Posts

ముసలోడికి కూడ" రేప్" చెయ్యాలన్పించిందట!

Image
                                            మొన్న ఖమ్మం జిల్లాలో  ఒక అరవైయేళ్ల వ్రుద్ద మహిళ పోలిస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే, తన ఇంటికి దగ్గర్లోనే ఉంటున్న ఒక 65  సంవత్సరాల వ్రుద్దుడు,  చేలో ఉన్న తన పై అత్యాచారం చేశాడని. పోలిస్లు కేస్ రిజిస్టర్ చేసి అమెను  వైద్య పరిక్షలకు పంపించారు. అతనిని కస్టడిలోకి తీసుకుని కేస్ విచారిస్తున్నారు.   ఇక్కడ విషయం ఏమిటంటె, అరవై ఏళ్లు వచ్చిన వ్యక్తులు కూడ మనసుని కంట్రోల్ చేసుకోలేక పోతే, పడుచు వాళ్లకి ఏమని బుద్ది చెపుతారు. చిన్న పిల్ల మీద అత్యాచారాళ్లొ, వ్రుద్దుల పాత్ర తాక్కువేమి కాదు. పెద్ద వారు కదాని, తల్లి తండ్రులు చిన్న పిల్లల్ని ఇరుగు పొరుగు ఉండే ముసలి వారి దగ్గరకు వెళ్లడానికి  అబ్యంతర పెట్టరు. అలాగే చిన్న పిల్లలు కదాని ఏమి చేసిన బయట పడే అవకాశాలు లేవని భావించిన ఈ మానసిక రోగులు తమ పైశాచికత్వాన్ని, పసి పాపల మీద చూపిస్తుంటారు. అందరూ అలా అని కాదు. ముసలి వారైనా సరే వారి వెనుకటి ప్రవర్తనలు ద్రుష్టిలో ఉంచుకునే వారి వద్దకు పిల్లల్ను పంపడం మంచిది. పిల్లల పట్ల అతిగా శ్రద్ద చూపుతున్నా, పరాయి వారైనప్పుడు కొంచం జాగ్రత్తగా

కులం మారినా ’వ్యాపార బుద్ది' మారలేదు.

Image
                                           అమ్మాయి ,అబ్బాయి గాడంగా ప్రేమించుకున్నారు. ఇరువురివి  వేరు,వేరు, కులాలు.అయినా వారి ప్రేమ ముందు "కులం" అడ్డం రాలేదు. పెండ్లి  చేసుకున్నారు. ఆ తర్వాత అబ్బాయి తరపు వారు "పెద్ద(?) మనసు" చేసుకుని ఇద్దర్ని ఆశిర్వదించారట. హాయిగా కాపురం చేస్తే ఆడపిల్ల  పుట్టింది. దానికి కూడ పెద్దలు ఏమి అనలేదట! జస్ట్ పాప బారసాలకి 2౦ తులాల బంగారం, లక్ష డిపాజిట్  తెమ్మని మాత్రమే అడిగారట, లేకుంటే వారి అబ్బాయికి మరో పెల్లీ ఖాయం అన్నారట  . దానికి ఆ గొప్ప ప్రేమికుడయిన భర్త కూడ వంత పాడాడట. ఏలాగు అంత ఇచ్చే స్తోమత తన తల్లితండ్రులకు లేదని ఆ ప్రేమికురాలు "ప్రేమించే భర్త" ను వదులుకోలేక, ఇటు "బంగారం" తేలేక,ఇంత అనర్దానికి కారణం పుట్టిన "ఆడపిల్లేనని" బావించి ఆ పాపని "గొంతు పిసికి చంపేసిందట ఆ "మహా ప్రేమికురాలయిన" ఇల్లాలు. తర్వాత కథ పొలిస్లు, కోర్ట్లు, అంతే.    ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏమిటంటె,అత్త మామలకు, కట్నం ముఖ్యమయితే, అది తెచ్చాకే కాపురం అనాలి. కాని అనలేదు."ఆడపిల్ల" కాబట్టి, "బంగారం" కావాలి అ

చక్కగా సంసారం చేసుకుoటే చాలు !. "బ్రెస్ట్ క్యాన్సర్ " ప్రచారం లో బెలూన్ లు ఎగరేయాల్సిన పనిలేదట !!?

Image
                                      "మొగుడూ , సంసారం వద్దు , ఒంటరిగా ఉంటేనే ముద్దు " అనుకునే మై చాయిస్ మహిళలకు ఇది పనికి రాని స్టేట్మెంటే . అయినా వినక తప్పదు . ఎందుకంటే ఈ ప్రకటన చేసిన వారు భారతదేశం లోని సాంప్రదాయ వాదులు కాదు మరి . అమెరికాలోని పరిశోధకులు . వీరు కూడా ఒక నెలొ , సంవత్సరమో పరిశోధన చేసి చెప్పింది కాదు, ఏ  పదో ఇరవై మంది మీదో పరిశోధన చేసి చెప్పింది అస్సలు కాదు . వివిధ పరిస్తుతుల్లో జీవిస్తున్న 9267 మంది మహిళల మీద 10 ఏండ్ల పాటు పరిశోధన చేసి నిగ్గు దేల్చిన నిజం ఇది . కావాలంటే క్రింది చిత్రం లోని సమాచారం చూడండి.                                                                                                     పైన సమాచారం లో తెల్పిన అమెరికా పరిశోధకుల ఫలితానుసారం ఒంటరి తనం తో జీవిస్తున్న మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 60% ఎక్కువట. అంతే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ ని జయించే అవకాశాలు వారికి తక్కువేనట . ఎందుకంటే వీరికి మందులు వాడిన తర్వాత కూడా తిరిగి ఈ రోగం వచ్చే అవకాశాలు ఎక్కువే కాబట్టి . అయితే ఈ విషయం లో వారు ఒక ఆసక్తికర విషయం చెప్పారు . అదేమిటంటే, శ

కొడుకులకు కోట్లు ఇచ్చినా రాని "పుణ్యఫలితం" దేనితో వస్తుందో తెలుసా?

Image
                                                                                                        నిన్న నేను ఒక వార్త చదివాను. బార్యా భర్తలు,కాపురం చేసి, ముగ్గురు కోడుకుల్ని కన్నారు. చక్కగా చదివించి, వారిని పెంచి,ప్రయోజకుల్ని చేసారు. తమ కున్న బూమిని ముగ్గురికి సమానం గా పంచారు. తమ జీవనార్దం మూడు ఎకరాలు ఉంచుకున్నారు. వారు వయో వ్రుద్దులయ్యారు.    వారి బూమి ప్రక్కనుంచే బై పాస్ రోడ్డు పోవటం పోవటం వలన మూడు ఎకరాలకు అదిక దరలు పల్కి కోట్ల రూపాయలకు అమ్మి వేశారు. ఆ సొమ్మంతా ఏమి చేసుకుంటారు మీరని చెప్పేసి, కొడుకులే వాటిని కూడ పంచుకుని, పది లక్షలు రూపాయలు ముసలి వారికి ఇచ్చారట. ఆ తర్వాత ఒక రోజు వారిని చూసే బాద్యత చిన్న కుమార్డు తీసుకుని వారి దగ్గర ఉన్న ఆ పది లక్షల రూపాయలు అతనే తీసుకున్నాడట. చిన్న కోడలి సంరక్షణలో నాలుగు నెలలు హాయిగా గడిచి పోయాక, ఇక తాను చూడను అని, ఇతర కొడుకులకు కూడా కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చారు కాబట్టి వారు కూడ చూడాలని చెప్పి నిష్కర్షగా బయటకు వెల్ల గొడితే, వారు తతిమ్మా కొడుకులని అడిగితే తమకు సంబందం లేదన్నారట. పాపం ఆముసలి దంపతులు పోలిశ్ స్టేషన్ కి వెళ్ళి తమకు న్యాయం చెయ్

ఇకనుంచి, విడిగా ఉంటున్న భార్యను "రేప్ " చెస్తే , విపరీతమైన పబ్లిసిటి ఇస్తారట!

Image
                                                  ఏమిటొ గాని రోజు రోజు కు  కేంద్ర హోమ్ శాఖకు , భారతీయ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతునట్లు కనపడుతుంది. ఇండియాలో కోర్టులు కేసులు తొందరగా పరిష్కరించక పోవడం  , అత్యాచార కేసులలో నిందితులు పెద్దమనుషులు లాగా సొసైటీలో చలామణి కావడం హోం శాఖకు ఏ మాత్రం నచ్చడం లేదు. భారతీయ న్యాయసూత్రాలలో ప్రదానమైనది "నేరం రుజువు కానంతవరకు నిందితుడు అమాయకుడే " . అలాగే నేరం రుజువు చేయాల్సిన బాద్యత ప్రాసిక్యూషన్ వారిదే. ఇదిగో ఈ కారణాలు చేతనే నిందితులు నేరస్తులుగా రుజువు అయ్యే వరకు కాలర్లు ఎగరేసుకుని తిరుగుతున్నారు . అందరి సంగతి ఏమో కాని రేపిస్ట్ లు కూడా అలా కాలర్ లు ఎగరేసుకు తిరగడాన్నికేంద్ర  హోం శాఖ సహించలేక పోతుంది. అందుకే నేరం రుజువు అయిందని కోర్టులు ఇచ్చే తీర్పులతో పని లేకుండానే , చార్జిషీట్ లో ఉన్న ప్రతి నిందితుడు నేరస్తుడే అనే తీర్మానానికి వచ్చి, ఇక నుండి వారి పేర్లు , వారి  రేప్ చరిత్రలను వెబ్సైట్లలో , పబ్లిక్ ప్లేస్ లలో బహిరంగ ప్రదర్శనకు ఉంచబోతుంది అట. !                                                                       

మనకు కావల్సింది "గ్రుహహింస" చట్టమా? "గ్రుహ పరిరక్షణ" చట్టమా?

Image
            మనకున్న చట్టాల్లో ఎక్కువుగా దుర్వినియోగమవుతున్నది "గ్రుహహింస" చట్టం. ఆ చట్టం యొక్క ఉద్దేశ్యం  ప్రధానంగా కుటుంబంలో బాగమైన స్త్రీల సమస్యను పరిష్కరించడం.ఒక వ్యక్తి రక్షణ కోసం మొత్తం కుటుంబం విచ్చిన్నమవుతున్నా ఈ చట్టం పట్టించుకోదు. బార్యాభర్తల మద్య ఏర్పడే సమస్యలను ముందు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలి అని ఉన్నప్పటికి ఆచరణలో అది విఫలమవుతుంది. ఈ చట్టం వలన స్త్రీ లను కుటుంబ హింస నుండి  రక్షించే పేరుతో కుటుంబ వ్యవస్తలోకి చొరబడిన చట్టం {పోలిస్} చివరకు కుటుంబాన్ని కూల్చివేస్తుంది. అటు కుటుంబం నుండి బయటపడిన స్త్రీ కూడ చివరకు పొందేది శూన్యమే.   దీనంతటికి మూల కారణం ఇంట్లొని  సమస్యలను,వీదిలొ  సమస్యలను ఒకే రీతిగా చట్టం నియంత్రణలోకి తేవడమే కాక, వీటి నియంత్రణకు పోలిస్ వారిని వినియోగించడం కుటుంబ వ్యవస్తను నాశనం చేస్తుంది. దీనివలన కుటుంబాలలోకి రాజకీయ నాయకుల జ్యొక్యం ఎక్కువైపోతుంది. చేతకాని ప్రబుత్వాల పనితీరు వల్ల కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్త ఏది లేక పోవడం వలన బార్యను తిట్టిన భర్త, వెలయాలిని తిట్టిన విటుడు ఒకే జైల్ లో ఉండాల్సిన పరిస్తితి.                

పిల్లలున్న "గొడ్డు మోతు"తల్లితండ్రులు అంటే వీరే !

Image
                                                                                                        సాదారణంగా సంతానం లేని పశువులని "గొడ్డుమోతు పశువులు " అనటం కద్దు . అలాగే పిల్లలు లేని స్త్రీలను కూడా కొంత మంది తోటి స్త్రీలు గొడ్డుమోతు వారు అని అవమానిస్తూ అవహేళన చేస్తుంటారు . కాని ఇది సరి అయిన పద్దతి కాదు. పిల్లలు కలుగక పోవడం అనేది దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ , దాని కోసం చింతిo చవలసిన విషయం కాని, సంతాన హినులను అదేదో పాపం చేసిన వారిలాగా చూడాల్సిన అవసరం లెదు.    ముక్యంగా హిందూ జీవన విదానంలో "సప్త సంతానం " గురించి చెప్పడం జరిగింది . అందులో కడుపున పుట్టిన వారు ఒక బాగం మాత్రమె . హిందూ గృహస్తుకు పేరు తెచ్చె మిగతా 6 రకాల సంతానం లో దత్త పుత్రులు , కవితలు , గ్రందరచనలు చెయ్యడం  , పాఠశాలలు కట్టించడం , చెరువులు తవ్వించడం, మొదలగు పనులన్నీ "సప్త సంతానం " లో బాగమేనని చెప్పారు . కాబట్టి పిల్లలు లేని వారు నిస్సందేహంగా "గొడ్డు మోతులు " కారు . మరి గొడ్డు మోతులు అంటే ఎవరో చూదాం .        ప్రతి వ్యక్తీ తనకు సహజ సంతానం ఉన్నా లేక పోయినా "పితృ హ్రుద