Posts

ఎంత మేదావి అయినా ,ఒంటె నెక్కక పొతే ఓట్లు వేసేది లేదన్నారట హైదరాబాద్ వాసులు!

                                                                            నిజంగా మానాభి మానాలు ఉన్న వారికి , మేధావులకు ఈ కాలపు రాజకీయాలు చూస్తుంటే ఎంత అసహ్యం వేయాలో అంత అసహ్యం వేస్తుంది . ఎన్ని డిగ్రీలు పుచ్చుకున్నా , ఎంత మేదావి అయినా రాజకీయం లోకి అడుగు పెట్టాకా చేతులు కట్టుకు నిలబడి , పైసాకు పనికి రాని వాడితో పోటీలు పడి నానా మాటలు అనిపించుకోవలసిందే . ఇంట్లో పెళ్ళాం బిద్దలుని పట్టించుకోని వారు, బలాదూర్ గా పోకిరిగా తిరిగే వారు , జులుం చేసి ప్రజలను భయపెట్టే వారు , చీటికి మాటికి కొట్లాటలు కు పోయి కేసులు పెట్టించుకునే వారు , విరే రాజకీయ రంగానికి పనికొచ్చే కార్యకర్తలు . వీరికి బాగా  డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారు గాడ్ పాదర్లుగా ఉంటె , ఆనతి కాలంలోనే నాయకులై ప్రజల ని ఎలేయ్యడానికి , అర్హత సంపాదిస్తారు .   అటువంటి వారు , రాజకీయ పార్తిలలో ప్రదాన స్తానాలో ఉంటె , వారికి చిన్న పెద్ద అని కాని , జ్ఞానం , వివేకం ఉన్నవారికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో కాని తెలియదు .ఎక్కడ మేధావులకు ప్రాదాన్యత ఇస్తే తమ లాంటి వారిని తోకేస్తారో అనే అబద్రతా బావంతో , వారిని  అవహేళన చేస్తూ , మానసికంగా దెబ్బ తీస్తూ ఉం

తాగిన మత్తులో తాళి కట్టిన ఇల్లాలిని చంపితే , ప్రభుత్వం పైన్ కట్టాల్సిందే నట !

Image
                                                                          ఇన్నాళ్ళు  "మద్యం" ఆదాయపు మత్తు తలకెక్కి , ప్రజల సంసార జీవన స్తితిగతులను పట్టించుకోని ఆంద్ర ప్రదేశ్ సర్కార్ కు రాష్ట్ర హై కోర్టు వారు చాచి లెంపకాయ ఒకటి కొట్టారు . మొన్న వారు ఇచ్చిన తీర్పు స్పూర్తి తో , తెలుగువారిలో ఏమన్నా తెలివి వచ్చి , ఇక నుంచి  రాష్ట్ర ప్రభుత్వ మద్యo  పాలసి వల్ల  బాదితులైన కుటుంబాలు కోర్టులను ఆశ్రయిస్తే , మద్యం అమ్మకాలు వలన రాష్ట్ర ప్రబుత్వానికి వచ్చె ఆదాయం కంటే , బాదితులకు చెల్లించే నష్ట పరిహారాల మొత్తమే ఎక్కువుంటుంది . "సాహెబ్ గారి సంపాదన బేగం గారి మందుల ఖర్చుకు చాలవు" అన్నట్లు తయారవుతుంది రాష్ట్ర ఖజానా పరిస్తితి. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రబుత్వాల పరమావధి కావాలి అనే విషయాన్ని రాష్ట్ర సర్కార్ కు గుర్తు చేస్తూ , హై కోర్టు వారు ఇచ్చిన ఈ  తీర్పు ఆహ్వానించ తగినది మరియు ఆలోచించ తగినది .   వరంగల్ జిల్లా అర్పనపల్లికి చెందిన ఘనపురపు రవి , రాష్ట్ర ప్రభుత్వ "మద్యం పాలసి " కి మెచ్చి ,  మద్యం దుకా ణానికి డైలీ  రెగ్యులర్ కష్టమర్ అయ్యాడు . మద్యం అమ్మకాలు లో వృద్ది కోసం కష

"పాకీ " పని అమానవీయం! ,O.K !, మరి ఈ "లపాకీ " పని గురించి ఏమిటి?

                                                                                "ఆ పాడు పనుల పై చట్టాలను అమలు చేయండి " అనే హెడ్డింగ్ తో ఈ రోజు "ఈనాడు" పేపర్లో వచ్చిన ఐటెం ను చూసి ఈ విషయాన్నీ ఈ టపా ద్వారా ప్రస్తావిస్తున్నాను . నిన్న గురువారం మన సుప్రీం కోర్టు వారు , మానవ విసిర్జితాలను మనుషుల ద్వారా చేయించారాదని చెపుతున్న చట్టాలను పూర్తీ స్తాయిలో అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను , కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది . చాలా సంతోష కరమైన విషయo .          సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెపుతున్న మన దేశం లో ఒక అంచనా ప్రకారం సుమారు 7 లక్షలు మంది "పాకి పని చేసే వారు ఉండటం, సాంకేతికంగా  సిగ్గుపడాల్సిన విషయమే . ఒక మనిషి విసర్జించిన దానిని మరొక మనిషి తన చేతులతో  తీసి శుబ్రపరచాల్సిన అవసరం , యంత్ర సంస్కృతీ లేని పూర్వకాలంలో అయితే O.K. కాని , హై  టెక్  యుగం అని చెప్పబడుతున్న నేటి సమాజంలో ఎంత మాత్రం కూడనిది . అయితే ఏదైనా ఉనికిలో ఉన్న ఒక వ్రుత్తి వ్యవస్తను సమూలంగా నిర్మూలించాలి అంటే , దాని మీదే ఆదార పడి బ్రతికే ప్రజలకు  ప్రత్యామ్నాయ ఉపాది చూపించవలసిన బాద్యత

పవన్ కళ్యాణ్ "ఇజం " ద్వారా రాజు రవితేజ ఆవిష్కరిస్తున్న "నిజం" ఏమిటి?

                                                                        నూతనంగా రాజకీయ పార్టి పెట్టబోయే ప్రతి ఒకరికి ఏదో ఒక ప్రత్యెక "ఇజం" ఉండాలా ? అవును ఉండాల్సిందే అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ . దాని ద్వారా నే పార్టి ఉద్దేశ్యాలు , ఆశయాలు , తెలుస్తాయి .మరి పార్టి మానిపెస్తో ఎందుకు? పార్టి ఆశయాలను   సాదించడానికి రానున్న 5 యేండ్ల కాలంలో తాము ఏర్పరచుకున్న ప్రణాళికలు , వాటి అమలు విదానం ఇవ్వన్ని తెలియ చేసేదే "పార్టి మేనిపెస్తో ". మరి ప్రజలకు కావాల్సింది పార్టి "ఇజమా ? లేక మేనిపెస్తో నా అంటే ఖచ్చితంగా మేనిపేస్ట్ యే అని అనక తప్పదు .     ఇలా ఖచ్చితం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే , ఎన్నో ఇజాలు పుట్టాయి . అన్ని ఇజాలులొ అంతో ఇంతో నిజం ఉంటుంది . కాని ఏ ఇజం కూడా అందర్నీ సంతృప్తి పరచేలా ఉండదు . ఎవరి ఇజం వారికే కరెక్టు అనిపిస్తుంది . ఈ ఇజాలు గురించి భారత దేశ ప్రజలు విని , విని ఉండటం వలన వారికి ఇజాల మిద ఆసక్తి ఉన్నట్లు కనపడటం లేదు . పవన్ కళ్యాణ్  గారి "ఇజం " గురించి వినపడుతున్న వార్తలు పట్టి చూస్తె అది భారత రాజ్యాంగo లాంటిదేమో అన్న అనుమానం కలుగుతుంది .

పెళ్ళాం మీద అలిగి వెళ్ళిపోయినా, గాడిదలకూ పోలిస్ సెర్చ్ డ్యూటి తప్పదా !?

                                                                    వెనుకటికి ఒకాయన అపరాద పరిశోదన నవలలు చదివి , చదివి , తానూ ఒక డిటెక్టివ్ అయి బాగుండు అనుకున్నాడట . వెంటనే కొంత డబ్బు ఖర్చు చేసి "xxx డిటెక్టివ్ ఏజెన్సి" అనే దానిని అట్టహాసంగా ప్రారంభించాడట. మొదటి రోజు మొదటి బేరం ఏమి తగులుతుందా అని ఎదురు చూస్తున్న అ డిటెక్టివ్ గారి దాగ్గరకు  , పంచే పైకెగ దోపుకుని , ఆయాసంగా ఒగర్స్తూ ఉన్న వ్యక్తీ ఒకరు రావడం జరిగింది . వచ్చి రావడంతోనే "అయ్యా ఇక్కడ, కనపడకుండా పారిపోయిన వాళ్ళ , జాడ కనిపెడతరంటగా " అని అడిగే సరికి , మొదటి కేసు ఏదో మిస్సింగ్ పర్సన్ కేసు తగిలందుకుని "అవును" , అన్నాడట  ఔత్సాహిక డిటెక్టివ్ . దానికి ఆ ఆసామి "బ్బాబ్బాబు ! మీకు పుణ్యముంటుంది . వారం రోజుల నుంచి నా గాడిద కనపడటం లేదు . వెతికి పెడితే "చచ్చిమీ కడుపున పుడతా " అని అంటుoటే   తెల్ల ముఖం వేసాడట ఆ కొత్త డిటెక్టివ్ . మన రాష్ట్రం లో పోలిస్ వారు నిర్వహిస్తున్న కొన్ని డ్యూటి లు చూస్తుంటే ఈ కదే గుర్తుకు వస్తుంది . విషయం ఏమిటంటే ,     సికింద్రాబాద్ జీడిమెట్ల పోలిస్ స్టేషన్ పరిది లో

స్వతంత్ర భారతంలోB.J.P హిందు వాదులు చేసిన హత్యలేన్ని ? లౌకిక వాదులు చేసిన హత్యలేన్ని?

Image
                                                                                                                                       భారత దేశం లోని రాజకీయ పార్టీలు ఒక సిదాంత పరంగా నడుస్తున్నాయి అని ఎవరైనా అంటే , వారు నూటికి నోరు పాళ్ళు అమాయకులైనా అయి ఉండాలి, లేకుంటే ఎదుటి వారి చెవిలో పూవులు పెట్టేవారైనా  అయి ఉండాలి . 1950 లో భారత రాజ్యాంగం ఏర్పడ్డాకా , ఎవరికీ ఇష్టం ఉన్నా , లేకపోయనా అంతా రాజ్యాంగానికి బద్ధులై నడువ వలసిందే . అలా నడచెవారికే ఎన్నికలలో పోటి చేసే అర్హత ఉంటుంది . కులం పేరునో , మతం పేరునో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసి ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టడం మన దేశంలో అసాద్యం . మరి అటువంటి దేశం లో B.J.P అనే పార్టి కేంద్రంలోనూ , రాష్ట్రాలలోను అధికారం చేపట్టి , ఆయా రాష్ట్ర ప్రజల చేత మన్ననలు పొందుతుంటే , దానికి మత పార్టి అని ముద్ర వేయడానికి పూనుకోవడం కచ్చితంగా ఓర్వలేని తనమో , కళ్ళు ఉండి చూడలేని కబోది తనమో అయి ఉండాలి .   B.J.P ని హిందూ మత  వాది పార్టి అని ఊ క దంపుడు  ఉపన్యాసాలు ఇస్తూ , ప్రజలను మబ్య పెట్టె వారు , అంతిమంగా వారు ఉపయోగ పడుతుంది లౌకిక వాదుల ముసుగులో ఉన్న "గే&quo

T.D.P ,B.J.P ల తెలంగాణా రాష్ట్ర ఉమ్మడి B.C. ముఖ్యమంత్రి అబ్యర్ది "పవర్ స్టార్ పవన్ కళ్యాణా"!?

                                                                          పోయిన వారంలో ఆంధ్రా గబ్బర్ సింగ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  గారు , ఏదో  ఆవహించిన  వాడిలా , ఒక స్టార్ హోటల్లో బ్రహ్మాండమైన సభ ఒకటి ఏర్పాటు చేసి "జనసేన" అనే నూతన రాజకీయ పార్టిని ప్రకటించడం , ఆ సందర్బంగా కేవలం 45 నిమిషాలు మాట్లాడుతారు అని ముందుగా చెప్పిన వ్యక్తీ 2 గంటలు పాటు అభిమానులను పంచ్  డైలాగులతో అలరించడం జరిగింది . అయన చేసిన ఉపన్యాస దోరణి  చూస్తె , తెలంగాణా లోని సిమాంద్ర సెటిలర్స్ కి కొంత మనో దైర్యం ఇచ్చేలా ఉన్నవి. K.C.R గారికి డైరెక్టు వార్నింగ్ లు ఇవ్వడం ద్వారా అయన తనలో ఉన్న డేరింగ్ నెస్ ని బయట పెట్టుకోవడం జరిగింది .           1956 తెలంగాణాకి , 2014 లో తెలంగాణా కి బోల్దంత తేడా ఉంది . ఆంద్ర ప్రదేశ్ ఏర్పడ్డాక , సిమాంద్ర నుండి లక్షలాది తెలుగువారు తెలంగాణా కు వచ్చి స్తిర పడ్డారు . కొన్ని ప్రాంతాలలో వారి ఓట్లు అబ్యర్దుల గెలుపు ఓటములను నిర్ణయించే స్తాయిలో ఉన్నాయి .ఎవరు ఎన్ని కహనిలు చెప్పినా సెటిలర్స్  ఓట్లు K.C.R కి వేసే ప్రశ్నే లేదు .  అవ్వన్నీ T.R.S  కి వ్యతిరేకంగా పడేవే . మరి తెలంగాణా వ్యాప్తం