సీమాంద్రా రాజదానిని రెండు నరసింహ క్షేత్రాలైన అగిరి పల్లి, మంగళ గిరి మద్య నిర్మింఛి "నర సింగపూర్" అని పేరు పెడితే బాగుంటుంది !

                                                                           
అగిరిపల్లి దేవాలయ మెట్ల మార్గం 

         సీమాంద్ర నూతన రాజదాని ని విజయవాడ చుట్టు ప్రక్కల ప్రాంతంలోనే నిర్మిస్తామని ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు ప్రకటించడం   దైవ సంకల్పం లో బాగంగానే  అనిపిస్తుంది . మొన్నటి దాక వివిధ ప్రాంతాలు పేర్లు చెప్పుకోచ్సినప్పటికి రాజదానిగా ముక్యంగా గుంటూర్ , తెనాలి, మంగళగిరి , విజయవాడ మద్య ప్రాంతమే  బహుళ ప్రచారం లో ఉండటం వలన ఆ ప్రాంతాలులోని బూములకు బూమ్ వచ్చింది . అయితే అనూహ్యంగా తేరా మీదకు అగిరిపల్లి పరిసర ప్రాంతాలు రాజదానిగా చేయనున్నారని వార్తలు రావడం , ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు విజయవాడ పరిసరాలలోనే రాజదాని ఉంటుందని ప్రకటించడం తో "అగిరి పల్లి" పరిసర అటవీ ప్రాంతానికి మహర్దశ  పట్టినట్లే .


  అగిరి పల్లి ఒక పుణ్య క్షేత్రమ్ . దేవదేవుడైన ఆ నరసింహ స్వామీ ఇక్కడ శోభనాచల వ్యాఘ్రా లక్ష్మీ నరసింహ స్వామిగా శోభానా చలం పై వేంచేసి ఉన్నారు . ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకోవాలంటే  క్రింది వీడియోను చూడవచ్చు .అగిరిపల్లి చుట్టూ అటవి ప్రాంతం వేల ఎకరాల్లో విస్తరించి ఉండటం వలన ఇక్కడ రాజదాని నిర్మాణం వ్యయ భరితం కాదని సర్కార్ వారి ఆలోచన . అగిరిపల్లి, అడవినెక్కలం , నున్న, గడ్డ మణుగు గ్రామ ప్రాంత ఫరిసరాలలో సుమారు 11 వేల ఎకరాలు ప్రభుత్వభూమి , 30 వేల ఎకరాలు అటవీ భూమి ఉందని కాబట్టి రాజధాని నిర్మాణం కి ఈ  భూములు అనువుగా ఉంటాయని అంటున్నారు . అదీ కాక ఎత్తైన భవన నిర్మాణాలకు ఇవి అనుకూలమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు . ఇవన్నీ నూతన రాజదాని నిర్మాణం ఇక్కడ చేపట్టడానికి పనికి వచ్చే అంశాలు .
                     
                     

    అయితే వాస్తుపరంగా చూస్తె  అగిరి పల్లి ప్రాంతం కంటే మంగళ గిరి ప్రాంతం బహు శ్రేష్టమైనది అని వాస్తు పండితుల బావన . ఈశ్యాన్య బాగంలో పుణ్య కృష్ణా నది ప్రవహిస్తూ ఉండటం వలన ఇక్కడ రాజధాని నిర్మిస్తే బేషుగ్గా ఉంతుంది అంటున్నారు . వాస్తు పరంగా అది కరెక్టే . కాని రాజదాని నిర్మాణానికి వాస్తుతో పాటు వేల ఎకరాల భూమి అవసరం . మంగళ గిరి పరిసర ప్రాంతంలోని వ్యవసాయ భూమిని నిర్మాణాలకు ఉపయోగించడం చాలా  ఖర్చుతో కూడుకున్నదే కాక నష్ట దాయక మైనది . అందుకే అటు వాస్తు పరంగా , ఇటు భూముల లబ్యత పరంగా ఉభయ తారకంగా మేలు చేసే విదంగా నూతన  రాజదాని నిర్మాణం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం .

   మంగళ గిరి పరిసర ప్రాంతాలలో రాజధాని అధికృత కార్యాలయాలు అంటే అసెంబ్లీ , సెక్రటేరియట్ నిర్మింప చేసి , మిగతా పాలనా పరమైన బవంతులు , ప్రజల నివాసాలు అన్నీo టికీ  అగిరిపల్లి అటవి భూములు ఉపయోగొస్తే బాగుంటుంది . దీని వలన ఇటు మంగళ గిరి నుండి అటు అగిరి పల్లి వరకు రాజదాని విస్తరించి రెండు పవిత్ర నరసింహ క్షేత్రాల మద్య నగరం విలసిల్లుతూ ఉంటుంది . ఎలాగో గుంటూరు , తెనాలి నగరాలు కలిసి పోతాయి కాబట్టి  ఆ ప్రాంతమంతా మహా నగరంగా మారిపోతుంది . నూతన రాజదాని రెండు నరసింహా క్షేత్రాల మద్య ఆవిర్భవిస్తుంది కాబట్టి దానికి "నర సింగ పూర్" అని పెడితే  అటు మోడరన్ గాను  ఇటు సాంప్రాదాయ బద్దంగాను ఉంటుంది .

 ఏది ఏమైనా అతి త్వరలో సిమాంద్రా కు  నూతన  రాజదాని నిర్మాణం జరిగి  అది కూడా  హైదరాబాద్  తో సమానంగా అభివృద్ధి చెందాలని, సీమాంద్రా వారు సుఖ సంతోషాలతో ఉండాలని  తోటి తెలుగు వారిగా  తెలంగాణా వారు కూడా కోరుకుంటున్నారు .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన