ఇంటాయన మీద కోపం తో పక్కింటాయన్ని ముద్దు పెట్టుకున్నట్లుంది!!!!

                                                                             


                                          వారు హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకునే   విద్యార్దులు . అందరికి ఉన్నట్లే వారిలోను బావాజాలాల  పరంగా బిన్న దృక్పదాలు ఉన్నాయి . ఉండవచ్చు . తప్పేమి కాదు. అయితే అందులో లెప్ట్ వింగ్ విద్యార్దులు అనబడే వారికి  మన భారతీయ సంస్క్రుతి అన్నా , ఆచారాలు అన్నా తగని ఒళ్ళు మంట అనుకుంటా . అందుకే   ఇన్నాళ్ళూ భారత దేశాన్ని ఏలిన పాలకులు "కుహానా లౌకిక వాదులు" కాబట్టి , వారు భారతీయ సంస్క్రుతి పరిరక్షణ అనే దాని మీద పెద్దగా ఆసక్తి లేదు కాబట్టి , లెప్ట్ వింగ్ విద్యార్దులు ఎంతో స్వెచ్చ గా ఉన్నట్లు ఫీలైపొయి భారతీయ సంస్క్రుతి మీద తమ అక్కసు అంతా వెల్ల గ్రక్కుతూ ఉన్నారు  . వారి ద్రుష్టిలో భారతీయ సంస్క్రుతి అంటె బ్రాహ్మణ సంస్క్రుతి అని , అది భారత దేశం లోని నిమ్న వర్గాలను అణచివేసిందని ,అదీ ఇప్పటికి కొనసాగుతుందని , ఇంకా ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణ అదిపత్యమే కొనసాగుతుందని , "దళిత వాదం" అనే పేరిట ఒక "గలత్  వాదాన్ని " ప్రచారం చేస్తున్నారు  , ఈ దేశం లో ని హిందూ సంస్కృతి మీద దాడి చేసి  తమ మతానికి,  వ్యాపార  సంస్కృతికి అడ్డంగా ఉన్నభారతీయ సంస్కృతిని  నిర్మూలించాలని చూసే   కొన్ని విదేశి శక్తులకు , లెప్ట్ వింగ్ ల భారతీయ సంస్కృతీ వ్యతిరేక ప్రచారం అనుకూలంగా అనిపించటం వలన,  వారికి ఆర్దికంగా , ఇతరత్రా సహాయం చేస్తూ వారిని ప్రోత్సాహిస్తునారు అని విశ్వసనీయ సమాచారం . అయితే దిని గురించి లోతుగా తెలియని అమాయక యువతి యువకులు ఈ లెప్ట్ వింగ్ ల మాయా వాదానికి ఆకర్షితులై తమకు తెలియ కుండానే తమ దెశ సంస్కృతి వ్యతిరేకంగా పోరాడుతున్నారు . ఇది చాలా విషాద కరమైన విషయమ్.

                   హిందూ పురాణాల ప్రకారం చూసినా , ఇప్పుడు నడుస్తున్నది శూద్ర పాలన  యుగమే . స్కంద పురాణమ్ ప్రకారం వైవస్వత మన్వంతరం లో పాతాళానికి తోక్కివేబడిన "బలి చక్రవర్తి", సూర్య సావర్నిక మన్వంతరమ్ లో తిరిగి ఇంద్ర పదవి చెపడతాడని చెప్పబడింది . ఇప్పటి పరిస్తితులు అలాగే ఉన్నాయి. భారత దేశా న్నికి ప్రధాన  మంత్రిగా ఉంది శూద్రుడు అయిన శ్రీ నరేంద్ర మోడి . తెలంగాణా ను ఏలుతున్నది శూద్రుడు అయిన శ్రీ K . చంద్ర శెఖర్ రావు. ఆంద్రాను ఏలుతున్నది కూడా శూద్రుడు అయినా శ్రీ చంద్ర బాబు నాయుడు . మరి విరెవ్వరూ బ్రాహ్మణులు కారు . మరి శూద్రులు పరిపాలించే యుగం లో మద్య యుగాల నాటి  బ్రాహ్మణ అధిపత్యం గురించి "గలత్ వాదం" ఎందుకు? ఇక పోతే ప్రపంచంలో ఎక్కడా ప్రజలని అణచి వేసిన దాఖాలాలు లేనట్లు, అది ఇండియాకే ప్రత్యేక మైనట్లు ప్రచారం చేసి , చేసి ప్రజలకు విసుగు కలిగేలా చెసారు . దానితో ప్రజలు వీళ్ళను పట్టించుకోవడం  మానివేసి , భారతీయ సంస్కృతిని పరిరక్షస్తూ , భారతదేశ అభివృద్దిని కాంక్షించే శ్రీ నరేంద్ర మోడి నాయకత్వం లోని ప్రభుత్వానికి పట్టం కట్టారు . వివక్షత అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే . కాకపోతే రూపం వేరు, పేర్లు వేరు అంతే , కొన్ని చోట్ల జాతి , రంగు వివక్షత ఉంటె ఇక్కడ  కుల  వివక్షత ఉంది . దీని ఒక్కటే కారణం  అజ్ణానం  మీద విజ్ఞానం ఎప్పుడూ అధిపత్యం చెలాయిస్తూనే ఉంటుంది . మనిషి జ్ఞాని కానంత కాలం ఎదో ఒక దాస్య శ్రుంఖాలలో  బందీగా ఉండవలసిందే . డబ్బు ఉన్న వాళ్ళంతా స్వెచ్చా జీవులు  అనుకోవడం మూర్కత్వమే . 

            ఇక పొతే  భారత దేశంలో రైట్ వింగ్  బావజాలానికి ప్రాతినిద్యం వహించే B.J.P  పార్టీ కేంద్రం లో అధికారం లోకి రావడం కంటగింపుగా మారిన కొంత మంది లెప్ట్ వింగ్ బావ జాలికులు , అభద్రతా బావంతో , అవకాశం చిక్కినప్పుడల్లా  ఎదో రకంగా  భారతీయ సంస్కృతి మీద దాడి చేయాలనే చూస్తున్నారు . అందులో బాగమే  మొన్న కేరళ మరియు హైదరాబాద్ లో జరిగిన  "ముద్దుల గోల ". రైట్ వింగ్ అంటే పడని అమాయక విద్యార్దులను రెచ్చగొట్టి వారి చేత  తమ సంస్క్రుతి విరుద్దమైన  పరాయి  సంస్క్రుతి పనిని చేయించి శునకానందమ్ పొందడమే " లవ్ టు కిస్" లోని అసలు ఉద్దేశ్యం  .

              ఇదెలా ఉందంటె "ఇంటాయన మీద కోపం తో ఉన్నవారిని పక్కింటాయన్ని ముద్దు పెట్టుకో " అని  చెప్పినట్లు ఉంది . మొన్న హైదరాబాద్ లో  "చుంబన ప్రేమ "  పేరుతో ఒక యువతి పెదాల పై మగ  స్నేహితులు  ఎలా దాడి చేసారో క్రింది విడియో చూస్తె అర్దమవుతుంది . సంస్క్రుతి మీద నిరసన పేరుతో ఈ విదంగా అమాయకంగా లైంగిక దాడులకు గురికావడం తప్పా ఆడపిల్లలకు ఒరిగేది ఏమి లేదు. ఇటువంటి చేష్టలను కఠిన విదానాలతో అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వాల పై ఉంది .

                                                               
                                          (విడియో సరిగా కనపడనిచో ఈ లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు)

                                              (Republished Post. OPD 4/11/2014). 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన