ఎంత మేదావి అయినా ,ఒంటె నెక్కక పొతే ఓట్లు వేసేది లేదన్నారట హైదరాబాద్ వాసులు!

                                                                           

నిజంగా మానాభి మానాలు ఉన్న వారికి , మేధావులకు ఈ కాలపు రాజకీయాలు చూస్తుంటే ఎంత అసహ్యం వేయాలో అంత అసహ్యం వేస్తుంది . ఎన్ని డిగ్రీలు పుచ్చుకున్నా , ఎంత మేదావి అయినా రాజకీయం లోకి అడుగు పెట్టాకా చేతులు కట్టుకు నిలబడి , పైసాకు పనికి రాని వాడితో పోటీలు పడి నానా మాటలు అనిపించుకోవలసిందే . ఇంట్లో పెళ్ళాం బిద్దలుని పట్టించుకోని వారు, బలాదూర్ గా పోకిరిగా తిరిగే వారు , జులుం చేసి ప్రజలను భయపెట్టే వారు , చీటికి మాటికి కొట్లాటలు కు పోయి కేసులు పెట్టించుకునే వారు , విరే రాజకీయ రంగానికి పనికొచ్చే కార్యకర్తలు . వీరికి బాగా  డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారు గాడ్ పాదర్లుగా ఉంటె , ఆనతి కాలంలోనే నాయకులై ప్రజల ని ఎలేయ్యడానికి , అర్హత సంపాదిస్తారు .

  అటువంటి వారు , రాజకీయ పార్తిలలో ప్రదాన స్తానాలో ఉంటె , వారికి చిన్న పెద్ద అని కాని , జ్ఞానం , వివేకం ఉన్నవారికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో కాని తెలియదు .ఎక్కడ మేధావులకు ప్రాదాన్యత ఇస్తే తమ లాంటి వారిని తోకేస్తారో అనే అబద్రతా బావంతో , వారిని  అవహేళన చేస్తూ , మానసికంగా దెబ్బ తీస్తూ ఉంటారు . అందుకే మేధావులు , ఆత్మాభిమానం గలవారేవ్వరూ రాజకీయ రంగానికి రావడానికి ఇష్టపడరు . కాని జయ ప్రకాష్ నారాయణ్ , చంద్ర బాబు లాంటి వారు "మేధావులు రాజకీయాలలోకి రాకపోతే సమాజానికి నష్టం" అంటుంటారు. మేదావులని నిర్లక్ష్య పరచే సమాజం కోసం మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉందా ? అని అప్పుడప్పుడు అనిపిస్తుంది . "సమాజం ని కేమిచ్సింది అని కాదు , సమాజానికి నీవేమి ఇచ్చావు  అన్నదే ముక్యం " అనేది 1960 కి ముందు మాట . "నా అవసరం నీకు లేనప్పుడు , నీ  అవసరాలు నాకనవసరం " అనేదే నేటికి పనికొచ్చే మాట .

       మేధావులు అణచి వేసి ఎ సమాజం బాగుపడినట్లు చరిత్రలో లేదు . ఒక్క చాణక్యుడిని అవమాన పరచినందుకే , లక్షలాది సైన్య బలం ఉన్న నంద వంశం సమూలంగా సర్వ నాశన మయింది . అయినా 100 రూపాయలు తీసుకుని వేసే ఓటుకు , బాగా అలోచించి వేసే వోటుకు ఒకే విలువ ఉన్న ప్రస్తుత రాజకీయ వ్యవస్తలో మేధావులకు రాజకీయాలలో సముచిత స్తానం దకుతుంది అనుకోవడం అత్యాసే అవుతుంది . ఒక రాజనీతి సిద్దాంతం ప్రకారం సమాజం లో అజ్ఞానులు అనారోగ్యంతో నశించాలంటే "నకిలీ వైద్యులను " ప్రోత్సాహించడమే కరెక్టు అంటా . ఇది చూడటానికి దుర్మార్గపు ఆలోచన కనపడుతున్నప్పటికి , తనకు నష్టం కలిగిస్తున్న మానవ జాతి వినాశనానికి ప్రక్రుతి అనుసరిస్తున్న పద్దతి ఇదే . అందుకే దొంగలు పాలకులుగా పరిణమించారు . వారిని నియత్రించడం ప్రస్తుత ప్రజాస్వామ్య విదానంలో అసాద్యం కావచ్చు . వారి పని పట్టడం కోసం దేవుడు దిగి రావాల్సిందే .

     పైన చిత్రం లో చిరునవ్వులు ఒలకబోస్తూ ఒంటె మిద కూర్చున్న మేదావి గారిని చూస్తె ఏమనిపిస్తుంది . ఒంటె ఎకితే గాని ఒత్లేయరేమోనని , అందరి రాజకీయ నాయకులకు మల్లె , తనకు ఇష్టం లేని పనిని కూడా , ఇష్టంగా చేస్తున్నట్లు లేదూ ? ఎన్ని ఒంటెలు ఎక్కినా, ప్రజల దగ్గర ఓట్లు ఎలా కొల్లగోట్టాలో మేధావులకు అస్సలు తెలియదు కాక తెలియదు . 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన