మంచి వాడి సంగతి మాంసం కూర దగ్గర తెలుస్తుoది అన్నట్లుంది సిమాంద్ర సమైక్యత సంగతి!

                                                   
  

అరె రే ! ఎన్ని మాటలు చెప్పారు ! తెలంగాణా విడిపోతే తెలుగుజాతి ఐక్యతే పోతుంది అన్నారు . తెలంగాణా విభజన వాదులు తెలుగు జాతిని చిలుస్తున్నారు అన్నారు . తెలుగు జాతి సమైక్యంగా ఉండాలని 2 నెలలు పైగా సమ్మె  చేసారు . ఆంద్ర ప్రదేశ్ ను విడదిస్తే తమ తడాఖా డిల్లికి చూపిస్తాం అని ప్రగల్బాలు పలికారు . తమకు జెండాలు , ఎజెండాలు ఏమి లేవు , సమైక్యతా ఒకట్టే తమ ఎజెండా అని రాష్ట్ర విభజన ప్రకటించక ముందు సమైక్యా రాగాలు తీస్తుంటే దేశం అంతా  నిజమే అనుకుంది . సిమాంద్ర లోని తెలుగు ప్రజలు ఉప్పెనలా కధలి వస్తుంటే రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో ఉప్పొంగిన సమైక్యతా బావం ఇది అని నా లాంటి అమాయకులు అనుకున్నారు . కాని అది అంతా  ఉత్తిదె అని ఇటివలి పరిణామాలు చూచిస్తున్నాయి .

  మంచి వాడి సంగతి మాంసం కూర దగ్గర  తెలుస్తుoది అన్నట్లుంది సిమాన్ద్రులలో సమైక్యత  సంగతి .ఆంధ్రులు ఆరంభ శూరులు అనే దానిని మరో సారి రుజువు చేస్తున్నారు సిమాంద్ర నాయకులు, వారిని అనుసరిస్తున్న ప్రజలు. తెలంగాణా విభజన జరుగక ముందు , కాంగ్రెస్ , తెలుగు దేశం , రెండు పార్టిలే ఉండేవి . పరాజ రాజ్యం వచ్చినా దానిని పెద్దగా ఆదరించలేదు కాబట్టి అది కూడా కాంగ్రెస్ లో కలిసి పోయింది . ఇప్పుడు విభజన తేది ప్రకటించాక అదే సిమాన్ద్రాలో 4 పార్టీలు అయ్యాయి . రాజకీయ నాయకులు సమైక్యత నిన్నాదాన్ని  చాప చుట్టి బాహాటంగా రాష్ట్ర విభజనను సమర్దించిన పార్తిలలోకి జంప్ అయి పోతున్నారు . ప్రజలు కూడా వారు నిర్వహిస్తున్న సభలకు వేలాదిగా తరలి వస్తున్నారు . వీరిని చూసి  అ పార్టి గెలిస్తే తమకు నష్టం కలుగుతుంది అనుకున్న వారు, తమ సామాజిక ఓట్లను చీల్చి సదరు పార్టి బలపడకుండా చూడాలని , పెద్ద పెద్ద డైలాగులు రాయించుకుని మరి రంగంలోకి దిగి పోతున్నారు . ఇలా సిమాంద్ర రాజకీయం నాలుగు  ముక్కలవుతుంటే , వీరిలో సమైక్యతా ఉందని ఎవరిని నమ్మించగలరు ? విభజన అయినా , సమైక్యతా అయినా అంతా రాజకీయ నాయకుల కోసమే అనేది స్పష్టంగా అర్ధమవుతుంది .

నేను ఈ  విషయంలో తెలంగాణా వారిని అనవలసింది ఏమి లేదనే బావిస్తున్నాను. ఎందుకంటే విడిపోతేనే బాగు పడతాం అని వారి ప్రగాడ నమ్మక్కం . అది నిజమా కాదా అనేది తేలాలంటే కొంత సమయం పడుతుంది . కాని సిమాంద్ర ప్రజల సంగతి ఏమిటి? ఎందుకు వారిలో సమైక్యతా లేకుండా పోయింది? ఒకే ఒక పార్టీ జెండా క్రింద ఎందుకు ఏకం కాలేక పోతున్నారు? . నాయకులు ఒకరి నొకరు దుమెట్టి పోసుకుంటుంటే , వారిలోని అనైక్యతకు "చీ " కొట్టలేని ప్రజలకు సమైక్యత గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? తక్కెట్లో కప్పలు లాగా నాయకులు ఆ పార్టి లోంచి ఈ పార్టీలోకి , ఈ పార్తిలోంచి అ  పార్టీలోకి జంప్ లు చేస్తుంటే వారిని ఎంకరేజ్ చేస్తూ , వారు పెట్టె సభలకు వేలం వెర్రిగా వెళ్తున్న ఈ ప్రజలకు తెలుగు జాతి అభిరుద్ది గురించి ఆలోచన ఉందా? రోత పుట్టడం లేదా ఈ దిగజారుడు రాజకీయాలు చూసి ? డిల్లీలో పెద్దలకు స్పష్టంగా తెలుసు. ఆంధ్రులు ఆరంభ శూరులు అని . అందుకే వారు అంత  సాహసం చేసారు . రేపు కాంగ్రెస్ కి ఓట్లు పడినా పడకపోయినా , తెలుగుజాతిలో సమైక్యతా లేదు అనేది మాత్రం ఈ  ఎన్నికల వలన దేశానికి వెల్లడవుతుంది .

.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన