Posts

Showing posts from October, 2014

వీళ్ళు "జూడా"లా ? లేక "ఘోడా" లా ?!

                                                                            దేనికైనా ఒక పరిమితి ఉంటుంది . ఆ పరిమితి దాటి ప్రవర్తిస్తే చిన్న పిల్లలు అయినా సరే దండనకు గురి కాక తప్పదు ! ఇదే విషయాన్ని మన ఉమ్మడి  రాష్త్ర హై కోర్టు వారు తెలంగాణా రాష్ట్ర జూనియర్ దాక్టర్ లకు స్పష్టం చేసారు , గత  నెల రోజులుగా సమ్మె చేస్తూ ,జబ్బులుతో బాద పడుతున్న ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్న "పిల్ల వైద్యులకు " హై కోర్టు వారి హెచ్చరికలు చెవి కెక్కినట్లు కన్పించడం లేదు . అందుకే అవసరమైతే సుప్రీం కోర్టు కైనా వెళతామని  మీడియాలో సంకేతాలు ఇస్తూ తమ పిల్ల తన్నాన్ని ప్రదర్శిస్తున్నారు . ఇది వారి కెరీర్ కు ఏ మాత్రం మంచిది కాదని కనీసం వారికి విద్యా బుద్దులు చెప్పిస్తున్న తల్లి తండ్రులు , ఇతర పెద్దలు గ్రహిo ఛి వారికి సరి సరి అయిన మార్గ నిర్దేశనమ్ చేయాలి. లేకుంటే తమ పిల్లల బవిష్యత్ నాశనానికి తామే కారకులవుతారు .   అసలు ఆంద్ర ప్రదేస్ లోని జూనియర్ దాక్టర్ ల సమస్యలు ఏమిటొ ఒక పట్టాన అర్దం కావు . ప్రతి సంవత్సరం సీజనల్ జబ్బులు వచ్చినట్లే వీరికి సమస్యలు వస్తుంటాయి . అది వారి స్టైపండ్ కు సంబందించిందో లేక వారి ఇత

మానవ వినాశనానికి కారణమయ్యె జ్ణానం కన్న, మానవ జాతిని కాపాడే ఆరాదన తత్వమే మిన్న".అని చాటుతున్న" నాగుల చవితి "

                                                                ఈ రోజు "నాగుల చవితి".! దీపావళి పండుగ తర్వాత వచ్చె చవితి రోజున తెలుగువారు ఎంతో భక్తీ ప్రపత్తుతలతో జరుపుకునే పండుగ ! నాగజాతి కి వారసులమైన మనం నాగు పాములను దేవతలుగా ఆరాదించడ మనేది సాంప్రదాయం . దానిలో బాగమే ఈ పండుగ జరుపుకోవడం .    పుట్టలో పాలు పోసి పాములను కొలవడం జ్ఞానమా ? అజ్ఞానమా ? అనే విషయం గురించి తర్కించే నైతిక అర్హత మనిషికి లేదు . ఎందుకంటె మానవ జాతి హననానికి కారణమయ్యే మరపిరంగులను చూసి గర్వంతో చాతి విరుచుకుO ట్టున్న(అ )జ్ఞానO   కంటె  , తమ జాతికి ప్రక్రుతి పరంగా మిత్రులుగా సహాయపడుతున్న పాములు కు పాలు పోసి పూజిస్తున్న ఆరాధనా తత్వమే  ఎంతో మిన్న!       సాదారణంగా "అలౌకిక ఆనంద ప్రపంచం"లోకి  బౌతిక కారణాలు చొప్పిస్తే "దున్నపోతు ని పింగాణి దుకాణం’లొకి తోలినట్లే" అని నా అబిప్రాయం.ఎందుకంటే బౌతిక వాదులకి అలౌకిక ఆనందం గురించి తెలియదు.వారికి తెలిసిందే సైన్స్ అని తెలియనదంతా హంబగ్ అంటూ వారు అనందగా ఉండలేరు, ఇతరులను ఆనందించనివ్వరు. నాగు పాముని దేవతగా ఆరాదించడమ్ వలన మేలే జరుగుద్ది తప్పా కీడు జరుగదు అని

గోవుల ను కబేళాలకు తరలించే వ్యక్తులను అరెస్ట్ చెసే అధికారం హిందువులకు లేదా ?!

                                                                                                  ఈ రోజు పత్రికలలో వచ్చిన ఖమ్మం S.P గారి పత్రికా ప్రకటన చూసాక నాకొక సందేహం కలుగుతుంది .  నిజంగా చట్ట ప్రకారం గోవుల వధను అడ్డుకునే అధికారం కానీ, గోవద కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తులను ప్రివేట్ హీందూ వ్యక్తులు అరెస్ట్ చేసి దగ్గర్లోని పోలిస్ వారికీ లేక పోలిస్ స్తేషన్ లో అప్పచెప్పే అధికారం కాని  కలిగి లేరా? అనేది నాకొచ్చిన సందేహం. ఈ సందేహం కలగడానికి కారణం పైన చిత్రం లో ఉన్న ఖమ్మం S.P  గారి ప్రకటణలోని కొన్ని ఆంశాలు. S.P  గారి ప్రకటనానుసారం ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి  వాహనముల ద్వారా  గోవులను వదశాలకు తరలిస్తునట్లైతే వాటి గురించి సమాచరం మాత్రమే పోలిసులకు ఇచ్చే బాద్యత ప్రజలకు ఉందని, వాటిని అడ్డుకునే అధికారం  లేదని ఘంటా పధంగా చెప్పడమే కాక, అలా చెయ్యడం చట్ట విరుద్దం కాబట్టి అటువంటి వారి పై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించడం జరిగింది. శ్.ఫ్ గారి స్తేట్మేంట్ హిందూ యేతరులు విషయం లో కరెక్టు కావచ్చేమో కానీ, గోవులను దైవంగా, మాత గా పూజించే హిందువుల విషయంలో కాదని నా అభిప్రాయం . అది ఎలాగో చూదాం. 

ఖమ్మం S.P గారు ఎద్దులను తరలించే లారీలు అపవద్దన్నారు తప్పా ,గోవులను తరలించే వాహనాలు ను అడ్డుకోవడం నేరమని చెప్పలేదు .!

                                                                                                              నిన్న ఖమ్మం s.p గారి పేరిట ఒక పత్రికా ప్రకటన వెలువడింది . దాని సారాంశం ఏమిటంటే కొంత మంది గో సంరక్షకులు ,హిందూ సంస్తలు గో వద నిషేధం పేరుతొ పశువులను వద్య శాలకు తరలించే వాహనాలను అడ్డుకుంటున్నారని ,ఎద్దులను వదించడానికి తరలించడం పై ఎటువంటి నిషేధం లేదని కావున అటువంటి వాహనాలను అడ్డుకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియ చేసారు .       పై ప్రకటన సారంశం ఎద్దులను తరలించే లారీలు ఆపవద్దు అని చెప్పడం తప్పా , గోవులను తరలించే లారీలు అపవద్దని ఎక్కడా అనలేదు . ఎమ్డుకంటే ఆవులను కబెలా లకు తరలించడం చట్టపరంగా కాగ్నిజబుల్ అపెన్స్ . దినిని అరి కట్టాల్సిన బాద్యత ప్రతి పౌరుడి పై ఉంది . అంటే కాదు , తమ ముందు ఏదైనా కాగ్నిజబుల్ నేరం జరుగుతుంటే ,నేరస్తులను అరెస్ట్ చేసి దగ్గరలోని పోలిస్ స్టేషన్ కి అప్పచెప్పే అధికారం కూడా ప్రతి పౌరుడికి ఉంది . భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు ఒక పొలిసే అన్నది మరువ రాదు . ఇదే విషయం నిన్న నేలకొండపల్లి లో స్వయంగా ఖమ్మం S.P గారు మద్య పాన నిషేద పోరాట సమితి గురించి ప్