Posts

Showing posts from September, 2012

గణేశ నిమజ్జనమా? సర్వ దేవతా నిమజ్జనమా?

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_933.html    రేపటి టపా లో సంచలనాతకమైన "మాయమైపోతున్న తెలుగు అమ్మాయి" గురించి తెలుసుకోండి.

కరెంట్ కోత, దోమల మోత

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_5979.html లింక్ పైన క్లిక్ చెయ్యండి

కరెంట్ కోత,దోమల మోత,ఇదీ మన తల రాత.

Image
                                                                                       మన తెలుగు ప్రజల  దౌర్బాగ్యం ఏమిటోగాని, బొత్తిగా ప్రజాసంక్షేమం పట్టించూకోని ప్రజానాయకుల ఏలుబడిలో ఉన్నాం.గత 15ఏండ్లుగా ఎన్నడూ పీల్చనంతగా, పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఎవరనుకున్నారు! దోమలండి,దోమలు!అవి కుడుతుంటే ప్రజలు చేసే ఆక్రందనలు ఈ పాలకులకు వినిపించటంలేదు.ఇదివరకు అప్రకటిత కోత ఉంటే చాలు తక్షణం స్పందించే రాజకీయ పార్టీలు సైతం ఈ విషయం లో కిమ్మనకుండా ఉన్నాయ్. పాపం వాళ్లకి మన ముఖ్య మంత్రి గారిని చూస్తే జాలేస్తుంది కాబోలు. ఏందుకంటే, అయన ఏ అవినీతి కుంభకోణంలో బాగస్వామి కాకపోయిన అవినీతి మంత్రులను కాపాడడానికే అయన తెగ కష్టపడాల్సి వస్తుంది.                ఆదెమి విచిత్రమో  కాని,మాది దేవుని పాలన అని చెప్పుకుఉన్న వాళ్ల పాలనలో కురిసిన వర్షాలు ఈ ఏడాది కురవలేదు. ప్రజలు కూడ డేవుదు పాలన పోయిందే అని బాద పడే పరిస్తితి వచ్చింది.వర్షాలు లేవు కాబట్టి, డాములలో నీళ్లు లేవు,  నీళ్లు లేవు కాబట్టి, కరెంట్ ఉత్పత్తి లేదు. ఆందుకే ఈ బాదంతా. కనీసం పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి అయినా ప్రజలకు కరెంట్ ఇద్దామన్న అలోచన సర్కారుకు

ఇల్లాలుకి ఇంటి సేవ, ప్రియురాలికి ఒంటి సేవ

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_24.html

నిజమైన స్త్రీ స్వేచ్చ ఏది?

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post.html

డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి సంబందం ఏమిటి"? తప్పక చూడండి

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_2064.html మీరు చూస్తున్న టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి.

అనుగ్రహంలోను, ఆగ్రహంలోను,గంగమ్మా!ఇలలో నీకు సాటి వేరే లేరమ్మా!

Image
            అమ్మా గంగమ్మా,భగీరథులమై నిను  ప్రార్థించిన వేళ మా వెంట నడచి మా బీళ్లను సస్యశ్యామలం చేశావు తల్లీ భక్తితో నిను పూజించిన వేళ, కరుణాంతరంగవై,తటాకమై నిలచి గ్రామసీమలలో మా పాడి పంటలకు ఆలంబనవైయావు.                 మాతా! వినమ్రులమై మ్రొక్కినందుకు జలధివై అంతులేని సంపదకు మము వారసులను చేసావు.                 కన్ను,మిన్ను కానక అంతులేని గర్వముతో విర్రవీగి,ప్రక్రుతికి హాని తలపెట్టిన వేళ ప్రళయమై మమ్ము ఒక్కపెట్టున ఊడ్చి పెట్టావు.                                                                          అందుకే, అమ్మా  గంగమ్మా ఆగ్రహంలో, అనుగ్రహంలో నీకు నీవే సాటి

అమ్మా గంగమ్మా ఆగ్రహంలో, అనుగ్రహంలో నీకు నీవే సాటి.

Image
             అమ్మా గంగమ్మా,భగీరథులమై నిను  ప్రార్థించిన వేళ మా వెంట నడచి మా బీళ్లను సస్యశ్యామలం చేశావు తల్లీ భక్తితో నిను పూజించిన వేళ, కరుణాంతరంగవై,తటాకమై నిలచి గ్రామసీమలలో మా పాడి పంటలకు ఆలంబనవైయావు.                 మాతా! వినమ్రులమై మ్రొక్కినందుకు జలధివై అంతులేని సంపదకు మము వారసులను చేసావు.                 కన్ను,మిన్ను కానక అంతులేని గర్వముతో విర్రవీగి,ప్రక్రుతికి హాని తలపెట్టిన వేళ ప్రళయమై మమ్ము ఒక్కపెట్టున ఊడ్చి పెట్టావు.                                                                           అందుకే, అమ్మా  గంగమ్మా ఆగ్రహంలో, అనుగ్రహంలో నీకు నీవే సాటి

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం

Image
                                                                                                                    నృసింహ మంత్రం                                                        ఉగ్రం వీరం మహా విష్ణుం                                                        జ్వలంతం సర్వతో ముఖం,                                                          నృసింహ బీషణం భద్రం,                                                        మృత్యు మృత్యుం నమామ్యహం .                                నరసింహ స్వామి  అపత్కాలములలో రక్షించగల ఏకైక దైవశక్తి అని చెప్పడానికి చారిత్రక ఆదారాలు ఉన్నాయి. శ్రీ ఆది శంకరాచార్యులు సైతం తాను మంటలలో కాలిపోతున్నపుడు తన ఇష్టదైవాన్ని కాక, నరసింహ స్వామినే ప్రార్దించి రక్షణ పొందుతాడు. అలా ఆ సమయంలో చెప్పబడిందే "మమ దేహీ కరావలంబ" స్తోత్రం. అలాగే అన్నమాచార్యులు సైతం ఈ స్వామిని ప్రార్థన చేసియే ఆపదసమయంలో గట్టేక్కాడు. అందుకే ఆపదలు బాపటానికి నరసింహ శక్తికి మించిన శక్తి "న భూతో న భవిష్యతి".                 మీరు సంక్లిష్ట పరిస్తితుల్లో ఉన్నప్పుడు మనసులొ నరసింహ స్వామి

మా ఇలవేల్పు కొలువైన కొవేల,

Image
                          ఈ  దేవాలయం,శ్రీ లక్శ్మినరసింహస్వామి దేవాలయం గార్లఒడ్డు లోనిది. ఇది ఖమ్మం జిల్లా,ఏనుకూర్ మండలం ,గార్లఒడ్డు గ్రామంలో కలదు. ఇది ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ద లక్శ్మి నరసింహ స్వామి దేవాలయాలలొ ఒకటి.ఈ దేవాలయం వ్యవస్తాపకులు కీర్తిశేషులు శ్రీ మద్దిగుంట తిరుపతయ్య,సరస్వతిగారలు.ఇది మా ఇలవేలుపు కొలువైన కోవేల.ఈ దేవాలయం ఖమ్మం నుండి భద్రాచలం వెళ్లు రోడ్డు మార్గంలో, ఖమ్మంనకు 45   కిలోమీటర్లు, మరియు కొత్తగూడెం పట్టణానికి 35  కిలోమీటర్లు దూరములో కలదు.  ఇది ఖమ్మం జిల్లాలోని దర్శనీయ స్తానములలో ముఖ్యమైనది.                                             విశాలమైన దేవస్థాన ముఖ మంటపము                                          ఓం నమో భగవతే లక్శ్మినరసింహాయా నమః                                                              

అందాల అరుణావని.

Image
                     అనూరుడు అదలింపుతో వడి,వడిగా పశ్చిమానికి వెళ్ల్లిన                      సప్తాశ్వముల అరుణ రథం దాటికి, కందిపొయిన అంబర వీధి అరుణిమమైన వేళ,                      అవనికి కుజత్వం సంప్రాప్తించి తానే అరుణ గ్రహం లాగ గోచరించు వేళ,                      కనిపిస్తుంది అందాల  అరుణావని.                                     

పర్యావరణ నాశకులు భగవత్ క్రుపకు అనర్హులు

Image
                                                                మానవునికి తొలి దైవ రూపాలు ప్రక్రుతి శక్తులు.అందుకే వ్రుగ్వేద కాలంలో మనవారు ప్రక్రుతి రూపాలైన అగ్ని వరుణ,మిత్ర లాంటి దేవతలను పూజించారు. సాక్షాత్తు దైవమైన సూర్యున్ని ప్రజాపతి గ బావించి పూజించారు. ఆ తర్వాతి కాలం లొ బగవంతునికి మానవ గుణాలు ఆపాదించి త్రిమూర్తిలను స్రుస్తించారు. సరే వీటన్నిటి తర్వాత వివరంగా తెలుసుకుందాము. ప్రస్తుత విషయం ఏమిటంటే సాక్షాతు దైవ స్వరూపమైన ప్రక్రుతిని నాశనం చేస్తున్న వారిని దేవుడు కరుణించుతాడా? వీరు దైవ క్రుపకు  అర్హులా? ఒకసారి ఆలొచించండి. దేవుని పేరుమీద వీరు చేస్తున్న దైవ ద్రోహం అదేనండి ప్రక్రుతి వినాశనం ఏ మాత్రం క్షమించరానిది. దీనిని హిందువులంతా ఖండించి తీరాలి. గనేశ నవరాత్రులు పేరుతొ బారి ఘనపతి విగ్రహాలు పోటిపడి ప్రతిష్టించి తటాకాలను,పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వారు ఎవరైనా సరే వారు దైవ నియమాలను ఉల్లంఘించ్హిన్న వారే. అటువంటి చర్యలను నిజమైన భక్తులు ప్రొత్శహించజాలరు. కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలమే ఈ మూడ భక్తి పెర్గడానికి కారణం.అరేరే ఒకరు ఒకరు 45 అడుగులు విగ్రహం చేస్తే ఇంకొకరు  70   అదుగుల విగ్

ఓం నమో శివ రుద్రాయా,

Image
                                                     ఓం నమో శివ రుద్రాయా,                                                     ఓం నమో శితి కంట్టాయా,                                                      ఓం నమో హర నాగా భరణాయా,                                                     ప్రణవాయా,డమ,డమ డమరుక నాథా నంధాయా.                                                       .                                           ( మా ఆంగ్ల బ్లాగు S S M Asramam(Surya Savarnika Manavu Ashramam) నుండి)           

స్త్రీలకు దహన సంస్కార హక్కు ఇవ్వడం అనివార్యం.

Image
స్త్రీలకు దహన సంస్కార హక్కు లు కావాలి                                                                              నేను ఈ రోజు ఒక వార్త చూసాను. చాలా బాద వేసింది.బెల్లంపల్లి ఏరియాలొ ఒక కన్నతల్లి దహన సంస్కారాలు చెయ్యడానికి కన్న కొదుకే నిరాకరిస్తే, చిన్న కూతురితొ కార్యక్రమం పూర్తి చేసారట.విషయం ఏమిటంటే కొడుకు సింగరేని కంపేనీలొ ఉద్యొగం. ముగ్గురు కూతుళ్లు.చిన్న అమ్మాయి పెళ్లి కోసం ముసలమ్మ(8౦) కొంత సొమ్ము దాచింది. ఆ సొమ్ముని తనకిస్తేగాని తల కొరివి పెట్టనన్నాడట తనయుడు.ఎంత అమానుషమో ఆలొచించండి.చివర్కి ఆ చిన్న కూతురితొనె తలకొరివి పెట్టించారట బందువులు.       ఇక్కడ మనం తెలుసుకోవల్సింది ఏమిటంటే అసలు తల్లి తండ్రులకు దహన సంస్కారాలు చేసే అదికారం ఇంకా కొడుకులకి మాత్రమే ఉంచడం హేతుబద్దత కాదు.ఎందుకంటే తల్లి తండ్రులకు ప్రాదమిక వారసులు కొడుకులు, కూతుళ్లు మాత్రమే.మనవళ్లు ఏవైపు వారైనా ద్వీతీయ వారసులే అవుతారు.ఉదాహరణకి కూతురు ప్రాదమిక వారసురాలు అయితే, మనవడు (కొడుకు కొడుకు) ద్వీతీయ వారసుడు అవుతాడు. ఇక్కడ మనవడి గురించి ఎందుకు చెపుతున్నానంటె కొరివి పెట్టే అధికారాలు పురుషుల వారసత్వం వారిగ హక్కులను కల్పించార

మనవు: నిజమైన బ్రాహ్మణుడెవ్వరు?మనవు - కాయ సంవాదం.

మనవు: నిజమైన బ్రాహ్మణుడెవ్వరు?మనవు - కాయ సంవాదం. :        నేను ఈ బ్లాగ్ ని మొదలుపెట్టగనె మొదటగ స్పందించింది కాయ గారు. వారు నన్ను కొన్ని ప్రశ్నలు వేయడం నేను జవాబులు ఇవ్వడం జరిగింది. కాయ గా...

నిజమైన బ్రాహ్మణుడెవ్వరు?మనవు - కాయ సంవాదం.

Image
       నేను ఈ బ్లాగ్ ని మొదలుపెట్టగనె మొదటగ స్పందించింది కాయ గారు. వారు నన్ను కొన్ని ప్రశ్నలు వేయడం నేను జవాబులు ఇవ్వడం జరిగింది. కాయ గారు కొంత చమత్కారంగ ప్రశ్నలు సందించినప్పట్టికి అవి చాల అర్థవంతమైనవి. వాటిని మీతో బాగస్వామ్యం చేసుకుందామనిపించి ప్రత్యకంగా టపా ప్రచురిస్తున్నాను."కాయ" గారికి ప్రత్యక దన్యవాదములతొ.........  కాయ 7 సెప్టెంబర్ 2012 10:31 సా మీరే మనువు అని ఎలా నమ్మాలి? నిజమైన మనుస్మృతి సెలవిస్తే అప్పుడు ఎవరైనా ఇటు చూస్తారు. ఇదొక్కటి చెప్పండి, మీ ప్రకారం, బ్రాహ్మణుడికి పుడితేనే బ్రాహ్మణుడట కదా!. ప్రత్యుత్తరం surya savarnika 8 సెప్టెంబర్ 2012 1:36 ఉ మనుస్మ్రుతి గురించి రాను రాను తెలియచెప్పుతాను.ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకు మాత్రమే బధులిస్తాను.మనుస్మ్రుతి కాలం నాటికి కుల వ్యవస్థ లేదు.అప్పటి సమాజం ప్రకారం జన్మనః జాయతె శూద్రః, సంస్కారత్ ద్విజ ఉచ్చయతే, వేదపతి బావేధ్ విప్రః, బ్రహ్మ జ్నానతి బ్రాహ్మణః అంటె ఒకరు జన్మం చేత శూద్రుడిగను,సంస్కారక్రియల చేత ద్విజుడిగను,వేదజ్నానం చేత విప్రుడిగను బ్రహ్మజ్నానం చేత,బ్రాహ్మణుడిగ గుర్తించబడ్దాదు.అంతే

ఇంటి ఇల్లాలా ? పని+మని+షి యా!?

Image
                                           అమ్మ ప్రేమ కు ఖరీదు కట్టే షరాబులెవ్వరురా విన్నారా!ఈ శుభవార్త! కేంద్ర ప్రభుత్వం వారు ఇంటి ఇల్లాళ్లకు పనిమనిషి హొదాను కట్టబెట్టబోతుంది.ఇకనుంచి ఇంటాయన సంపాదనలొనుంచి 20% ఇంటి ఇల్లాలుకు అమే చెసే ఇంటి పనికి జీతంగ ఇవ్వాలంట.ఓ సారీ సారీ దానిని జీతం అనకుండా గౌరవ వేతనమో మరేదో అంటారంట!యెంత మంచి ఆలొచన వచ్చిందండి మన సర్కారుకు.ప్రజలు అడుగుతున్న ఎన్నో డిమాండ్లను పట్టిచ్చుకోకుండా ఎవరూ అడగని ఈ వరాన్ని భారత స్త్రీలకు ఇవ్వాలని ఎందుకు అనిపించింధో? దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో త్వరలొనే తెలుస్తుంది.నిత్యావసర సరుకుల దరలు అదుపులొ పెట్టలేని సర్కారుకు ప్రజల ఇంటి విషయాలలొ కలగచేసుకునే నైతిక అర్హత ఉందా? ఆలొచించండి.         సరే అవన్నీ రాజకీయ యెత్తుగడలు అనుకున్నా, వారి స్వార్దం కోసం బారతీయుల కాపురాల్లొ ఎందుకు లేనిపోని చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు? మరి 20% ఇల్లాలుకు ఇచ్చివేసి 80% సంపాదన ఏమైన చేసుకొవచ్చా? దానిమీద ఇల్లాలుకు అదికారం ఉండదా? మరి ఇంట్లొ పిల్లల సంగతేమిటి? వాళ్లేమి పాపం చేసారు? ఒహో వాళ్లకి ఓటు హక్కు లేదు కదూ! మర్చేపొయాను.లేకపోతే వాళ్ల పర్సంటేజ్ డి

వ్రుద్ద వివాహాలు - మన జీవన ధర్మానికి వ్యతిరేకం.

Image
శివ శక్తి    అదే వాన ప్రస్తం                                                                                                                                             నేను' ఈనాడు' లొ ఒక వ్యాసం "మలి సంద్యకో మనసు తోడు" అనేది చూశాను.దాని సారాంశం ఏమిటంటె రాష్త్రంలొ వయోధిక వివాహాలు ఎక్కువ అవుతున్నాయని,కొన్ని పరిస్తుతుల ద్రుష్టా వాటిని స్వాగతించల్సిన అవసరం వుందని.దీనిని నేను పూర్తిగ వ్యతిరేకిస్తాను.ఎందుకంటె నా ద్రుష్టిలొ వివాహమంటె ప్రత్యెక కుటుంబ(గ్రుహస్త) జీవనం అరంబించడానికి ముందు ఇరు కుటుంబాలకు చెందిన స్త్రీ పురుశుల మద్య జరిగే తంతు. కాబట్టి ఇది కచ్చితంగ రెండు  కుటుంబాల కలయిక ద్వార మరో కుటుంబ ఎర్పాటు కోసం ఉద్దేసించబడీంది.      కేవలం స్త్రీ పురుషుల ప్రేమ కొసమే అయితే పెండ్లి అవసరంలేదు.సహచర జీవనం చాలు. కాని పటిష్టమైన క్రమబద్దమైన మానవ జాతి అబిరుద్దికి ప్రేమ ఒక్కటే సరిపోదు. బలమైన కుటుంబవ్యవస్త కావాలి. అందుకు వివాహ వ్యవస్త ఉండాలి. అందుకు ఇరు కుటుంబాల అనుమతి తప్పనిసరి.లేదా సమాజ ఆమోదం తోనైన వివాహాలు జరగాలి. దీనికి కొన్ని పద్దతులున్నై. కాబట్టి నూతన కుటుంబ ఏర్పాటు కోసమే వ

స్త్రీ స్వేచ్చ

Image
                                                     ఆ!మిత్రులార,మళ్లి ఈ రొజు మిమ్మల్ని పలకరించె అవకాశం వచ్చినందుకు సంతోషంగ ఉంది.నిన్న కొన్ని విషయాలు చెప్పాను. ఈ రోజు చెప్పేది ఏమిటంటె నేను గత జన్మలొ మనువు గ "మనుస్మ్రుతి"రాసాను. ఈ మద్య ఒక చోట "మనుస్మ్రుతి" అనే పుస్తకం చూశాను.కాని అందులొ నేను రాసింది తక్కువగను,రాయంది ఎక్కువగను కనిపించింది.నేను చాలా ఆశ్చర్యపొయాను. ఇధేమిటి? ఇదంతా ఎవరు చొప్పించారు? అని ఆలోచిస్తూ వెళుతుంటె ఒక మైదానంలొ పెద్ద సభ జరుగుతుంది.ఆ సభలో ఎవరో నన్ను విమర్సిస్తూ ఉపన్యాసం చెపుతుంటె అక్కడికి వెళ్లి ఆశ్చర్యంగా వింటుండిపొయా.                    ఆ ఉపన్యాస సారాంశం ఏమిటంటె నేను స్త్రీ వ్యతిరేకినంట! నా వల్లనే ఈ దేశంలొ స్త్రీలకు స్వేచ్చ లేకుండా పోయి, బానిసలుగ మిగిలిపొతె వీళ్లు స్త్రీ లను స్వేచ్చా వీదుల్లొ విహరింప చేసి వాళ్ల అభ్యుదయానికి పాటు పడుతున్నరంట!          సరే నండి కాసేపు నేను రాయని "న స్త్రీ స్వాతంత్ర మర్హతి" నేనే రాసాను అనుకుంధాం. దాని ప్రకారం  స్త్రీని ఎక్కడ ఉంచాం.తండ్రి,భర్త, కొడుకు,ఎవరో ఒకరి సంరక్షణలొ కుటుంబంలొనె ఉంచాం. కాని ఈనాడు 

నేను మనవుని.మళ్లి పుట్టాను.

Image
నేను ఫుట్టింది ఇక్కడే నేను మనవుని.మళ్లి పుట్టాను.ఈ దేశంలొ నా పేరు మీద ఇప్పటి వరకు జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు చూసి భరించలేక మీకు కొన్ని నిజాలను చెప్పడానికి,నా పేరు మీద జరిగిన తప్పుల్ని సవరించడానికి నేను మళ్లి పుట్టాను.ఫూర్వ జన్మలొ నేను మనువుని. నాకు ఉన్న కొమ్ముని తీసివెసి ఈ జన్మలొ మనవు గ పుట్టాను.నేను పుట్టింధి 1999 లొ.నేను ఇప్పుడు మీ ముంధుకు ఎంధుకు వస్తునానంటె కొన్ని నిజాలు చెప్పి మర్చిపోయిన చక్కనైన  మనబాటని మీకు చూపిద్దామని.ఆంతే.(సశేషం)