మ గారు రక రకాల పిండి వంటలు ముక్యంగా వినాయకుడికి (మాకు కూడ)  ఇష్టమైన కుడుములు చేసి పూజకి అంతా సిద్దంచేసి ఉంచేవారు. మా నాన్న గారు పూజమంధిరంలో పటాలకు పూజ చేసి, మేము చేసిన గణపతిని ప్రతిష్తించి పూజ చేసేవారు.మేము పిల్లలం మా పుస్తకాల పైన  "శ్రీ " అని పసుపుతో రాసి పూజ దగ్గర పెట్టేవళ్లం. అలాగే మా నాన్న గారు మా వ్యాపార సంబందమైన పుస్తకాలను పెట్టె వారు. మా వ్యవసాయ పనిముట్లు అన్నిటి పైన కొంత పత్రిని ఉంచి పసుపు కుంకమతో బొట్లు పెట్టేవాళ్లమ్.

         ఆ తర్వాత మా నాన్న గారు విఘ్నేశ్వర  పూజా విదానం పుస్తకంలో చెప్పబడిన విదంగా పూజ నిర్వహిస్తు,పెద్దగా  మంత్రాలు ,పద్యాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటే మేము పిల్లలందరమ్,మా అమ్మ గారు భ క్తి బావంతో ఆలకించే వాళ్లం. పూజ చివర్లో శమంతక మణోపఖ్యానం  కధ విన్న తర్వాత, అక్షతలు మా శిరసున వేసి మమ్ములను ఆశీర్వదించి,పూజ ముగించి తీర్థ ప్రసాదములు ఇచ్చేవారు. మేమందరం మాకు చదువులో బాగా మార్కులు రావాలని,బొజ్జ గణపయ్యకు భక్తితో నమస్కరించే వాళ్లమ్.ఆ తర్వాత తీర్థ ప్రసాదాలను మా పాళ్లేర్లకు, మా ఇంటికి వచ్చిన వారందర్కి పంచిపెట్టి ఆనందించే వాళ్లం. ఈ విదంగా గణపతి పూజ ని ఎంతో అనందంగా జరుపుకునే వాళ్లమ్. మా నాన్న గారి తదనంతరం నేను కూడ ఇంచు మించు ఇదే పద్దతి పాటిస్తు మా నాన్న గారి సాంప్రదాయాన్ని పాటిస్టున్నాము.మాకు తెల్సినంత వరకు ప్రతి తెలుగువారు ఈ విదంగానే చేస్తుండొచ్చు. స్వహస్త్తలతొ ప్రతిమని చేసి, స్వహస్త్తలతొ పత్రి సేకరణ చేసి,స్వయంగా గణ నాదుని పూజిస్తే కలిగే త్రుప్తి,ఆనందం మరువలేనిది.

     కాని, ఈనాటి పూజా విదానం చూస్తుంటే కొంత బాధ వేస్తుంది.నిరాడంబరం స్తానంలో ఆడంబరం మొదలైంది. గణపతి కి బదులు  ఘనపతి ని ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు. దీని కోసం బారీ  క్రేన్లను ఉపయూగిస్టున్నారు.విగ్రహ తయారికి పర్యవర్నానికి హాని చేసే అనేక రంగుల్ని ఉపయూగిస్తున్నారు .ఒకరి మీద ఒకరు పోటీ తొ వీది వూరి కొక్కటి లేక కాలని కొక్క  గణపతి బదులు అనే క మంది ఘనపతుల్ని పేట్టి అట్టహాసమ్ చేస్తున్నరు. చివరకు ఘననాదుని లడ్డూ సహితం క్రేన్ సహయంతోనే అయన చేతుల్లో పెడుతున్నారంటే ఆడంబరం ఏ స్తాయిలో ఉందో ఆలోచించండి.చివరకు ఈ ఘనపతుల్ని చెర్వులో నిమ్మజ్జనం చేస్తుంటె పర్యావరణ  ప్రేమికులు వ్యతిరేకించడం  చివరకు మన మతాచారాలే ప్రశ్నించబడడం ,విజ్నానుల ద్రుష్టిలో మనం అజ్ఞానులుగా  మిగిలిపొవడం ఎంతవరకు సమంజసం చెప్పండి? దేనికైన ఒక పరిమితి ఉంటుంది.ఎక్కడ నిర్మలత్వం ఉంటుందో అక్కడ మాత్రమే భగవంతుడు  ఉంటాడు.ఆడంబరమ్ మనకి దైవాన్ని దూరం చేస్తుంది. పత్రం,పుశ్పం,ఫలం,తోయం చాలు అన్నాడు భగవంతుడు.నమ్మని వాళ్లు ఎలాగు నమ్మరు. నమ్మే మనమైన అది పాటించాల్సిన అవసరం లేదా? మనం చేస్తుంది గణపతి పూజా? ఘనపతి పూజా? మీరే ఆలోచించండి.

        మనవు బ్లాగు వీక్షకులకు , అగ్రిగ్రేటర్ లకు, స్నేహితులకు , శ్రేయోభిలాషులకు  అందర్కి వినాయక చవితి శుభాకాంక్షలతో ...
                                                                                "మనవు "             

Comments

  1. చాల చక్కగా చెప్పారు

    ReplyDelete
  2. చాల చక్కగా చెప్పారు

    ReplyDelete
  3. ధన్యవాదములు మనసుభాషణం గారు

    ReplyDelete
  4. మీకూ శుభాకాంక్షలు ...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు స్రుజన గారు

      Delete
  5. మీకు కూడా వినాయకచవితి శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు చంద్రశేఖర్ గారు

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన